శ్రద్ధాంజలి ఘటించిన సిపిఎం పార్టీ జిల్లా నాయకులు….

శ్రద్ధాంజలి ఘటించిన సిపిఎం పార్టీ జిల్లా నాయకులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి…

 

మండలంలోని కరకగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అశ్వాపురం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి కామ్రేడ్ పొడియం అడమయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు నిమ్మల వెంకన్న,సత్రపల్లి సాంబశివరావు,మండల కన్వీనర్ కొమరం కాంతారావు,ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్ లు శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం వారు మాట్లాడారు అశ్వాపురం గ్రామం ఏర్పడిన నాటినుండి గ్రామ అభివృద్ధి కొరకు సిపిఎం పార్టీ అండతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారని వారన్నారు పార్టీకి అందించిన సేవలు ఎనలేనివని అడమయ్య పోడు భూముల పోరాటం మండలం లోని అనేక గ్రామాల్లో పోడు భూముల పోరాటం వలస ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని మంచినీరు, రేషన్ కార్డులు ఇతర సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటంలో పాల్గొన్నాడని వారన్నారు గ్రామం ఏర్పడిన ముందు తరం గ్రామస్తులలో ఒకడని ఊరుని నిలబెట్టిన వ్యక్తిగా అడమయ్య చరిత్రలో నిలిచారన్నారు ఈరోజు అడమయ్య లేకపోవడం పార్టీకి తీరని లోటని వారు అన్నారు ఆశయాలు కొనసాగించాలని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు అడబాయ కుటుంబానికి ప్రధాన సానుభూతి తెలియజేస్తూ కుటుంబానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు మాదాసు అఖిల్ సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు చర్ప సత్యం, బిలపాటి శంకరయ్య, కోవ్వాసి వెంకటేశ్వర్లు, పద్దం బాబురావు, పదం సత్యం తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version