నేడు డయల్ యువర్ డిపో మేనేజర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ స్వామి మంగళవారం ‘డయల్ యువర్ డిపో మేనేజర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో, ప్రజలు ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు మరియు సూచనలను నేరుగా తెలియజేయవచ్చు. దీని కోసం 99592 26269 నంబర్ కు ఫోన్ చేయాలని మేనేజర్ కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తుంది.