అన్ని వేళ్లూ బిజేపి వైపే..!

బిజేపి పెద్దలు నోరు తెరిచేదెప్పుడు?
పార్టీ ప్రతిష్ట దిగజారుతుంటే కూడా కనిపించడం లేదా?
గుడి కోసం కొట్లాడాల్సిందిపోయి, కోట్లు తీసుకొని సైలెంటవుతారా?
ఇద్దరు నేతలకు చెరో కోటి ముట్ట జెప్పామని అంటున్నారు…నిజమేనా?
గుడి కోసం గుంటూరు స్వామి తాపత్రయపడుతుంటే, బిజేపి నేతలు కోట్లు మింగేస్తుంటే?
ధర్మం, దైవం కోసం అన్న మాటలు మాట్లాడే అర్హత బిజేపి నేతలకు వున్నట్లేనా?
ఇన్ని ఆరోపణలు వస్తున్నా బిజేపి పెద్దలు ఎందుకు నోరు విప్పడం లేదు?
గుడి కావాలా…కోట్లు కావాలా? బిజేపి నేతలు ఏం చెబుతారు?
తెల్లని కాగితం అగ్రిమెంటుకు చెల్లుతుందా?
తూతూ మంత్రంగా రాసుకుంటే చట్టం ముందు నిలబడుతుందా?
నాలా మీద జాగ ఇస్తామంటే సంతకాలు చేసేస్తారా?
ఎవరివారు బేరాలు మాట్లాడుకుంటే సరిపోయిందా?
ఇప్పటికైనా బిజేపి పెద్దలు కళ్లు తెరవకుంటే, పార్టీకే తీవ్ర నష్టం?
వచ్చేది మేమే…గెలిచేది మేమే అనుకుంటూ ఇలాంటి పనులు చేస్తే జనం నమ్ముతారా?
దేవుడికే దిక్కులేకుండా చేస్తుంటే, మా బతుకులు బాగు చేస్తారని అనుకుంటారా?
వచ్చేది మేమే…గెలిచేది మేమే అనుకుంటూ పై స్ధాయి నేతలు బడాయిలకు పోతుంటే, అందిన కాడికి నొక్కుతూ, జేబులు నింపుకుంటూ, కింది స్ధాయిలో పార్టీకి బొక్కలు పెడుతున్నారు. ఇదీ బిజేపిలో సాగుతున్న పైన పటారాం..లోన లొటారం ముచ్చట. దైవం, హైందవం, హిందుత్వం, ధర్మం, దేశం అంటూ మాటలు చెప్పుకుంటే సరిపోదు. అందుకు తగ్గట్టు కూడా నాయకులు ప్రవర్తించాలి. త్యాగాలు చేయాలి. అంతే కాని ధర్మం ముసుగేసుకొని, అందిన కాడికి దోచుకుంటాం…దేవుడికైనా శఠగోపం పెట్టేస్తామంటే ఇలాగే వుంటుంది. జూబ్లీహిల్స్‌ అభయాంజనేయ స్వామికి జరిగిన అన్యాయమే రేపు మాకు జరుగుతుంది? అని ప్రజలు అనుకుంటున్నారు. హైందవం ప్రకారం ధర్మం అంటే గుడి, దేవుడు. ఎందుకంటే ధర్మ పరిరక్షకుడు దేవుడు. ఆయన వుండేది గుడిలో…మరి ఆ పరిరక్షకుడైన దేవుడి కోసం, ధర్మనిరతిని అనుసరించాల్సిన బిజేపి నేతలు ఏం చేస్తున్నారు. ధర్మాన్ని పాటిస్తున్నారా? బిజేపి నేతలమని చెప్పుకోగానే సరిపోతుందా? వాళ్లు, ఓట్ల నాడు పనిచేస్తే చాలనకుంటుందా? ఇంకేం అక్కర్లేదా? ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత వారి మీదలేదా? ఒక వేళ వాళ్లు తప్పు చేస్తే పార్టీ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోదా? మీరు చేయాల్సింది మీరు చేసుకోండి? మేం చూసుకుంటామని పార్టీ ఏమైనా భరోసా కల్పిస్తోందా? ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం బిజేపి నేతలపై వుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్‌ గుడి వివాదమేమీ చిన్నది కాదు. దేవుడు ఎక్కడైనా దేవుడే…గుడి చిన్నది కదా? అని దేవుడు చిన్న దేవుడౌతాడా? ఇదెక్కడి చోద్యం. పెద్ద గుళ్లలోని దేవుళ్లను తొలగిస్తే, గుళ్లు కూల్చేస్తేనే తప్పా…చిన్న చిన్న గుళ్లు మింగేసినా బిజేపి రాష్ట్ర నాయకులకు పట్టదా? కింది స్ధాయి నేతలంతా కలిసి గుడిని, గుట్టను మింగేవాళ్లకు సహకరిస్తూ, వాళ్లు కూడా మింగుడులో పాలు పంచుకుంటుంటే కూడా తప్పని అనిపించడం లేదా? జూబ్లీహిల్స్‌ గుడి వివాదం ఏమైనా కొత్తదా? ఆరు నెలలుగా రగులుతున్నదే… రాష్ట్రంలో ఏ మారు మూల ఏం జరిగినా తెలిసే ఈ రోజుల్లో జూబ్లీహిల్స్‌ కొండ మామjైు, గుడి మాయమై, దేవుడికే దిక్కులేకుండాపోతుంటే బిజేపి రాష్ట్ర నాయకత్వానికి తెలియంకుండా వుంటుందని ఎవరైనా అనుకుంటారా? రాష్ట్ర పార్టీ చిత్తశుద్ది ఎంత గొప్పదో తెలుసుకోలేరా? మేమే హిందుత్వానికి ప్రతీకలమంటే ఇదేనా? గుడి వున్న స్ధలాన్ని మాయం చేసేవారికి సాయం చేయడమే ధర్మపరిరక్షణ అని కూడా బిజేపి నేతలు అనుకుంటున్నారా?
గుడి వున్న స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే బిజేపి చూస్తూ ఎలా ఊరుకున్నది. ఇదేనా హైందరపరిరక్షణ కోసం పాటుపడుతున్న బిజేపి అన్న అనుమానం ప్రజలకు రాదా? ఉత్తర ప్రదేశ్‌లో రామ మందిర నిర్మాణం గొప్పగా చెప్పుకుంటే సరిపోతుందా? జూబ్లీహిల్స్‌లో అంజన్న గుడి కూల్చినా ఫరావాలేదా? దాని ఆనవాలు లేకుండా చేస్తున్నా బిజేపి పెద్దలు కదలరా? లేకపోతే….అవును మేం…గుడికన్నా, దేవుడికన్నా, వ్యాపారులకే సపోర్టు చేస్తామని చెప్పండి? కనీసం అప్పుడైనా జనం నిజం చెప్పారని అనుకుంటారు. అంతే కాని ఆగం, ఆగం చేసి, హడావుడి, హడావుడి చేసి, గుడిని కదలనీయం…గుట్ట తొలవనీయం అని పెద్దపెద్ద మాటలు చెప్పిన బిజేపి నేతలు ముడుపులు తీసుకొని నోరు మూసుకున్నారని సాక్ష్యాత్తు బిల్టర్లే చెబుతుంటే ఆ పార్టీ పెద్దలకు వినిపించడం లేదా? గుడి కడితే మాకేం వస్తుంది, కనీసం ఆపినట్లు నటిస్తే నాలుగు రూపాయలు వస్తాయని అనుకున్నారా? అన్నది కూడా స్పష్టం చేయాలి.
గుంటూరు స్వామి చాలా స్పష్టంగా, సూటిగా బిజేపి నేతలకు ఎంతెంత ముట్టజెప్పారన్న మాటను చెప్పారు. పల్లపు గోవర్ధన్‌ అనే నాయకుడికి రూ.కోటి…విహెచ్‌పికి చెందిన నేత రామరాజుకు రూ. కోటి. ఇచ్చినట్లు గుంటూరు స్వామి ప్రజల సమక్షంలో చెప్పేశారు. మరి అలాంటప్పుడు అటు భజరంగదళ్‌ ఏం చేస్తున్నట్లు? ఇటు విశ్వహిందూ పరిషత్‌ ఏం చేస్తున్నట్లు? మరో మాజీ బిజేపి ఎమ్మెల్యేకు ముట్టాల్సినంత ముట్టినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక స్ధానిక కార్పోరేటర్‌ వెంకటేశ్‌కు లక్షల్లో రూకలు ముట్టినట్లు, కొంత పని కాంట్రాక్టు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇది నిజామా కాదా? అన్నది వాళ్లే చెప్పాలి. ముందు గుంటూరు స్వామి మీద కేసు నమోదు చేసినట్లు చెప్పిన బిజేపి నేతలు ఆ కేసును ఎందుకు ఉపసంహరించుకున్నట్లు. కోట్ల రూపాయలు తీసుకుంటే చాలు, గుడి కడితే మాకేంటి…కట్టకపోతే మాకేంటి అనుకునేంత కుత్సిత స్వభావ నేతలను బిజేపి ప్రోత్సహిస్తున్నట్లు అనుకోవచ్చా? అనే ప్రశ్నలకు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు, విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్రపెద్దలు కూడా నోరు విప్పాల్సిందే…వివరణివ్వాల్సిందే…లేకుంటే దేవుడితోనే ఆడుకుంటారా? దైవం, ధర్మం అనుకుంటూ రాజకీయాలు చేస్తూ, వచ్చేది మమే…వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పుకుంటూ చేయాల్సినపనులు ఇవేనా? ఇప్పుడే ఇలా చేస్తుంటే, రేపు అధికారంలో కూర్చుండబెడితే, గట్టలు, గుళ్లు మేమే మింగేస్తామని పరోక్షంగా చెప్పినట్లు కాదా? పార్టీకి ఇలాంటి నేతలు తీరని నష్టం చేస్తున్నట్లు కాదా? భవిష్యత్‌ రాజకీయ నిర్మాణం, పార్టీ కోసం పని చేయాల్సిన నేతలు, త్యాగాలు చేయాల్సిన నేతలే ఇలా ధర్మం తప్పితే పార్టీని ప్రజలు ఎలా నమ్ముతారు? ఎలా ఆదరిస్తారు? హైదరాబాద్‌ నడిబొడ్డునే ఇలాంటి దుర్చర్యలకు బిజేపి నేతల ముసుగులో దేవుడికే నీడ లేకుండా చేయడానికి సహకరించడం న్యాయమేనా? పంచుకోవాడాలలో పాలు పంచుకుంటుంటే, వాటాలతో జేబులు నింపుకుంటుంటే పార్టీ ఎలా ఉపేక్షిస్తోంది. ఇలాంటివారిని ప్రోత్సహించడం ఒక భాగమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాకమానవు.
జూబ్లీహిల్స్‌ గుట్ట, గుడి విషయంలో అన్ని వేళ్లు బిజేపి వైపే చూపిస్తుంటే బిజేపి నేతలు ఏమని సమాధానం చెప్పుకుంటారు? సహజంగా నాయకులు ఏ రియలెస్టేట్‌ వ్యాపారమో చేసుకుంటూ గడిరచిన సొమ్మును రాజకీయాల్లో ఖర్చు చేసి, ప్రజలకు చేరువౌతున్న రోజులు. కాని గుడి పేరు చెప్పుకొని వ్యాపారులకు కొమ్ము కాస్తూ, గుడికే శఠగోపం పెడుతూ, ప్రజలకు ఎలా చేరువౌతారు. నిజానికి ఇలాంటి సంఘటనల్లో, సందర్భాలలో అధికార పార్టీకి చెందిన నేతలు, నాయకులు వత్తాసు పలుకడం చూస్తుంటాము. కాని ఇక్కడ టిఆర్‌ఎస్‌కు చెందిన నేతలు ఎవ్వరూ అటు వైపు తొంగిచూడలేదు. అందులో పాలు పంచుకోలేదు. ఏ పాలు కోరలేదు. ఎవరితో లాలూచీ పడలేదు. దాన్ని రాజకీయం చేయలేదు. గుడి అడ్డుకుంటున్నామని అడ్డదారులు తొక్కలేదు. కాంగ్రెస్‌నేతలు కూడా అక్కడికి చేరింది లేదు. ఆపే ప్రయత్నం చేసింది లేదు. మొత్తంగా వచ్చింది బిజేపి నేతలు. దాని అనుబంధ సంస్ధలైన విశ్వహిందూ పరిషత్‌, భజరంగదళ్‌ సంస్ధలు. ఇక్కడ మరో చమత్కారమేమింటే భజరంగదళ్‌ అంటేనే హనుమంతుడు. అలాంటిది అభయాంజనేయ స్వామి గుడికే దిక్కులేకుండా చేస్తున్నవారి పంచన చేరి, జేబులు నింపుకునే ప్రయత్నం భావ్యమా? ఆ సంస్ధ నేతలు ఇలాంటి యవ్యారాలు చేయడం పద్దతేనా? వీళ్లా ధర్మం కాపాడేదన్న అనుమానం రాకుండా వుండదా? ఎవరిని మోసం చేయడానికి ధర్మం కోసం, దైవం కోసం, దేశం కోసమంటూ పైకి మాయ మాటలు చెప్పి మూటలు దోచుకెళ్లడం అన్నదానికి ఈ ఒక్క సందర్భం చాలదా? ఎక్కడికక్కడ నియోజవర్గ స్ధాయి నాయకుల నుంచి మొదలు, కార్పోరేటర్‌ దాకా అందినకాడికి దండుకొని మింగేసి, నీతి వాఖ్యాలు వల్లిస్తే జనం వింటారా? నమ్ముతారా? ఇప్పటికైనా బిజేపి పెద్దలు ఆలోచించుకోవాలి. గట్ట లేకుండా చేసి, గుడి ఆనవాలు కనిపించకుండా చేసి, నాలాలో భాగమైన స్ధలం ఇస్తామంటే స్ధానిక కార్పోరేటర్‌ ఎలా సంతం చేస్తాడు? ప్రభుత్వ భూమిని రాసిచ్చే అధికారం ఎవరికైనా వుంటుందా? ఏదో ఒక కాగితం మీద రాతలు రాసుకుంటే అవి అగ్రిమెంట్లు అవుతాయా? చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయా? దానికి ఎలాంటి చట్టబద్దత అవసరం లేదా? ఇలా బిజేపికే శఠగోపం పెట్టే నాయకులు అందిన కాడికి దోచుకుంటూ, పార్టీప్రతిష్టను బజారు పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? చర్యలు ఏమైనా తీసుకుంటారా? అసలు ఏం జరిగిందన్నదానిపై పార్టీపరమైన కమిటీ ఏదైనా ఏర్పాటు చేస్తారా? దోషులని తేలితే వాళ్లను పార్టీనుంచి తప్పిస్తారా? భవిష్యత్తులో ఇలాంటి పనులు ఏ నాయకుడు చేయకుండా గట్టిగుణపాఠంచెబుతారా? అన్నది పార్టీ నుంచి స్పష్టత కావాలి. ఇవ్వాలి…గుడి నిర్మాణ బాధ్యత కూడా తీసుకోవాలి. ఇంత జరిగాక తప్పుకుంటామంటే చాలదు!

గుడి ఏది?…ఆ ఒక్కటీ అడక్కు!?

