పిల్లలతో సహా తండ్రి అదృశ్యం…
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో గల చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలతో సహా తండ్రి అదృశ్యమైనట్లు చిరాగ్ పల్లి ఎస్సై కె.రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 17 తారీకు న పర్వతాపూర్ గ్రామానికి చెందిన గురడి గోపాల్ రెడ్డి (38) సంవత్సరల వయస్సు గల వ్యక్తి తన కూతురు అనుష రెడ్డి, కొడుకు సాత్విక్ రెడ్డి తో కలిసి సంగారెడ్డికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని బంధువుల దగ్గర చుట్టూ ప్రక్క ల గల గ్రామాలలో ఆచూకీ కోసం ప్రయత్నించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో పిల్లలతో సహా అదృశ్యం అయినా తండ్రి గోపాల్ రెడ్డి తల్లి గూరడి శోభమ్మ చిరాగ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిరాగ్ పల్లి ఎస్ఐ కె. రాజేందర్ రెడ్డి తెలిపారు.