రైతు బాంధవుడు కేసీఆర్‌

https://epaper.netidhatri.com/

విజయం ఖాయమైంది మెజారిటీ కోసమే ప్రయత్నం
60 ఏళ్ల అంధకారంపై…అభివృద్ధి సూర్యుడై పొడిచిన పాలకుడు కేసీఆర్‌
ఎడారిగా మారిన తెలంగాణను సిరుల తెలంగాణ గా మార్చిన అధిపతి..రైతు సంక్షేమ వారధి.
రైతు రాజ్యాన…కేసిఆర్‌ నజరాన!

`రైతు వరదాత కేసిఆర్‌…

`రుణ విముక్తి జరిగింది.

` రైతు బాంధువుడు…అపర భగీరధుడు.

స్వతంత్ర భారతాన రైతు కన్నీరు తుడిచిన ఏకైక నాయకుడు ‘‘కేసిఆర్‌’’ అని అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ’’నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న అంశాలు…ఆయన మాటల్లోనే.
`తెలంగాణ రైతులందరి పక్షాన కృతజ్ఞతలు.

`కేసిఆర్‌ మాటంటే మాటే…

`ఎంత కష్టమైనా నెరవేర్చుడే!

`రైతంటే ఎనలేని ప్రేమ వుండేది ఒక్క కేసిఆర్‌ కే!

` రైతు దిగులు తీరె…

`రైతు ఇంట ఆనందమే.

` రంది తీరిన రైతుకు సంబరమే.

`సంక్షేమ తెలంగాణ… పురోగతి గ్రామ, గ్రామాన.

` 31 లక్షల మంది రైతులకు లబ్ధి.

` 19 వేల కోట్ల సర్థుబాటు.

`అనూహ్యమైన నిర్ణయం.

` తెలంగాణ రైతుకు వరాల మూటలు.

` గత పదేళ్లలో రైతు కోసం ఊహకందని పథకాలు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

రైతు మనసు తెలిసిన నాయకుడు పాలకుడౌతే ఆ రాష్ట్రం ఎంత సుభిక్షంగా, ఎంత సుసంపన్నంగా వుంటుందో తెలంగాణను చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది. ఎందుకంటే కేసిఆర్‌ స్వతహాగా రైతు. ఆయనకు రైతు కష్టాలు తెలుసు. రైతు కన్నీళ్లు తెలుసు. సాగు కోసం ఎంత రైతు కష్టడతాడో తెలుసు. ఆరు గాలం శ్రమించినా, ఫలితం దక్కని నాడు రైతు వేదన ఏమిటో తెలుసు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కన్నీళ్లు కార్చే రోజులు ఎలా వుంటాయో తెలుసు. బంగారు పంటలు పండిద్దామనుకుంటే నీళ్లు లేకపోతే ఎంత కన్నీటి పర్యంతమౌతాడో తెలుసు. సాగు చేసేందుకు రొక్కం లేక ఎన్ని అవస్ధలు పడతాడో తెలుసు. అందుకే తెలంగాణ వస్తే గాని రైతు దుఖం తీరదని నిర్ణయం తీసుకున్న గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. పట్టుదలకు మారు పేరుగా ఆయన పట్టిన పట్టు విడవలేవు. తెలంగాణ సాధించేదాకా విశ్రమించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి. ఆయనకు రైతులంటే వల్లమాలిన ప్రేమ. గౌరవం. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని జలయజ్ఞం చేసిన గొప్ప మహర్షి కేసిఆర్‌. ఆయనను వేనోళ్ల పొగిడినా సరిపోదు. దేశమంతా ఆయన పేరు నినాదమైనా సరిపోదు. అంత గొప్ప గుణం వున్న నాయకుడు దేశంలోనే మరొకరు లేదు. కేవలం రైతు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్‌. పరిస్ధితులు అనుకూలించినప్పుడు ఎవరైనా పనులు చేస్తారు. కాని ప్రజల కోసం ఎంతటి ఇబ్బందులైనా ఎదుర్కొని పనులు పూర్తి చేయడం అన్నది ఎంతో గొప్పది. అందుకోసం కొన్ని దశాబ్ధాలుగా శ్రమ పడడడం అన్నది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం ఒక్క కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. నీటికెడ్చిన తెలంగాణ గోసను చూసి దుఖం తన్నుకొచ్చిన రోజులు చూసిన నాడు నా తెలంగాణ అంటూ కంటి తడిపెట్టుకున్నది కేసిఆర్‌. అసలే అరకొర వ్యవసాయం అనుకుంటే విద్యుత్‌ చార్జీల మోతతో తెలంగాణను ఎడారిగా మార్చే ఉమ్మడి పాలకుల కుట్రను ఎదుర్కొన్నది కేసిఆర్‌. అందుకే తెగించి 2001లో తెలంగాణ కోసం బయలు దేరి తెలంగాణ సాధించేవరకు అలుపెరగని పోరాటంచేశాడు. మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. ఎత్తిన పడికిలి దించలేదు. ఇప్పుడు పాలకుడిగాకూడా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలోనే తీసుకున్న నిర్ణయాలను వరసగా అమలు చేస్తున్నాడు. రైతు లోకం తెలంగాణలో సృష్టిస్తున్నాడు. ఒకనాడు ఎక్కడ చూసినా నెర్రెలు పారి, పడావు పడ్డ భూములు. మరి నేడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు. పండుతున్న బంగారు పంటలు. పదేళ్లలో ఎంత అధ్భుతం. ఎంత ఆశ్చర్యం. ఇలాంటి తెలంగాణ ఆవిష్కణ ఇంత తక్కువ సమయంలో జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రగతి పరుగులు ఎవరూ కలగనలేదు. కాని కేసిఆర్‌ మాత్రమే కలగన్నాడు. ఆ కలను నిజం చేసి చూపిస్తున్నాడు. అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , నేటిదాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వెలుబుచ్చిన విషయాలు. ఆయన మాటల్లోనే…
ఎన్నికల సమయంలో రైతు రుణ మాఫీ గురించి ప్రజలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిలబెట్టుకున్నారు.
తెలంగాణలో రైతు, సాగు గురించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారని మరోసారి నిరూపించారు. రైతు రుణమాఫీ మూలంగా తెలంగాణలోని సుమారు 31లక్షల మంది రైతులకు ఊరట కల్గుతుంది. అందుకోసం అవసరమైన రూ.19వేల కోట్ల రూపాయాలు సర్ధుబాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజునుంచే రుణమాఫీ అమలు చేస్తున్నారు. రైతు రుణ మాఫీ ఎప్పుడో జరిగిపోయేది. కాని మధ్యలో కరోనా కాలంలో రెండేళ్లపాటు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రైతు బంధు ఆగలేదు. ప్రాజెక్టుల పనులు నిలిచిపోలేదు. అందుకే కొంత కాలయాపన జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా, ఎవరూ ఊహించని అనేక పనులు, పధకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ తలరాతనే మర్చేశాడు. తెలంగాణను బంగారు నేలగా తీర్చిదిద్దారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వస్తుందని ఎవరూ ఊహించలేదు. దానితో ముడిపడినటువంటి అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందని అనుకోలేదు. తెలంగాణ నిండు కుండలా కరువులొచ్చినా సాగుకు కష్టం రాకుండా నీటి నిల్వలతో కళకళలాడుతుందని కలగనలేదు. చెరువు బాగు గురించి ఎవరికీ అవగాహన కూడా లేదు. కాని అవన్నీ నెరవేరాయి. తెలంగాణలోని సుమారు 46వేల చెరువులు పూర్వకళను సంతరించుకున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఎండిపోయిన చెరువులు మళ్లీ పురుడు పోసుకున్నాయి. నేనున్నానని గుర్తు చేస్తున్నాయి. చెరువే ఊరికి ఆదరువు అని పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. తెలంగాణ పల్లెలో పొలాలకు నీళ్లందిస్తున్నాయి. కుల వృత్తులకు ఆధారంగా నిలుస్తున్నాయి. చెరువులే మత్య్స సంపదకు ఆలవాలంగా మారిపోయాయి. తెలంగాణలో నీలి విప్లవానికి కూడా శ్రీకారం జరిగింది. రైతు బంధుతో రైతుకు భరోసా కలుగుతోంది. పండిన పంటలు పొలం గట్టునే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణ రైతు కాలు మీద కాలేసుకొని పాగు చేసుకునే పరిస్ధితి వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు ఎకరం భూమి వున్న రైతు జీవితానికి ఢోకా లేదు. ఐదెకరాల రైతు నేడు కోటిశ్వరుడౌతానని కలలో కూడా కలగనలేదు. అలా తెలంగాణ తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు రైతుల పక్షాన వేల వేల ధన్యవాదాలు.
నిన్నటి నా తెలంగాణ గుర్తుచేసుకుంటే కలలో గగుర్భాటు పడుతుంది.
దేశమంతా పచ్చగా తెలంగాణ మాత్రం ఎందుకు ఇలా ఎండిపోతోందని అనుకునేవాళ్లం. మధన పడేవాళ్లం. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరుకు అనంతపురం లాంటి జిల్లాలో పంటలు పండుతున్న తరుణంలో తెలంగాణలో ఎందుకు పంటలెందుకు లేదు? కనీసం తాగడానికి మంచినీళ్లు ఎందుకు లేవు? అరవై తెలంగాణ గోస పడిరది. నీటి చుక్కకు తండ్లాడిరది. గొంత తడవక తల్లడిల్లింది. సాగు లేక భూమి తల్లి విలవిలలాడిరది. రైతు బతుకు చిద్రమైంది. వానలు పడితే సాగు. అది కూడా ఆకాశం వైపు నిత్యం చూసుకుంటూ కన్నీళ్లతో సాలు తడిపిన కాలం. తొలకరిని చూసి మురిసిపోయి చేసుకునేసాగు. ఆ తర్వాత చినుకు జాడ లేకపోతే ఎండిపోతున్న సాలును కన్నీరొలికే సాగు. నీరు లేక వేసిన విత్తనం పురుగు తింటుంటే మోడు వారిని బతుకు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు కష్టం పగవాడికి కూడా రాకూడదనంత దుర్భరంగా వుండేది. ప్రజలకు తినడానికి తిండి లేక, చేయడానికి పనులు లేక, దేశాలు పట్టిపోయిన కాలం గుర్తు చేసుకుంటే తెలంగాణను సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ యుగపురుషుడుగానే చూడాలి. తెలంగాణ సాగును చూసి ఆయన పాలన స్వర్ణయుగంగా చెప్పుకోవాలి. గతంలో రాజుల కాలంలో గుప్తు కాలం స్వర్ణయుగమని చదువున్నాం. అదెలా వుంటుందో ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో చూస్తున్నాం. బంగారు తెలంగాణలో చూసి తరిస్తున్నాం. మురుస్తున్నాం. రైతు రాజుగా చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తుంటే ఇది నా తెలంగాణ అని సంబరపడుతున్నాం. నా తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను రైతులోకం కొలుస్తోంది. కేసిఆర్‌ నామస్మరణ చేస్తోంది.

