గడ్డం.రాణి చిత్రపటానికి నివాళులు అర్పించిన టీపీసీసీ సభ్యులు నాగాసీతారాములు

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,నేటిధాత్రి:

కొత్తగూడెం నియోజకవర్గం, సుజాత నగర్ లో గడ్డం.రాజశేఖర్, సురేందర్,రాజేందర్ సోదరుల మాతృమూర్తి అయిన గడ్డం.రాణి చిత్రపటానికి పూలమాల వేసి,నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపిన టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ మడిపల్లి. శ్రీనివాసులు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంజాల. శ్రీనివాసరావు. పాలకుర్తి.అంజి దొంచవరపు.శ్రీను, వెంకన్న,జానిమియా తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం

రక్తదానం మహాదానం,రక్తదానంపై అపోహలు వద్దు : ఎస్పీ

భద్రాద్రి కొత్తగూడెం, నేటిధాత్రి: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలు నందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజం కోసం,దేశం కోసం,రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు.ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు.వారి త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు.పేద ప్రజలు,బాధితులకు సత్వర న్యాయం అందించడం,ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే వారి త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు. థలసేమియా,క్యాన్సర్,హిమోఫీలియా,రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి,ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని,రక్తదానం చేసి అటువంటి వారి ప్రాణాలను కాపాడటం ద్వారా మనకు కూడా మంచి చేకూరుతుందని అని అన్నారు.రక్తదానం మహాదానమని,రక్తదానంపై అపోహలు వద్దని ఎస్పీ అన్నారు.ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడానికి ఈ శిబిరాల ద్వారా సేకరించిన రక్తం ఉపయోగపడుతుందని తెలియజేసారు.ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి ప్రతీ 5 నెలలకొకసారి రక్తదానం చేయడం ద్వారా శరీరం మరింత ఉత్సాహవంతంగా మారుతుందని అన్నారు.ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు సబ్ డివిజన్ పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.అదేవిధంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన పోలీస్అధికారులు ,సిబ్బంది, యువత కు ప్రజలందరికీ కృతజ్ఞతలు, తెలిపారు .డిఎస్పీ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం ద్వారా 130 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని,ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కొత్తగూడెం పట్టణ,పరిసర ప్రాంతాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు,ఎస్బి ఇన్స్పెక్టర్ స్వామి,సిఐలు రమాకాంత్,సత్యనారాయణ, రాజు,అబ్బయ్య,వసంత్ కుమార్,ఆర్ఐలు దామోదర్,కామరాజు,ఎస్సైలలు,డాక్టర్ రవిబాబు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

ఘనంగ మహనీయుల జయంతి వేడుకలు

గోదావరి ఖని,నేటిధాత్రి: గోదావరిఖని లక్ష్మీనగర్ లోని న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో ఆదివాసుల హక్కుల కోసం అలాగే నిజాం నిరంకుశ పాలనను ప్రశ్నించిన గోండు బెబ్బులీ కొమరం భీము మరియు నిజాయితి కి మారు పేరు అయిన మాజి ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ జయంతి పార్టీ కార్యాలయంలో ఘనంగ నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జె వీ రాజు మాట్లాడుతూ ఎస్.ఆర్.శంకరన్ సేవలను కొనియాడుతూ ప్రభుత్వ ఫలాలు ,సేవలు ప్రతి ప్రజకు అందేలా మరియు ఎలాంటి ఆర్బాటలకు పోకుండా నిడారంబరతతో ప్రజల సమస్యల్ని తన సమస్యగా భావించి ప్రజలకి ఎప్పుడు ఏమి కావాలో అప్పటికప్పుడు రూపకల్పన చేసి ప్రజల్లో ఒక మంచి అధికారిగా పేరుపొందిన వారి జయంతి ఘనంగా జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం అని అన్నారు.
అలాగే గోండు వీరుడైన కొమరం భీమ్ గారు అలనాటి నిజాం నిరంకుశపాలను వ్యతిరేకిస్తూ ఆదివాసుల హక్కుల కోసం తను చేసిన ఉద్యమాలను కొనియాడుతూ వారిని కీర్తిస్తూ వారికి నివాళులర్పిస్తూ వారి జయంతిని కూడా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించామని వేముల అశోక్ తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగమ తిరుపతి వేముల అశోక్ మహిళా నాయకురాలు గంట భబిత సోని, పోగుల శేకర్ అఫ్రాజ్ కార్పొరేషన్ ఇంచార్జ్ ముఖేష్. సదన్ కుమార్ యాదవ్ వీరందరు కూడా పాల్గొని మహనీయుల జయంతి సందర్భంగా వారి ని ఆదర్శంగా తీసుకోవాలి అని పిలువును ఇచ్చి వారి సేవలను కొనియాడారు.

