ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
డాక్టర్ తిక్క వినోద్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి మమత హాస్పిటల్ వైద్యులు డాక్టర్.తిక్క వినోద్ కుమార్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఆరోగ్యమే మహాభాగ్యం అని,ప్రతి వ్యక్తి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం,సమతుల్య ఆహారం తీసుకోవడం,సరైన నిద్రపోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని భూపాలపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు తెలిపారు.
