మున్సిపల్ లో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ మెజార్టీ పాలకవర్గ సభ్యులు మున్సిపల్ ఉన్నతాధికారులకు మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జమ్మికుంటలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎక్కడ చూసినా అదే చర్చ జోరుగా జరుగుతోంది. గత కొంత కాలంగా మున్సిపల్ చైర్మన్ కు పాలకవర్గ సభ్యులకు మధ్య పాలనలో వారిలో ఉన్నటువంటి బేధాభిప్రాయాలు ఒక్కసారిగా బయటికి వస్తున్న క్రమంలో ఉప ఎన్నిక నేపథ్యమాఅని వాటినీ బయటకి పొక్కకుండా ఇన్ని రోజులు కాపాడినటువంటి పాలకవర్గ సభ్యులు. ఉప-ఎన్నిక పూర్తికాగానే ఈ నెల 16న పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పొందుపరచిన ఎజెండా అంశాలు చూసిన పాలకవర్గ సభ్యులు ఒక్కసారిగా విస్మయానికి గురి అయినట్లు చెప్పారు. పలు అభివృద్ధి పనుల పేరుతో పాలకవర్గ సభ్యుల అనుమతి లేకుండానే 90 శాతం ముందస్తుగా బిల్లులు చెల్లించారని.

అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం జరిగిందని. సదరు పనుల పై పూర్తి విచారణ చేపట్టాలని 17 మంది కౌన్సిల్ సభ్యులతో కూడిన ఫిర్యాదు కాపీ మున్సిపల్ ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 30 కౌన్సిల్ స్థానాలు ఉండగా… కేవలం ఒక్క కౌన్సిల్ మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండగా.. మిగతా 29 మంది కౌన్సిలర్లు తెరాస మద్దతుదారులే అయినప్పటికీ…. వారిలోపనే 17 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో జరుగుతున్నటువంటి పొందుపరచిన ఎజెండా అంశాలను తప్పుబడుతూ…. వాటిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ… కలెక్టర్ తోపాటు మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం చూస్తుంటే.. ఏ స్థాయిలో మున్సిపల్ కార్యాలయంలో అవినీతి జరుగుతుందో అర్థమవుతుంది. ఏకఛత్రాధిపత్యంగా మున్సిపల్ చైర్మన్ అన్ని తానై వ్యవహరించడం చూస్తుంటే అసలు పాలన సజావుగా జరుగుతుందా… ఒక వ్యక్తే కేంద్రీకృతమై పాలన జరుగుతుందా అనేఅటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో మీడియాకు సమావేశాలు జరిగినప్పుడు పాల్గొనేందుకు అవకాశం ఉండగా.. ఉన్నతాధికారుల నుంచోలి ఆదేశాలు లేవ్వంటు సమావేశాల్లో మీడియాను అనుమతించకుండా తూతూ మంత్రంగా వాళ్ల సమావేశాలు నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కౌన్సిలర్ల సమన్వయంతో దృష్టి సారించాల్సిన చైర్మన్. ఏకపక్ష నిర్ణయాలతో జమ్మికుంట మున్సిపల్ పాలన గాడి తప్పుతుంది. దీని పై ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో నేనేం చేసినా అడిగే వారు లేరనే ధైర్యంతో ఏకపక్షంగా మున్సిపల్ చైర్మన్ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలు కట్టే పన్నుల డబ్బుతో పాలన జరుగుతుందనే విషయాన్ని పాలకవర్గం మర్చిపోయి తమ ఇష్టానుసారం పరిపాలన చేయడమనేది సరైన విధానం కాదని. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజలకు తెలియాల్సిందేనని. ఆ విషయాన్ని జమ్మికుంట పురపాలక సంఘం చైర్మన్, అధికారులు విస్మరించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏది ఏమైనా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు పని చేస్తున్న పాలకవర్గం ఆ దిశలో పూర్తి స్థాయిలో సరైనటువంటి పాలన అందించేందుకు దృష్టిసారించాలని పట్టణ ప్రజలు సైతం కోరుకుంటున్నారు. మున్సిపల్ లో జరిగిన నిధుల దుర్వినియోగం పై మెజార్టీ పాలకవర్గం సభ్యులే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం పట్ల పట్టణంలో ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజా ధనాన్ని కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మేధావి వర్గాలు సైతం కోరుతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version