Category: తాజా వార్తలు
చిన్నారి చైత్ర హంతకుణ్ని కఠినంగా శిక్షించాలి
బాధిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి సేవాలాల్ సేన పెద్దపల్లి,జయశంకర్ జిల్లాల కన్వీనర్ అంగోత్ రాజునాయక్ డిమాండ్
మల్హర్రావు నేటిదాత్రి: హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ లో 6 సంవత్సరాల పసికందు గిరిజన బిడ్డ చిన్నారి చైత్ర ను అత్యాచారం చేసి,హత్య చేసిన కిరాతకున్ని కఠినంగా శిక్షించాలని రాజు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ పెద్దలు గానీ, కనీసం గిరిజన మంత్రి మహిళ అయి ఉండి కూడా నేటి వరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించి కా పోవడం బాధాకరం
రాష్ట్రంలో ఇంత గోరం జరుగుతున్నా కనీసం గిరిజన MLA లు గాని MP లు గాని మంత్రులు, ప్రజా ప్రతినిధులు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు వీళ్ళని గిరిజన సమాజం ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు
అత్యాచారం, హత్య, పోక్సో చట్టాల కింద తక్షణమే విచారణ పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీస్ శాఖ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఖమ్మంలో మరియమ్మ కుటుంబానికి ఇచ్చినట్టుగానే ఈ కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగం అమ్మాయి తండ్రికి ఇవ్వాలని మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఒక ప్రకటనలో రాజు నాయక్ డిమాండ్ చేశారు
సింగరేణి కాలనీ లో గుడుంబా, డ్రగ్స్ వ్యాపారం ఒక మాఫియా లాగా తయారై విచ్చలవిడిగా అమ్ముతున్న ఇక్కడ ఎక్సైజ్ అధికారులు కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో దళిత, గిరిజనుల పై దాడులు, అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
సినిమాలు, టీవీలు ,మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నా విచ్చలవిడి అశ్లీలత అరికట్టడంలో సెన్సార్ బోర్డు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు
అత్యాచార నిందితుడి ని వెంటనే ఉరితీయాలి
కాజీపేట, నేటిధాత్రి:
సభ్య సమాజం తలదించుకునే విధంగా సైదాబాద్ సింగరేణి కాలనీ లో చిన్నారిపై అత్యాచార ఘటనకు పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి ఉరితీయాలని కార్పోరేటర్లు విజయశ్రీ రజాలీ, జక్కుల రవిందర్ యాదవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీని తీసి చిన్నారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 6 సంవత్సరాల పసిపాపను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో పసిపిల్లలకే రక్షణ కరువైతే మహిళల పరిస్థితి ఏమిటని ఆవేదనను వ్యక్తం చేశారు. టీపీసీసీ కార్యదర్శి సయ్యద్ రజాలీ మాట్లాడుతూ సీఎం కేసిఆర్ కు వెనుకబడిన వర్గాలు, దళితులూ, గిరిజనులపై ఎంత ప్రేమ ఉందో ఈ ఘటన ద్వారా స్పష్టమైందని అన్నారు. మహిళలు చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా చర్యలు చేపట్టి మహిళా చట్టాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలనీ లేని పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి రాజధాని నడిబొడ్డున ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో సందెల విజయ్ కుమార్, కాసర్ల నగేష్, మహేందర్ రెడ్డి,మద్దెల శోభారాణి, గుర్రపు కొటేశ్వర్, బైరబోయిన రమేష్, పెద్దపల్లి విజయ్, మానస, అర్చన, తబ్బు, మాతంగి నర్సింగ్, షారుఖ్, తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ధర్మసాగర్,నేటిధాత్రి:
డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నారాయణగిరి గ్రామ సర్పంచ్, ధర్మసాగర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి కోరారు. బుధవారం నారాయణగిరి గ్రామపంచాయతీలో జనరల్ బాడీ మీటింగ్ ను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి నీటి సమస్య రాకుండా చూడడంతో పాటు, అవసరమున్న ప్రతి ఇంటికి పైప్లైన్ నిర్మాణం చేసి మంచినీరు అందిస్తామని అన్నారు. గ్రామపంచాయతీ ఆధీనంలో ఉన్న రెండు బావులకు నూతనంగా ఓడల నిర్మాణం జరుగుతుందని, గ్రామంలో అవసరమున్న కాలనీ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం కోసం అంగీకారం తెలపడం జరిగిందని తెలిపారు. నారాయణగిరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు, మౌలిక వసతులు కల్పించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధిపధంలో నడిపించడానికే జనరల్ బాడీ మీటింగ్ ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రఘు, వార్డు మెంబర్లు వల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి, గంటె సరిత, కొలను సుమలత, పసునూరి రవి, గంటె లింగమూర్తి, వల్లపురెడ్డి జనార్దన్ రెడ్డి, కారోబార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మహా అన్నదాన కార్యక్రమం
భీమదేవరపల్లి నేటిదాత్రి:
అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పదని పొలం ఉమాదేవి అన్నారు.
