కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు చూసి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.