విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం.
నర్సంపేట,నేటిధాత్రి:
వ్యవసాయం పట్ల విద్యుత్ వినియోగం అందుకు నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో నర్సంపేట రూరల్ విద్యుత్తు ఏఈ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రధానంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయానికి విద్యుత్ వాడే క్రమంలో కెపాసిటర్లు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. మోతాదుని మించి విద్యుత్తు వాడరాదని తెలిపారు. విద్యుత్తు సమస్యలు వస్తే వెంటనే పరిష్కారం చేస్తామని ఏఈ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ కుమారి,వార్డు సభ్యులు మామిడి ఐలయ్య,
లైన్మెన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్ మ్యాండ్ రమేష్, మాజీ వార్డు మెంబర్ ఉప్పుల రాజు, భయ్య నవీన్, సలుపాల ప్రభాకర్, సుధాకర్, ఐలయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
