ఆర్టిసి కార్మికులను వేధిస్తున్న డిఎం ను సస్పెండ్ చేయాలి.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు కార్మికుల మొర
బెల్లంపల్లి నేటిధాత్రి :
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫాబాద్ డిపోలో పని చేస్తున్న కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న డిపో మేనేజర్ విశ్వనాథ్ ను సస్పెండ్ చేయాలని , కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, ఆర్ టి సి కార్మిక సంఘం నాయకులు కె. ఎస్. రావు డిమాండు చేశారు. ఈ రోజు ఆర్ టి సి కార్మికులతో కలిసి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసిఫాబాద్ డిపోలో పని చేస్తున్న కార్మికులపై భారం పెంచి వేధింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆసిఫాబాద్ నుండి హైదరాబాద్ వెళ్ళే సర్వీసులను నడిపితే మూడు రోజుల పని దినాలుగా ఉన్న దానిని రెండు రోజులకు కుదించే కుట్ర చేస్తున్నారని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పెరుతో పని చేయని మిశన్ ద్వారా టెస్ట్ చేసి కార్మికులపై తప్పుడు నివేదికలు ఇచ్చి సస్పెండ్ చేయడం, సర్వీస్ నుండి రిమూవల్ చేయడం చేస్తున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాల్లో 216 మంది కార్మికులను సస్పెండ్, రిమూవల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ సొలొమాన్, ఆసిఫాబాద్ డిపో మేనేజర్ విశ్వనాథ్ వేధింపులు ఆపాలని, ఆర్ ఎం ను ట్రాన్స్ఫర్ చేయాలని, డి ఎం విశ్వనాథ్ ను సస్పెండ్ చేయాలని విన్నవించగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించారని, ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారని ఏమాజి తెలిపారు. కేంద్ర మంత్రినీకలిసిన వారిలో బిజెపి సీనియర్ నాయకులు కేశవరెడ్డి, ఆర్ టి సి కార్మికులు పాల్గొన్నారు.