అభివృద్ధి అంటే హైదరాబద్‌

https://epaper.netidhatri.com/

ప్రజలు మెచ్చిన పాలన ప్రగతి పథంలో ముందున్న పాలన కెసిఆర్‌ సుపరిపాలన

పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ!
పదేళ్ల లో తెలంగాణ అభివృద్ధి పై పారిశ్రామిక ప్రగతి గురించిఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే…

` హైదరాబాద్‌ చుట్టూ అద్భుతమైన ప్రగతి.

`తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ.

`ఐటిలో మేటి తెలంగాణ.

`తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు.

`ఫార్మాహబ్‌ గా తెలంగాణ.

`హైదరాబాద్‌ లో మరిన్ని సొగసులు.

`కొత్త కట్టడాలు.

`మహానగరంగా…విశ్వ నగరంగా

`పేరుమోసిన వ్యాపార సముదాలన్నీ హైదరాబాద్‌ లోనే.

`బిజినెస్‌ సమ్మిట్ల వేధిక.

`ప్రపంచ స్థాయి కంపెనీల మూల సంస్థలు హైదరాబాద్‌ లో..

`రజనీకాంత్‌ లాంటి వారు ఆశ్చర్యపోయామన్నారు.

`లండన్‌ లో వున్నానా అని చెప్పిన సినీ నటి లయ. Continue reading అభివృద్ధి అంటే హైదరాబద్‌

ఇంటింటా ప్రచారం నిర్వహించిన చల్లా జ్యోతి

పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సతీమణి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అధిక మెజారిటీ తో చల్లా ధర్మారెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ అభివృద్ధిపథకాలు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని వికలాంగుల పెన్షన్ గాని వింతౌత్ పెన్షన్ గాని ఆసరా పెన్షన్ గాని కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ రైతుబంధు రైతు బీమా బీసీ బందు మైనార్టీ బందు దళిత బంధు కుల సంఘాలకు కుల వృత్తులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాంటి మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ నెల 30న జరిగే ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటు చేయాలనీ పరకాల ను అభివృద్ధి చేయాలంటే ధర్మన్న నే సరైన నాయకుడని అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షులు సనత్ పటేల్, పరకాల పట్టణ మాజీ మహిళ అధ్యక్షురాలు గంట కళావతి, మహిళ నాయకురాళ్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల వేళ రైతుకన్నుల్లో ఆనందం

పొలాలల్లో వడ్ల కుప్పలు
. *ఐకెపి సెంటర్లు ప్రారంభం, మిగతావి కూడా ప్రారంభించాలి శాయంపేట నేటిధాత్రి

శాయంపేట మండలం మైలారం గ్రామంలో రైతుల ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేపడుతుంది. అదేవిధంగా వానకాలం సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంట కోతలు జరుగుతున్న ప్రాంతంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు చేయాలి.రైతులకు న్యాయం జరిగేటట్టు చూసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో చివరి వరకు రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామంలోని రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు.

గులాబీ గూటికి చేరినకాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపెళ్లి జిల్లా చిట్యాలమండలం లోని నైన్ పాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడు రామగిరి రాజు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు యధండ్ల గణేష్ యాదవ్ లను ఆహ్వానించి సోమవారం రోజున బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్,ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొడుగు విజేందర్ యూత్ అధ్యక్షులు గుండు నగేష్ గొర్రె అనిల్ యాదవ్ ఉన్నారు.

అంతర్జాతీయ బాలల దినోత్సవం

నడికూడ,నేటి ధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజున అంతర్జాతీయ బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ నవంబర్ 20 1989న బాలల హక్కులపై కన్వెన్షన్ ను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిందని ఇట్టి ప్రత్యేక రోజును అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం గా జరుపుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికను భారతదేశం డిసెంబర్ 11, 1992 నాడు అంగీకరించిందని అన్నారు.తదనుగుణంగా పిల్లల హక్కుల రక్షణకై భారతదేశం బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చట్టం(సిపిసిర్) జనవరి 20,2006 నాడు అమల్లోకి తెచ్చిందని, బాలలందరూ వారి యొక్క హక్కులు సంపూర్ణంగా పొందేలా కృషి చేస్తామని, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ చేయాలని, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచన చేసిందని అన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు, బాలల హక్కుల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్యా, విద్యా వాలంటీర్లు బాబురావు పర్శవేని జ్యోతి, ఐఆర్పి రమేష్ ఆయాలు అరుణ,సుశీల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులే ఎమ్మెల్యే చల్లా

న డి కూడ, నేటి ధాత్రి:
కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.నడికూడ మండలంలోని కంటాత్మకూరు, రామకృష్ణాపురం గ్రామంలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు.అనంతరం
ఎమ్మెల్యే మాట్లాడుతూ అరవై ఎండ్లు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే పేదల బాధలను, పేదల కడుపును నింపాలని, రైతులకు పొలాలకు నీరివ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ రాలేదన్నారు,తెలంగాణను నాశనం చేశారన్నారు,మళ్లీ ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ అధికారం కోసం మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు.ఈ ఎన్నికల తర్వాత
కాంగ్రెస్,బిజెపి పార్టీలు తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతాయన్నారు.
నేడు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తేనే సాధ్యమవుతుందన్నారు.ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచన చేయాలి గత పది ఎండ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గమనించాలి.పనిచేసే వారికి పట్టం కట్టాలని కోరారు.పరకాల నియోజకవర్గంలో సిఎం కేసీఆర్ సహకారంతో కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటుచేసుకున్నాం అందులో నిర్మానవుతున్న కంపెనీలలో నియోజకవర్గంలోని యువతకు,మహిళలకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మొదటి బాలెట్ లో మూడో నంబర్ పైన ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్థులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

చీకట్లో ఓట్ల కొరకు కాంగ్రెస్ ప్రమాణం.