కొత్తగూడెం ఏరియా జి.కె.ఓ.సి. నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటిధాత్రి:

చుంచుపల్లి మండలం. రుద్రంపూర్.జి.కె.ఓ.సి నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 2021 సందర్బముగా జరిగినవి. మేనేజర్ కరుణాకర్ రావు అధ్యక్షతన ఏర్పటు చేసిన ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌ శ్రీ జక్కం రమేశ్ . జి.ఎం. హెచ్‌ఆర్‌డి బి‌హెచ్ వెంకటేశ్వర రావు, టి‌బి‌జి‌కే‌ఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ . ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి గారు, జి.కె.ఓ.సి ప్రాజెక్టు ఆఫీసర్ రమేశ్ , హాజరు అయినారు. కార్మికులను ఉద్దేశించి వీరు మాట్లాడుతూ ..రక్షణ సంభంధించి విషయాలను వారికి తెలియజేయడ మైనది. రక్షణ విషయాలను పాటల ద్వారా నాటికల ద్వారా కళాకారులు తెలియ జేసినారు. 2019 52 వ వార్షిక రక్షణ వారోస్తవాల్లో జి.కె.ఓ.సి మైన్ కు గ్రూప్ 2 లో మొదటి బహుమతి, ఓవరాల్ ఎన్విరాన్మెంట్ లో 2 వ బహుమతి పొందినది అని తెలియ జేసినారు.ఈ కార్యక్రమములో ఎస్.ఓ.ఎం. (పి.పి) కార్పొరేట్ డి. శ్యామ్ సుందర్, డి‌జి‌ఎం (ఈ &ఎం) హెచ్.ఆర్.డి. కార్పొరేట్ కె. రామోహన్, ఎస్.ఎస్.ఎస్.ఓ. యెల్లందు ఏరియా పి. బాలాజి నాయుడు, అడిషనల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ ఎం. ప్రసాద్,(మైనింగ్) డి. రాజకుమార్,(ఎలక్రీకల్ ) బి. రవీందర్, డబల్యూ.ఎం. ఐ ఐ.(మెకనికల్ ) ఏ. సదానందం, సీనియార్ సెక్యూరిటి ఆఫీసర్ రమనా రెడ్డి, మధుకర్ ఎస్.ఈ, పిట్ సెక్రెటరి చెరిపల్లి నాగరాజు, గోపు కుమార్, మురాద్, భీముడు, విప్లవ రెడ్డి, కుమారస్వామి, 11 మెన్ కమిటీ సబ్యులు కాపు కృష్ణ, సేఫ్టీ కమిటీ మెంబర్లు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, జీనుకుల సదానందం కళా బృందం, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు, డి‌ఎల్‌ఆర్ కార్మికులు పాల్గొన్నారు

త్రివేణి స్కూల్లో ముందస్తు దీపావళి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటిధాత్రి:

భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో గల త్రివేణి స్కూల్ నందు ముందస్తు దీపావళి వేడుకలు జరుపుకున్నారు, ఈ యొక్క దీపావళి గురించి ప్రిన్సిపాల్ జంగాల మంజుల మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు, జరుపుకునే పండుగల లో దీపావళి పండుగ కూడా ఒకటని ఎంతో ప్రాముఖ్యత కూడుకున్నదని నరక చతుర్దశి నాడు సత్యభామ నరకాసురుని ఏ విధంగా వధించినది ఎందుకు వధించాల్సి వచ్చింది అని దీపావళి యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పినారు, మరియు పిల్లలందరూ కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని చెప్పినారు, పిల్లలకి, అధ్యాపక బృందానికి, విద్యార్థినీ, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, దీపావళి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ యొక్క కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కాలుమిల్లి విమలాదేవి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాబురావు సార్ అకడమిక్ ఇంచార్జ్ నరేష్, క్యాంపస్ ఇంచార్జ్ సందీప్ రెడ్డి, విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన వోరగంటి

 


శంకరపట్నం నేటిధాత్రి :మండల కేంద్రంలో,తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ సదాశివ ఫైర్ వర్క్ దీపావళి టపాకాయల దుకాణమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడంచాలా సంతోషం అని,వారిని ప్రశంసిస్తూ,హర్షం వ్యక్తం చేసి, యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు, యువకులు, వోరగంటి యువసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మాత శిశు హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

 

డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి

కరీంనగర్ నేటిధాత్రి :కరీంనగర్ పట్టణ కేంద్రం లో ప్రభుత్వ మాత శిశు హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకొని విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న డాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు.