 


అయితే నాకేమిస్తావో ఒక్క ముక్కలో చెప్పు?
ఇచ్చేవాడు లటుక్కు… మింగే వాడు మిటుక్కు…?
అంతేనా…గుంటూరు శివ స్వామి?
కరి మింగిన వెలగ పండు జూబ్లిహిల్స్‌ కొండ
ఊర్లు పంచుకున్నంత పని చేశారు?
గుట్ట మాయం, గుడికి శఠగోపం?
గుంటూరు స్వామి చెప్పిన నిజాలు?
వాటాలు పంచుకున్నట్లేనా.. నాయకులు?
స్వామి చెప్పినవన్నీ ఒప్పుకున్నట్లేనా?
దేవుడినే మాయం చేసిన ఘనులు?
నిలదీయాల్సిన వాళ్లు నిలువు దోపిడీ చేస్తున్నారు?
దేవుడికే నీడ లేకుండా చేస్తున్నారు?
అడిగిన వాళ్లకు, అడినట్టు కోట్లుకు కోట్లు పప్పు బెల్లం పంచినట్లు ఎందుకు పంచుతున్నట్లు? అసలు ప్రసాదం అందిరికీ అందకుండా గుడి కట్టరెందుకు? ఇంత మందికి ఇన్నేసి కోట్లు ఇచ్చే బదులు వాటితోనే గుడిని గొప్పగా కట్టొచ్చు..కదా???.యాదాద్రిలో కొత్త గుడిలా చరిత్రలో నిలిచిపోతుంది కదా!! అమ్మమ్మా…ఆ…ఒక్కటీ అడక్కు…నిజంగా అక్కడ గుడి కడితే మాకు మిగిలేది ప్రసాదమే…అందులో కారం కారం మిరియాలే…!! చేదు…చేదు ఆవాలే!!! ఈ మాత్రం తెలియకుండానే వ్యాపారం చేస్తున్నామా? అడిగినోళ్లు అడిగినట్లు ఎంత పంచుకుంటూ పోయినా సరే…మిగిలేది ఎంత లేదన్నా…ఇంకో పది కొండలు కొనేంత? అమ్మా…గుడి కట్టేయడమే…అదే చేయాలనకుంటే ఇంతెందకు? ఈ తంతంతా ఎందుకు? అందుకే అడగిన వారికి అడిగినట్లు సమర్పించుకుంటూనే వుంటాం…కాని … ఆ గుడి అంటూ…ఆ ఒక్కటీ అడక్కు….!!! గుడి అంటూ మళ్లో సారి మాట్లాడొద్దు…సరేనా…అంతే కదా…! ఇదే కదా..!! జరుగుతోంది గుంటూరు స్వామి!!! ఇక్కడ అడిగేవారు అడుగుతున్నారా? లేక ఇచ్చేవారు ఇచ్చేస్తున్నారా? అన్న దాని గుట్టు కూడా పూర్తిగా గుంటూరు శివ స్వామి మాత్రమే విప్పాలి. సర్వసంగ పరిత్యాగులైన వాళ్లే అసలు బండారం బైట పెట్టాలి. అక్కడ గుడి వుంటుందా? వుండదా? తేల్చి చెప్పాలి. ఈ దాగుడు మూతలకు తెరదించాలి…!
కరిమింగిన వెలగ పండులో కనీసం పెంకైనా మిగులుతుందేమో! కాని గుట్ట మింగిన వాళ్లు ఇసుక రాయి ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నారు. సహకరించిన వాళ్లకు వాటాలకు వాటాలు పంచుకుంటూ పోతూ, నోర్లు మూయిస్తున్నారు? ఇసుక రేణువు కూడా ఆనవాలు కనిపించకుండా. చదును చేసి, దేవుణ్ణి ఖాళీ చేయించి, నివాసాలకు అనువు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ కొండ, గుడి అని చెప్పుకునేందుకు కూడా వీలు లేకుండా ప్రకృతిని ధ్వంసం చేసేస్తున్నారు. కొబ్బరి కాయ కొడితే చాలు పక్కన పడి వుంటాడు…అని దేవుణ్ణి ఓ మూలన పడేశారు. ఇంకే ముంది? నోరెత్తినవాళ్లందరినీ నోట్ల కట్టలతో మూయించారట? కోట్లకు కోట్లు విసిరేస్తున్నారట. ఈ మాట స్పష్టంగా గుంటూరు స్వామి, మీడియా సమక్షంలో, భక్తుల సందోహంలో చెప్పిన మాట. ఆయన ఏ ఒక్కరినీ వదల్లేదు. ఎవరినీ విడిచిపెట్టలేదు. ఎవరు ఎంతెంత తీసుకున్నారన్నదానిని పూస గుచ్చినట్లు చెప్పారు. మాటల తూటాలు పేల్చారు. అయినా ఏ ఒక్కరి నుంచి స్పందన లేదు? మేం తీసుకోలేదని చెప్పిన వాళ్లు లేరు? అంటే మౌనం అర్ధాంగికారమా? పూర్ణాంగీకారమా? అన్నది తెలియాల్సివుంది. కోట్లు జేబులో వచ్చి చేరాయి…దేవుడు పేరుతో జేబులు నిండాయి. గుడి ఎటు పోతే మాకేంటి? గుట్ట మాయమైతే మాకేంటి? దేవుడు ఎటు వెళ్లిపోతే మాకేంటి అనుకుంటున్నారా?
అసలేం జరిగింది?: రెడ్‌ఫోర్ట్‌ అక్భర్‌ పేరిట ఓ వెంచర్‌ ఏర్పాటుకు రాత్రికి రాత్రికి జూబ్లిహిల్స్‌లోని ఓ గుట్ట చుట్టూ రేకులు కట్టేశారు. ఒక రకంగా చెప్పాంటే గుట్టను చుట్టేశారు. దాని మీద రాతలు రాసేశారు. ఆ స్ధలం విస్తీర్ణం కూడా రాసేశారు. అక్కడో గుడి వుంది. ఆ గుడిలో అభయాంజనేయ స్వామి దేవుడున్నాడు. కాని స్వామిని భక్తులకు కనిపించకుండా చేశారు. భక్తులు వెళ్లేందుకు దారి లేకుండా చేసేశారు. పూజలు బంద్‌ చేశారు. భక్తులకు దూరం చేశారు. ఈ ముచ్చట, ఆనోట ఈనోట జనానికి తెలిసిపోయింది. ఒక్కొక్కరు వస్తూ వెళ్తున్నారు. ఇదేం చోద్యమనుకుంటున్నారు. ఈ వార్త భజరంగల్‌, విశ్వహిందూ పరిషత్‌ వాళ్లకు సమాచారం అందింది. ఇంకేముంది హడావుడి మొదలైంది. బిజేపి శ్రేణులు కదిలారు. ఏదో పెద్ద కథే జరిగేలా వుందని అందరూ అనుకున్నారు. ఆ సంస్ధ ప్రతినిధులు కూడా అనుకున్నారు. ఆ స్ధలం చుట్టూ ఏర్పాటు చేసిన రేకులు మాయం చేశారు. రాతలు తుడిపేశారు. ఇక్కడే అసలు రాజకీయం మొదలు పెట్టారు. అధికారులు రంగంలోకి దిగారు. అందరూ కలిసి సంస్ధ యాజమాన్యానికి కొమ్ము కాశారు. మళ్లీ రేకులతో చుట్టేశారు. గట్టు మీద వున్న గుడి కూల్చేశారు. దేవుణ్ని కిందికి దించేశారు. అయినా ఎవరూ కదల్లేదు. దేవుడికే దిక్కులేకుండాపోతే మేం చేస్తామని సామాన్యులు అనుకున్నా, బిజేపి మాత్రం మేమున్నామన్నట్లు నమ్మించింది. నటించింది. ఇదీ అక్కడి ప్రజలు అంటున్నమాట. చాలా కాలం పాటు ఏ వివాదం లేకుండా పోయింది. ఆదాయ మార్గం కరువైందనుకున్న సందర్భంలో గుట్ట, గుడి బిజేపి నేతలకు ఓ వరంగా మారింది. స్ధానిక ప్రజా ప్రతినిధులకు ఓ కల్ప వృక్షంగా కనిపించింది. ఆఖరుకు బిజేపిలోని కొందరు పెద్దలకు, ఆరెస్సెస్‌, భజరంగదళ్‌ ముఖ్యులకు కూడా వరంగా మారింది. ఈ మాట గుంటూరు స్వామి చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎవరైతే గుడి విషయంలో ముడుపులు తీసుకున్నారో వాళ్లను ఆయా హిందూ సంస్ధలైన, బిజేపి అనుబంధ సంస్ధలనుంచి తొలగించాలని కూడా గంటూరు స్వామి డిమాండ్‌ చేశారు. అయినా ఉలుకూ , పలుకూ లేదు. కారణం ఏమైవుంటుంది? అన్నదానిపై ఎవరూ స్పందించకపోవడమంటేనే తేలు కుట్టిన దొంగలు కావడం కాదా?
దేవుడినే మాయం చేసి, వాటాలు పంచుకొని?: ఇది నిజంగా ఏ నీతో నాయకులే చెప్పాలి. అది ప్రభుత్వ స్థలమని అందిరికీ తెలుసు. ఆ స్ధలం ఎలాంటి ఆక్షన్‌ లేకుండా, రెడ్‌ ఫోర్డ్‌ అక్భర్‌ అనే సంస్ధకు అత్తసొమ్ము, అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వం కట్టబెట్టిందని తెలుసు. అసలే ప్రభుత్వం భూముల అమ్మకాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న ఈ తరుణంలో హైదరాబాద్‌కు గుండెకాయా లాంటి ప్రదేశంలో అంత స్ధలం అప్పనంగా ఎలా అప్పగించారు? అందుకు ఎవరెవరికి ఎంత ముట్టాయన్నదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి?. ఎక్కడికక్కడ భూములు వేలం వేసి, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతుంటే, ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ సిఎస్‌ స్పెషల్‌ జీవో ఇచ్చి, ఎలా దారాధత్తం చేశారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులంతా ఎలా సహకరించారు? అసలు అక్కడ గుడే లేదని ఓ తహసిల్ధార్‌ ఎలా రిపోర్టు ఇస్తాడు? అదే తహసిల్ధార్‌ ప్రభుత్వ స్థలమన్న బోర్డు గతంలో ఎందుకు పెట్టించాడు? అక్కడ గుడే లేకపోతే, 2016లో కార్పోరేటర్‌ విజయారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఎలా పిర్యాధు చేశారు? అన్నదానిపై ఎవరు క్లారిటీ ఇవ్వాలి.
ఇన్ని ఆరోపణలు ఎక్కడా వినలేదు?: ఏ గుడి అయినా ఎక్కడైనా గతంలో ప్రైవేటు స్థలాలలో వెలిసినట్లు చరిత్రలో లేదు. అలాగే జూబ్లిహిల్స్‌లోని ఈ అభయాంజనేయ స్వామి గుడి కూడా ప్రభుత్వ స్థలంలోనే వుంది. పూజలు కూడా జరుగుతున్నాయి. ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి గుట్ట మొత్తం ఓ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన ప్రభుత్వం, గుడిని కూల్చేసుకోండి అని ఏమైనా ప్రత్యేక అనుమతినిచ్చిందా? స్ధానిక ఎమ్మెల్యే గుడి కూల్చేందుకు ఎలా సహకరిస్తాడు? ఏకంగా గుడి కోసం నాలా కబ్జా చేసిన బిల్డర్ల్‌కు సహకరిస్తూ, ఎలా కొబ్బరి కాయ కొడతారు? నాలా స్థలంలో గుడి నిర్మాణం సాధ్యమయ్యేదేనా? అలా నిర్మాణం చేయొచ్చా? గుడి ప్రాంతాన్ని కాదని, కొండను తవ్వి, గుడిని, దేవుణ్ణి దూరంగా విరిరేస్తామంటే ఎమ్మెల్యే ఎలా ఒప్పుకున్నారు? గుంటూరు స్వామి చెప్పినట్లు అందరకీ వాటాలు వెళ్లాయన్నట్లు…ఇక్కడ కూడా జరిగిందా? అన్న అనుమానం ప్రజలకు రాకమానదు. స్ధానిక ప్రజా ప్రతినిధిగా వున్న ఎమ్మెల్యే ఎవరికి రక్షణ కోసం వున్నట్లు? ఎవరికి కొమ్ము కాస్తున్నట్లు? ఇదే వరుసలో అసలు గుడిని అడ్డుకోవాల్సిన స్ధానిక కార్పోరేటర్‌ కు కూడా తులాభారం అందినట్లు చెబుతున్నారు. నిజమేనా? అన్నదానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఇక దీనిపై మొదటినుంచి పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్న మరో బిజేపి నాయకుడు పల్లపు గోవర్ధన్‌కు ఓ హోటల్‌లో కోటి రూపాయుల తీసుకున్నట్టు గుంటూరు స్వామి వెల్లడిరచారు. ఇది నిజమేనా? ఇక మాజీ ఎమ్మెల్యే బిజేపి నాయకుడికి కూడా పెద్దఎత్తున ముడుపులు అందాయన్న మాట వినిపిస్తోంది? నిజమేనా? భజరంగ్‌ దళ్‌, ఆరెస్సెస్‌ నాయకులకు కూడా అమ్యామ్యాలు అందుకున్నట్లు గుంటూరు స్వామి వాళ్లు ఆ సంస్థలకే చీడ పురుగులు అన్నంత మాట మాట్లాడారు? అయినా వారిపై ఆయా సంస్ధలు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముడుపుల విషయంలో నోరెందుకు తెరవడం లేదు? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరిపై వుంది.
బిల్డర్లు ఎంతో చాకచక్యంగా?: సమస్యను పక్క దోవ పట్టించడంతో ఆ సంస్ధ ప్రతినిధులు ఆడుతున్న చదరంగం ఎంతో చాకచక్యమైంది. వారు వేస్తున్న పాచికులు ఎంతో చాణక్యమైనవి. అసలు వివాదం పైకి కనిపించకుండా, నోరు తెరిచిన వారందరినీ నోట్లకట్టలతో కొనేసి, తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు, ఒకరి మీద, మరొకరిని ఉసిగొల్పి, అసలు రాజకీయం నెరిపి, గుట్టను ఇప్పటికే సగం తరలించారు. ఇంకా వున్నా…చూస్తున్నంతలో అంతా మాయమౌతుంది. టిఆర్‌ఎస్‌ రాలేదు. బిజేపి వచ్చినా…ఇక గుంటూరు స్వామి అసలేం జరిగిందో చెప్పేశాడు. కాంగ్రెస్‌ ఎప్పుడొచ్చిందో…ఎప్పుడు మౌనాన్ని ఆశ్రయించిందో తెలిసిందే…చిన్న చిన్న విషయాలను పెద్దది చేసే రేవంత్‌ రెడ్డి, ఇంత పెద్ద విషయాన్ని వందల కోట్ల ప్రాపర్టీ కొల్లగొడుతుంటే కళ్లు మూసుకుంటున్నాడు. ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడంలేదు. కొన్నవారిని గురించి వివరాలు వెల్లడిరచలేదు. ఇక పిపిసి అధికార ప్రతినిధిగా దాసోసు శ్రవన్‌ ఒక్కసారి మీడియా సమావేశం… ఆ తర్వాత దాన్ని నిద్రలోనే మర్చిపోవడం చేసేశారు…ఒక రకంగా అందరూ మర్చిపొమ్మని చెప్పేశారు…! ఇదీ సంగతి…

పట్టుబడినా పనిష్మెంట్‌ లేదా!?


` దొరికినా వాళ్లింకా నిజాయితీ పరులేనా?
` రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖలో సస్పెండైన వారిపై చర్యలు తీసుకోరా..?
` ఎక్కడ మా మేడకు చుట్టుకుంటుందో నని ఎలాంటి దర్యాప్తు లేకుండానే వదిలేస్తారా?
` కావాలనే కాలయాపన చేస్తూ అక్రమార్కులకు ప్రోత్సాహమా..?