భీమదేవరపల్లి రెడ్డి సంఘం శ్రీ గణనాయక నవరాత్రి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు మార్పాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వచ్చిన పొలం ఉమాదేవి ఈ కార్యక్రమానికి హాజరై అన్నదానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి.రాజేందర్ రెడ్డి మహిపాల్ రెడ్డి.భూపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి మరియు రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి
ఎలాంటి డీజే లకు అనుమతి లేదు.
గూడూరు సిఐ రాజి రెడ్డి.
కొత్తగూడ, నేటి ధాత్రి.
గణేష్ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని గూడూరు సీఐ రాజి రెడ్డి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ నిమజ్జనం రోజు రహదారులపై ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూ నిమజ్జనం చేయాలని తెలిపారు. ఈ పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు. ఎవరైనా డీజేలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈత రాని పిల్లలకు నిమజ్జనం రోజు తీసుకెళ్లకూడదు. కోవిడ్-19 నిబంధనలు ప్రార్థిస్తూ శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా కొత్తగూడ, గంగారం మండల ప్రజలకు తెలియజేశారు.
ఫాతిమానగర్ లో బైకును ఢీకొన్న కారు -ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
కాజీపేట, నేటిధాత్రి:
కాజీపేట పట్టణంలోని ఫాతిమానగర్ జంక్షన్ లో బైకును ఓ కారు వెనుకాల నుంచి వచ్చి ఢీకొన్న సంఘటన బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట నుండి హనుమకొండ కు ఇద్దరు విద్యార్థులు బైకుపై వెళ్తున్నారు. బైకు ఫాతిమానగర్ జంక్షన్ దగ్గరకు రాగానే వెనుక నుండి అతివేగంగా వచ్చిన కారు బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా దెబ్బలు తాకాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వెంకట్రాజం కుటుంబానికి అండగా ఉంటా -మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
ధర్మసాగర్,నేటిధాత్రి:
ధర్మసాగర్ మండలం లోని నారాయణగిరి గ్రామంలో ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు గొట్టుముక్కల వెంకట్రాజం ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. నారాయణగిరిలోని వెంకట్రాజం స్వగృహానికి ఆయన కార్యకర్తలతో కలిసి వెళ్లి వెంకట్రాజం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రాజం కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని, ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చునని భరోసాను కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కడియం యువసేన నాయకులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
గణపతి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
హనుమకొండ, నేటిదాత్రి
హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి విశేష దినం నిర్వహించగా ముఖ్య అథితిగా పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని భక్తీ శ్రద్దలతో నిర్వహిస్తున్న వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వల్లాల జగన్ గౌడ్ ని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రముఖులు 303 గవర్నర్ తడక కుమార స్వామి గౌడ్, కోఆర్డినేటర్ జంగా గోపాల్ రెడ్డి, ఆర్ సి, దేశీని లక్ష్మినారాయణ, సైకాలజిస్టు బరుపాటి గోపి, ఎలక్ట్ గవర్నర్ సుధాకర్, పలువురు అభినందించినారు.