స్థానిక మాత శిశు ఆస్పటల్ ముందు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అనంతరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ మాత శిశు హాస్పిటల్ లో గర్భని స్త్రీలకు సౌకర్యాలు కల్పించాలి జన్మించిన శిష్యులకు అందుబాటులో మందులు ఉంచాలని గర్భిణీ శ్రీ తో అనుచిత వ్యాఖ్యలు చేసిన మత్తువైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకొని ఆయనకు విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్త్రీల వైద్య నిపుణులు సమయపాలన పాటించకపోవడం వల్ల గర్భని స్త్రీలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి శిశు ఆస్పత్రిలో కనబడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగే నీరు సరిపడే కుర్చీలు ఏర్పాటు చేయాలని వారు అన్నారు. డెలివరీ అయిన తర్వాత రూమ్లలో ఫ్యాన్లు ఇతర సౌకర్యాలు లేకపోవడం వల్ల గర్భని స్త్రీలు ఇబ్బంది పడుతున్నారని వారు అన్నారు. చిన్నపిల్లలకు పూర్తిస్థాయిలో మందులు అక్కడ లేకపోవడం వల్ల ప్రైవేట్ మెడికల్ షాపులకు ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని వారు అన్నారు.డెలివరీ అయిన సమయంలో స్టాప్ నర్సులు ఆయలు ఒక్కొక్క గర్భని శ్రీ దగ్గర సుమారు 1000 నుండి 2000 వరకు వసూలు చేస్తున్నారని అన్నారు.RMO సూపర్డెంట్లు పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల వైద్యుల సమయపాలన పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవడంలో సూపర్డెంట్ నిర్లక్ష్య వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులను గుర్తించి తక్షణమే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఇప్పటికైనా వైద్యశాఖ మంత్రి ప్రజలకు సకాలంలో వైద్యం అందించే విధంగా ఎప్పటికప్పుడు హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో మరింత ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివరాజ్ పటేల్, నవీన్, శివ రాహుల్, కిషన్ ,మహేష్ అరుణ్, రఘు ,రాజేందర్ లక్పతి, తదితరులు పాల్గొన్నారు.

పేద వ్యక్తి అంతక్రియలకు ఆర్థిక సహాయం

మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా),22 అక్టోబర్ (నేటిధాత్రి):

సమాజంలో గొప్ప వాళ్ళు ఇంకా గొప్పగా, పేదవారు ఇంకా పేదలు అవుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని పటేల్ నగర్ లో నివసిస్తున్న ప్రమోద్(21) పవన్ (17) ఇద్దరు అన్నదమ్ములు, పెయింటింగ్, డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అద్దె ఇంట్లో తండ్రి నరసింహులు (45) తో జీవనం కొనసాగిస్తున్న అన్నదమ్ములకు విధి రాతవల్ల ఊహించని సంఘటన తమ తండ్రి నరసింహులు శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందారు.తండ్రి అంతక్రియలకు కూడా చిల్లి గవ్వలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని పటేల్ నగర్ కి చెందిన మధు మానవసేవే మాధవసేవ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజును సంప్రదించి, నరసింహులు అంతక్రియలకు ఆర్థిక సహాయం కోరడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని తమ వాట్సాప్ గ్రూప్ లో సభ్యులకు తెలియజేయడంతో మానవతాదృక్పథంతో 24 మంది సభ్యుల సహకారంతో నరసింహులు అంతక్రియలకు 16 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని నరసింహులు ఇద్దరు కుమారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, ఉదారి సత్యనారాయణ యాదవ్, జగపతి, సత్యనారాయణ, తో పాటు స్థానికులు మధు, తదితరలో పాల్గొన్నారు. నరసింహులు అంతక్రియలకు ఆర్థిక సహాయం అందించిన వాట్సాప్ గ్రూప్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రతిభా విద్యాలయంలో  దీపావళి వేడుకలు

 

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ప్రతిభా విద్యాలయంలో ముందస్తుగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడగంటి గంగాధర్, ఉపాధ్యాయులు పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు దీపావళి పండుగను జరుపుకున్నారు.