పనిచేస్తే ఓటు వేస్తారు,ఓట్ల ప్రమాణం చేపించుకోవడం ఏమిటి

ప్రచారాల పేరుతో ప్రమాణాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా.!?

అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, నేటి ధాత్రి గత నెల నుండి ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంది.

ప్రధాన పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ లపై ఓటర్లకు నమ్మకం లేదు అనడానికి ప్రమాణాలు సాక్ష్యం.!?

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

మంథని నియోజకవర్గ ప్రజలకు మరియు ఓటర్లకు నేటి ధాత్రి గత 20 రోజుల నుండి ఎన్నికల నగర మోగిన అనంతరం ఓటర్లలో చైతన్యం కొరకు నిష్పక్షంగా ఓటును వినియోగించుకోవాలని గారడీలకు ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని నేటి ధాత్రి వరుస ప్రజల్లో చైతన్యం కొరకు కథనాలను అందిస్తూ ఓటర్లకు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల వ్యవహారాలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. చివరికి నేటి ధాత్రి అక్షరాలు వాస్తవాలుగా తిరపతి కి రావడం జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి మంథని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పక్షాన ఓట్లు వేయాలని ప్రమాణాలు చేపిస్తున్న వీడియో తెరపైకి రావడం జరిగింది. నియోజకవర్గ ఓటర్లు మరియు ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనించాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీ అభ్యర్థులు పార్టీకు సంబంధించిన వ్యక్తులు ప్రజల వద్దకు వెళ్లి తమ పక్షాన ఓట్లు వేయాలని ఊరుకోవడమే తప్ప ప్రమాణాలు ప్రతిజ్ఞలు చేయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కానీ ప్రజలపై ఆ పార్టీకి నమ్మకం లేకపోవడంతో దేవుళ్ళ పేరు మీద ప్రమాణం చేయించి అభ్యర్థి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి ఎన్నికల కమిషనర్ కు సవాల్ విసిరేటట్టుగా కనబడుతుంది.

చీకట్లో ఓట్ల కొరకు కాంగ్రెస్ ప్రమాణం.

నేటి ధాత్రి చెప్పినట్లే ఒక్కొక్కటి సాక్షాలుగా తెరపైకి రావడం అర్ధరాత్రి పెద్ద మొత్తంలో మహిళను గుమ్మి గూడించుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎం ఎల్ ఏ అభ్యర్థి గెలుపు కొరకు మీరు ఓట్లు వేయాలని మహిళలతో వారి ఆధ్యాత్మిక దేవుళ్ల పై ప్రమాణం చేయించి జై కాంగ్రెస్ అన్న నినాదాల వీడియో ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. మంథని నియోజకవర్గం అసెంబ్లీ పరిధిలోని మహదేపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో శనివారం అర్ధరాత్రి మహదేవ్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు సుమారు వందకు పైబడి మహిళలను ఒక్కచోటకు చేర్చి ఎంపీపీ మహదేవ్పూర్ మేము పెద్దంపేట గ్రామ మహిళలము మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఎంఎల్ఏ అభ్యర్థి శ్రీధర్ బాబుకు కు తమ ఓటు వేస్తామని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము అని ప్రమాణం మరియు ప్రతిజ్ఞ మహిళలతో చెప్పించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాణం చేసిన వీడియో నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఒక మండల పరిషత్ అధ్యక్షురాలు మండలంలో ప్రజలకు తమ పార్టీకి మీ ఓట్లు అందించి సహకరించండి అని ప్రచారం చేయాల్సిన ఎంపీపీ దేవుని పేరుతో తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని మహిళలతో ప్రమాణాలు చేయించిన వ్యవహారాన్ని నియోజకవర్గ ఓటర్లు ప్రజలు తప్పుబడుతున్నారు.

పనిచేస్తే ఓటు వేస్తారు,ఓట్ల ప్రమాణం చేపించుకోవడం ఏమిటి.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంథని నియోజక వర్గం ఎన్నికలవేళ ప్రమాణాలతో ఓట్లు అడగడం అనే ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకువచ్చిందేమో ఇది ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం కాదా అని చర్చించుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని ప్రజల్లో తీసుకువెళ్లి నిర్భయంగా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్దంపేట గ్రామంలో చేసిన పనిని చూపించి తమకు ఓట్లు వేసి విజయాన్ని అందించాలని చెప్పవలసిన ఎంపీపీ దేవునిపై ప్రమాణం చేయించి మనస్ఫూర్తి ఆత్మసాక్షిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రమాణం చేయించడం ఏమిటి, ఈ వ్యవహారాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గంలో ప్రజలకు గ్రామాలకు ఏమైనా పనులు చేసిందా లేక ప్రమాణాలకు పరిమితమై ఓట్లు వేయించుకునే క్రమంలో ఉందా అన్నట్లుగా ఉంది ఈ ప్రమాణాల వ్యవహారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని చూసి నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేస్తారు, కానీ ప్రజా ప్రతినిధులు వెళ్లి అమాయక మహిళలను పెద్ద మొత్తంలో ఒకచోటు చేర్చి కాంగ్రెస్ పార్టీకి మీ దేవుని పేరు మీద ఒట్టేసి ఓటు వేస్తామని ప్రమాణం చేయించుకుంటే అమాయక మహిళలు దేవుడు మీద ప్రమాణం చేసి ఉన్నాము కదా లేకుంటే తమకు భవిష్యత్తులో ఏమవుతుందో నని భయభ్రాంతులకు గురై కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓట్లు వస్తాయని ఆలోచనతోనే ప్రమాణాలు చేయించు కుంటున్నారేమో అని చెప్పడంలో సందేహం కాదు సాక్ష్యమే నియోజకవర్గ ప్రజల ముందు ఉంది.

ప్రచారాల పేరుతో ప్రమాణాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా.!?

ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు సుమారు 28 రోజులు అభ్యర్థులకు నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి వారు గతంలో నియోజకవర్గంలో ఎంఎల్ఏ లుగా కొనసాగితే మీరు ప్రజలకు చేసిన సేవలను వారి దృష్టిలో పెట్టి తిరిగి గతం కంటే రాబోయే రోజుల్లో మంచి పని చేస్తామని, అలాగే ఇతర పార్టీ మరియు స్వతంత్ర అభ్యర్థులు భవిష్యత్తులో ప్రజలకు ఒక సిపాయిలాగా బడుగు బలహీన కుల మత భేదం లేకుండా పట్టణాలు గ్రామాల్లో అభివృద్ధి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల వద్దకు అందేలా ప్రజల్లో ఒక వ్యక్తిగా ప్రజలకు సహాయ సౌకర్యాలు అందించేలా చేస్తాము తమకు మీ ఓటుతో ఆశీర్వదించండి అని ప్రజల్లో అభ్యర్థులు భవిష్యత్తు తో పాటు గతంలో చేసిన పనులను వివరిస్తూ తమకు ఓటు వేయాలని కోరడం కొరకు ఎన్నికల సంఘం ప్రచారాల కొరకు సమయాన్ని ఇచ్చింది. కానీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మాత్రం ప్రచారాల సమయంలో ప్రమాణాలు చేయిస్తూ అమాయక మహిళలను ఆధ్యాత్మిక దేవుళ్ల పై ప్రమాణం చేపించి గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభాలకు గురి చేస్తూ ప్రచారం పేరుతో ప్రమాణాలు కొనసాగించడం కచ్చితంగా తమకే ఓట్లు వేయడానికి దేవుళ్లపై ప్రమాణాలు చేయించుకోవడం ఒకవైపు ఆశ్చర్యానికి గురి చేస్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎప్పుడు వచ్చి తమతో ప్రమాణం చేపించుకుంటారేమో నియోజకవర్గ ఓటర్లు కాస్త భయందోళన కు గురయ్యే పరిస్థితి ఈ దారితీస్తుంది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల వ్యవహారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల నిబంధనలను ప్రచారంలో ప్రమాణాలు చేయించుకోవడం నిబంధనలో వస్తుందా లేక నిబంధనలకు విరుద్ధఎం అనేది ఎన్నికల అధికారులే నిర్ణయించాలి.

అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, నేటి ధాత్రి గత నెల నుండి ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంది.

నియోజకవర్గ ప్రజలకు నేటి ధాత్రి గత 25 రోజుల నుండి రాజ్యాంగం అందించిన అమూల్యమైన ఓటును ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నిర్భయంగా నియోజకవర్గ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు చైతన్యవంతం చేస్తూ రాజకీయ పార్టీల వ్యవహారాలను నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతూ ప్రజలకు మరియు ఓటర్లకు వాస్తవాలతో చైతన్యం తీసుకువచ్చే విధంగా కథనాలు అందిస్తున్న నేటి ధాత్రి నేడు ప్రధాన పార్టీల వ్యవహారం కూడా ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుంది. చివరికి నీటి ధాత్రి చెప్పిందే వాస్తవాలు తెర పైకి రావడం జరుగుతుంది. ప్రధాన పార్టీల మాయలో పడద్దని అమాయక ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తుందని గత 20 రోజుల నుండి నేటి ధాత్రి, చెప్పుకుంటూనే వస్తుంది, చివరికి అదే సాక్ష్యంగా అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి చీకట్లో మహిళలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని దేవుడు మీద ప్రమాణం చేయించిన వ్యవహారం నియోజకవర్గ ఓటర్ల ముందు ఉంది. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలు ఓటర్లు తమ ఓటు వినియోగించుకునే విషయంలో ఒక నిష్పక్షంగా మీ సమస్యలను పరిష్కరించే వ్యక్తిని మీ ఓటు హక్కుతో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రమాణాలు చేయించుకునేవారు రేపు భవిష్యత్తులో మీకు ఆధ్యాత్మికంగా మీ దేవుళ్లను సాక్షిగా పెట్టి పని అడుగుతే ఒట్టు వేసుకునే పరిస్థితి వరకు దారితీస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీ ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రధాన పార్టీ కాంగ్రెస్,టిఆర్ఎస్ లపై ఓటర్లకు నమ్మకం లేదు అనడానికి ప్రమాణాలు సాక్ష్యం.

ప్రస్తుతం మంథని నియోజకవర్గం లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి లపై ప్రజలకు నమ్మకం లేదు అనడానికి పెద్దంపేట గ్రామంలో ప్రమాణం చేయించడమే సాక్ష్యం. నియోజకవర్గాన్ని కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీలు పరిపాలించినప్పటికీ నేడు ప్రజల్లో ఏ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు అనేది కేవలం ఎన్నికలు తొమ్మిది రోజులు ఉన్నప్పటికీ స్పష్టత లేకపోవడం తో పాటు పార్టీలో ప్రజా ప్రతినిధులుగా కొనసాగే వ్యక్తులు గ్రామాల్లో వెళ్లి అర్ధరాత్రి వేళ దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ఆత్మ సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రమాణాలు చేసుకునే పరిస్థితికి రావడం జరిగిందంటే ప్రధాన పార్టీల వ్యవహారం అభ్యర్థులపై నియోజకవర్గ ఓటర్లలో నమ్మకం లేదన్నడానికి దీనికంటే బలమైన సాక్ష్యం అవసరం లేదు. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు పాలించినప్పటికీ కూడా గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గంలోని ప్రజలకు సేవలు అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్న పార్టీ అభ్యర్థులు మరి వారు చేసిన పనికి నియోజకవర్గ ప్రజలు ఓటు వేయక తప్పదు కానీ దేవునిపై ఒట్టేసి తమ పార్టీకి ఓటు వేయాలని ప్రమాణం ఎందుకు చేయించు కుంటున్నారు. ప్రజలకు పార్టీలపై నమ్మకం లేదా లేక పార్టీలకు ప్రజలపై నమ్మకం లేదా అనేది ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్న వ్యవహారం కానీ వాస్తవం ఏమిటంటే ప్రధాన పార్టీకు నియోజకవర్గ ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి తమ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కొరకు మహిళలతో దేవుని పేరుపై ప్రమాణం చేసుకొని ఓటు వేయించుకునే ప్రయత్నం అన్నది వాస్తవం.

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి.ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండల కేంద్రానికి పల్లె మల్లేష్(40) అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, సర్పంచ్ బచ్చిరెడ్డి, ఎక్స్ ఎంపీపీ నర్సింలు, కో ఆప్షన్ ఆల్తాఫ్ బేగ్, బిఆర్ఎస్ పార్టీ ఉపద్యక్షులు రాచమల్ల యాదగిరి, మాజీ ఏఎంసి డైరెక్టర్ దేవేందర్, భీమగండ్ల నర్సింలు, అల్లే శ్రీనివాస్, పాల్కొండ నవీన్, అంజనేయులు బిఆర్ఎస్ నాయకులు, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటా ప్రచారంలో దేవి రవిందర్

నేటి దాత్రి న్యూస్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని కుకునూర్ పల్లి మండలం తిప్పారం ఇంటింటా ప్రచారం లో ఎంపీటీసీల పోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవిందర్ మాట్లాడుతూ కేసీఆర్ ను మూడో సారి గెలిపించాలి అన్నాడు కేసీఆర్
ప్రబుత్వం ప్రజల ప్రబుత్వం,
రైతు బీమా, రైతు బందు ఒక ఏకరానికి 10000 లు రూపాయలు ఇస్తుంది ఈసారి గేలిస్తే 16000 ఇస్తుంది

పించాన్ 2000 నుండి 5000 ఇస్తుంది కళ్యాణ లక్ష్మి 24 గంటల కరెంట్, కేసీఆర్ క్విట్ ,

ప్రవేట్ హాస్పటల్ కు దీటుగా ప్రబుత్వ హాస్పటల్ నిర్వహించారు మిషన్ బగిరథ
మిషన్ కాకతీయ , వడ్ల కొనుగోలు ప్రబుత్వ సంక్షేమ పథకాల గురించి చేపుతూ, కేసీఆర్ ను గెలిపించాలి, కాంగ్రెస్ ,కాని బిజెపి ,కాని ఇతర పార్టీలు గెలిస్తే బిల్డింగ్ కు సున్నం ఎపించార్ అన్నారు, గాడిదలకు గడ్డి వేస్తే పాలు రావు అబివృది చూసి కేసీఆర్ ను గెలిపించాలి,
ఆకుల బద్రఅన్న మాట్లాడుతూ
తిప్పరం లో పెంకుటిఇల్లు ఎక్కువ ఉన్నాయి కేసీఆర్ గెలిపించి ఊరు అబివృది చేసుకుందాం అన్నారు,

ఈ కార్యక్రమంలో తిప్పారం సర్పంచ్ కర్రె లక్ష్మి రాజయ్య

మంగోల్ సర్పంచ్ కిరణ్, మత్పల్లి సర్పంచ్ మహీపాల్
తిప్పరం గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ
ఆద్యక్షులు కోరే చరణ్ సినియర్ బి ఆర్ ఎస్ ఆద్యక్షుడు ఇరుసల కారుణకర్
కోరే ఈశ్వరాయ్య కిష్ట రెడ్డి నాగయ్య డబ్బేట స్వామి బోగీ కారుణకర్, డాక్టర్ మహేందర్ డాక్టర్ పాష కనకయ్య ఎల్లమ్ లింగం ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ అంటే కరువు, కష్టం, చీకటి!?

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదు…నిండా ముంచిన పార్టీ.

`తెలంగాణ ను అరిగోస పెట్టిన పార్టీ.

`తెలంగాణను ఆగం చేసిన పార్టీ.

`తెలంగాణ ను ఎడారి చేసిందే కాంగ్రెస్‌.

`పెనం మీద నుంచి పొయ్యిలో వేసిందే కాంగ్రెస్‌.

`భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో కలిపిందే కాంగ్రెస్‌.

కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది. కొన్ని తరాలు కష్టాలు అనుభించింది. అరవై ఏళ్లు తెలంగాణ చీకట్లలో మగ్గాల్సివచ్చింది. నమ్మితే మళ్ళీ పాత రోజులే అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు.. ఆయన మాటల్లోనే

`ఇప్పుడు ఇచ్చామంటూ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నది.

`పచ్చి తెలంగాణ వ్యతిరేకి రేవంత్‌.

