టీబీజీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా…

టీబీజీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకులు

సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డును వెంటనే అమలు చేయాలి

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టిబిజికేఎస్ సంఘం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి,టీబీజీకెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి,వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి టిబిజికెఎస్ నాయకులు, బడిదల సమ్మయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత బిఆర్ఎస్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలకు చట్టబద్దత లేని సమయంలో, 115 మెడికల్ బోర్డుల ద్వారా 13,119 మంది కార్మిక బిడ్డలకు కారుణ్య నియామకాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది.
నేటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏడాది కాలంగా (మార్చి 2025 నుండి) ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించకుండా 2000 మంది అనారోగ్యంతో ఉన్న కార్మికుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం అడుతుంది.

సింగరేణిలో ఇచ్చిన గ్యారంటీలు నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహిస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కడం అన్యాయం.
వారసత్వ ఉద్యోగాల వల్ల సింగరేణి కుంటుపడిందని చెప్పడం అబద్దం! ప్రభుత్వం చెల్లించాల్సిన 50 వేల కోట్ల బకాయిల వల్లే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
మారు పేర్ల విజిలెన్స్ అంశం పై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి.అక్టోబర్ 2025 నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డిపెండెంట్లకు ఉద్యోగ నియమక పత్రలు వేంటనే ఇవ్వాలి.
బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైకరి నశించాలి..
తెలంగాణ బొగ్గు గణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ సంఘం పిలుపునిచ్చారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version