అక్షర ద స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి :నర్సంపేట పట్టణంలో బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్ , బిట్స్ స్కూల్ ల లో దీపావళి పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి, క్రాకర్స్ బాణా సంచా కాల్చారు. చిన్నారి విద్యార్థిని విద్యార్థులు కృష్ణుడు, సత్యభామ నరకాసుడు వేషధారణతో అందరిని అలంరించారు.ఈ సందర్భంగా నరకాసుర వధ నిర్వహించి దీపావళి ప్రాముఖ్యతను నాటక రూపంలో ప్రదర్శించారు. బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్. ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి దీపావళి పండుగ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల సెక్రేటరి రాజేశ్వర్ రెడ్డి , పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.జ్యోతి, సీ.ఎ.వొ సురేష్ . ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాద్యాయుడి వికృత షష్ఠ!

వేములవాడ,నేటిధాత్రి:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు జక్కుల శివప్రసాద్ ను నిర్బంధించిన గ్రామస్తులు..

–విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, వ్యక్తిగత విషయాలు ఆరా తీయడాన్ని ఆగ్రహించి ప్రశ్నించిన గ్రామస్తులు..
–మందలించేందుకు వెళ్లిన తల్లిదండ్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఉపాధ్యాయుడు..

–సహనం కోల్పోయి సదరు ఉపాధ్యాయుని కుర్చీని ఎత్తేసి ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు..
–ప్రభుత్వ పాఠశాలలో ఉద్రిక్తత వాతావరణం..
— పాఠశాలకు చేరుకున్న పోలీసులు..
— ఉపాధ్యాయుడిని, సస్పెండ్ చేస్తా అని వివరణ ఇచ్చిన , జిల్లా విద్యాధికారి…

గీత కార్మికుల కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తాం

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బబ్బురి ఉప్పలయ్య,మోడెం వెంకటేశ్వర్లు ఎన్నిక

 

కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:  ఈనెల 19, 20, 21 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర మహాసభలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని, కేసముద్రం మండలం నుండి బబ్బురి ఉప్పలయ్య, మోడెం వెంకటేశ్వర్లను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారని బబ్బురి ఉప్పలయ్య మోడెం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా స్థానం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ అవకాశం రావడానికి సహకరించిన ప్రతి ఒక్క కల్లుగీత కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ అవకాశంతో గౌడ కులస్తుల సంక్షేమం,కల్లు గీత కార్మికుల కోసం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని తెలిపారు.పదవి రావడం వల్ల బాధ్యత పెరుగుతుందని,కేసముద్రం మండల కల్లు గీత కార్మిక సంఘం పనితీరును బేరీజు వేసుకొని ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించిన బహిరంగ సభ సమావేశాలు విజయవంతం అయ్యాయని తెలిపారు.మా పై నమ్మకంతో కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు ఎం వి రమణ కు యమగాని వెంకన్న కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గంగపురపు వెంకన్న,బబ్బురు వెంకటమల్లు, గంధసిరి యాకన్న,గంధం వెంకన్న,కామగొని సారయ్య, సాంబయ్య,గంధసిరి వెంకన్న, స్వామి,గంధసిరి విజేందర్, గంధం శ్రీనివాస్,బొమ్మగాని ఎల్లయ్య,కందాలరమేష్ తదితరులు పాల్గొన్నారు.

మళ్ళీ బావిలో పాకురు, నిండిన చెత్త

 

గతంలో తాత్కాలిక చర్యలు, తొంగి చూడాలి అధికారులు

నిర్లక్ష్యంపై గ్రామ ప్రజల అసహనం

కొడిమ్యాల, నేటిధాత్రి:జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మంచినీటి బావిలో పాకూరు, చెత్తతో నిండి ప్రజల పాలిట శాపంగా మారింది. కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డులకు మంచి తాగు నీరు అందించే మంచి నీళ్ల బావి పడువడ్డ బావిలా చెత్త, పాకురు నిండి భయంకరంగా అయింది. అ బావి నీళ్ళే నిత్యం ప్రజలు తాగడం, కనీసం బావిని శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీళ్లు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యం పలు అయ్యే అవకాశం ఉన్నందున, గతంలో కూడ తాత్కాలిక చర్యలు చేపట్టారాని, సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు..

