బోడగమ్మలో యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు…

బోడగమ్మలో యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు:

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలం బోడగమ్మ (బోరేగావ్) గ్రామంలో ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బోరేగావ్ క్రైస్తవ సహోదరుల ఆధ్వర్యంలో జరిగే ఈ 11వ వార్షిక మహాసభలు 40 రోజుల సంపూర్ణ ఉపవాస ప్రార్థనల ముగింపు సందర్భంగా ఆత్మల రక్షణార్థం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి దైవ సందేశాలు ఉంటాయి. ఏలూరు జిల్లా పెదలంక హోలీ చర్చి దైవజనులు కె. జాన్ మంగాచార్యులు, హైదరాబాద్ రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రాజా హేబెల్, హైదరాబాద్ బ్రిమ్-ట్రూ వర్డ్ సెంటర్ దైవజనులు కె.ఆర్. జాన్ ముఖ్య వక్తలుగా పాల్గొంటారు. బ్రదర్ కె. ప్రశాంత్, సిస్టర్ ఝాన్సీరాణి ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు గ్రామ విశ్వాసులు, పెద్దలు, యువజన సంఘం సభ్యులను ఆహ్వానించారు. భక్తుల కోసం ప్రేమవిందు భోజన సదుపాయం కల్పించనున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version