` కమీషనర్‌ గారు ఒక్కసారి ఇటువైపు చూడండి
` పూర్తి లెక్కలు తీయించండి?
` సస్పెండ్‌ అయినవారి సంగతి తెల్చాలనే డిమాండ్‌
` తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయత్నాలు.. మరిచిన జిల్లా పెద్దలు..?
` ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా పద్దతి మార్చుకోని వారిపై ఓ కన్నేయండి?
హైదరాబాద్‌ , నేటిధాత్రి :
ఆస్ధి…ఈ మాట వినగానే ఎవరికైనా ఒక ధైర్యం. ఒక భరోసా…అది నివాసమైనా, సాగు భూమైనా జీవితానికి సంబంధించినది. ఆకలి తీర్చుతుంది. ఆపదలో ఆదుకుంటుంది. అందుకే అలాంటి ఆస్ధులలో స్ధిరాస్ధులు అన్నవి ఎంతో కీలకం. అలాంటి వాటిని తమ సొంతం చేసుకోవడానికి, వాటిపై యాజమాన్య హక్కులు సాధించుకోవడం అవసరం. అందుకోసం ప్రభుత్వానికి అవసరమైన చెల్పింపులు చెల్లించి, రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే తమదైపోతుంది. తమ ఆస్దిగా స్ధిరపడిపోతుంది. ఇక్కడే దళారులకు, రిజిస్ట్రేషన్‌ అధికారులకు పండగ. సహజంగా క్రయ విక్రయ ప్రక్రియలు సమాజంలో సహజం. పైగా రియలెస్టేట్‌ వ్యాపారం విపరీతంగా పెరగడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు తాకిడిపెరిగింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులలో రిజిస్ట్రేషన్ల శాఖ అంత్యంత కీలకమైంది. రాజుల కాలం నుంచైనా సరే భూమి శిస్తు అన్నది అత్యంత ప్రధానం. ఇప్పుడు అదే కొనసాగుతోంది. ఎవరి స్ధిరాస్ధి వారిదే అన్నది రుజువుకు ఇదే ఆధారం. అందులో మార్పులు, చేర్చులు, చేతులు మారడాలు అన్నది జరిగిన ప్రతీసారి రిజిస్ట్రేషన్‌ తప్పని సరి.
ఇదే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేది. దాంతో ప్రతి వ్యక్తి రిజిస్ట్రేషన్‌ కార్యాయలం గుమ్మం తొక్కాల్సిందే. ముడుపులు చెల్లించాల్సిందే. కాగితాలు ఎంత పక్కాగా వున్నా సరే…అక్కడ ఆమ్యామ్యాలు చెల్లించకపోతే ఫైలు కదిలే సమమస్యే లేదు. ఏదో ఒక తిరకాసు సృష్టించాల్సిందే ముక్కు పిండి వసూలు చేయాల్సిందే. స్టాంపు వెండర్‌ దగ్గర నుంచి మొదలు, డాక్యుమెంటు రైటర్‌, సబ్‌ రిజిస్ధ్రార్‌ దాక. మధ్యవర్తులు, సబ్‌ రిజిస్ట్రార్‌లు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సైన్యాలు ఇంత మందిని సంతృప్తి పరిస్తే తప్ప, డాక్యుమెంటు మీద సంతకం పడదు. నీ చేతికి రాదు. ఇదీ జనం అవస్ధలు. ఈ అవస్ధలు అందరికీ తెలిసినే…అయితే అప్పుడప్పుడు మేం వున్నామంటూ ఓసారి ఏసిబి దాడులు. ఇంత వరకు బాగానే వుంది. సస్పెండ్‌ చేసినట్లు ఓ ముక్క చెప్పడం…వదిలేయడం రిజిస్రేషన్ల శాఖలో పరిపాటిగా మారింది. వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా తక్కువేం లేదు.
` వరంగల్‌లో సస్పెండైన వారిపై కానరాని చర్యలు
వరంగల్‌లోనే సంపత్‌ కుమార్‌, రాంచంద్రయ్య, శ్రీనివాస్‌, సురేంద్రబాబు నలుగురు సస్పెండ్‌ అయ్యారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా అనేక మంది రిజిస్ట్రార్‌లు పట్టుబడ్డారు. అందులో ఏదో చిన్న చిన్న మొత్తంతో కాదు, ఏకంగా లక్షల రూపాయలుతో కూడా పట్టుబడిన వారున్నారు. వారిలో రాజేంద్రనగర్‌కు చెందిన సబ్‌ రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ ఏకంగా రూ.50 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఆయనకు సహకరించిన డాక్యుమెంటు రైటర్‌ వాసును కూడా ఏసిబి వాళ్లు పట్టుకున్నారు. కాని ఏమైంది. దర్యాప్తు ఎంత వరకు వచ్చింది. అన్నది ఎప్పుడో మర్చిపోయారు. దాని మూలాలు వెతకడం వదిలేశారు. గత ఏడాది సెప్టెంబర్‌ 7న బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ నిజాముద్దీన్‌ ఏసిబికి పట్టుబడ్డారు. రూ.75వేలు తీసుకుంటుంటగా ఏబిసి వల వేసి పట్టుకున్నది. కాని ఏమైంది. ఏం కాలేదు. ఆ తర్వాత ఫైలు ముందుకు కదల్లేదు. ఆయనపై విచారణ పెద్దగా సాగింది లేదు.
ఇటీవల కాలంలో యాదాద్రి లోనూ సబ్‌ రిజిస్ట్రార్‌ కాలం కలిసొచ్చిందనుకున్నాడో ఏమో! ఇక అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డాడు. పరిసర ప్రాంతాల్లో భూములకు పెద్దఎత్తున డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. నగరానికి దగ్గర కావడంతోపాటు, యాదాద్రి పేరుతో నూతన ఆలయ నిర్మాణం జరగడంతో అక్కడ ప్రాంతాలకు ఒక్కసారిగా రియలెస్టేట్‌ భూమ్‌ వచ్చేసింది. సహజంగా యాదాద్రి చుట్టుపక్కల భూముల ధరలు రాత్రికి రాత్రి విపరీతంగా పెరిగాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోకి ఆ ప్రాంతాన్ని చేర్చాక మరీ రియలెస్టేట్‌ వ్యాపారం విపరీతంగా పెరిగింది. ఎక్కడ చూసినా వెంచర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్ల విక్రయాలు నిత్యం జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రాంతం అభివృద్ధి చెందుతుండడంతో, అక్కడ భూములు కొనేసుకునేందుకు ఎంతో మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఇది రిజిస్రేషన్ల శాఖకు వరమైంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది.
` యాదాద్రి సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌
ఇదే సమయంలో యాదాద్రి సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ ఏకంగా దుకాణమే తెరిచినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. రైతులు, వ్యాపారులు, సామాన్యుల నుంచి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్‌ పేరిట వసూలు చేస్తున్నారని ఏసిబికి ఉప్పందింది. దాంతో వాళ్లు రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే సోదాలు చేసి దేవానంద్‌ను పట్టుకున్నారు. రియల్టర్‌ను బెదిరించి మరీ వసూలు పేరుతో డాక్యుమెంటు రైటర్‌ వసూలు చేయడాన్ని ఏసిబి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ను సస్పెండ్‌ చేశారు. పైగా అదే సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంట్లోకూడా పెద్దఎత్తున సోదాలు నిర్వహించి భారీగా నగదు కూడా, డాక్యుమెంటు, ఆస్ధులు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లుపై కూడా వేటు పడిరది. ఈయన పరిస్థితి మరీ విచిత్రం. ఆయన ఏకంగా అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్ల చేయడం. రాత్రిళ్లు కూడా కార్యాలయంలోనే వుంటుండడం… పెద్దఎత్తున చీకటి సమయంలో అక్రమ రిజిస్రేషన్లు చేస్తున్నట్లు తెలిసి, ఏబిసి రైడ్‌ చేసి మరీ పట్టుకున్నది. అక్కడ అక్రమంగా ఏకంగా 400పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెల్లడైంది.
` మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ అప్పారావు
వీళ్లే కాదు మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ అప్పారావు ఆ మధ్యే సస్పెండ్‌ అయ్యారు. లక్సెట్టిపేట ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ రతన్‌ ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలోనూ నలుగురు రిజిస్ట్రార్‌లతోపాటు, ఇతర సిబ్బంది సస్పెండ్‌ అయివున్నారు. కాని వారిపై చర్యలు మాత్రం తీసుకున్నది లేదు. ఇలా ఇంత మంది సబ్‌ రిజిస్ట్రార్‌లు పట్టుబడినా వారిపై శాఖాపరమైన చర్యలు లేవు. వారికి శిక్షలు లేవు. సస్పెండ్‌ పేరుతో ఉద్యోగానికి కొంత కాలం మాత్రమే దూరం చేస్తున్నారు. అంటే తర్వాత ఎప్పుడో అదును చూసి వారికి తిరిగి విధులు అప్పగించడానికే అన్నది ఇక్కడ స్పష్టమౌతోంది. పైగా కాలం గడిస్తే, ఆయనది తప్పేం లేదన్నట్లు కూడా రికార్డులు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. అంతా పై అధికారుల చేతుల్లో పని. వారు కూడా కనికరిస్తే చాలు మళ్లీ ఉద్యోగంలో చేరడం పెద్ద పని కాదు. సాక్ష్యాత్తు వారు ఏసిబి వలలో చిక్కినా వారికి ఎప్పుడైనా మళ్లీ పోస్టింగులు రావొచ్చన్న మాటే డిపార్టుమెంట్లో చెబుతున్నారే గాని, వారికి శిక్ష పడుతుందన్న మాట ఎవరి నుంచి రావడంలేదు. వారి మీద ఎలాంటి శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినా పై వారి లీలలు కూడా బైట పెట్టేందేకు సస్పెండ్‌ అయిన ఉద్యోగులు వారి గుట్టు బైట పెట్టేందుకు సిద్దపడుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అందుకే సస్పెండ్‌ అయిన వారి పట్ల ఉదాసీతన కనబర్చుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. మొండికిపోయి వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారంటే వారి పాత్ర ఎంత వుందనేది కూడా ఇక్కడే స్పష్టమౌతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాలం గడిస్తే అంతా సర్ధుకుంటుంది. లేకుంటే మన మెడకు చుట్టుకుంటుంది. ఎందుకు తొందరపడడం అన్న ఆలోచనలతో చాలా మంది పై అధికారులు కాలయాపనపైనే మొగ్గు చూపుతున్నారని సమాచారం. అందుకే పూర్తి స్ధాయి ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం కూడా తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నది. సంబంధిత శాఖ కమీషన్‌ శేషాద్రి అధ్యక్షతన ఉన్నత స్ధాయి కమిటీ కూడా ఏర్పాటైంది. దాంతో సస్పెండ్‌ అయిన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలో వారి పరిస్థితి కథ కంచి చేరొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై కూడా పెద్దఎత్తున చర్యలు తీసుకునేందుకు కూడా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఎందుకైనా మంచిది కమీషనర్‌ ముందు తన శాఖనుంచే ప్రక్షాళన మొదలు పెడితే మరింత రసవత్తరంగా వుంటుంది. అవినీతి పరుల ఆట కట్టినట్లైతుంది.

రాజకీయాల్లో నవశకానికి నాంది


కేంద్ర రాజకీయాల దిశగా వడివడిగా అడుగులు
` కేంద్రం ఒక మిథ్య…అది ఎన్టీఆర్‌ మాట
` అదే బాటన కేసిఆక్‌ రాజకీయ మార్పుకు శ్రీకారం
` థర్డ్‌ ఫ్రంట్‌ నిర్మాణ దిశగా ప్రయత్నాలు
` జాతీయ స్ధాయిలో ముమ్మరంగా చర్చలు
` లౌకిక వాద శక్తుల ఏకంతో సరికొత్త సమీకరణాలు
` కాంగ్రెస్‌తో కలవడమా? లేదా? అన్నది తర్వాత
` ముందు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమే అసలు ఎజెండా
` జాతీయ పార్టీలను శాసించడమే అసలు లెక్క

హైదరాబాద్‌ , నేటిధాత్రి:
చూసే చూపు, వేసే అడుగు, మాటల్లో వాడీ, వేడీ…చిత్తశుద్ది, వాక్‌శుద్ధి వుంటే నాయకుడు అనుకున్నది సాధిస్తాడని చెప్పడానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిదర్శనం. ఆయన అడుగులు తార్కాణం. ఆయన ఆశయాలు ఆదర్శం. ఆయన నిర్ణయాలు ప్రయత్నం…ఆయన ఎంచుకున్న ఉద్యమం నినాదం…జై తెలంగాణ జెండా ఎగరేయడమే, ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం అనుకున్నారు. సాధించాలనుకున్నారు. పిడికిలెత్తారు. జనాన్ని ఏకం చేశారు. జనమంతా జై తెలంగాణ అనేలా చేశారు. ముక్కొటి మంది తెలంగాణ వాదులు ఏకమయ్యారు. పిల్లా, జెల్లా, ముసలీ, ముతక అందరూ అదే నినాదం…ఎవరి నోట విన్నా ఒకటే విధానం..అదే తెలంగాణ వాదం…తెలంగాణ సాధన కార్యం. అంతే కాలం కరిగిపోయింది. రణం చివరి దాకా నడిచింది. పద్నాలుగేళ్ల ఉద్యమ కళ్లు మూసితెరిచినంత కాలంలో సాగిపోయింది. ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది. కేసిఆర్‌ కలలు గన్న బంగారు తెలంగాణ ఆవిష్కారమౌతోంది. అదీ నాయకుడి చూపుకు వుండే విలువ. అదే నాయకుడి మాటకుండే విలువ. ఒకనాడు ఉద్యమ నాయకుడు కేసిఆర్‌ సభలైనా, మాటలైనా, టివీలలో చర్చలైనా, సిడీలలో ఆయన ప్రసంగాలైనా సరే…ఎక్కడ విన్నా అవే మాటలు.. ఏ పెళ్లిలోనూ తెలంగాణ పాటలే…అంతే అదంతే…తెలంగాణ ఉద్యమం ఒక చరిత్ర నిర్మాణమే…అలా నాయకుడి మాట మంత్రం కావాలి. ఆయన మాటలే మంత్రోపదేశాలు కావాలి. జనం నమ్మాలి. నరనరాన ఆయన మాటలు జీర్ణించుకోవాలి. అదే 2001లో మొదలైంది. 2014లో ఫలించింది. అందుకే కేసిఆర్‌ ఇప్పటికీ ఏది మాట్లాడినా, ఏది చెప్పినా ఎంతో ముందు చూపుతో చెబుతారని అంటారు. నమ్ముతారు.
2018 ముందస్తు ఎన్నికల సమయంలో కేసిఆర్‌ మొదటిసారి మూడో ఫ్రంట్‌ ముచ్చట చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ మాట కేసిఆర్‌ మర్చిపోయారు. అని రాజకీయ పార్టీలు, విశ్లేషకులు అనుకున్నారు. కాని ఆయనను నమ్మిన వాళ్లు మాత్రం అమ్ములపొదిలోని అస్త్రాలు ఎప్పుడు పడితే అప్పుడు తీసే రకం కాదు కేసిఆర్‌ అని అనుకున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది. అస్త్రశస్త్రలు తీసే సమయం ఆసన్నమైంది. దేశ ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. జనం ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే సరైన సమయం. ఈ సమయంలో మూడో ఫ్రంట్‌ అన్న మాట కాకపోయినా, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో చలనం వచ్చిందన్న నమ్మకం ప్రజలకు కలగాలి. బలంగా వున్న ప్రాంతీయ పార్టీలు ఏకమౌతున్నాయని అనిపించాలి. అప్పుడు జాతీయ పార్టీల వైపు ప్రజలు చూడరు. జాతీయ ప్రయోజనాల పేరుతో రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాదికి, బిజేపి ఏతర రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఓ వైపు రైతాంగ సమస్యలు…మరో వైపు నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు…అడ్డూ అదుపు లేకుండా పోతున్న భూముల ధరలు…సామాన్యుడు బతకలేని పరిస్ధితులు.. ప్రెటో, డీజిల్‌ ధరలు…వంటగ్యాస్‌ కొనలేని పరిస్ధితులు. ఇవన్నీ బిజేపి వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అందుకే ఇదే సరైన సమయం. ఆ మధ్య ముఖ్యమంత్రి కేసిఆర్‌ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ను కలవడంతోనే అసలు స్కెచ్‌ మొదలైంది. దేశంలో వరుసగా బిజేపిపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లడం వంటివి చూస్తూనే వున్నాం. తాజాగా బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలవడం, రాజకీయాలపై చర్చలు జరపడం ఒక ఎత్తు. అంతకు ముందే సిపిఎం జాతీయ నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్‌తో బేటీ కావడం అన్నది అందుకు బలాన్ని చేకూర్చింది. ఉత్తరాధి విషయానికి వస్తే, ఆప్‌, తృణమూల్‌ పార్టీలు ఎలాగూ థర్డ్‌ ఫ్రంట్‌ వైపు అడుగులు వేయొచ్చు. ఎలాగైనా రాజకీయ సమీకరణాలు మొదలు కావడం అన్నది ఒక శుభపరిణామం…అది కేసిఆర్‌ వల్లనే సాధ్యం.
రాష్ట్రాలను చిన్న చూపు చూడడం అన్నది జాతీయ స్ధాయి రాజకీయాలకు అలవాటు. అందులో ఉత్తర భారతంలో బలంగా వున్న జాతీయ పార్టీలు దక్షిణాధి రాష్ట్రాలను పెద్దగా పట్టించకోవన్న ఆరోపణలు ఇప్పటికే వున్నాయి. అందుకు కాంగ్రెస్‌, బిజేపి ఏం మినహాయింపు కాదు. కాకపోతే కాంగ్రెస్‌కు గతం నుంచైనా దక్షిణాదిలో బలం ఎక్కువే. కాని నాయకత్వం మాత్రం మొత్తం ఉత్తరాధిదే. ఇది కాంగ్రెస్‌లో వున్న ఏకైక అసంతృప్తి. ఇక బిజేపిలో మాత్రం మొత్తం ఉత్తరాధి పెత్తనమే. దక్షిణాదిలో అంత బలమైన నాయకుడు ఎవరూ లేరు. ఎదగనీయరు అన్న విమర్శలు బిజేపిలో వున్నాయి. గతంలో దక్షిణాది నుంచి బంగారు లక్ష్మణ్‌ అధ్యక్షుడిగా వుండడాన్ని సహించలేని ఉత్తరాధి నాయకత్వం ఆయనను తెహల్కా పేరుతో పార్టీ ఫండ్‌ను కూడా అవినీతిగా చిత్రీకరించి, దించేసింది. మనో వేధనకు గురిచేసింది. పార్టీ కోసం జీవితాంతం పనిచేసిన బంగారు లక్ష్మణ్‌ చేసింది తప్పు కాదని తెలుసు. కాని ఆయనపై కక్షపెంచుకున్న కొంత మంది నేతలు చేసిన నిర్వాకం మూలంగానే ఆయన నిష్క్రమణం అలా జరిగిందని అంటుంటారు. అలాగే దక్షిణాదినుంచి మరో బలమైన నేతగా ఉన్నత స్ధాయికి ఎదిగిన ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కావాలనే ఉత్తరాధి నాయకత్వం పక్కనపెట్టిందన్న అసంతృప్తి దక్షిణాది రాజకీయ నాయకులకెంతోమందికి వుంది. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా వుంటే దక్షిణాదికి ఇప్పటికే ఎంతో మేలు జరిగేనే మాట వుండనే వుంది. గత ప్రభుత్వ హయాంలో తొలి నాళ్లలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు అనేక నిధులు అందించిన సంగతి తెలిసిందే. పైగా తనదైన శైలిలో రాజకీయాలు చేసే వెంకయ్య నాయుడును మౌన ముని చేసేశారన్న మాటలు వింటూనే వుంటాం. ఇవన్నీ రాజకీయాల్లో ఒక భాగమే కావచ్చు. కాని కొన్ని ప్రాంతాల బలమైన వాయిస్‌ వినిపించకుండా చేయడం కూడ సరైంది కాదు. ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజేపిలు దక్షిణాదిపట్ల కొంత వివపక్షపూరితమైన రాజకీయాలు చేస్తారన్న అపవాదు మాత్రం వుండనే వుంది. కాంగ్రెస్‌ నుంచి దక్షిణాది ప్రధాన మంత్రిగా పని చేసిన మొదటి ప్రధాని పి.వి. నర్సింహారావుకు చివరి క్షణాలలో ఇచ్చిన మర్యాద ఏమిటో చూసిందే…అందరికీ తెలిసిందే. నాడు కాంగ్రెస్‌ను అందరూ దుమ్మెత్తిపోసింది. ఇప్పటికైనా కాంగ్రెస్‌లో మార్పు వస్తుందనే అనుకుంటున్నారు…థర్డ్‌ ఫ్రంట్‌తో కలిస్తే తప్ప కాంగ్రెస్‌కు కూడా భవిష్యత్తు లేదనే అనుకుంటున్నారు. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందగుడు ఎప్పుడు వేస్తారా! అని ఎదురుచూస్తున్నారు.