ఉద్యమ వీరుడు స్ఫూర్తితో పోరాటాలు చేయాలి

కొమరం భీం జయంతి వేడుకల్లో గిరిజన సేవ జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:భద్రాద్రి కొత్తగూడెం.మాన్య వీరుడు అదివాసి గోండు బెబ్బులి కొమరం భీం జయంతి సందర్భంగా జల్ జంగిల్ జమీన్ నిదానంతో తిరుగుపాటు పోరాట ఉద్యమ వీరుడు స్ఫూర్తితో ఆయన ఆశయాలు సాధించుట కొరకు నేటి యువత అందరూ కూడా కొమరం భీం ఉద్యమాలు పోరాటాలు చేయాలని ఆదివాసి హక్కులు చట్టాలు సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు వైద్య విద్య ఉపాధి ఉద్యోగం రాజకీయ ఐక్యత తో అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ కొమురం భీం కి ఘన నివాళులు అర్పిస్తున్నాము.ఈ కార్యక్రమంలో గిరిజన సేవక్ సంఘ్ జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర నాయకులు బాడిశ బిక్షం, అరెం ప్రశాంత్, కాకా పృథ్వి రాజ్,కుంజా రవి, తాటి రాజు తదితరులు పాల్గొన్నారు

మునుగోడు నియోజకవర్గంలో ఎంపీ వద్దిరాజు విస్త్రత ప్రచారం

 

మర్రిగూడలో ఇంటింట ప్రచారం,నామాపురం,గుజ్జలలో ఆత్మీయ సమ్మేళనాలు

కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావలసిందిగా ఇతర పార్టీల నాయకులతో మంతనాలు జరిపిన రవిచంద్ర

మునుగోడు నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఘన విజయం

చేకూర్చేందుకు శనివారం విస్త్రత ప్రచారం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,చల్లా

హరిశంకర్,ఆకుల రజిత్ లతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మొదట గట్టుప్పల్ మండలం నామాపురంలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో వారంతా మాట్లాడి గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు.ఆ తర్వాత నామాపురంలో పలు వాడల్లో కాలినడకన తిరిగి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి గురించి వివరించారు.మర్రిగూడ మండల కేంద్రంలో ఎంపీ రవిచంద్ర,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గులాబీ శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.మర్రిగూడలో బీజేపీకి చెందిన,నారాయణపురం మండలం గుజ్జలో కాంగ్రెసు నాయకులలో మంతనాలు జరిపి రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసిన, చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం గురించి ఎంపీ వివరించారు.గుజ్జ రామాలయంలో తెలంగాణను అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసి జాతీయ పార్టీని నెలకొల్పిన కేసీఆర్ ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.అటుతర్వాత మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో వద్దిరాజు ప్రసంగిస్తూ మున్నూరుకాపులు,బిసిల ఉన్నతికి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.ఎన్నికల ప్రచారంలో ఎంపీ వెంట మున్నూరుకాపు ప్రముఖులు విష్ణు జగతి, పర్వతం సతీష్,సత్తినేని శ్రీనివాస్,ఉప్పు సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణ,వాసాల వెంకటేష్, గుండ్లపల్లి శేషగిరిరావు,పాశం కిరణ్ తదితరులు ఉన్నారు.

టిడిపి బలోపేతానికి కృషి చేయాలి

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

నేటిధాత్రి, కైరతాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మాజీ శాసనమండలి సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయనను శుక్ర వారం కొర్రపాటి కిషోర్, అయ్యప్ప, రాజేంద్ర, రిషి వర్మ, హనీష్, సాయి తదితరులు అమీర్ పేట్ లోని తన నివాసంలో మర్యాదగా కలిసి అభినందనలు తెలియజేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 

కరీంనగర్:నేటిధాత్రి 

కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా నగర మేయర్ వై.సునీల్ రావు 3వ డివిజన్ లో పర్యటించారు.కిసాన్ నగర్ లో నూతనంగా చేపట్టిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్,డ్రైనేజీ,సిసి రోడ్ల పనులను కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ తో కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు.అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అన్ని రంగాల్లోని ముందుకు తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నడని మేయర్ సునీల్ రావ్ తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

 