`తెలంగాణ ఉద్యమకారులను గన్‌ తో బెదిరించిందే రేవంత్‌.

`తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిందే రేవంత్‌.

`తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసిందే రేవంత్‌.

`రేవంత్‌ ను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు.

`తెలంగాణ లో కాంగ్రెస్‌ కు చోటు లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, ఆకలిబాధలు, కరువులు, చీకట్లు…కాంగ్రెస్‌ పాలనలో ఇవన్నీ చూసింది తెలంగాణ సమాజం. అన్ని బాధలు అనుభవించింది తెలంగాణ. కాంగ్రెస్‌ పెట్టింది ఒక్క బాధైతే చెప్పుకోవచ్చు. కాని ప్రతి క్షణం బాధలే..ప్రతి రోజు గోసలే… దాని పాలనంతా కష్టాలే..ప్రజలకు నష్టాలే..మిగిలినవి చేదు జ్ఞాపకాలే..ఆకలి కేకలే…ఇక రేవంత్‌న నమ్మితే తెలంగాణకు మరోసారి మోసమే…మళ్లీ ఆగమే…ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆగం చేయాలని చూసిన దుర్మార్గుడు. తెలంగాణను మళ్లీ పొయ్యిలో తోసేయాలని చూసిన ద్రోహి. ఇప్పటికే ఉమ్మడి పాలనే బాగుందంటున్న ద్రోహిని తెలంగాణ ప్రజలు అసలే క్షమించరు. వందల మంది యువత ప్రాణాలు త్యాగాలు చేసి, తెలంగాణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల త్యాగాలను అవమానించిన రేవంత్‌కు మన గడ్డమీద వుండే అర్హత లేదు. తెలంగాణలో రాజకీయాలు చేసే నైతికత లేదు. తెలంగాణలో ఓట్లడిగి రాజకీయం చేసే హక్కేలేదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సమజానికి ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం వుంది. ఆత్మాభిమానం వుంది. సీమాంధ్రకు, తెలంగాణకు కొన్ని వైరుధ్యాలున్నాయి. ఆచార వ్యవహారాలలో తేడాలున్నాయి. బాషలో, యాసలు ప్రత్యేకంగా వున్నాయి. పండుగలు ప్రత్యేకతను సంతరించుకొని వున్నాయి. తెలంగాణ బతుకమ్మ స్వరూపం. తెలంగాణ బతుకమ్మ జీవన విధానం. తెలంగాణ పండగల బతుకమ్మ మన జీవనశైలికి నిదర్శనం. కాని ఆంధ్రుకు బతుకమ్మ లేదు. తెలంగాణ బతుకమ్మను అవరవై ఏళ్లలో సీమాంధ్రులు గౌరవించింది లేదు. పూజించింది లేదు. పూలను కొలిచిందిలేదు. పూలతో ప్రకృతికి దగ్గరైంది లేదు. తెలంగాణకు పూలంటే దైవం. తెలంగాణకు పూలంటే ఒక జీవితం. సమాజాన్ని కాపాడే కల్పతరువుకు సంకేతం. తెలంగాణ బాషలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఏ సమాజానికి సంస్కృతే ఆ వ్యవస్ధకు గొప్పది. అలాంటి వ్యవస్ధను ఆ సమాజంలో నివసించే రేవంత్‌ లాంటి వ్యక్తి నాశనం చేయాలని చూస్తే, ఆ ప్రజానికాన్ని మోసం చేయాలని చూస్తే తెలంగాణ గాలి కూడా క్షమించదు. అలాగే తెలంగాణ రేవంత్‌ చేసే రాజకీయాన్ని ఆహ్వానించదు. రేవంత్‌ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహిని ముందు పెట్టుకొని రాజకీయం చేస్తామంటూ కాంగ్రెస్‌పార్టీని ప్రజలు అసలే క్షమించరు. తెలంగాణ పిసిసి. అధ్యక్షుడయ్యాక ఇప్పటికే తెలంగాణలో అనేక చిచ్చులు పెట్టే ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేశాడు. రైతులకు మూడు గంటల కరంటు చాలంటూ మొదలుపెట్టి, ఉమ్మడి పాలనే బాగుందనేదాకా అనేక నీతిమాలిన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ఆలయ భూములు అమ్మి, మైనార్టీ డిక్లరేషన్‌ అమలు చేస్తానని చెప్పి, సమజాంలో చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్‌ అంటే హైదరాబాద్‌లో కర్ఫ్యూ. హైదరాబాద్‌లో హిందువులు, ముస్లింలు కలిసి వుంటే కాంగ్రెస్‌ రాజకీయం చెల్లదు. అలా కలిసి వుండడం కాంగ్రెస్‌ నచ్చదు. కొన్ని వందల సంవత్సరాలుగా కలిసి బుతుకుతున్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత గడచిన తొమ్మిదేళ్ల కాలంలో మళ్లీ మంచి రోజులను చూస్తున్నాం. తెలంగాణలో హిందూ ముస్లింల సఖ్యతను మళ్లీ కల్లారా చూస్తున్నాం. అలాంటి ప్రశాంతమైన వాతావారణాన్ని చెడగొట్టాలని చూసే రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తిని తెలంగాణ సమాజం తరిమేయాలి. అతన్ని నమ్మిన పార్టీని హుస్సేన్‌సాగర్‌లో ముంచేయాలి. అప్పుడుగాని తెలంగాణకు పట్టిన శనిపోదంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్‌ను కడిగిపారేశారు. కాంగ్రెస్‌ అసలు స్వరూపం వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఈ తరానికి కాంగ్రెస్‌ అంటే ఏమిటి?
ఆ పార్టీ ఎంత దుర్మార్గమైంది. రేవంత్‌ రెడ్డి లాంటి నాయకుడు తెలంగాణకు ఎంతో మోసకారి అన్నది తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం వుంది. తెలంగాణ ఒకనాడు కోటి తరనాల వీణ. అలాంటి తెలంగాణను చెరపట్టినంత పనిచేసి, ఆంధ్రలో విలీనం చేసిన పార్టీయే కాంగ్రెస్‌పార్టీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వత విముక్తికోసం తెలంగాణ సమాజం కోరుకుంటుంటే, దేశంలో విలీనం చేసినట్లే చేసి, ఆంధ్రాలో కలిపేసింది. నిజాం రాజ్యంలో పెనం మీద వున్న తెలంగాణ సమాజాన్ని ఆంధ్రతో కలిపి పొయ్యిలో వేసింది. తెలంగాణను ఆగం చేసింది. పైగా గడుసు పెల్లోడు లాంటి ఆంధ్రా చేతిలో,అమాయక అమ్మాయి తెలంగాణను పెడుతున్నాము. అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన నెహ్రో చేసిన తొలి మోసం తెలంగాణకు శాపంగా మారింది. ఆనాటి నుంచి తెలంగాణ సమాజం అరిగోసడిరది. హైదరాబాద్‌ రాష్ట్రంగా వెలుగొందాల్సిన ప్రాంతాన్ని చీల్చి, సాంస్కృతిక విద్వంసం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ. ఆంధ్రాతో ఎప్పుడూ తెలంగాణకు జీవన వైవిద్యమే..ఇప్పటికీ మహారాష్ట్రలోని మన పూర్వ ప్రాంతాలు, కర్నాకటలోని కొన్ని జిల్లాలలో తెలంగాణ సంస్కృతి కాపాడబడుతోంది. అక్కడి సమాజం ఇంకా తెలంగాణ యాసను, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. కాని అరవైఏళ్లపాటు తెలంగాణతో కలిసిసాగి, తెలంగాణను విధ్వసం చేశారు. అందుకు ముఖ్య కారణం కాంగ్రెస్‌పార్టీ. ఇప్పుడు తగుదునమ్మా అని తెలంగాణ ఇచ్చింది మేమే..అని కొందరు..తెచ్చింది మేమే…అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడడం లేదు. తెలంగాణ ద్రోహిని పార్టీ అధ్యక్షుడిని చేసుకొని, ఒకనాడు సోనియాగాంధీని అనరాని మాటలు అన్న రేవంత్‌ను నెత్తినపెట్టుకున్న కాంగ్రెస్‌ను ప్రజలు చీ కొడుతున్నారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల కుట్రలో తెలంగాణను బలి చేసిందే కాంగ్రెస్‌పార్టీ. ఆంద్ర ప్రాంత నాయకులు తెలంగాణను దోచుకుంటుంటే సహకరించిందే కాంగ్రెస్‌ పార్టీ. కేవలం పదవుల కోసం చేతగాని దద్దమ్మల్లాగా చేతులు కట్టుకొని, పదవుల ఎర కోసం ఎదురుచూసిన తెలంగాణ నాయకులను లెక్కలోకి తీసుకోకుండా, సీమాంధ్రకు దోచిపెట్టినపార్టీయే కాంగ్రెస్‌. ఒకనాడు గొలుసు కట్టు చెరువులతో దేశంలోనే గొప్పగా సాగు సంపదను కలిగి వున్న ప్రాంతం తెలంగాణ. ప్రపంచంలోనే నైజాం ధనవంతుడుగా మారడానికి కూడా తెలంగాణసాగుసంపదే. అలాంటి తెలంగాణను , ఆంధ్రాలో విలీనం చేయడంతో తెలంగాణ సాగు ఆగమైంది. చెరువులు చెల్లాచెదురయ్యాయి. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం తెలంగాణ సాగు చిన్నాభిన్నమైంది. నీటి వసతులు కరువై, తెలంగాణ ఎడారిగా మారింది. దీనంతటికీ కారణం కాంగ్రెస్‌ పార్టీ. ఒక ప్రాంతాన్ని గొప్పగా, మరో ప్రాంతంపై సీత కన్నేసి చెరబట్టినంత పనిచేసింది కాంగ్రెస్‌పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల విలీనానికి ముందు, మూడుకోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో వున్న తెలంగాణ, రెండు కోట్ల లోటుతో ఏర్పాటైన ఆంధ్రలో కలిపారు. తెలంగాణకు ఆకలి కేకలు చూపించారు.
ఇప్పుడు తెలంగాణ పచ్చి వ్యతిరేకి రేవంత్‌రెడ్డిని ముందు పెట్టుకొని మళ్లీ శిఖండి రాజకీయం చేస్తోంది కాంగ్రెస్‌పార్టీ.
కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ల తెలివి తెల్లారినట్లే వుందని తిట్టుకుంటున్నారు. 24గంటల ఉచిత కరంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి, కర్నాటక కాంగ్రెస్‌ నేతలు ఐదుగంటల కరంటు ఇస్తామంటుంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెల్లమొహం వేయాల్సివస్తోంది. అంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నది నిజమే అని నమ్మాల్సి వస్తోంది. తాజాగా నిజామాబాద్‌ లో ప్రచారం చేసిన షబ్బీర్‌ అలీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అంటే ఒక బల్బు, ఒక ప్యాన్‌, ఒక టివి. వుంటేనే ఇస్తామని, అంతకంటే ఎక్కువ వుంటే ఇవ్వమని తేల్చేశారు. ఎన్నికలు కాకముందే ఇన్ని అబద్దాలు ఆడుతున్న కాంగ్రెస్‌ను నమ్మితే నట్టెట ముంచడం ఖాయం. అయినా జాతీయ పార్టీలకు దేశమంతా ఒకే విధానం వుండాలి. కాని పూటకో వేషం వేసినట్లు, రాష్ట్రానికో విధానం అంటేనే కాంగ్రెస్‌ డొల్లతనం ఏమిటో అర్ధమౌతోంది.