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న TRS రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర*

 

ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం కుటుంబసమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కృపతో.. ప్రజలంతా కరోనతో విముక్తి పొంది సుఖ సంతోషాలతో.ఆరోగ్యంగా ఉండాలని..ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్.రథసారథి KTR గారి సారధ్యంలో మరింత అభివృద్ధి చెందాలని స్వామి వారిని కోరుతు..ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఫస్టు వికెట్‌ డౌన్‌..

మధుకు సెక్షన్‌ మార్పు? మెమో జారీ?
క్లర్కును పక్కసెక్షన్‌కు పంపడం కూడా చర్యలేనా?
క్లర్కును మార్చడమంటే తప్పు జరిగినట్లే…మరి మిగతా వారి సంగతేంది?
క్లర్కు ఎరనా?….లేక తిమింగలమా? తేల్చకుండా వదిలేయడం అంటే అర్ధమేమిటి?
సెక్షన్‌ ఇన్‌చార్జి, సూపరెండెంటుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా?
కొత్తగా తెరమీదకు వచ్చిన జిరాక్స్‌ ఛలాన బాగోతమేటి?
ఒకటే ఛలాన మీద రెండుసార్లు స్టాంపు పేపర్లు ఎలా ఇచ్చారు?
ఇది పైదాకా వెళ్లిందా? ఇక్కడే క్లోజ్‌ చేశారా?
ఇక్కడ కూడా సబ్బారావు ఆశీస్సులేనా?
కమీషనర్‌గారు ఒక్కసారి లుక్కేయండి?
జిరాక్స్‌ల కథాకమామిషు తేల్చండి?
కాస్త ప్రక్షాళన చేపట్టండి?
సస్పెండ్‌ అయిన వారిపై చర్యలు లేకుండా ఎలా వుండవో చెప్పండి?
నేరాలు చేసి ఎలా మళ్లీ కుర్చీల్లో కూర్చుంటున్నారో చూడండి?
మాటలు మార్చినంత సులువులుగా ఫైళ్లు కూడా మాయం చేయడం ఒక కళేమో! రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కార్యాలయాల్లో కూడా మాటలే కాదు, చేతలు ఇలాగే వుంటాయి. గోల్‌మాల్‌ వ్యవహరాలు సాగుతూనే వుంటాయి. అందులో భాగమే క్లర్క్‌ మధు మాయాజాలం. నేటిధాత్రిలో బుధవారం ప్రచురితమైన ‘స్టాంపు పేపర్లు కిదర్‌ గయా’ అనే వార్తకు అధికారులు కొద్దిగా స్పందించారు. క్లర్కు మధును ఆ స్ధానం నుంచి కదిలించి, మెమో జారీ చేసి, పక్క సెక్షన్‌కు మార్చారు. ఇంతే…ఇది కూడా పనిష్మెంటే అన్నంత గొప్పగా చెప్పుకుంటున్నారు. తప్పు చేసినవారిని ఉపేంక్షిచేంది లేదన్నంతగా మధును మరో సెక్షన్‌కు మార్చేచి చేతులు దులుపుకున్నారు. ఇంతకీ మధు అనే క్లర్క్‌ ఎరనా….లేక తిమింగలమా అన్నది మాత్రం తేల్చలేదు. మధు ఎరే…అయితే అసలు తిమింగలాలు ఎవరు? అన్నది కూడా తేలాలి. మధును మార్చినట్లే ఆయన చేత చేయించిన వారిని కూడా సాగనంపాలి. కాని అది జరగలేదు. ఇంతకీ ఈ వ్యవహారంలో మధు ఎవరికీ తెలియకుండా చేశాడా? చేస్తుంటే సెక్షన్‌ ఇన్‌చార్జి, సూపరెండెంటు కళ్లు మూసుకున్నారా? ఏ ఒక్క స్టాంపు పేపర్‌ బైటకు వెళ్లినా, వారి పర్యవేక్షణ లేకుండా కదలొద్దు. అలాంటిది ఒక్క మధు మాత్రమే నిర్ణయం తీసుకునేంత పెద్దరికం ఆయన చేతిలో వుందా? అన్నది కూడా ఉన్నతాధికారులే చెప్పాలి. అనుమతి లేకుండ ఇంకా ఎన్ని వెళ్లాయో? అన్నది ఎలా తెలియాలి. ఈ వ్యవహారంలో తవ్వినా కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఏంటంటే?: ప్రభుత్వశాఖలపై వివరాలు బైటకు రావడం సహజం. అలాంటి వార్తలలో అసలు విషయాలు చాలా మరుగునే వుంటాయి. చిన్న చిన్న విషయాలు మాత్రమే బైటకు వస్తుంటాయి. అలాంటి విషయాల్లో ఒకదాని తర్వాత ఒకటి కొన్ని సార్లు వెలుగులోకి వస్తుంటాయి. అందులో మూడేళ్ల క్రితం మూడు లక్షల రూపాయల స్టాంపు పేపర్లుకు ఎలాంటి లెక్కలు లేకుండా రెక్కలొచ్చి వెళ్లిపోయాయి అన్నది ప్రచారం సాగింది. ఈ విషయాన్ని నేటిధాత్రి బైట పెట్టింది. దాంతో ఏం చెప్పాలో అధికారులకు పాలు పోలేదు. దాంతో అసలు విషయం అది కాదంటూ కొత్త కథ అల్లేశారు. అందులో శివకుమార్‌ అనే స్టాంపు వెండర్‌కు స్టాంపు పేపర్లు కార్యాలయ క్లర్కు అందజేశాడని అన్నారు. తర్వాత రూ.50వేలకు చెందిన ఛలానా చెల్లించడం జరిగిందన్నారు. ఇది పొంతన లేని సమాధానం. అసలు జరిగిందెంత? అన్నదానిపై స్పష్టత నివ్వాల్సిన సమయంలో అబ్బే జరిగింది అంత కాదు..ఇంత అని ఒప్పుకోవడం జరిగింది. కాని ఇందులో రసవత్తరమైన సంఘటన జరిగినట్లు మరొక విషయం తెలిసింది. ముందు శివకుమార్‌ అనే స్టాంపు వెండర్‌ డూప్లికేట్‌ ఛలాన సమర్పించి రూ.50వేల స్టాంపు పేపర్లు తీసుకెళ్లాడట…అదే నిజమైతే క్లర్క్‌ చూసుకోకుండా ఇచ్చే అవకాశం లేదు. కాని స్టాంపు వెండర్‌కు స్టాంపు పేపర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకూ అంటే…అసలు ఛలాన ఎక్కడో పెట్టాను. మర్చిపోయాను. గుర్తు రావడంలేదు. కాకపోతే దానికి సంబంధించిన జిరాక్స్‌ ఇప్పుడు సమర్పిస్తాను. తర్వాత ఒరిజినల్‌ తెచ్చి ఇస్తానంటే రూ.50వేల స్లాంపు పేపర్లు ఇచ్చారట. ఇది నమ్మశక్యమైన మాటేనా…ఇదే కాదు..మరో ట్విస్టు కూడా వుంది. అదే శివకుమార్‌ తర్వాత మరోసారి అసలు ఛలానా తెచ్చి రూ.50వేల స్టాంపు పేపర్లు తీసుకెళ్లడానికి వచ్చాడట. అప్పుడు ఈ పాత ఛలానతో ఎలా ఇస్తాం…గతంలోనే దీని జిరాక్స్‌ ఇచ్చి, స్టాంపు పేపర్లు తీసుకెళ్లావని క్లర్కు గుర్తు చేస్తే, నేనెప్పుడిచ్చాను…మీరు స్టాంపు పేపర్లు నాకెప్పుడిచ్చారని ప్లేటు పిరాయించాడట. దాంతో అసలు గుట్టు బైట పడుతుందని తేలు కుట్టిన దొంగలా శివ కుమార్‌కు మళ్లీ రూ.50వేల స్టాంపు పేపర్లు ఇచ్చారట. సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు వుండవు. అసలు జిరాక్స్‌ కాపీతో స్టాంపు పేపర్లు ఎలా ఇచ్చారు? తర్వాత అదే స్టాంపు వెండర్‌ ఒరిజినల్‌ ఇస్తే పాతదాన్ని చూపించి కొత్తది ఎందుకు అందులో జత చేయలేదు? మళ్లీ అదే ఛలనాకు స్టాంపు పేపర్లు ఇవ్వడమేమిటి? ఎవరు నిజం చెబుతున్నటు? ఎవరు ఎవరికి భయపడుతున్నట్లు? ఒక స్టాంపు వెండర్‌ ఆఫీస్‌ సిబ్బందిని బెదిరించేంత స్ధితి ఎందుకొచ్చింది? ఎవరు కల్పించారు? అతను అంత గట్టిగా మాట్లాడాడంటే లోపం ఎక్కడుంది? నిజంగా ఒక స్టాంపు వెండర్‌ జిరాక్స్‌ ఛలాన తెచ్చి ఇవ్వడమే తప్పు. దాన్ని ఛలనాగా భావించి స్టాంపు పేపర్లు ఇవ్వడం క్లర్క్‌తో పాటు, కార్యాలయం సిబ్బంది చేసిన నేరం. దాన్ని కప్పిపుచ్చుకోవడమే కాకుండా, మళ్లీ అదే ఛలాన ఒరిజినల్‌ తెచ్చి ఇస్తే, మరోసారి అదే నెంబర్‌ మీద స్టాంపు పేపర్లు ఇవ్వడం అంటే మరో నేరం. ఒకసారి తప్పు చేయడమే పెద్ద తప్పు. దాన్ని కప్పి కప్పుపుచ్చునేందుకు మరోసారి నేరం చేసి కూడా ఏం జరగనట్లు, అదో చిన్న పొరపాటు అన్నట్లు క్లర్కును మరో సెక్షన్‌కు మార్చడమంటేనే ఇందులో ఏదో పెద్ద గూడుపుఠాణీ వున్నట్లే లెక్క. ఆ బొక్కను తవ్వితే గాని, అసలు లెక్కలు బైటకు రావు. కలుగులో దాక్కున్న ఎలుకలను పట్టుకోలేరు.
సానుభూతితో ఉద్యోగం…?: సరే క్లర్కు ఆనార్యోగంతో బాధపడుతున్నప్పుడు ఆయనకు ఇంత పెద్ద పని అప్పగించడం తప్పు కాదా? ఆయనకూడా ఇలాంటి పని కాకుండా ఎలాంటి టెన్ష్‌న్‌ లేని సీటు కోరుకోవచ్చు కదా? ప్రభుత్వానికి చెందిన ప్రతి రూపాయి లెక్క చూపాల్సిన పెద్ద బాధ్యతను ఎందుకు ఎత్తుకున్నట్లు? చిన్న ఉద్యోగి కార్యాలయానికి కారులో వచ్చేంత సీనుంటుందా? ఇలా ప్రభుత్వాదాయానికి కన్నంపెడుతుంటే జీతంతో పనేముంటుంది. ఇక క్లర్కును పక్కన పెడితే సమస్య తీరినట్లేనా….
సుబ్బారావు ఆశీస్సులే ఇంత దూరం తెస్తున్నాయా?: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పనిచేసేవారందరికీ సుబ్బారావు ఆశీస్సులు మెండుగా వుంటాయన్నది అందరూ చెప్పుకునే మాటే…మసి బూసుకున్నా సరే…తుడిచేసేంత పెద్ద చేయి ఆయనదట. అందుకే ఎవరు ఎన్ని చేసినా కూడా…మై హూనా అంటుంటారట. కింది స్ధాయి నుంచి పైకెదిగిన ఉద్యోగికి అన్ని వర్గాల ఉద్యోగులతో సత్సంబంధాలు కామన్‌…అలాగే లొసుగులు కూడా తెలియడం కామన్‌…ఇదే కామన్‌గా అందరికీ సుబ్బారావు కనిపించడం…ఆదుకుంటాడనే నమ్మకం కల్గించడం…ఎవరెవరు ఏమనుకున్నా…సరే…అంతా మా వెనుకు వున్న కొండంత అండ చూసుకుంటాడన్న ధీమా…ఆహా…రాజ్యమేలాంటే కిరీటాలే కావాలా అన్నారట. ఇలా పై స్ధాయి ఆశీస్సులు కూడా వుంటే సరే…కాపాడే సుబ్బారావు లాంటి వారు ఒక్కరుంటే చాలు…ఏదైనా మాఫ్‌…అంతే సేఫ్‌…
కమీషనర్‌గారు…ఒక్కసారి లుక్కేయండి…ఈ బాగోతాలేమిటో చూడండి?: రిజిస్ట్రేషన్ల కమీషనర్‌కు ఆ శాఖలో జరిగే అవినీతిని అంతం చూసేదాకా వదిలిపెట్టరన్న పేరుంది. ఆయన దృష్టికి వచ్చిన ఏ సమస్యను వదిలే సమస్య లేదని అంటారు. ఎక్కడ ఏ మూలన ఏది జరిగినట్లు ఆయన దృష్టికి వచ్చినా సరే క్షణాల్లో స్పందిస్తారు. వారిని తొలగిస్తారు. కాని ఆయన దాకా వెళ్లకుండా మధ్యలోనే సుబ్బారావులు అన్నీ సమకూర్చుతుంటారట. దాంతో పైన కూర్చున్న కమీషనర్‌తో ఏం పని…కాపాడే వారున్నాక అడ్డూ అదుపూ ఏముంది? దాంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సస్పెండ్‌ అయిన ఎంతో మంది ఉద్యోగుల మీద చర్యలు లేవు. వారి ఉద్యోగాలు తొలగించింది లేదు. కేసులు నమోదు చేసి, జైలుకు పంపించింది. ఎంత ఖర్చైనా సరే మళ్లీ ఉద్యోగం ఖాయం…మళ్లీ మళ్లీ వెనకేసుకోవడం తధ్యం…అందుకే ఒక్కసారి కొంత కాలం ఇటు వైపు లుక్కేస్తే ఎంతో మంది దొరికిపోతారు…దొరికిన వారు దారికొస్తారు….లేకుంటే మళ్లీ ఉద్యోగాల్లో చేరుతారు..ఈ సెక్షన్‌ కాకపోతే మరో సెక్షన్‌లో కొంత కాలం దూరిపోతారు…మళ్లీ పాత సీట్లోకొచ్చి కూర్చుంటారు…ఇదే కామన్‌…

దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధం కండి సీఎం కేసీఆర్ పిలుపు

 

*నేటిధాత్రి హైదరాబాద్*
12-1-2022
గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని, వీరిని ఎక్కడికక్కడ నిలదీయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రప్రభుత్వం మెడలు వంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచేలా కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై తన నిరసన వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాయనున్నారు.
రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్రప్రభుత్వం, ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం కోలుకోలేకుండా దెబ్బతీసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి మాట తప్పిన కేంద్రం.. ఉల్టా రైతుల పెట్టుబడి ఖర్చులనే రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయడం, ఎరువుల ధరలను విపరీతంగా పెంచడం, అష్టకష్టాలు పడి రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనకపోవడం లాంటి రైతు వ్యతిరేక చర్యలతో… నేడు దేశంలో రైతులు బతికి బట్టకట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఒక్కసారిగా ఎత్తివేసి, రైతులను వ్యవసాయం చేయకుండా దూరంచేస్తున్న బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం ఐక్యంగా తిరగబడితే తప్ప, వారికి బుద్ధి రాదన్నారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రాష్ట్ర రైతాంగం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ధరలు తగ్గించే దాకా.. పోరాడాలన్నారు.
ఎనర్జీని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే వ్యతిరేకిస్తూ, వ్యవసాయాన్ని నెమ్మది నెమ్మదిగా కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్న బిజెపి చర్యలను దేశ రైతాంగం గుర్తించాలన్నారు. రైతుల పొలాల్లో.. రైతులనే కూలీలుగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

రికాంలేని రిజిస్ట్రార్ల ఆమ్దానీ` ‘2’

` మధుమాయ…స్టాంపు పేపర్లు కిదర్‌ గయా..?
` మూడు లక్షల విలువైన పేపర్ల మూడేళ్ల కింద మాయం?
` జరిగింది నిజమే కాని అంత కాదు…అంటున్న క్లర్కు?
` అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లే కదా..?
` అయినా ఇప్పటి వరకు దిక్కూదివానం లేని పర్యవేక్షణ?
` అధికారులు పట్టించుకోరు…విచారణ చేయరు
` లెక్కలు చూసింది లేదు? తేల్చింది లేదు?
` ఇదంతా జరుగుతున్నా శాఖలో ఉలుకు లేదు? పలుకు లేదు??
` అంతా పైవాడు చూసుకుంటాడన్న నమ్మకమా..?
` సుబ్బారావు చెంతనుండగా…చింతెందుకు అనుకుంటున్నారట?
` క్లర్కు కాళ్లు మొక్కిండని అధికారులు వదిలేశారట?
` ప్రజాధనం కొల్లగొట్టి దయాగుణం చూపెట్టిన అధికారులు భలే…భలే…?
హైదరాబాద్‌ , నేటిధాత్రి :
తాడి చెట్టుకిందకు ఎందుకు వెళ్లావంటే దూడ గడ్డి కోసమని ఎవరైనా సమాధనం చెబితే ఎలా వుంటుంది. సరిగ్గా వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయ క్లర్కు మధు చెప్పే, చెప్పించే సమాధానాలు సరిగ్గా అలాగే వున్నాయి. మూడేళ్ల క్రితం మీ ఆఫీసులో ఏం జరిగిందని నేటి ధాత్రి ప్రశ్నిస్తే…నాకు గుండె జబ్బు వుందన్న సమాధానం చెప్పించాడు. రెవిన్యూ స్టాంపులు మాయమైనట్లు మాకు సమాచారం వుందని అంటే నా గుండెలో మిషన్‌ ఏర్పాటు చేశారు. సౌండ్‌ బైటకు కూడా వినిపిస్తుంటున్నాడు. అసలు స్టాంపు పేపర్లు ఎలా మాయమయ్యాయని అడుతుంటే అప్పుడు వేరే రిజిస్ట్రార్‌ వుండేవారంటారు…అదేంటి పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మేం అడుగుతున్నదేమిటి? మీరు చెబుతున్నదేమిటి? అని అంటే శివకుమార్‌ అనే స్టాంపు వెండర్‌ రూ.50వేల రూపాయల చలాన్‌ తర్వాత చెల్లించేశాడని అంటున్నారు. అసలు ఎక్కడైనా ప్రశ్నకు, సమాధానానికి పొంతన వుందా? అందుకే తాడిచెట్టు సామెత చెప్పాల్సివచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే సరిగ్గా మూడేళ్ల క్రితం వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయం నుంచి రూ.3 లక్షల రూపాయల విలవైన స్టాంపు పేపర్లు మాయం అయ్యాయి. అందుకు కార్యాలయ క్లర్కు మధు కారణం అంటున్నారు. అబ్బే జరిగింది అంత కాదు. కేవలం రూ. 50 వేల స్టాంపు పేపర్లే కాని, ఆ తర్వాత సంబంధిత స్టాంపు వెండర్‌ శివకుమార్‌ ఛలాన చెల్లించేశాడు. కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు. ఇదీ క్లర్కు మధు వివరణ. అంటే జరిగింది వాస్తవమే కాని, జరిగింది 3 లక్షలు కాదు…అని ఒప్పుకున్నట్లు కాదా? ఇప్పటికైనా పై అధికారులు పట్టించుకుంటారా లేదా? ఎలా జరిగిందన్నది విచారిస్తారా లేదా? క్లర్కు తన మాటల్లోనే అంత కాదు, ఇంత అనే విషయాన్ని ఒప్పుకున్న విషయం మీకు తెలియంది కాదా? ఆలస్యమైనా సరే…తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తారా? దయాగుణం చూపించి వదిలేశారా? లేక ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని సైలెంటు అయ్యారా? ఇంత కాలం బైటక పొక్కకుండా దాచేశారా?
సహజంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సంబంధిత సూపరెండెంటు, సెక్షన్‌ ఇన్‌ఛార్జిలు బాధ్యత వహించాలి. చేసింది క్లర్కు అయినా చేయించిన వాళ్లు వెనుక ఎవరున్నారు? అవి ఎవరు ఎవరికివ్వమన్నారు? ఎవరికిచ్చారు? ఎవరు వాటిని వాడేసుకున్నారు? అన్న సంగతి కార్యాలయం మొత్తానికి తెలియకుండా జరుగుతుందా? కాని ఎవరూ కిమ్మనలేదు. ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ ఎలా జరిగిందని ఆరా తీయలేదు. సరికదా…లక్షలాది రూపాయల ప్రజా ధనం వృధా చేసిన వ్యక్తులకు అండగా నిలుస్తున్నారు. అంటే అర్ధమేమిటి? ఆఖరుకు మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్లర్కు ఉన్నతాధికారుల కాళ్లు మొక్కాడని వదిలేశారట. ఎంత భలేగా వుంది కదా! అధికారులది ఎంత జాలి గుండెనో…ప్రభుత్వ ధనం లూటీ చేసిన వారిని కూడా క్షమించేంత దయా గుణం వారికే సొంతం. పోయింది వారి సొమ్ము కాదు కదా? రాజుల సొమ్ము రాళ్ల పాలు అది గతం. ప్రజల సొమ్ము అధికారులపాలు అని మార్చినట్లున్నారు.
అసలు ప్రభుత్వ కార్యాలయం అంటే ఎలా వుంటుంది? గుండు పిన్ను కొన్నా లెక్కుండాలి. ఒక్క కాగితం వాడినా లెక్కరాయాలి. ఇదీ సర్కారు లెక్కల సంగతి. కాని ఏకంగా మూడు లక్షల రూపాయల స్టాంపు పేపర్లు మాయమైతే లెక్కలు లేవా? రాయలేదా? ప్రజాధనం లూటీ చేశారా? మన్నుతిన్న పాములా సైలెంటుగా వున్నారా? అంటే ఔననే సమాధానం మాత్రం నర్మగర్భంగానే ఊ…అంటూ వస్తూనే…రూ.50వేలు కట్టేశారంటున్నారు. ఇదీ అధికారుల తీరు…ఆఖరుకు క్లర్కు మధు అసలు సంగతిని చెప్పకనే చెప్పేశాడు. అయితే లాజిక్‌ లేని సమాధానం చెబుతున్నానని అనుకోలేదు. రసీదులు లేకుండా రిజిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయం నుంచి స్టాంపు పేపర్‌ ఒక్కటి కూడా బైటకు వెళ్లే అవకాశం లేదు. సంబంధితం స్టాంపు వెండర్‌ ఎవరైనా సరే ముందు అవసరమైన మేరకు ఛలనా తీయాలి. దాన్ని అధికారలు డీ పాస్‌ చేయాలి. అప్పుడు గాని వాటిని ఇవ్వడానికి వీలు లేదు. కాని ఏకంగా రూ. 3లక్షల రూపాయల విలువైన పేపర్లు మాయం కావడమేమిటి? వాటికి సంబంధించిన రూ.50వేల ఛాలన్‌ తర్వాత చెల్లించడమేమిటి? అలా నమ్మకంతో కూడా స్టాంపు పేపర్లను ఒక స్టాంపు వెండర్‌కు అందించే అధికారం క్లర్కుకు వుంటుందా? అధికారుల సంతకం లేకుండానే బైటకు వెళ్తాయా? స్టాంపు పేపర్లు అంటే అంత ఆషామాషీ వ్యవహరమైపోయిందా? అంతా గందరగోళంగానే వుంది…
మూడేళ్ల క్రితం స్టాంపు పేపర్లు మాయమైతే ఇప్పటి వరకు చర్యలు లేకపోవడం ఆశ్యర్యమేస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పుడు మంత్రిగా వున్న కృష్ణ యాదవ్‌ను మహరాష్ట్రకు చెందిన పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. కేవలం లక్ష రూపాయల విలువైన నకిలీ స్టాంపు పేపర్ల తయారీ, సరఫరా సహకరించాన్న సమాచారం మేరకు ఆరేళ్లపాటు జైలు జీవితం అనుభవించారు. ఎందుకంటే స్టాంపు పేపర్ల వ్యవహారం అంత సీరియస్‌. క్యాబినేట్‌ మంత్రిగా వున్న వ్యక్తిని కనీసం నాడు స్పీకర్‌కు కూడా చెప్పకుండా, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలియకుండా, ఎలాంటి బెయిల్‌ మంజూరు చేయకుండా, ఆరేళ్లపాటు రిమాండ్‌ ఖైదీగానే జైలులో వుంచారు….కాని వరంగల్‌ జిల్లా రిజిస్ట్రేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో 3 లక్షల రూపాయల విలువైన పేపర్లు మాయమైతే ఇంత నిర్లిప్తతా…అసలు నాడు ఆ మంత్రిమీద కేవలం అనుమానం మాత్రమే…ఆ అనుమానంతో ఆరేళ్లపాటు ఎలాంటి బెయిల్‌ ఇవ్వకుండా ఖైదు చేశారు. మూడేళ్లు గడుస్తున్నా…వరంగల్‌లో జరిగిన ఈ విషయాన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాటి మాయం వెనకు ఎవరెవరున్నారన్నరదానిపై రకరకాల చర్చ జరుగుతోంది. అయితే దీనితోపాటు రాష్ట్రంలోని అనేక రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న లీలలు అంతా ఇంతా కాదు. అయితే వారందరినీ కాపాడుతూ వారికి అభయంగా వుంటూ ఓ సుబ్బారావు అనే పెద్ద మనిషి వున్నాడని భహిరంగగానే చెప్పుకుంటున్నారు. ఎంతటి అవినీతి చేసినా సరే…నేను చూసుకుంటానన్నంత భరోసా ఇస్తూ కాపాడుతున్నాడట. అసలు స్టాంపు పేపర్‌ మాయం అన్నది దేశద్రోహానికి చెందినంత కేసు అన్నది తెలిసే చేస్తున్నారా? లేక దొరలేదు కదా? అనుకుంటున్నారా? ప్రభుత్వ రాజముద్రతో కూడుకున్న స్టాంపు డ్యూటీని అధికారులు ఇంత సింపుల్‌గా చేతులు మార్చుతున్నారా? వరంగల్‌ ఘటన ఇందుకు సాక్ష్యం. సహజంగా పుండు అన్నది ఒక్క దగ్గర మొదలైతే దాని చుట్టూ పుళ్లు పడడం కామన్‌. శరీరమైనా, సమాజమైనా ఒక్కటే…ఇలాంటివి ఎక్కడెక్కడ, ఏ కార్యాలయాలలో ఎంతెంత జరుగుతోందన్నదానిపై నేటిధాత్రి తన పరిశోధన చేపట్టింది. విస్తుపోయే నిజాలు తెలిసి ఆశ్చర్యపోయింది. ఈ విషయాలు ప్రజలు తెలియాలి. బాధితులు ఎంత మంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో ప్రపంచానికి తెలియాలి. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఎలా మోసాలు జరుగుతున్నాయో ప్రజలకు తెలియాలి. ఇదే మా అక్షర యజ్ఞం…మీ కోసం… సమాజం కోసం…పరిరక్షణ కోసం…మాతో మీరూ కలిసిరండి…బాధితులు మమ్మల్ని సంప్రదించండి. ఇంతకీ ఇప్పటికైనా వరంగల్‌లో జరిగిన సంఘటనపై దర్యాపు జరిపిస్తారో…లేదో చూడాలి.

