సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు.
చిట్యాల,నేటిధాత్రి :
జయశంకర్ జిల్లా భూపాలపల్లి చిట్యాల మండలం
గోపాలపురం గ్రామంలో గౌడ సంఘం అధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని నారాయణ గౌడ్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని నారాయణ మాట్లాడుతూ
సామాన్య గౌడ గీత కార్మికుని కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించిన బహుజన వీరుడు
నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన అలుపెరగని పోరాట యోధుడు
భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా అసమాన పోరు చేసిన ధీరుడు
మొఘలాయిల పెత్తనంపై సమర శంఖారావాన్నిపూరించి
గోల్కొండ కోటాపై జెండాను ఎగరేసిన తొలి తెలుగు చక్రవర్తి
వందల ఏండ్ల క్రితమే అణగారిన ప్రజల ఆత్మ గౌరవాన్నివెలుగెత్తి చాటుతూ, సామాజిక న్యాయాన్నిఅమలు చేసిన సమరసేనాని, తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం కుటుంబ సభ్యులు పోశాల రాజు, పోశాల పైడయ్య, బత్తిని సదయ్య, పులి కిరణ్, పులి యుగేంధర్ , కోరుకోప్పుల అశోక్, కోల వేంకటేష్, మూల పైడయ్య, కోల మొగిళి, గ్రామస్తులు పాల్గొన్నారు.