కారె రావాలి కేసీఆరే సీఎం కావాలి.

ఎమ్మెల్యే అభ్యర్థి ఆలా వెంకటేశ్వర్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం గా కావాలని బీఆర్‌ఎస్‌ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
మదనాపురం మండలం అజ్జకొలు గ్రామంలో సోమవారం కారుగుర్తు అభ్యర్థి ఆల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి ఆల మాట్లాడుతూ


అజ్జకొలు గ్రామంలో 35 కోట్లతో 58 లక్షల నిదులతో గ్రామంలో అభివృద్ధి సంక్షేమం జరిగింది
గ్రామంలో మన ఊరు మన బడి పాఠశాల మరియు సిసి రోడ్లు,డ్రైనేజీలు నిర్మించినం
మళ్లీ కేసీఆరే సీఎంగా కావాలి
అప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయి
దేవరకద్ర గులాబీ జెండా ఎగురవేయాలి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో, దేవరకద్ర నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చేశామన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పనులు చేసినట్లు చెప్పారు.
ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
ప్రజలు ఓటుతో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
దేవరకద్ర మరోమారు గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు.
తెలంగాణకు సీఎం కేసీఆర్‌ శ్రీరామరక్ష అన్నారు.
ప్రచారంలో భాగంగా మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే అభ్యర్థి ఆల ప్రతి ఒక్కరిని కలిసి ఆప్యాయంగా పలకరించారు. వివిధ గ్రామాల ప్రజలను
కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గట్టు తిమ్మప్ప , కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ,జడ్పిటిసి కృష్ణయ్య , బాలమనెమ్మ ,పాల్గొన్నారు.

దాసరి ఉష త్వరగా కోలుకోవాలని శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:

పెద్దపల్లి నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష ఆరోగ్యం క్షీణించి అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్యం మెరుగుపడి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు అఖండమైన భారీ మెజార్టీతో పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపొంది తెలంగాణ చట్టసభల్లో శాసన సభ్యురాలుగా అడుగు పెట్టాలని ఓదెల గ్రామంలోని పార్వతీ శంభు లింగేశ్వర ఆలయం లో అభిషేకం జరిపించారు.ఈ కార్యక్రమంలో ఓదెల మండల ఉపాధ్యక్షులు బోయ సదానందం ,మండల మహిళా కన్వీనర్ మేకల శోభ ,ఓదెల సెక్టార్ అధ్యక్షుడు బీరం రవి,6 వార్డ్ మెంబర్ రాచర్ల నిర్మల రాజేశం,మాజీ వార్డ్ మెంబర్ బుద్దే మహేష్,ముదిరాజ్ సంఘం డైరెక్టర్స్ తూడి రాజయ్య,తూడి ప్రవీణ్ , పెండం ఓదెలు,పసెట్ల స్వామి,ఓదెల విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ,మరియు పార్టీ కార్యకర్తలు తూడి సంధ్య,ఓల్లాల రజిని,నూతి రమాదేవి,పందెన దీపిక,కొండ్ర చర్మిల,చిలుముల శ్రీలత,గడ్డం సునీత, నూతి రాజేందర్,ఎంబడి రాజు,గాండ్ల శరత్, వంశీ,గడిగొప్పుల నవీన్,రామినేని కోటి, రామినేని స్వామి,అప్పని మధు,కొండ్ర సాగర్,కొండ్ర వెంకటేష్,రేగుల తిరుపతి,రేగుల రాజేందర్,కొండ్ర సంతోష్ తుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించాలి.

డీసీఈ బిఅసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మోడల్ స్కూల్లో సోమవారం రోజున 10వ తరగతి ప్రత్యేక తరగతులను సందర్శించిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అసిస్టెంట్ కార్యదర్శి శనిగరపు భద్రయ్య,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులను కోరారు,
అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశముల మేరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ కొనసాగించాలిఅని. పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సూచనలు చేస్తూ ఉపాధ్యాయులు ఎస్ ఏ -1పరీక్ష ఫలితాలలో వచ్చిన విద్యార్థి స్థాయిని బట్టి ఏబిసి గ్రూపులుగా విభజించి సీ గ్రూపు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని. ఉపాధ్యాయులు వారిని అడాప్ట్ చేసుకోవాలిఅని వెనుకబడిన విద్యార్థులపై ప్రారంభము నుండే ప్రత్యేక శ్రద్ధ చూపాలిఅని . విద్యార్థుల ఇండ్ల ను సందర్శించి 100% హాజరు కొరకు కృషి చేయాలి. ఎవరైనా ఉపాధ్యాయులు రానిచో ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. డిసెంబర్ 2023 వరకు సెలబస్ పూర్తి చేయాలి. రివిజన్ చేయడానికి ప్రత్యేక తరగతుల కాల నిర్ణయ పట్టికను తప్పక అమలు చేయాలి .ప్రత్యేక తరగతుల నిర్వహణ సజావుగా జరిగేటట్లు ప్రధానో పాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోని పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి తగిన కృషి చేయాలి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక నిర్వహణకు తప్పనిసరిగా హాజరు కావలెను ప్రత్యేక తరగతుల నిర్వహణ కొరకు ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించాలి పర్యవేక్షణ అధికారులు సందర్శించినప్పుడు అట్టి రిజిస్టర్లను చూపించాలని ఉపాధ్యాయులను కోరినారు.