యుగానికొక్కడు

` జగాన్ని మెలుకొల్పే యుగకర్తలకు మార్గదర్శకుడు
` అనాధలను ఆదరించే ధీనజనబాంధవుడు
` కేసిఆర్‌ ఒక్క ఆలోచన కోట్ల మందికి భరోసా
` అనాధలంతా ప్రభుత్వ బిడ్డలు ఒక విప్లవం
` చరిత్రలో ఈ ఆలోచన ఒక నూతన అధ్యాయం…


` భవిష్యత్‌ తరాలకు సంచలన సందేశం
` అది కేసిఆర్‌కే సాధ్యం…ప్రపంచానికి ఆదర్శం.

` ఇకపై అనాధలన్నవారు తెలంగాణలో కనిపించరు.
` వారికి జీవించే హక్కును కల్పించి..వారి జీవితాల్లో వెలుగులు నింపదమే…
` ఆసరా సగటు జీవన ఆయుః ప్రమాణానికి సూచిక
` కళ్యాణలక్ష్మి ఒక ఆడపిల్ల ధైర్యానికి ప్రతీక
` ఇప్పుడు అనాధలకు చేయూత…వారి జీవితాలకు భరోసా…
హైదరాబాద్‌ , నేటిధాత్రి : రామాయణంలో రాముడు చేయలేదు( త్రేతాయుగం). మహాభారతంలో కృష్ణుడు( ద్వాపర యుగం) చేయలేదు. కలియుగంలో ఇప్పటి వరకు ఎవరూ ఆలోచించలేదు. రాజరికంలో ఏ రాజు చేసినట్లు లేదు. ప్రపంచ దేశాలలో ఆచరించినట్లు ఎక్కడా కనిపించలేదు. మొదటిసారి ఒక్కడే..ఒక్కడు…కేసిఆర్‌ ఆలోచించాడు. అనాధలను అక్కున చేర్చుకునే యజ్ఞం మొదలుపెట్టాడు. రాష్ట్రంలో అనాధలందరూ ప్రభుత్వ బిడ్డలు కావాలని సంకల్పించాడు. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు….ఇక రాష్ట్రంలో తాను అనాధను అన్న మాట ఎవరి వెంట వినపడకుండా చేయనున్నాడు….
ఆకలి ఒక నరకం. అనాధ జీవితం ఒక శాపం. కాని యుగానికొక్కడుగా యుగపురుషుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో ఇక శాపగ్రస్ధులు అనే మాట ఇక వుండదేమో! అనాధ పిల్లలు అంటూ ఎవరూ చెప్పుకోవాల్సిన అవసరం రాదేమో! మాకు ఎవరూ లేరన్న భాధ వారిలో ఒక వుండదేమో… భవిష్యత్తులో అనాధ అన్న పదమే తెలంగాణలో వినిపించదేమో! పసి వయసులోనే అందరూ దూరం చేసుకొని చెత్త కుప్పల్లో బతుకులీడ్చేవారు వుండకపోవచ్చు. భూమ్మీదకొచ్చాక వారికి కూడా జీవించే హక్కు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవడం అన్నది ఒక వినూత్నం. విప్లవాత్మకం. ప్రపంచం అబ్బుర పడే నిర్ణయం. అనాధ అనే మనో వేధన బతికినంత కాలం వెంటాడే మానసిక శిక్ష ఇక భవిష్యత్తులతో తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తికి వుండదు. వారు కూడా బతికేందుకు, అందమైన జీవితం అనుభవించేందుకు కూడా మంచి రోజులు వస్తున్నాయంటే అది తెలంగాణ సంకల్పం. బలమైన నమ్మకం. ఆ నమ్మకం పేరు కేసిఆర్‌.
ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కారణజన్ముడు అని చాలా మంది ఎందుకంటారో …ఈ నిర్ణయాన్ని బట్టి చెప్పొచ్చు. చరిత్రలో సమాజం కోసం, ప్రజల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం జీవిత పర్యంతం ఉద్యమం సాగించిన అతి కొద్ది మంది యుగకర్తలలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందరికంటే ముందున్న వ్యక్తి అని చెప్పకతప్పదు. అవరైఏళ్ల తెలంగాణ ఆకాంక్షను తన జీవితం లక్ష్యం చేసుకొని, పద్నాలుగేళ్లపాటు పోరాటం సాగించి, తెలంగాణ సాధించి, కలలు గన్న తెలంగాణ ఆవిష్కరణే కాదు, ప్రపంచం ఆశ్చర్యపోయేలా…అబ్బురపడేలా…ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారు. ఇది ఏ నాయకుడికి సాధ్యం కాదు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సాధించి చూపిస్తున్నారు. ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని కాలోజీ అన్నారు. ఒక్క మంచి ఆలోచన కొన్ని కోట్ల మంది జీవితాలకు వెలుగులు అని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిరూపిస్తున్నారు. అవును ఇది చరిత్ర కాదలేని సత్యం. జీవిత సత్యం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ మదిలో చిగురించిన ఏ ఆలోచన వృధా కాలేదు. అది తెలంగాణ సాధన నుంచి మొదలు, నేటి కాళేశ్వర ప్రాజెక్టుదాకా…ఎండిన బీడ్లనుంచి, జలజల పారే నీటి సవ్వడుల దాకా… ఆడపిల్ల పెళ్లి కష్టం నుంచి, సంతోషంగా కళ్యాణ లక్ష్మి దాకా…వృద్దాప్యంలో ఏ కొడుకు, కోడలు ఆసరా లేకుండా ప్రభుత్వమే ఆసరాగా అందిస్తున్న పింఛన్లు వారి జీవితాలకు ఒక భరోసా నింపుతున్నాయి. వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాయి. ఆత్మగౌరవంతో బతికేందుకు ఉపయోగపడుతున్నాయి. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, మనసునిండా ప్రశాంతంత వుంటే ఏ రోగం రాదు. చావు అంత తొందరగా దరిచేదరంటారు. ఇప్పుడు తెలంగాణలోని ఎంతో మంది వయసు మళ్లిన వారిని చూస్తే ఇదే కనిపిస్తుంది. ఇదే నిజమని ప్రపంచం గుర్తించింది. ఏతోడు లేని, నీడలేని పిల్లలుండీ ఆసరా లేని వారందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు తెలంగాణ ప్రజల సగటు జీవిత ఆయుః ప్రమాణం కూడా పెంచుతున్నాయి. ఇక ఇప్పుడు అనాధలకు న్యాయం. వారి జీవితాలను కాపాడే బాధ్యతా ధర్మం ప్రభుత్వం తీసుకోవడం అన్నది ఆషామాషీ నిర్ణయంకాదు.
ఆకలి ఒక పాపమో! శాపమో!! కాని ఎవరికైనా అది నరకమే!!! ఏవరూ లేని వారికి అది నిత్య నరకం. పసిపిల్లల పాటిల శాపం. అది ఆకలని వారికి తెలియదు. కడుపులో మంట జీవితాన్ని దహిస్తుంటే ఏమిటో తెలియదు. ఆ క్షణం ఒక ముద్ద కావాలి. లేకుంటే జీవితం ఆరిపోవాలి. అలా ఆకలిని భరించలేక ఏటా కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. సహజంగా పోషకాహారలోపమే పెద్ద శాపమైతే, అసలే ఆహారం అన్నది అందని జీవితాలను ఏమని చెప్పగలం. వారి బాధ వర్ణణాతీం. దానంత దురదృష్టం మరొకటి వుండకోవచ్చు. మహానగరాల్లో వారి జీవితాలు చూస్తుంటే అసలు మానవజన్మ అన్నది ఎంత నరకమో? వారికే ఎందుకంత వేధనో అని మన కళ్లునిండా నీళ్లు సుడులు తిరగక మానవు. కాని ఆ కన్నీటి చుక్కలే నోటి దాహానికి ఆసరా చుక్కలైతే ఇక వారి జీవితం ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. కళ్లు తెరవకుండానే ఈ లోకం మీదకు వచ్చి, భూమ్మీద పడి, ఎక్కడున్నామో తెలియని వేధనే ప్రపంచమైపోయే పసి అనాధ హృదయాల జీవితం అరణ్యరోధన. అభం శుభం తెలియని వయసులోనే నా అనేవారు లేక, కన్నవారు కనిపించక, ఎవరికి పుట్టామో తెలియక, ఎవరూ దగ్గరకు రానీయకుండా, చెట్టుకింద జీవితాలు. ఎండకు ఎండి, వానకు నాని, మురిక కాలువల పక్కన, వీధి కుక్కల మధ్యన బతకడం అంటే ఇంతకన్నా శాపగ్రస్ధమేముంటుంది. అసలు తామెవరమో? కూడా తెలియని పసిహృదయాలకు అంత శిక్ష ఎందుకో? అన్న ప్రశ్న అందరిలో ఉత్పన్నమైనా, ఎంత మంది వారిని ఆదుకోగలరు. ఎంత కాలం ఆదుకోగలరు. దైవం చేసిన మోసంతో భూమ్మీదకొచ్చి, కళ్లు తెరవకుండానే కన్న వారిని దూరం చేసుకొని, ఎంగిలి విస్తర్లే ఆహారమై కడుపుకునింపుకొని కోట్ల మంది జీవిస్తున్నారు. అలా నీడలేని వారికి ఆశ్రయం ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదు. వారిని ఏకంగా ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడం అన్నది చరిత్రలో సువర్ణాధ్యాయం. ఏ తోడు లేని అనాధ పిల్లలను ప్రభుత్వమే దరి చేర్చుకోవడం, వారి జీవితాలివ్వడం, వారి భవిష్యత్తు తీర్చిదిద్దడం, భవిష్యత్తులో అలాంటి వారి జీవితాలకు తావులేకుండా చూడడం అన్నది ఒక దైవకార్యం. ఒక జీవన యజ్ఞం. చరిత్రలో ఇలాంటిది విన్నది లేదు. చూసింది లేదు. మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ప్రకటించడం విశేషం. విప్లవాత్మకం. ఆదర్శం. అనాధ పిల్లలను అక్కున చేర్చుకోవడం కోసం వారందరినీ ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయానికి నేటిధాత్రి దినపత్రిక ప్రత్యేక అభినందనలు. ఇలాంటి నిర్ణయాలు ఒక్క కేసిఆర్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపించారు. పేదల జీవితాలకు కేసిర్‌ అనే ఒక్క పదమే భరోసా అని మరోసారి రుజువు చేస్తున్నారు. యుగపురుషుడుగా చరిత్ర వున్నంత కాలం కేసిఆర్‌ నిలుస్తారు. ఇదే నిత్యం…కేసిఆర్‌ సంక్షేమం సత్యం…యుగయుగాలకు ఆదర్శం…

కేంద్ర రాష్ట్ర-ప్రభుత్వ విధానాలతో రైతాంగానికి తీవ్ర నష్టం

“వరి సాగు విషయంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న ప్రభుత్వాలు జాబితాలో ఉన్న పంటలను పండించలేని దుస్థితి నేడు రైతు బంధు పథకం తో మిగతా పధకాలకు తూట్లు వరి పండే భూములలో వేరే పంట ఎలా వేయాలి సరైన ప్రణాళిక లేని ప్రభుత్వ విధానాలు” – రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి
మహబూబాబాద్, నేటిధాత్రి: పంట నష్టపరిహారం అందలేదు గ్రామాలలో రైతులు వారి వారి సమస్యలు సరైన ముందుచూపు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఆరుగాలం కష్టపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టిపిసిసి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అవినాష్ రెడ్డి అన్నారు. రైతాంగ సమస్యలను గ్రామ గ్రామాన తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న టువంటి రచ్చబండ కార్యక్రమం లో మహబూబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో నెంబర్ వార్డు ఈదుల పూస పల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన రైతాంగ సమస్యల మీద ఒక బలమైన టువంటి రైతు ఉద్యమాన్ని నిర్మించడం కోసం రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుండి రైతులను కాపాడడం కోసం రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ధరణి కార్యక్రమం వల్ల చాలామంది రైతుల భూములు నష్టపోయారని తెలిపారు. వరి సాగు విషయంలో ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారు అని అన్నారు.

ఒకరు ధాన్యం పందించందని అని ఒకరు వద్దని అనడంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారని అని తెలిపారు . జాబితాలో ఉన్నటువంటి పంటలను పండించినా కూడా మద్దతు ధర కల్పించలేని దుస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. రైతుబంధు సాకుగా చూపి వ్యవసాయ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మిల్లర్లు కలిసి రైతులు తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు. వరి పండే పంట భూములలో వరి తప్ప వేరే పంట సాగు చేయలేని దుస్థితి ఉన్నా కూడా వరి సాగు చేయవద్దు అనడం ఏంటని ప్రశ్నించారు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా చేస్తుందని అన్నారు.సీనియర్ నాయకులు మురళి నాయక్ మాట్లాడుతూ మిల్లర్లు తరుగు పేరుతో రైతులను తీవ్రంగా నష్ట పరుస్తున్నారని అన్నారు. అలాగే పండించిన పంట డబ్బులు ఎకౌంట్లో పడ్డాక బ్యాంకు వారు రుణాలు ఉన్నాయని డబ్బులను కట్ చేసుకుని మిగతా డబ్బులు చెల్లిస్తున్నారని అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట రుణాలు వచ్చేవని కానీ ఇప్పుడు రుణమాఫీ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే ఈ ప్రాంతంలో మిర్చి సాగు ఎక్కువగా ఉన్నందున లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా పంట సరిగా రాలేదన్నారు. ఒక్కొక్క రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాగైనా మిర్చి సాగు చేసిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ లో రైతుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. వెన్ను శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మిర్చి సాగు పంట ఎక్కువ సాగు చేశారని వారు లక్షల్లో నష్టపోయారన్నారు తెలిపారు. మిర్చి సాగు రైతులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మిర్చి సాగు పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి , బెల్లయ్య నాయక్,పీసీసీ సభ్యులు దస్రు నాయక్, తండ వెంకటేశ్వర్లు, రజినీకాంత్, నునావత్ రాధ వెన్నం లక్ష్మారెడ్డి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి మహేందర్ రెడ్డి, కత్తి స్వామి, రమేష్ నాయక్, రమేష్ ముఖ్య నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సినిమా ధియేటర్ యాజమాన్యం

ఘనపూర్ స్టేషన్ (జనగాం) నేటిధాత్రి
ఘనపూర్ మండల కేంద్రం లోని మహాలక్ష్మి ధియేటర్ యాజమాన్యం ఆగడాలకు హద్దే లేదు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న యాజమాన్యం, దీనిపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ మాట్లాడుతూ థియేటర్ యాజమాన్యం పైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ధియేటర్ లో ఏసీ అని చెప్పి కనీసం ఫ్యాన్లు కుడా లేవని గతంలో మొదటి, రెండవ, మూడువ, తరగతలు చొప్పున ధరలు ఉండేవి అలా కాకుండా మొత్తం అన్ని కేటగిరీ కి ఒక్కటే ధర టికెట్ల కు వంద రూపాయలు మాత్రమే అని దాదాపు రెండు సంవత్సరాలనుండి పెట్టారు అలాగే గత రెండు సంవత్సరములు నుండి 100 కంటే ఎక్కువ 150 రూపాయలు ధర పెంచడం జరిగింది. రెండు సంవత్సరాలనుండి వంద రూపాయలు ఉండేది పుష్ప సినిమా నుండి నూట యేబది రూపాయల (150) వరకు తీసుకుంటున్నారు ఇప్పుడు R R R సినిమా నుండి 175 వరకు తీసుకుంటాం అంటున్నారు.

