నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ లో డిప్యూటీ మేయర్ కు చాంబర్ కేటాయించడం సిగ్గుచేటు.
బిఆర్ఎస్ విధానాలు బిజెపి అవలంబిస్తుంది-సిపిఐ
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగర పాలక సంస్థలో మార్పు తెస్తామని చెప్పినటువంటి బిజెపి రెండు నెలలు కాకముందే బిఆర్ఎస్ అవలంబించినట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ డిప్యూటీ మేయర్ ఛాంబర్ ప్రారంభించుకోవడం చూస్తుంటే అవినీతికి బిజెపి కూడా ఏంతక్కువ కాదని నిరూపించుకుంటుందని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్సులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు విమర్శించారు. నగరపాలక సంస్థలో మున్సిపల్ కమిషనర్ బిజెపికి అనుకూలంగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. గతంలో మున్సిపల్ లో డిప్యూటీ మేయర్ ఛాంబర్ ను ఏర్పాటు చేస్తే బిజెపి పార్టీతీవ్రంగా వ్యతిరేకించి పోరాటాలు చేసిందని కానీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గత పాలనలో అవలంబించిన విధానాలే బిజెపి కూడా అవలంబించడం దుర్మార్గమైన చర్యని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర మంత్రిని అడ్డుపెట్టుకొని డిప్యూటీ మేయర్ చాంబర్ ఏర్పాటు చేశారని ఇప్పుడు కేంద్రమంత్రినీ అడ్డుపెట్టుకొని ఏర్పాటు చేశారని వారికి వీరికి ఏమీ తేడా లేదని అధికార దాహం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రథమ పౌరుడైన మేయర్ మాత్రమే చాంబర్ ఉండాలని డిప్యూటీ మేయర్ కు ఛాంబర్ ఉండాలని ఏనిబంధనలో లేదని కానీ ప్రజాధనం కోల్లగొట్టడానికి బిజెపి నిబంధనలను తుంగలో తొక్కి అవినీతికి పాల్పడాలని చూస్తుందని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై, డిప్యూటీ మేయర్ చాంబర్ ఏర్పాటుపై సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు ఒక ప్రకటనలో హెచ్చరించారు.