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నబోయిన రవి అన్నారు ఖరీఫ్ సీజన్ లో పండించిన వరి పంట కోతలు ప్రారంభమయు 15 రోజులు గడిచిన ఇప్పటివరకు గ్రామాల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు అని అన్నారు వాతావరణం సహకరించక భారీగా కురుస్తున్న వర్షాలకు రైతులు భయపడి క్వింటల్ 1500 రూపాయలకు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారు అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వంకు మునుగోడు ఎన్నికల మీద ఉన్న శ్రద్ద రైతులపై లేకపోవడం దారుణమన్నారు స్థానిక ఎమ్మెల్యే రైతుల సమస్యలు పట్టించుకోకుండా మునుగోడు లో అభివృద్ధి చేస్తాం అని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని హెచ్చరించారు

నేటి నుంచే జిల్లాలో బాలమిత్ర వారాంతపు శిక్షణ

 


– ఎఫ్ ఎల్ ఎం లో భాగంగా అమలు

– ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం

-తెలంగాణ లోనే మొట్ట మొదటి సారిగా జిల్లాలో అమలు

-బాల మిత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్లజిల్లా, నేటిధాత్రి:
తెలంగాణ లోనే ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు మొట్ట మొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో శ్రీకారం చుట్టిన కార్యక్రమం బాలమిత్ర వారాంతపు శిక్షణ కార్యక్రమం.ఎఫ్ ఎల్ ఎం కార్యక్రమంలో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా 9 వ తరగతి విద్యార్థుల చే బ్యాచింగ్- మ్యాచింగ్ విధానంలో ప్రతి శనివారం మధ్యాహ్నం పూట 1-5 వ తరగతి విద్యార్థులకు మెంటార్ లుగా వ్యవహరిస్తూ వారి అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తారు.

కాగా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ తో కలిసి బాలమిత్ర పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవిష్కరించారు.
కార్యక్రమ అమలుకు సంబంధించి విద్యా శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.

గురుకులం ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించిన ఇంచార్జ్ అర్ సి ఓ డేవిడ్ రాజ్

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి :

భద్రాచలంలో గురుకులం ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలకు మెరిట్ ప్రకారము ఉపాధ్యాయులను పంపించాలని ఇన్చార్జి ఆర్ సి ఓ గురుకులం డేవిడ్ రాజ్ సంబంధిత ప్రిన్సిపాల్ లకు ఆదేశించారు. శనివారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకులం ప్రిన్సిపాల్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మించే గురుకులం కళాశాలకు గురుకులంలో పనిచేసే వారికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వాలని, అలాగే బాలికల కళాశాలలో మహిళ అధ్యాపకులను, బాలుర కళాశాలలో పురుషులను మాత్రమే, నియమించాలని ,ఇటీవల జూనియర్ లెక్చరర్ల పోస్టుల కొరకు అప్లై చేసుకుని నియమితులైన వారిని తప్పనిసరిగా ఆయా కళాశాలలో నియమించాలని, అదేవిధంగా ప్రస్తుతం కళాశాలలో ఖాళీ అయిన పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని ఆయన అన్నారు. ఇంతవరకు గురుకులం పాఠశాలలో కళాశాలలో పనిచేసి వెళ్లిపోయిన వారి జాబితా తయారుచేసి తనకు అందించాలని, ఆ తర్వాత అదే కళాశాలలో పనిచేస్తున్న వారికి మెరిట్ ప్రకారము ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం గురుకుల కళాశాల పాఠశాల లో చదువుతున్న విద్యార్థిని,విద్యార్థుల చదువు పట్ల సంబంధిత ఉపాధ్యాయులు కృషి చేయాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అన్నారు. కొత్తగా నిర్మించే కళాశాలలో సంబంధిత కమిటీల ఆధారంగా వారు సూచించిన దాని ప్రకారం లెక్చరర్లను నియమిస్తామని ఆయన తెలుపుతూ ముఖ్యంగా మెరిట్ ప్రకారము మాత్రమే పరిగణలకు తీసుకొని సంబంధిత అధ్యాపకులను నియమిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, సుదిమల్ల, గుండాల ,దమ్మపేట, భద్రాచలం కిన్నెరసాని ప్రిన్సిపాల్ లు అరుణ్ కుమారి ,హరికృష్ణ, శ్యాం కుమార్ ,దేవదాస్, రవికుమార్ ,ఖమ్మం ఎస్ఓఈ ప్రిన్సిపాల్ బాలస్వామి, గురుకులం పరిపాలన అధికారి నరేందర్ ,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version