యాజమాన్యం వారిని అడిగితే ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ధరలు పెంచుతున్నామని RRR సినిమాకు నూట డెబ్బది ఐదు రూపాయలు (175) వరకు పెంచుతామని చెబుతున్నారు. ఇది ప్రజలపై పెను భారమే అవుతుందని వారన్నారు. ఒక పక్క కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో థియేటర్ యాజమాన్యం మరోసారి ప్రజల పై పెనుభారం మోపే విధంగా ప్రయత్నిస్తుంది ప్రజల ఆరోగ్యం పట్ల కువైట్ డెల్టా ప్లస్ ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఇస్తుంటే కనీసం శానిటైజర్ గాని సోషల్ డిస్టెన్స్ గాని మాస్కు ధరించి వస్తున్నారా ప్రజలు లేరా అని చూడకుండా ప్రజలు అనారోగ్యం పాలవుతుంటే ధియేటర్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ముఖ్యంగా తాగునిరు లేకపోవడం శానిటేషన్ చేయకపోవడం మూత్రశాలలు శుభ్రపరచి కుండా కనీసం చేతులు కడుక్కోవడం కోసం గాని నీటి సదుపాయాలు లేవు ఏసీ కాదు కదా కనీసం ఫ్యాన్లు కుడా లేకపోవడం విడ్డూరంగా ఉందని దోమలు దురవాసన వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తెరాస ప్రభుత్వం ధియేటర్ యాజమాన్యలకు వంత పడుతుంది ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ధియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని లేకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తాము అని అని అవసరమైతే ప్రజల కొరకు ధర్నా ను చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని థియేటర్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నాము, ఈ కార్యక్రమంలో కోటి ఎల్లయ్య, శ్రీనివాస్, రాములు, రాజేష్, రాజు, సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న

శేరిలింగంపల్లి ( నేటి ధాత్రి) కొలువులపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ గారు మరియు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి .ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై మొండి వైఖరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో, నిరుద్యోగ భృతి హామీ అమలు లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.

ఈ తెరాస ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగుల భర్తీ గురించి మాట్లాడకుండా, కేంద్రాన్ని ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటం చాలా సిగ్గుచేటు, ఈ అబద్ధలు మాట్లాడుతూ ప్రజలని మభ్యపెట్టి మోసంచేసే ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు,నిరుద్యోగులే తగినబుద్ధి చెప్తారు అన్ని అన్నారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటే.. ఈనాడు ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్ని అన్నారు. ఇకనైనా ఆత్మహత్యలు ఆగాలి. నిరుద్యోగులకు అండగా ఉంటామనే భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అన్ని అన్నారు. లక్ష ఉద్యోగాలంటూ, త్వరలో నోటిఫికేషన్లంటూ ఓట్లు దండుకొని గద్దెనెక్కి జాబ్ నోటిఫికేషన్లు ఇయ్యకుండా గడీల్లో రాక్షసానందం పొందుతున్న తెరాస ప్రభుత్వం అన్ని అన్నారు.

నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నా అవేవి పట్టనట్టు, సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు ,రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ సాధించడం లక్ష్యంగా బండి సంజయ్ గారు నిరుద్యోగ దీక్ష చేపెట్టారు అన్ని అన్నారు . ఈ దీక్షలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ శ్రీమతి విజయశాంతి,ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్‌, మంత్రి శ్రీనివాస్ , పలువురు సీనియర్ నాయకులు ,రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున తరలివచ్చిన బిజెపి శ్రేణులు, కార్యకర్తలు ,యువకులు, నిరుద్యోగులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఓట్లుంటేనే ఓదార్పులా” “నేటిధాత్రి” కథనానికి “కడియం” స్పందన

*గత ఏడాది తల్లి, పది రోజుల క్రితం తండ్రి…*

*తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి అనాధలుగా మిగిలిన పసిపిల్లలు*

*అన్ని రకాలుగా పిల్లలను ఆదుకుంటామని కడియం ప్రకటన*

*ఐనవోలు* గ్రామానికి చెందిన చిన్నారులు *ప్రణయ్, నందులపై “నేటిధాత్రి” దినపత్రికలో వచ్చిన కథనానికి తెలంగాణ మాజీ ఉప  ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ “కడియం శ్రీహరి” స్పందించారు*. అనాధలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పారు. గత ఏడాది జూన్ లో కన్న తల్లి చనిపోయింది. గత పది రోజుల క్రితం తండ్రి చనిపోవడంతో పిల్లలు అనాధలయ్యారు. జరిగిన *సంఘటన తెలియగానే నేటిధాత్రిలో ఆ పిల్లలుపై ఈ రోజు  ‘ఓట్లుంటేనే ఓదార్పులా” అనే కథనం ప్రచురించడం జరిగింది. ఆ వార్తను చూసిన కడియం శ్రీహరి ఆ పిల్లలకు సంబంధించి అన్ని రకాల సహాయసహారాలు అందించేందుకు ముందుకొచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.* ఆ పిల్లల విషయంలో మరింత మంది మానవతా హృదయులు ముందుకొస్తే వారి జీవితం తెగిన గాలిపటం కాకుండా వుంటుంది. *నిరుపేదలైన దళిత పిల్లలను ఆదుకోవాల్సిందిగా “నేటిధాత్రి” మనవి.

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అన్ని విధాల లాభాలు

నర్సంపేట, నేటిధాత్రి : భూములు లేని పాడి రైతులు, మత్స్యకారులు, గొల్ల కురుములు కూడా రైతులేనని వారికి ఏదోవిధంగా ఆర్ధిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకురావడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డు (కేసిసి) అంటే రైతులకు ఏటిఎం లాగా ఉపయోగపడుతుందని అలాగే వాటి వలన అనేక విధాలుగా లాభాలు పొందవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్, నర్సంపేట రూరల్, మున్సిపాలిటీకి చెందిన మత్స్యకారులకు, గొర్రెలు, మేకల పెంపకందారులకు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసిసి) ప్రాముఖ్యత దరఖాస్తు విధానం నర్సంపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్యాంపెయిన్ లో లబ్దిదారులకు కేసిసి లకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భూములు లేని పాడి రైతులు, మత్స్యకారులు, గొల్ల కురుములు కూడా రైతులేనని వారికి ఏదోవిధంగా ఆర్ధిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకురావడం జరిగింది.

కిసాన్ క్రెడిట్ కార్డు అంటే రైతులకు ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 25 వేల నుండి రూ.లక్ష 60 వేల వరకు కేవలం 7 శాతం వడ్డితో బ్యాంకు ఋణం పొందే అవకాశం ఉంది. ఈ 7 శాతం వడ్డీలో సగం అంటే 4 శాతం వడ్డీని మీకు మద్దతుగా గవర్నమెంట్ వారు తిరిగి బ్యాంకర్లకు చెల్లిస్తుంది. అంటే కేవలం 30 పైసల వడ్డీ మాత్రమే లబ్దిదారులపైన పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ భూములపై క్రాప్ లోన్ తీసుకున్న వారికి కేసిసి కార్డ్ వర్తించదని ప్రధానంగా రైతు దరఖాస్తు పెట్టిన 15 రోజుల నుండి 30 రోజులలో బ్యాంక్ లోన్ ఖచ్చితంగా ఇవ్వాలిసిందే తేల్చి చెప్పారు.

అర్హులైన 2500 మంది మత్స్యకారులు, పాడి రైతులకు, గొర్రెల, మేకల కాపారులను సొసైటీల ద్వారా గుర్తించి లబ్దిదారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ గుర్తింపు కార్డ్ అనేది కిసాన్ క్రెడిట్ కార్డుకు ముఖ్యమైనది అన్నారు. దరఖాస్తులో ఏదైనా లోపం ఉండి నిరాకరించబడితే దానికి సంబందించిన కారణాన్ని మెస్సేజ్ రూపకంలో దరఖాస్తుదారునికి పంపిస్తారని గతంలో బ్యాంక్ ల ద్వారా క్రాప్ అప్పు తీసుకొని సరిగ్గా కట్టని వారి దరఖాస్తులు మాత్రమే తిరస్కరించబడుతాయని, కెసిసి కార్డు పొందిన వ్యక్తికి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుందని తెలుపుతూ, ఎవరెవరూ ఏఏ వృత్తులలో ఉంటారో వారికి ఆ వృత్తిలో పెట్టుబడి కింద ఆర్థిక సహాయం చేయడమే కేసిసి కార్డు ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే వివరించారు. ఆర్థికంగా పేదరికంలో ఉండి వృత్తిని నమ్ముకున్న రైతులకు కేసీసీ కార్డు ఒక వరం లాంటిదని, కార్డును నియోజకవర్గంలోని అర్హులైన రైతులందరూ సద్వినియోగ పరుచుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఎమ్మార్వోలు, ఎంపిడివోలు, పశు సంవర్థక శాఖ జెడి, ఏడీలు, యూనియన్ బ్యాంక్ ఎల్దిఎం , జిల్లా మత్స్య శాఖాధికారి, పీఏసిఎస్ చైర్మన్లు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, అర్ఎస్ఎస్ కన్వీనర్లు, క్లస్టర్ భాద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా – రాస్తారోకో

చిట్యాల, నేటిధాత్రి: దళితుడిని కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు నేటి వరకు చేయకపోవడం తో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో చిట్యాల చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని ధర్నా, రాస్తారోకో నిర్వహించడం జరిగిందని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య అన్నారు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతి నగర్ గ్రామానికి చెందిన పర్లపెల్లి మహేందర్ మాదిగను బిసి యాదవ్ కులానికి చెందిన బొంకూరి రాజయ్య మరియు కుమారుడు కుమార్ తండ్రి కొడుకులు ఇద్దరు కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని నవంబరు 14నాడు పిర్యాదు చేసిన నేటి వరకు ఎఫ్ఐర్ నమోదు చేయుటకు జాప్యం చేయడం వల్ల కేసును తప్పు దారి పట్టించి బాధితులకు అన్యాయం జరుగే అవకాశం ఉందని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ శాంతి నగర్ లో జరిగిన సంఘటనపై సరియైన సాక్షాలు ఉన్న ప్రజాప్రతినిధుల మాటలు నమ్మి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయకుండా తప్పు దారి పట్టించి దళితుడికి అన్యాయం చేయాలని చూడటం బాధాకరమన్నారు. ఇట్టి సంఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గారికి అదనపు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు గారికి పిర్యాదు చేసిన, ఎస్సీ ఎస్టీ కమీషనర్ హెల్ప్ లైన్ లో పిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు దళితులంటే ఎందుకు అంత చిన్న చూపు? దళితులు ఎన్నికల్లో మీకు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు.? సరియైన సాక్షాలు ఉన్న సంబంధించిన పోలీసు అధికారులు ఎఫ్ఐర్ నమోదు ఎందుకు చేయడం లేదని అన్నారు. అందుకే దళిత బహుజనులకు రాజ్యాధికారం ఎంతో అవసరమని అన్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్సై కృష్ణ ప్రసాద్ గారు నేను వచ్చిన తర్వాత సంఘటన జరుగుతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేస్తానని అనడం సరి కాదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితుడిని కొట్టిన బొంకూరి రాజయ్య భూమి పట్టా దారుడు, భూమికి అతనికి ఎలాంటి సంబంధం లేదని అతనికి సహకరించి అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేస్తామని చెప్పి చేయకుండా దళితుడైన మహేందర్ కు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, లేనిపక్షంలో భాదితునితో పాటు దళిత సంఘాలము ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా భారీ ఎత్తున జిల్లా, రాష్ట్రశశ వ్యాప్తంగా చేపడుతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు.

కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలి దళితుడైన పర్లపెల్లి మహేందర్ కు న్యాయం చేయాలి. పిర్యాదు దారుడు పర్లపెల్లి మహేందర్ పై, సాక్షులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంబంధించిన అధికారులకు తెలియజేయుచున్నాము. మా డిమాండ్లు పరిష్కరించే వరకు ప్రతి రోజు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తెలియజేయుచున్నాము.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు పర్లపెల్లి కుమార్ కట్కూరి రాజేందర్ జన్నే నరేష్ శనిగరపు శ్రీనివాస్ పర్లపెల్లి శ్రీ కాంత్ మొలుగూరి రాకేష్ పిర్యాదు దారుడు పర్లపెల్లి మహేందర్ కుటుంబ సభ్యులు పర్లపెల్లి సమ్మయ్య సమ్మక్క బంగారి రాణమ్మ తదితరులు పాల్గొన్నారు.

దళితుల భూ సమస్యపై మంత్రి ఎర్రబెల్లి మౌనం వీడాలి : కేవీపీఎస్

పాలకుర్తి:(జనగామ) నేటిధాత్రి
మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన దళితుల భూములు స్ధానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు తెలియకుండానే కబ్జాకు గురై అక్రమ రిజిస్ట్రేషన్ లు అయ్యాయా అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాటోత్ ఇందిరలు మండిపడ్డారు. దళితులను ఆదుకుంటామని ఎన్నికల లో మాయ మాటలు చెప్పి దళితుల ఓట్లను వేయించుకోని ఇప్పుడు దళితుల భూములను కబ్జా చేస్తున్న అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటూ ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండడంలో మతలబేంటో చెప్పాలని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దళిత ద్రోహిఅని అన్నారు. దళితుల భూ సమస్యపై మంత్రి ఎర్రబెల్లి మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

దళితుల భూములను కబ్జా దారులకు కట్టబెట్టిన తహశీల్దార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం పాలకుర్తి మండలకేంద్రములో గత 8 రోజులుగా తమ పట్టా భూములకు రక్షణ కల్పించాలని దీక్షలు చేస్తున్న దళితుల పోరాటానికి సంఘీభావంగా మండల కేంద్రములో కేవీపీఎస్ ఆధ్వర్యములో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్ధార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఇండ్ల స్థలాల పోరాట నాయకులకు పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టా కాగితాలు వున్న 52 దళిత కుటుంబాలకుఇండ్ల స్థలాల భూమినికబ్జా కోరులకు కట్టబెట్టిన తహశీల్ధార్ విజయభాస్కర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని దళితుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే జోక్యం చేసుకొని దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 1993 లో ప్రభుత్వం దళితుల 52 కుటుంబాలకు ఇండ్ల స్థలాల కోసం ఆనాటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూమిని ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తో కుమ్మక్కై కబ్జా చేశారని, తక్షణమే ఆ భూమిని ఇప్పించాలని తహశీల్ధార్ ను డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల కోసం పట్టాలు పంపిణీ చేసిన భూములను హద్దులు నిర్ణయించి దళితులకు ఇవ్వాలన్నారు.

రెవిన్యూ అధికారులు వైఫల్యం వల్ల దళితులకు అన్యాయం జరిగిందన్నారు తహశీల్ధార్ నలుగురికి అక్రమ పట్టాలు చేయడం శోచనీయమన్నారు ఫలితంగా భూమి కబ్జా అయిందని అన్నారు. ఇప్పుడు అధికారులు కబ్జా దారులకు అనుకూలంగా మాట్లాడటం ఆందోళన కరం అన్నారు. ఈ భూమి లో సగం డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇచ్చిందన్నారు నిర్మాణం అయిన తర్వాత ఆ ఇండ్లు బిసి లకు ఇస్తాం, ఎస్సీ లకి ఇవ్వమని అధికారులు అనడం కులవివక్ష ను అమలు చేయడమే అన్నారు. పట్టాలు వున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇండ్లు ఇవ్వమని చెప్పడం అట్టుడుకు పేదలను మోసం చేయడమే అన్నారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు తూటి దేవదానం,బొట్ల శేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత, టిడీపీ మండల అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న, జిల్లానాయకులు యాదగిరి, బహుజన కులాల ఐక్య వేదిక వ్యస్థాపక అధ్యక్షులు గుమ్మడిరాజుల సాంబయ్య,ద్రవిడ బహుజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు చేరిపల్లి ఆనంద్,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, ఘనపురం ఎల్లయ్య,పసలాది ఉపేందర్,భూపోరాట నాయకులు రమేష్ బాబు, వెంకన్న,ఎల్లమ్మ,యాకమ్మ, లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు

టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్

*కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..*

ఉమ్మడి మెదక్ జిల్లాకు ఈ అవకాశం ఇవ్వడం సంతోషకరం..

ఇంతకు మునుపు తన దైన శైలిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు.


అదే రీతిలో ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎం ఎస్ ఐడీసీ. అలాంటి సంస్థకు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎర్రోళ్ల శ్రీను కు నా అభినందనలు.
సాధారణంగా మనకు ప్రభుత్వ ఆస్పత్రులలో బిల్డింగ్ లు, మెడికల్ డివైసెస్, ఎక్స్ రేలు, టెస్టింగ్ ల్యాబ్ లు, ఇంజక్షన్లు, బెడ్లు మాత్రమే ఆస్పత్రుల్లో కనిపిస్తాయి. కాని అవి సమకూరడానికి శ్రమించేది, సమకూర్చేది టీఎస్ఎంఎస్ఐడీసీ సంస్థనే.