మండల కేంద్రంలో కారు జోరు పెద్ద ఎత్తున ప్రచారంలో పెద్దూరి తిరుపతి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఉపసర్పంచ్ పెద్దూరీ తిరుపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వాడవాడల తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ అభివృద్ధిపథకాలు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని వికలాంగుల పెన్షన్ గాని వింతౌత్ పెన్షన్ గాని ఆసరా పెన్షన్ గాని కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ రైతుబంధు రైతు బీమా బీసీ బందు మైనార్టీ బందు దళిత బంధు కుల సంఘాలకు కుల వృత్తులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాంటిది పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కనీసం మూడు నుంచి ఐదు గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నందున ఇచ్చిన హామీలన్నీ మరిచిందని అలాంటి మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అలాగే మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రియతమ మంత్రి కేటీ రామారావుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని వాడ వాడలా గడపగడప ప్రచారం చేయడం జరిగిందని తెలియజేశారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏం సి డైరెక్టర్లు మైనార్టీ మహిళ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు ఎస్సీ సెల్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఇట్టి ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కాంగ్రెస్,బిజెపి పార్టీల నుండి బి.ఆర్ ఎస్.లో చేరిన నాయకులు

పరకాల నేటిధాత్రి
పరకాలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుటకు మరొకసారి అవకాశం ఇవ్వాలని బి.ఆర్.ఎస్.అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.సోమవారం ఉదయం పరకాల పట్టణం 10,11 వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్,బిజెపి పార్టీల నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.చేరికయిన వారిలో బుస్స మొగిలి,గూడెల్లి దశరతం,పసుల రాజ భద్రయ్య,మంద రవిలు మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి,సంక్షేమ పథకాలు నచ్చి బారస పార్టీలోకి చేరిక కావడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు రేవూరి విజయపాల్ రెడ్డి,దుప్పటి సాంబశివుడు,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

నేరెళ్ల గ్రామంలో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘడ గడప ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో వాడవల తిరుగుతూ కారు గుర్తుకే ఓటేయలని బి ఆర్ ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆడవాళ్ళ గడపగడపప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చావుతో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన బి ఆర్ ఎస్ పార్టీ అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్.మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాల తీసుకువచ్చి దేశంలోమన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని అలాగే రాబోయే ఎన్నికల్లో మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీ రామారావుని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని మళ్లీ మన నియోజకవర్గ అభివృద్ధి ఇంకా ఎంతో చేసుకోవాలని అందుకుగాను మన ప్రజలందరం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో గడపగడప తిరుగుతూ ప్రచారం చేశారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస రాజు స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులుపార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు పార్టీ సీనియర్ కార్యకర్తలు తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

విజయం దిశగా ఎన్నికల ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడప ప్రచారం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే మళ్లీ మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవడం ఖాయమని తెలియజేస్తూ మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు మన నియోజకవర్గ చరిత్రలో ఎవరు చేయని అభివృద్ధి చేసి చూపించారని మనకు ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి పరిచారని అలాంటి మన ప్రియతమ మంత్రి కేటీ రామారావును వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్లీ మన నియోజకవర్గాన్ని అందులో మన తంగళ్ళపల్లి మండలాన్ని ముందు ముందు ఎంతో అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని వాడవాడలా ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస రాజు పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి స్థానిక సర్పంచ్ అనిత రవీందర్ ఎంపిటిసి కోడి అంతయ్య స్థానిక ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి వార్డు మెంబర్లు కార్యo జగత్ రెడ్డి పరశురాములు మహిళ పార్టీ నాయకులు మైనార్టీ మహిళా నాయకులు ఎస్సీ సెల్ నాయకులుపార్టీ సీనియర్నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇంటింటిప్రచారంలో దూసుకుపోతున్న బిఆర్ఎస్.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి . గండ్ర వెంకట రమణా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని చింతకుంట రామయ్య పల్లె గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రజలను కోరి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయండి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దు సమేతనే ఉండే(నమ్మి నాన పోస్తే నాట పుచ్చి బుర్రలు ఐనాయట) కావున ప్రజలు అభివృద్ధి ప్రదాత ను ఆదరించాలి అని జెడ్పీటీసీ గొర్రె సాగర్ ఇంటింటికీ తిరిగి ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ మ్యానిఫెస్టోను అందరికీ వివరించారు,బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే.400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందజేయడం జరుగుతుంది.ఆసరా పింఛన్ 5000 కు పెరుగుతుంది.వికలాంగుల పింఛన్ 6 వేలకు పెరుగుతుంది.ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెరుగుతుంది.తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందజేయడం జరుగుతుంది5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తుంది.సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 3000 రూపాయలు అందజేయడం జరుగుతుంది.నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోకారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకట రమణా రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జెడ్పీటీసీ గొర్రె సాగర్ గారు ముఖ్య అతిథులుగా హాజరై కెసిఆర్ గారి మానిఫెస్టోను ప్రజలకు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్య నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు

కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించి నిండా మునిగిన రైతులు

కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌..

`సూర్యపేట ఎమ్మెల్యే ,రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక లో కాంగ్రెస్‌ పరిపాలన వాస్తవ పరిస్థితులు.

`జాలి పడితే మిగిలేవి కన్నీళ్లే!

`తెలంగాణ మళ్లీ యాభై ఏళ్ల వెనక్కే!

`ఇళ్లకు కోతలే…వ్యాపార సంస్థలకు వాతలే!

`ఇష్టాను సారం బిల్లుల మోతలే.

`తెలంగాణ కాంగ్రెస్‌ నేతలవన్నీ ప్రగల్భాలే!

`కష్టాల కర్నాటక… కరంటు కటకట!

`తెలంగాణ లో కరంటు వెలుగులు…

`కర్నాటక లో కాంగ్రెస్‌ పుణ్యమా అని చీకట్లు.

`కరంటు లేమికి సాక్ష్యం కర్నాటక.

`ఆరు నెలల్లో అంతా తారుమారు.

`కాంగ్రెస్‌ ను గెలిపించి నిండా మునిగిన రైతు.

`రైతులు రోడ్డెక్కి ధర్నాలు..నిరసనలు.

` రైతులకు ఐదు గంటలకన్నా కరంటివ్వలేమంటున్న సర్కారు.

`ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ తీరు.

`కాంగ్రెస్‌ చెబుతున్నవన్నీ అబద్దాలే!

`అధికారం కోసం ఆరాటం.

