రైతులను ఇబ్బంది పెట్టవద్దు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.
కల్వకుర్తి / నేటి ధాత్రి :
కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం పరిసర గ్రామాల రైతుల పొలాలగుండా 765 పవర్ గ్రిడ్ హైటెన్షన్ లైన్ ను ఎలాంటి సమాచారం లేకుండా 1200 వందల మంది రైతులకు నష్టం కలిగించే విధంగా తీసుకెళ్తున్న పవర్ గ్రిడ్ లైన్ పనులు ఆపాలని బాధిత రైతులు కడ్తాల్ లో ధర్నా నిర్వహిస్తున్నారు. వారికి సంఘీభావంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేహాజరయ్యారు.ఈసందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ..ప్రభుత్వం అప్రజాస్వామికంగా రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిరుపేద సన్న, చిన్నకారు రైతుల పొలాలగుండా 765 పవర్ గ్రిడ్ లైన్ తీసుకెళ్లడం అన్యాయమని, బజారునపడే దుస్థితి వస్తుందని, గత కొన్ని నెలలుగా ఈవిషయం ముఖ్యమంత్రికి తప్ప మిగతా అధికారపార్టీ నాయకులకు, అధికారులకు నివేదించినప్పటికీ స్పందనలేదని, అధికారులు పట్టించుకోని ఈ సమస్యను వెంటనే తీర్చాలని అని అన్నారు.ఈ కార్యక్రమంలో బాధిత రైతులు, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్ రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ సులోచన, సాయిలు గ్రామ బీ ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రామకృష్ణ,రాఘవేందర్, నరసింహ, వెంకటేష్,అంజి,మనీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.