ఆస్పత్రుల భవన నిర్మాణా పనులు, అవసరమైన ఫర్నిచర్, మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, వైద్యానికి అవసరమైన కాటన్, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్ నిర్వహణ, శానిటైజెషన్, ఆస్పత్రుల భద్రతకు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాట్లు, వైద్యో ఆరోగ్య శాఖకు అవసమరైన అన్ని సదుపాయాలు కల్పించేది ఈ సంస్థ ద్వారానే. ఒక్క మాటలో చెప్పాలంటే సూది నుండి సీటీ స్కాన్ మిషన్ వరకు సమకూర్చేది ఈ సంస్థే.

మహబూబ్ నగర్,సిద్దిపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు టీఎస్ఎంఎస్ఐడీసీ నిర్మించింది.
సిరిసిల్లలో నర్సింగ్ కాలేజీని నిర్మించింది. ఎం.ఎన్. జే క్యాన్సర్ ఆసుపత్రిలో మాడ్యులర్ ధియెటర్ నిర్మాణ పనులు ఈసంస్థ ద్వారానే జరుగుతున్నాయి.

తెలంగాణ వైద్య విధాన పరిషత్తు కు సంబంధించిన 14 ఆస్పత్రుల అప్ గ్రేడేషన్, 83 ఆస్పత్రులను బలోపేతం చేయడం లో ఈ టీఎస్ఎంఎస్ఐడీసీ కీలకంగా పని చేసింది.
19 హబ్ అండ్ స్పోక్ మోడల్ డయాగ్నోస్టిక్ సేవలు అందించే కేంద్రాలు, 8 మినీ హబ్ లను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది.

ఇక కరోనా సమయంలో దేశంలోనే కరోనా టెస్ట్ కిట్స్, పీపీఈ కిట్స్, ఆక్సిజన్ , కరోనా మందులు, రెమిడెసివర్ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఎస్ఎంఎస్ ఐడీసీ సంస్థ ఎంతో చాకచక్యంగా వాటిని సేకరించి ఎంతో మంది కరోనా బాధితుల ప్రాణాలు కాపాడడంలో కీలకంగా వ్యవహరించింది. బ్లాక్ ఫంగస్ కి కూడా మనం మందులు సరఫరా చేశాం. ఎంతో మంది వ్యాధిగ్రస్థులకు సేవలందించి కాపాడుకున్నాం.
ఆసుప‌త్రుల్లో అత్యాధునిక వైద్య ప‌రిక‌రాల‌ను ప్ర‌భుత్వం స‌మ‌కూర్చుతున్న‌ది. మొత్తం రూ. 150 కోట్ల‌తో వివిధ ఆసుప‌త్రుల్లో అత్యాధునిక సిటీ, ఎంఆర్ఐ, పిఇటి స్కాన్ మిష‌న్ల‌ను ఏర్పాటు చేసింది.
గుండె స‌మ‌స్య‌లున్న వారిని కాపాడుకునేందుకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, ఎంజీఎంల‌లో, ఖ‌మ్మం, ఆదిలాబాద్ ఆసుప‌త్రుల్లో విలువైన క్యాథ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం. టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా వీట‌న్నింటిని స‌మ‌కూర్చుకుంటున్నాం.

ఆరోగ్య తెలంగాణ గా తెలంగాణ రాష్ట్రం మారాలన్నది సీఎం కేసీఆర్ గారి కల. పేషంట్లకు త్వరిత గతిన ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే ఒక గొప్ప బాధ్యత ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద ఉంది. తను చురుకుగా ఉండి, తన సంస్థను మరింత ముందుకు సమర్థవంతంగా నడుపుతూ, వందకు వంద శాతం తన బాధ్యతలను నిర్వర్తించి కేసీఆర్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను.

మున్సిపల్ లో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ మెజార్టీ పాలకవర్గ సభ్యులు మున్సిపల్ ఉన్నతాధికారులకు మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జమ్మికుంటలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎక్కడ చూసినా అదే చర్చ జోరుగా జరుగుతోంది. గత కొంత కాలంగా మున్సిపల్ చైర్మన్ కు పాలకవర్గ సభ్యులకు మధ్య పాలనలో వారిలో ఉన్నటువంటి బేధాభిప్రాయాలు ఒక్కసారిగా బయటికి వస్తున్న క్రమంలో ఉప ఎన్నిక నేపథ్యమాఅని వాటినీ బయటకి పొక్కకుండా ఇన్ని రోజులు కాపాడినటువంటి పాలకవర్గ సభ్యులు. ఉప-ఎన్నిక పూర్తికాగానే ఈ నెల 16న పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పొందుపరచిన ఎజెండా అంశాలు చూసిన పాలకవర్గ సభ్యులు ఒక్కసారిగా విస్మయానికి గురి అయినట్లు చెప్పారు. పలు అభివృద్ధి పనుల పేరుతో పాలకవర్గ సభ్యుల అనుమతి లేకుండానే 90 శాతం ముందస్తుగా బిల్లులు చెల్లించారని.

అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం జరిగిందని. సదరు పనుల పై పూర్తి విచారణ చేపట్టాలని 17 మంది కౌన్సిల్ సభ్యులతో కూడిన ఫిర్యాదు కాపీ మున్సిపల్ ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 30 కౌన్సిల్ స్థానాలు ఉండగా… కేవలం ఒక్క కౌన్సిల్ మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండగా.. మిగతా 29 మంది కౌన్సిలర్లు తెరాస మద్దతుదారులే అయినప్పటికీ…. వారిలోపనే 17 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో జరుగుతున్నటువంటి పొందుపరచిన ఎజెండా అంశాలను తప్పుబడుతూ…. వాటిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ… కలెక్టర్ తోపాటు మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం చూస్తుంటే.. ఏ స్థాయిలో మున్సిపల్ కార్యాలయంలో అవినీతి జరుగుతుందో అర్థమవుతుంది. ఏకఛత్రాధిపత్యంగా మున్సిపల్ చైర్మన్ అన్ని తానై వ్యవహరించడం చూస్తుంటే అసలు పాలన సజావుగా జరుగుతుందా… ఒక వ్యక్తే కేంద్రీకృతమై పాలన జరుగుతుందా అనేఅటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో మీడియాకు సమావేశాలు జరిగినప్పుడు పాల్గొనేందుకు అవకాశం ఉండగా.. ఉన్నతాధికారుల నుంచోలి ఆదేశాలు లేవ్వంటు సమావేశాల్లో మీడియాను అనుమతించకుండా తూతూ మంత్రంగా వాళ్ల సమావేశాలు నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కౌన్సిలర్ల సమన్వయంతో దృష్టి సారించాల్సిన చైర్మన్. ఏకపక్ష నిర్ణయాలతో జమ్మికుంట మున్సిపల్ పాలన గాడి తప్పుతుంది. దీని పై ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో నేనేం చేసినా అడిగే వారు లేరనే ధైర్యంతో ఏకపక్షంగా మున్సిపల్ చైర్మన్ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలు కట్టే పన్నుల డబ్బుతో పాలన జరుగుతుందనే విషయాన్ని పాలకవర్గం మర్చిపోయి తమ ఇష్టానుసారం పరిపాలన చేయడమనేది సరైన విధానం కాదని. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజలకు తెలియాల్సిందేనని. ఆ విషయాన్ని జమ్మికుంట పురపాలక సంఘం చైర్మన్, అధికారులు విస్మరించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏది ఏమైనా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు పని చేస్తున్న పాలకవర్గం ఆ దిశలో పూర్తి స్థాయిలో సరైనటువంటి పాలన అందించేందుకు దృష్టిసారించాలని పట్టణ ప్రజలు సైతం కోరుకుంటున్నారు. మున్సిపల్ లో జరిగిన నిధుల దుర్వినియోగం పై మెజార్టీ పాలకవర్గం సభ్యులే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం పట్ల పట్టణంలో ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజా ధనాన్ని కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మేధావి వర్గాలు సైతం కోరుతున్నాయి.

విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..: కలెక్టర్ గోపి

  • పాఠశాల పని తీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్.
  • మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి.
  • పెద్ది స్వప్న చొరవతో కదిలిన జిల్లా అధికార యంత్రాంగం.       

నల్లబెల్లి – నేటి ధాత్రి :ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో మండలంలోని మూడు చెక్కల పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల లో నెలకొన్న సమస్యలపై జడ్పీ సమావేశంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రస్తావించి నివేదికను కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకు అందజేయగా స్పందించిన జిల్లా కలెక్టర్ గోపి, జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మంగళవారం జిల్లా యంత్రాంగంతో గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసినారు ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులను మందలించారు.
పాఠశాలలో త్రాగు నీటి సమస్య, వాటర్ పైప్ లీకేజెస్, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడాన్ని గుర్తించి తక్షణమే పరిస్థితులను చక్కదిద్దాలని అధికారులను ఆదేశించారు.

 పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తా. గండ్ర జ్యోతి

జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని, పచ్చదనం పరిశుభ్రతను పాటిస్తూ పిల్లలకు మెరుగైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు దోహదపడాలని ఆమె అన్నారు అలాగే పాఠశాలలోని వంటగది, డార్మెటరీ, టాయ్ లెట్స్, వాటర్ ప్లాంట్స్ ను పరిశీలించి రిపేర్స్ ఉన్న చోట్ల యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టాలని, మౌలిక వసతులు కల్పనపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులు రెగ్యులర్ గా పాఠశాలను విజిట్ చేస్తూ మానిటరింగ్ చెయ్యాలని లేనియెడల చర్యలు తప్పవని అధికారులను ఆమె ఆదేశించారు.

 విద్యార్థులతో మాటామంతి

పాఠశాలలోని విద్యార్థినులతో కలెక్టర్, జెడ్పి చైర్ పర్సన్ స్వయంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన, తరగతుల నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తున్నార అని అడిగి తెలుసుకున్నారు త్వరలోనే పాఠశాలలో పూర్తిస్థాయిలో సిబ్బందిని భర్తీ చేస్తామని వారన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ , జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న , ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ , డి టి డి ఓ జహీరుద్దీన్, జె డి ఎ ఉషా దయాల్,ఆర్ డి ఓ పవన్, ఏ డి ఏ తోట శ్రీనివాసరావు ,తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ , ఎం పీ ఓ కూచన ప్రకాష్, ఏవో పరమేశ్వర్, సర్పంచ్ పూల్ సింగ్, ఎంపీటీసీ దేవ్ నాయక్, వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇసుక క్వారీలను వెంటనే నిలిపి వేయకుంటే కోర్టును ఆశ్రయిస్తాం : జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ

ములుగు, నేటి ధాత్రి : ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇసుకాసురులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంపై కన్నాయిగూడెం జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. ప్రజలకు నయానో భయానో ఎంతో కొంత ముట్టజెప్పి వారి పట్టా భూములను లీజుకు తీసుకొని ఇసుక దొంగలు అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులను మచ్చిక చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీలకు అనుమతులు పొంది ఇసుకను ఏజెన్సీ గ్రామీణ అటవీ ప్రాంతాల నుండి వరంగల్ హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటు అందినకాడికి దోచుకుని కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో పది కిలోమీటర్ల మేర పర్యావరణ పరిరక్షణ హద్దులు కలిగి ఉంటాయి ఎక్కువ సెన్సిటివ్ జోన్ పరిధిలో పర్యావరణానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలు లదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన నిబంధనలు కలిగి ఉన్నాయి అని జెడ్ పి టి సి నామ కరంచంద్ గాంధీ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణానికి హాని కలిగించే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దు కానీ బుట్టాయిగూడెం, చింతగూడెం ఏటూర్ నాగారం ప్రాంతాలలో ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కి తూట్లు పొడుస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఎవరైనా లాలూచీ పడితే అధికారులపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం చింతగూడెం గ్రామంలో ఇసుక క్వారీ పెట్టడానికి ముందు ఏర్పాటుచేసిన డి ఎల్ సి పై పరిపాలన అధికారి జిల్లా కలెక్టర్ కి భూగర్భ జల వనరుల అధికారులు ఇతర అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చే కలెక్టర్ ని తప్పుదోవ పట్టించారని వాపోయారు. గ్రామాలను పర్యావరణ రహితంగా మార్చి అడ్డగోలుగా ఖనిజ సంపదను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకోవాలని ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

నదీ గర్భంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఉన్నారని ఇది సరైంది కాదని ఆయన తెలిపారు.
వాగులో రోడ్లు వేసి గోదావరి కి అనుసంధానం చేసి రాత్రి పూట ఇసుక అక్రమ తవ్వకాలు నదీ గర్భంలో చేపడుతున్నారు. ఇసుక ఖనిజ సంపదలను ఇసుక వ్యాపారులు కొల్ల కొడుతున్నారని ఆయన ఆవేదన చెందారు. టి ఎస్ ఏం డి సి పి ఓ న స్వయంగా అదనపు బకెట్ దందా కి పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయని అదనపు బకెట్ దందా కి టి ఎస్ ఎన్ డి సి పి ఓ అనుమతి ఇవ్వడం జరిగిందని వ్యవహారం లో వచ్చిన వాటాలో గుత్తేదారులు అధికారులు వాటాలు పంచుకున్నట్లు ఆరోపించారు. మైనింగ్ అధికారులు రెండు బకెట్ లకు మాత్రమే అనుమతి ఇచ్చారని చెప్పుకుంటూ గుత్తేదారులు అదనంగా ఐదు బకెట్లో వరకు ఒక్కొక్క బడ్జెట్ కు రెండు వేల చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. బుట్టాయిగూడెం, చింతగూడెం ఇసుక క్వారీల నుండి ప్రతి లారీ ఓవర్లోడ్ తో పోతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నారనీ ఇసుక నిబంధన మేరకు తీయకుండా ఇష్టానుసారంగా తీయడంతో నది భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని జెడ్ పి టి సి అన్నారు. రైతులు పూర్తిస్థాయిలో తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని, నది గర్భంలోనే మట్టి రోడ్లు చేశారని ఆయన పేర్కొన్నారు.

కన్నాయిగూడెం మండలంలో 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రస్తుతం ఇసుక లారీల వల్ల ధ్వంసం అవు తుందని కన్నాయిగూడెం ప్రజలందరికీ కొద్ది సంవత్సరాల క్రితమే రోడ్డు అందుబాటులోకి వచ్చింది రూ 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రస్తుతం ఇసుక లారీలు ఓవర్ లోడ్ తో వెళ్లడం ద్వారా రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని అన్నారు. దీని వెనుక పాత్ర సూత్రధారులు మొత్తం టి ఎస్ ఏం డి సి అధికారులే అధికారులు పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ధ్వంసం అవుతున్న భూగర్భజలాలు అడుగంటి పోతున్న ఎవరి ప్రయోజనం కోసం గుత్తేదారులకు సంపాదించి పెట్టడానికి ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకొని సంపాదన ధ్యేయంగా ఇసుకను తోడేస్తున్నారనీ తెలిపారు.

అటవీ శాఖ జిల్లా విజిలెన్స్ అధికారులు గత శనివారం ఆకస్మాత్తుగా క్వారీలలో తనిఖీలు నిర్వహించారనీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇసుక క్వారీల నిర్వాహకులు అధికార పార్టీ నాయకులు కొంతమంది అధికారులను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారనే విమర్శలు వెల్లు వెతుతున్నాయని తెలిపారు.

అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న అంతసేపు వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం ఎటురు నాగారం ఆయా మండలాల్లోని పట్టా ల్యాండ్స్ సొసైటీ ఇసుక క్వారీల నుండి లారీలు నిలిపివేశారని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయని నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని అధికారులను మోసం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా క్వారీలను ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ప్రజల పక్షాన పోరాటం చేయక తప్పదని జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version