విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి.

జూలై 23న విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి-వామపక్ష విద్యార్థి సంఘాలు

కరీంనగర్, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ చౌక్ వద్ద వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో బంద్ జయప్రదం చేయాలని వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డిఈవో పోస్టులను భర్తీ చెయ్యాలి.ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలి. పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి, నిధులు కేటాయించాలి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలి. విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలి. ఎన్ఈపి-2020 తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. బంద్ విజయవంతానికి విద్యార్థులు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని వారు కోరారు. ఈసమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామారపు వెంకటేష్, మచ్చ రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, పిడిఎస్యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కుతాటి రాణా ప్రతాప్, పిడిఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్, ఎఐఎఫ్డిఎస్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీకాంత్, పిడిఎస్యూ జిల్లా నాయకులు ముల్కాల మారుతి, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు కేశబోయిన రాము యాదవ్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అసంపెల్లి వినయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆకాశ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version