కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం.

కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
కేంద్రీయ విద్యాలయం ఎట్టకేలకు ప్రారంభోత్సవా నికి సిద్ధమైంది.

దశాబ్ద కాలానికి పైగా మండల కేంద్రంలో అరకొరా వసతుల మధ్య కొనసాగిన విద్యాలయం గత సంవత్సరం అక్టోబర్ 14న కొత్త భవనంలోకి సామగ్రిని, విద్యార్థులను తరలించారు.

మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన సెంట్రల్ సెలబస్ ను అందించడమే లక్ష్యంగా 12ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఝరాసంగంలో కేంద్రీయ విద్యాల యాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

సొంత భవనాల కోసం ప్రభుత్వం మాచ్నూర్ శివారులో 10ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.26 కోట్ల కేటా యించింది.

నిర్మాణం పనులు పూర్తికాగా, గత ఆరు నెలల నుంచి సొంత భవనంలో తరగతులు కొనసా గుతున్నాయి.

‘ఏ’ ఆకారంలో జీప్లస్-2 నిర్మాణం.

ప్రతి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం ఉండాలనే
కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఝరాసంగంలో 12 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాఠశా లలో 1-10 పదో తరగతి వరకు విద్య అందిస్తున్నారు.

ప్రస్తుతం పాఠశాలలో 425 మంది విద్యార్థులున్నారు. 2025 – 26 సంవత్సరానికి మొదటి తరగతిలో మరో 40 మంది విద్యార్థులను ఏర్పాటు చేశారు.

గత సంవత్సరం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ) ద్వారా రూ.26 కోట్లు కేటాయించారు.

పాఠశాల క్యాంపస్ చుట్టూ ప్రహరీ, ఆంగ్ల అక్షరం ‘ఏ’ ఆకారంలో జీప్లస్-2 అంతస్తులుగా నిర్మాణం పూర్తయింది.

1వ తరగతి నుంచి 12 తరగతి వరకు సరిపడా 2 రెండేసి గదుల చొప్పున తరగతి గదులను నిర్మించారు.

ఇదే ప్రాంగణంలో సిబ్బంది నివాస గృహాలు, నీటి వసతి, శౌచాలయాలు, సిమెంటు రహదారులు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాల నిఘా, రన్నింగ్ దారి, క్రీడా ప్రాంగణాలు వాలీబాల్, బాస్కెట్ బాల్, కోకో, కబడ్డీ కోర్టు నిర్మాణం చేపట్టారు.

విద్యార్థుల కోసం ప్రత్యేకమైన స్కూటర్, సైకిల్ ఇతర వాహనాల నిలిపేందుకు పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

మంజీరా, మిషన్ భగీరథ వంటి నీటి పథకాల పైప్లెన్ ను పాఠ శాలకు అనుసంధానం చేశారు.

24 గంటల విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు.

దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకమైన గదుల.

Collector inspected.

 

 

 

◆*రూ.26 కోట్లతో భవన ನಿರಾಣಂ.*

◆*ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్.*

◆*12 ఏండ్ల క్రితం ఏర్పాటు.*

◆*గతేడాదే భవనంలోకి విద్యార్థులు.*

◆*ప్రస్తుతం కేవీలో 426 మంది పిల్లలు.*

ర్యాంపులు, మరుగుదొడ్లు నిర్మించారు.

విశాలమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య పాఠశాల నిర్మాణం పూర్తి కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

23న సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభోత్సవం.

కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి 23న ప్రారంభించను న్నారు.

కేంద్రీయ విద్యాలయం నుంచి విద్యా ర్థులు, తల్లి దండ్రులు హాజరు కావాల్సిందిగా సందేశాలు పంపించారు.

ఇప్పటికే జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎంపీ సురేష్ షెట్కా ర్, జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవే క్షించారు.

సీఎం రాకకోసం కేంద్రీయ విద్యాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబ వుతోంది.

రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తరువాత మొదటిసారి జహీరాబాద్ తో పాటు ఝరాసంగం మండలాన్ని సందర్శిస్తున్న సందర్బంగా మండల ప్రజలు, నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version