ప్రభుత్వ పాఠశాలలో సీఎం కప్ జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ బేస్ బాల్ పోటీలు.
చిట్యాల, నేటిదాత్రి :
జూకల్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ బేస్ బాల్ పోటీలు ఘనంగా నిర్వహించామని హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ తెలిపారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎస్ఓ చిర్రా రఘు హాజరై సాఫ్ట్ బాల్ బేస్ బాల్ క్రీడల గురించి మాట్లాడారు ఈ పోటీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ మంచిక అభినవ్ వినయ్ కుమార్ సారధ్యంలో జిల్లాలోని 12 మండలాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరై వారి ప్రతిభను చాటారని మాట్లాడడం జరిగింది . ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన విద్యాశాఖ ఏఎమ్ఓ పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ క్రీడల వలన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పేరు రావడం శుభ పరిణామమని మాట్లాడడం జరిగింది ఈ పోటీలలో గెలుపొందిన వారిని తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ సాఫ్ట్ బాల్ బేస్ పోటీలకు పంపిస్తామని నిర్వాహకులు బండి ప్రసాద్ గాజర్ల శ్రీనివాస్ తెలియజేశారు ఈ క్రీడా పోటీలలో ఫిజికల్ డైరెక్టర్లు సూదం సాంబమూర్తి బండి ప్రసాద్ నూకల లింగయ్య గాజర్ల శ్రీనివాస్ పూర్ణిమ సమ్మయ్య హేమలత కళ్యాణి సులోచన దొడ్డ శ్రీలత రాధికా రాణి స్వరూప సంఘ రఘుపతి హై స్కూల్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
