ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో భార్యాభర్తల ఫైట్..

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో భార్యాభర్తల ఫైట్.. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడంతో..

 

 

 

 

శనివారం ఓ ఎయిర్ ఇండియా విమానంలో భార్యాభర్తలు తగవు పడ్డారు.

ఈ క్రమంలో మహిళ భర్త మరో ప్యాసెంజర్‌తో కూడా దురుసుగా వ్యవహరించడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అమృత్‌సర్-ఢిల్లీ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానంలో భార్యాభర్తలు తగవు పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

మరో ప్యాసెంజర్ ఫిర్యాదు మేరకు..

భార్యతో గొడవ పడ్డ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అమృత్‌సర్-ఢిల్లీ విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఏఐ 454 ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది.

విమానం ల్యాండయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం మొదలైంది.
ఇద్దరి గొడవను చూసి మరో ప్యాసెంజర్ వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో మహిళ భర్త..
ప్యాసెంజర్‌తో తగవుకు దిగాడు.
వీరి గొడవ పతాకస్థాయికి చేరడంతో విమానం క్రూ సదరు ప్యాసెంజర్‌ను బిజినెస్ క్లాస్‌లోకి మార్చాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.
‘ల్యాండింగ్‌లో సిద్ధమవుతున్న సమయంలో మహిళ భర్త సీట్ల మధ్య నడవాలో నిలబడి మరో ప్యాసెంజర్‌తో తగవుకు దిగారు.
ఈ విషయం క్యాబిన్ క్రూ దృష్టికి రావడంతో వారు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.
రెండో ప్యాసెంజర్‌ను బిజినెన్ క్లాస్‌లోకి పంపించారు.
ఈ మేరకు మహిళ భర్తపై రెండవ ప్యాసెంజర్ ఫిర్యాదు చేయడంతో పైలట్ ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
విమానం ఢిల్లీలో దిగాక వారు మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నారు’ అని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

విమానంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనను తాము అస్సలు సహించబోమని ఎయిర్ ఇండియా పేర్కొంది.

ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొంది.

ఈ విషయంలో దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని వెల్లడించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version