తెలంగాణ అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం
నేటిధాత్రి మొగుళ్లపల్లి
తెలంగాణ అమరవీరుల స్మరిస్తూ మండలం లోని ఇసిపేట మొగుళ్లపల్లి కొరికి శాల గ్రామాల్లో సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ సిపిఐ ఎర్ర జెండా ఆవిష్కరించారు నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది అమరులై పోయారని వారి ఆశయాల ను కొనసాగించాలని జిల్లా రైతు సంఘం నాయకులు పెరుమండ్ల రాజయ్య అన్నారు ఈ కార్యక్రమంలో నిమ్మల రాజయ్య కాశి బోయిన రాజయ్య నేరెళ్ల కుమారస్వామి ఎండి నబి సూత్రపు ఆనందం మం దల శ్రీకాంత్ నాంపల్లి కొమురయ్య రాజమల్లు సుధాకర్ గడ్డం రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర గవర్నర్ మాతృమూర్తి కి నివాళులు అర్పించిన : వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)
రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి మరణించడంతో
ఈరోజు గురువారం చెన్నైలోని వారి స్వగృహంలో కృష్ణకుమారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, గవర్నర్ గారిని పరామర్శించిన **TRS రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)* వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి. స్వర్గీయ కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని.వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతున్ని ప్రార్ధించారు..
చిరకాలం నుండి గవర్నర్ కుటుంబంతో గాయత్రి రవికి ఆత్మీయ అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈరోజు చెన్నైకి వెళ్లి నివాళులు అర్పించారు …
విద్యుత్ శాఖలో ఒకే ఒక్కడు లైన్ ఇన్స్పెక్టర్
నడి కూడ నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లొ అన్నీతానై అధికభారమై ఇబ్బంది పడుతున్నవైనం.
పట్టించుకోని పై అధికారులు.
మనోవేదన పడుతూ విధులు నిర్వహిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ మల్లయ్య.
మండలంలో విద్యుత్ శాఖలో ఏఇ , లైన్ ఇన్స్పెక్టర్ , సీనియర్ లైన్ మెన్ , జూనియర్ లైన్ మెన్ , హెల్పర్ లు ఉండాలి కానీ ప్రస్తుతం ఎఇ , మరియు లైన్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. దీంతో మండల పరిధిలో ఏ ఊర్లో సమస్య వచ్చినా ఎఇ లైన్ ఇన్స్పెక్టర్ కె .మల్లయ్య కే అప్పచెప్పడం వల్ల నానా తంటాలు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. శాఖా పరంగా ఆదాయం సమకూర్చడానికి ఇంటింటికీ తిరిగి బిల్లులు వసూలుచేయాలి , లైన్ ఫాల్ట్ వస్తే కరెంట్ స్తంభాలు ఎక్కాలి , రైతులు పిలిస్తే వెళ్ళాలి, సబ్ స్టేషన్ లో సమస్య ఉంటే సరిచేయాలి ఇవన్నీ కేవలం లైన్ ఇన్స్పెక్టర్ మాత్రమే చేస్తున్నారు. ఇవ్వన్నీ జూనియర్ లైన్ మెన్ విధులు కానీ 57 సంవత్సరాల వయస్సు లో కూడా లైన్ ఇన్స్పెక్టర్ మల్లయ్య భయం భయం గా కరెంట్ పోల్స్ ఎక్కడం , సబ్ స్టేషన్ స్తంభాలు ఎక్కి విధులు నిర్వహిస్తున్నారు. తగిన సిబ్బంది లేక పోవడం వల్ల ఎప్పుడు ఎవరు ఫోన్ చేసిన వెంటనే వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ఇటు రైతుల నుండి ఒత్తిడి , అటు ఏఇ ఒత్తిడి చేయడం వల్ల మనోవేదన పడుతూ విధులను నిర్వహిస్తున్నాడు. పై అధికారులకు విన్నవించుకున్నా సిబ్బందిని నియమించక పోవడం వల్ల విధుల నిర్వహణ అధిక భారం అవుతుందని మల్లయ్య వాపోతున్నారు. దీనిపై అధికారులు ,స్థానిక ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు స్పందించి విద్యుత్ సేవలను అందించడానికి తగిన సిబ్బందిని నియమించాలని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా
రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలో ని గాంధీ విగ్రహం దగ్గర నుండి ర్యాలీ నిర్వహించి యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎంపిటిసి వనం హర్షిని చంద్రశేఖర్ జెండా ఎగరడం జరిగింది యువజన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు
ఉద్యోగ నోటిఫికేషన్ లు మరియు నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ ఖాళీగా ఉన్నా పోస్టులను భర్తీ చేయకపోవడం వలన రాష్ట్రంలో ఉన్న యువత చాలా నష్టపోతున్నారు అని అన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక దళిత సోదరుల అందరికీ దళితబంథు పథకం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనం పల్లి ఎంపీటీసీ వేమవరం సుధీర్ బాబు యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోట్ల సాయిబాబా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాల్వేరు అశోక్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాపురం ప్రవీణ్, యువజన కాంగ్రెస్ మాజీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మిరియాల మల్లేష్, పట్టణ అధ్యక్షులు బాసాని రాజు, ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు మోటె క్రాంతి,కల్లూరు నరేష్, రేపాక రమేష్, గురజాల మహేష్ రెడ్డి, గోగు హరిప్రసాద్, రేఖ సైదులు,చల్ల సుధీర్, దండుగుల శేఖర్ గజారాజు సాయి కుమార్, నకిరేకంటి నర్సి పైల్వాన్, పరశురాం, మహేశ్వరం అశోక్,రాజు,బైకని నరేష్,సాయితేజ
కాకతీయ యూనివర్శిటీ మొదటి గేటు వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నాయిని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
నేటిదాత్రి:
కాకతీయ యూనివర్సిటీ వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్ వరంగల్ వెస్ట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ మాట్లాడుతూ ఈ
ఎన్ని సమస్యలు, కష్టాలు చుట్టు ముట్టినా
ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతున్న
మన రాజేందర్ రెడ్డి ని కేయూ విద్యార్థులం, యువజన కాంగ్రెస్ మరియు NSUI విద్యార్థి సంఘాలమందరం కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిపించుకుంటామని
మరియు నాయిని అన్నగారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపు కోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటుంన్నాను.
ఈ కార్యక్రమంలో..డివిజన్ ప్రెసిడెంట్లు సాయిరాం యాదవ్, శ్రీదర్ యాదవ్, వర్ధన్నపేట నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ వంశి,నెమలి నితిన్ , యూత్ కాంగ్రెస్ నాయకులు అరుణ్, మరియు కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు బన్ని, చరణ్, తరున్ రాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పెద్ది ని పరామర్శించిన నేటిధాత్రి చైర్మన్
తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి స్వర్గీయ పెద్ది రాజిరెడ్డి అనారోగ్యంతో మరణించగా నేటిధాత్రి గ్రూప్స్ చైర్మన్ , సిఈఓ కట్టా రాఘవేంద్ర రావు, నేటిధాత్రి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ కట్టా శివ సుబ్రమణ్యం, తెలంగాణ బ్యూరో బిర్రు కుమారస్వామిలు సోమవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని నల్లబెల్లి మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాజిరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో రూరల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తడుక రమేష్ గౌడ్, నర్సంపేట ఇంఛార్జి కందుల శ్రీనివాస్ గౌడ్,నల్లబెల్లి మండల రిపోర్టర్ పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, నెక్కోండ,చెన్నారావుపేట ఖానాపూర్ మండలాల రిపోర్టర్స్ మధు,యాదగిరి,ప్రవీణ్, వినయ్ గౌడ్ లు పాల్గొన్నారు.