`దుర్మార్గపు కాంగ్రెస్‌ రాజకీయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే అబద్దాల పుట్ట. కర్నాటకలో అధికారంలోకి వచ్చిందని ఇక పులినిచూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కాంగ్రెస్‌ వ్యవహారం చూస్తే విచిత్రమనిపిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒక్క శాతం కూడా. ఈ పదేళ్లలో ప్రభుత్వం మీద ప్రజలు ఒక్క రోజు కూడా నిరసన తెలియజేసిన సందర్భం లేదు. అంతగొప్పగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలన సాగుతోంది. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి స్ధానమే లేదు. కాని నిత్యం అబద్దాలు వల్లెవేస్తూ, నిజాలను కప్పిపుచ్చుకుంటూ, కేవలం పదవుల కోసమే రాజకీయాలు చేసే కొందరు స్వార్ధపరులు కాంగ్రెస్‌లో చేరినంత మాత్రాన బపడినట్లు కాదు. కాంగ్రెస్‌కు బలం చేకూరిచనట్లు కాదు. కాంగ్రెస్‌ చెబుతున్న హమీలన్నీ ఇప్పటికే తెలంగాణలో అమలు చేస్తున్నవే. కాంగ్రెస్‌ కొత్తగా చెప్పిందేమిటి? ఇస్తామంటున్నదేమిటి? దేశంలో డెబ్బ్కె ఏళ్ల స్వతంత్య్రంలో ఏనాడు రైతుల గురించి ఆలోచించింది లేదు. ఇంతపెద్ద దేశంలో కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన దేశంలో ప్రాజెక్టుల నిర్మాణాల మీద దృష్టిపెట్టలేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కాంగ్రెస్‌ కట్టింది లేదు. అరవైఏళ్ల తెలంగాణను గోసపెట్టిన పార్టీయే కాంగ్రెస్‌. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు కొత్తగా కర్నాటక అంటూ భజన చేస్తున్నారు. ఏముంది కర్నాటకలో కరంటు లేదు. రైతులకు కరంటు ఇవ్వడం లేదు. కేవలం ఐదు గంటలు మాత్రమే ఇవ్వగలమంటూ అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రకటన చూస్తున్నాం. రైతులు రోడ్డెక్కి నిరసలను తెలియజేస్తున్న సందర్భం చూస్తూనే వున్నాం. పంటలు ఎండిపోయే పరిస్దితి ఎదురౌతుందని రైతులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. గొప్పగా చెప్పుకునే కర్నాటకలో ఇండ్లకు కూడా సరిగ్గా కరంటు సరఫరా చేయడంలేదు. హోటల్స్‌ బిజినెస్‌ వ్యాపారులు కరంటు కోతలపై నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఇక దోపిడీకి అంతే లేదు. ఏకంగా అక్కడి నాయకుల పేరుతోనే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలు చీదరించుకుంటున్నారన్న సోయి కూడా లేకుండా కర్నాటక గెలిచాం..గ్యారెంటీలు ఇచ్చాం… అని చెప్పుకోవడం కాదు…బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటినే కాపీ కొడుతూ కూని రాగాలు తీస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్‌ పార్టీ సభలకు ఎంత మంది వస్తున్నారో చూస్తున్నాం. రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీలు వస్తే తప్ప రాజకీయం నడవని నేతలు రాష్ట్రాన్ని నడిపిస్తారా? ఇలాంటి పరాన్న జీవుల్లాంటి నాయకులను చూసి ప్రజలు ఓట్టేస్తారా? అంటున్న సూర్యపేట ఎమ్మెల్యే ,రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో చెప్పిన కర్నాకట వాస్తవ పరిస్ధితులు, తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్‌ అంటేనే కరంటు కోతలు.
తెలంగాణ అరవై ఏళ్లపాటు చూసిందే..ఇప్పుడు కర్నాకటలో చూస్తున్నదే. కర్నాకటలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమేమిటో ప్రజలకు తెలుసు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతుల మసిబూసి మారేడు కాయ చేస్తామంటే ఎవరూ నమ్మరు. పైగా ఓటుకు నోటు కేసులో వున్న దొంగను నమ్మి పార్టీ అప్పగించిన కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారా? అసలు కర్నాటకలో ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆఖరుకు చెత్త సేకరణకు ముందుకొచ్చే ఎజెన్సీలనుంచి కూడా వసూలు చేస్తున్నారంటే కాంగ్రెస్‌ పనితనమేమిటో? ఆ పరిపాలన ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. గత పాలకులు బిజేపి పూర్తిగా అవినీతి మయమైపోవడం వల్ల ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. అదేదో గొప్పగా , తెలంగాణలో కూడా మేమే అంటూ కలలు కంటున్నారు. వాళ్లకు మిలిలేవి కలలే.. ఆ కలల్లోనే వాళ్లు ఊరేగాల్సిందే. తప్ప..తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఎప్పటీకి కాంగ్రెస్‌కు వుండదు. ఇప్పటికీ కనీసం టిక్కెట్ల ఖరారుకే దిక్కులేదు. అలాంటి కాంగ్రెస్‌ నాయకుల చేతుల్లో పాలన పెడితే ప్రజల జీవితాలు ఆగమే…అరవైఏళ్లపాటు తెలంగాణ ప్రజలు కొట్లాడిరదే కాంగ్రెస్‌ మీద. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్‌. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంద్రలోకలిపిందే కాంగ్రెస్‌. ఇప్పుడేదో కొత్తగా తెలంగాణ మేమే ఇచ్చామని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడాలి. ప్రజల మీద ప్రేమతో కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన ఉద్యమంతో అనివార్యమై ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ మీద తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో పద్నాలుగేళ్లపాటు నిరంతరం ఉద్యమం చేశారు. ఎంతో మంది యువత బలయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్షతో దిగివచ్చారు. అప్పడు తెలంగాణ ప్రకటన చేశారు. అంతే కాని అడగగానే చాక్లెట్‌ చేతిలో పెట్టినట్లు ఇచ్చినట్లు ఎంతో సుతారంగా చెబుతున్నారు. అలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడని తత్వం కాంగ్రెస్‌ నేతలది. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని ఇక తప్పని పరిస్దితుల్లో తెలంగాణ ఇచ్చారు. ఇవ్వకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని ఇచ్చారు. అంతే గాని తెలంగాణ మీద ప్రేమతో కాదు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే తెలంగాణ ప్రజల్లో గుండెల్లో వున్నది కేసిఆర్‌. తెలంగాణ కలలు నెరవేర్చే నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చాడు. ప్రజల కష్టాలు తీర్చాడు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యాడు. ఆడపిల్లలకు మేమమాయ్యాడు. ఆసరాతో కుటుంబాలను ఆదుకుంటున్నాడు. కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడపిల్లల పెళ్లి చేస్తున్నాడు. తల్లి బిడ్డల క్షేమం చూస్తున్నాడు. అమ్మ కాబోతున్న తల్లులను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తల్లి గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం దాకా, తల్లి బిడ్డ క్షేమంగా ఆసుపత్రిని నుంచి ఇంటికి చేర్చుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇదీ మన తెలంగాణ గొప్పదనం. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఔదార్యం. ఇంత గొప్ప ప్రభుత్వం వుండగా, ఏనాడు ప్రజల యోగక్షేమాలు పట్టని కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించడం అన్నది కల్ల.
తెలంగాణ అంటేనే ఓ అధ్భుతం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన అంటేనే ఓ స్వర్ణయుగం. ఎందుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కరంటు కోతలతో తెలంగాణ విలవిలలాడిరది. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో తెలంగాణ వెలుగులతో నిండిరది. ఆరు నెలల్లో అసలు కరంటు సమస్య అన్నది లేకుండాపోయింది. ఇండ్లకు ఇరవై నాలుగు గంట కరంటు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అరవైఏళ్లలో ఏ ఒక్కనాడు ఇరవై నాలుగు గంటల కరంటు తెలంగాణ ప్రజలు చూసింది లేదు. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే రెప్పపాటు కూడా పోకుండా కరంటు చూస్తోంది. ఇదీ కేసిఆర్‌ నాయకత్వానికి, పాలనకు నిదర్శనం. మరి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇరవైనాలుగు గంటల నిర్విరామ కరంటు ఎందుకు సరఫరా కావడంలేదు. సాక్ష్యాత్తు దేశ రాజదానిలో కూడా కరంటుకోతలు చూస్తున్నాం. కాని తెలంగాణలో ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏనాడు కోత చూసింది లేదు. ప్రజలు ఇబ్బంది పడిరది లేదు. రైతులకు కష్టం కలగలేదు. అర్ధరాత్రులు రైతులు కరంటు కోసం బావుల వద్దకు వెళ్లింది లేదు. అక్కడ నిద్రలు చేసింది లేదు. తెలంగాణలో వున్నది బిఆర్‌ఎస్‌ సంక్షేమ ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం. పేదల ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న గొప్ప పరిపాలనకు నిలయం. అలాంటి తెలంగాణలో మరో పార్టీ అధికారంలో వచ్చే అవకాశమే లేదు. కర్నాకట పేరు చెప్పుకుంటే పడే ఆ కాస్త ఓట్లు కూడా పోతాయి. ముందు కాంగ్రెస్‌ అది తెలుసుకుంటే మేలు..కాంగ్రెస్‌ను ఆదరిస్తే మళ్లీ తెలంగాణను చీకట్లోకి తీసుకెళ్తారు. తెలంగాణను ఆగం చేస్తారు..ప్రజలు బాగా ఆలోచించాల్సిన సమయం. మోసం చేసేవాళ్లు చాలా చెప్తారు. నమ్మించి ఆగం చేస్తారు. బిఆర్‌ఎస్‌ ప్రజలను గుండెల్లో పెట్టుకునేపార్టీ. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రికేసిఆర్‌. మూడోసారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ విజయం తధ్యం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version