కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అన్ని విధాల లాభాలు

నర్సంపేట, నేటిధాత్రి : భూములు లేని పాడి రైతులు, మత్స్యకారులు, గొల్ల కురుములు కూడా రైతులేనని వారికి ఏదోవిధంగా ఆర్ధిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకురావడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డు (కేసిసి) అంటే రైతులకు ఏటిఎం లాగా ఉపయోగపడుతుందని అలాగే వాటి వలన అనేక విధాలుగా లాభాలు పొందవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్, నర్సంపేట రూరల్, మున్సిపాలిటీకి చెందిన మత్స్యకారులకు, గొర్రెలు, మేకల పెంపకందారులకు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసిసి) ప్రాముఖ్యత దరఖాస్తు విధానం నర్సంపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్యాంపెయిన్ లో లబ్దిదారులకు కేసిసి లకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భూములు లేని పాడి రైతులు, మత్స్యకారులు, గొల్ల కురుములు కూడా రైతులేనని వారికి ఏదోవిధంగా ఆర్ధిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకురావడం జరిగింది.

కిసాన్ క్రెడిట్ కార్డు అంటే రైతులకు ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 25 వేల నుండి రూ.లక్ష 60 వేల వరకు కేవలం 7 శాతం వడ్డితో బ్యాంకు ఋణం పొందే అవకాశం ఉంది. ఈ 7 శాతం వడ్డీలో సగం అంటే 4 శాతం వడ్డీని మీకు మద్దతుగా గవర్నమెంట్ వారు తిరిగి బ్యాంకర్లకు చెల్లిస్తుంది. అంటే కేవలం 30 పైసల వడ్డీ మాత్రమే లబ్దిదారులపైన పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ భూములపై క్రాప్ లోన్ తీసుకున్న వారికి కేసిసి కార్డ్ వర్తించదని ప్రధానంగా రైతు దరఖాస్తు పెట్టిన 15 రోజుల నుండి 30 రోజులలో బ్యాంక్ లోన్ ఖచ్చితంగా ఇవ్వాలిసిందే తేల్చి చెప్పారు.

అర్హులైన 2500 మంది మత్స్యకారులు, పాడి రైతులకు, గొర్రెల, మేకల కాపారులను సొసైటీల ద్వారా గుర్తించి లబ్దిదారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ గుర్తింపు కార్డ్ అనేది కిసాన్ క్రెడిట్ కార్డుకు ముఖ్యమైనది అన్నారు. దరఖాస్తులో ఏదైనా లోపం ఉండి నిరాకరించబడితే దానికి సంబందించిన కారణాన్ని మెస్సేజ్ రూపకంలో దరఖాస్తుదారునికి పంపిస్తారని గతంలో బ్యాంక్ ల ద్వారా క్రాప్ అప్పు తీసుకొని సరిగ్గా కట్టని వారి దరఖాస్తులు మాత్రమే తిరస్కరించబడుతాయని, కెసిసి కార్డు పొందిన వ్యక్తికి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుందని తెలుపుతూ, ఎవరెవరూ ఏఏ వృత్తులలో ఉంటారో వారికి ఆ వృత్తిలో పెట్టుబడి కింద ఆర్థిక సహాయం చేయడమే కేసిసి కార్డు ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే వివరించారు. ఆర్థికంగా పేదరికంలో ఉండి వృత్తిని నమ్ముకున్న రైతులకు కేసీసీ కార్డు ఒక వరం లాంటిదని, కార్డును నియోజకవర్గంలోని అర్హులైన రైతులందరూ సద్వినియోగ పరుచుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఎమ్మార్వోలు, ఎంపిడివోలు, పశు సంవర్థక శాఖ జెడి, ఏడీలు, యూనియన్ బ్యాంక్ ఎల్దిఎం , జిల్లా మత్స్య శాఖాధికారి, పీఏసిఎస్ చైర్మన్లు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, అర్ఎస్ఎస్ కన్వీనర్లు, క్లస్టర్ భాద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version