వంద పడకల ఆసుపత్రి దారిలో నిలిచిన వర్షం నీరు
-
నీరును వెంటనే తొలగించాలి సిపిఎం డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి:
నిన్న కొంతసేపు కురిసిన వర్షానికి వంద పడకల ఆసుపత్రి కి పోయే దారిలో చెరువులను తలపించేలా నీరు నిలిచిపోవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సిన బాలింతలు, గర్భిణీలు వారి బంధువులు ఇబ్బందులు పడుతు వేలవల్సి వస్తుందాని కాబట్టి వెంటనే వర్షం నీరు తొలగించి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు.సిపిఎం బృందం వర్షం నీరు నిలిచిన ఉన్న పరిస్థితిని పరిశీలించి అందులో దిగి నిరసన వ్యక్తం చేసి పేషెంట్స్ బంధువులను ఆసుపత్రి కి తరలించడం ఆస్పత్రిలో ఉన్న వారిని బయటికి తరలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొద్దిపాటి వర్షానికి నీళ్లు నిలవడం తో పేషెంట్లు హాస్పటల్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం నీరు చెరువులకు పోయే దారిని కాంట్రాక్టర్మూ సివేయడంతో ఈ సమస్య ఉత్పన్నం అయిందని ఆయన పేర్కొన్నారు. వర్షంనిరు చెరువు కు వెళ్లే దారిలో అడ్డుగా కాంట్రాక్టర్ల మట్టిపొయడంతొ నిరు నిలిసిపొయిందాని కావున మట్టిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నీరు నిలవడానికి కారణమైన కాంట్రాక్టర్ పై సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.వర్షం నిరు పై నుండి వస్తున్న వాటర్ పోవడానికి కాలువను ఏర్పాటు చేయాలని అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆసుపత్రికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోవడానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి జోక్యం చేసుకోవాలని పరిష్కారించాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కాకుంటే రాబోయే రోజులొ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య, పొలం రాజేందర్, బొట్ల చక్రపాణి ,నాయకులు రజాక్ విరాట్ శ్రీ రాములు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కోతకు గురవుతున్న సిసి రోడ్డు
-
ఇంత నిర్లక్ష్యం ఎందుకు స్థానిక ప్రజలు
దామెర,నేటిధాత్రి:
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డబుల్ రోడ్డు సైడ్ డ్రైనేజీ లేక ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద రోడ్డు క్రింది భాగం నుండి వెళుతుండగా క్రింది భాగం మొత్తం కోతకు గురై రోడ్డు కూలిపోయే ప్రమాదముందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా కాంట్రాక్టర్ మేలుకొని సైడ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని ,. సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రైతు కుటుంబాలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం
-
రూ. కోటి 10 లక్షల విలువైన రైతుబీమా చెక్కుల వితరణ
-
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి :
దేశానికి అన్నం పెట్టే రైతు ఆకాల మరణం పొందితే వారిపై ఆధార పడ్డ కుటుంబం రోడ్డున పడుతుందని ,రైతు బతికున్నప్పుడు ఎంత గౌరవంగా బతికారో యజమాని చనిపోయాక కూడా అంతే గౌరవంగా బతకాలనే ఉద్దేశ్యంతో రూ.5 లక్షల ప్రమాద బీమా ను కుటుంబాలకు అందిస్తూ యావత్ ప్రపంచం మెచ్చే విధంగా అలాగే ఐక్యరాజ్యసమితి అభినందించే విధంగా పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నియోజవర్గంలోని పలు మండలాలలోని 22 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి టీ 5 లక్షల చొప్పున రూ. కోటి 10 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఇప్పటివరకు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 442 మంది రైతుల కుటుంబాలకు రైతుబీమా పథకం ద్వారా రూ. 22 కోట్ల 10 లక్షలు, అదేవిధంగా 66531 మంది రైతులకు రైతుబందు పథకం ద్వారా 57 కోట్ల 18 లక్షల రూపాయల నగదును అందజేసినట్లు తెలిపారు. రైతుబీమా పథకం వలన యావత్తు తెలంగాణ రైతులు భరోసాగా బ్రతుకుతున్నార ని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్ రావు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, అర్ ఎస్ ఎస్ డైరెక్టర్లు, రైతుబందు కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
*హూజురాబాద్ టికేట్ నాకే* _యూత్ ఓక్కోకరికి 3000- 5000 ఇస్తా
ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో, నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కజిన్ బ్రదర్ పాడి కౌశిక్ రెడ్డి ఆడియో కలకలం సృష్టిస్తోంది.