రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుమారుడు సాయి నిఖిల్ చంద్ర పుట్టినరోజు వేడుకలు
Category: తాజా వార్తలు
ఘనంగా వద్దిరాజు నిఖిల్ జన్మదిన వేడుకలు
వరంగల్ అక్టోబర్ 26
తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారి కుమారుడు వద్దిరాజు సాయి నిఖిల్ చంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని కొత్తవాడ
మునుగోడు జీవితాలను నిలబెట్టింది కేసిఆర్ :ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
`మిషన్ భగీరథే ప్రజల జీవన ఆయుఃప్రమాణం పెంచుతోంది.
`కట్టాతో మునుగోడులో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
`మిషన్ భగీరథ దాహార్తినే కాదు జీవితాలను కాపాడుతోంది.
`మునుగోడులో మంచినీరే సంజీవని.
`ఆ నీళ్ల కోసమే ప్రజలు దశాబ్దాలు కొట్లాడిరది.
`కనికరం లేని కాంగ్రెస్ నేతల శాపమే ఫ్లోరోసిస్ రక్కసి.
`ఏళ్లు గడుస్తున్నా, ఎంతో మంది తనువుచాలిస్తున్నా కాంగ్రెస్ నాయకులకు జాలి కలగలేదు.
`ముప్పై ఏళ్లుగా రాజకీయం చేస్తున్న కోమటి రెడ్డి సోదరులకు చిత్తశుద్ధి లేదు.
`మునుగోడు మీద రాజగోపాల్ రెడ్డి కి ఎలాంటి ప్రేమ లేదు.
`వెంకట రెడ్డి మంత్రిగా వున్ననాడు మునుగోడుకు మంచినీళ్లు తేలేదు.
`కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు 8 వేల కోట్లు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి చూశారు.
`పులిచింతల ప్రాజెక్టు లాభాలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నారు.
`1972లోనే పివి. నరసింహారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడే నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు నిధులు కేటాయించారు.
`ఆ విషయం కూడా కోమటి రెడ్డి సోదరులకు తెలియదు.
`నల్గొండ మాదే, బ్రాండ్ మేమే అని చెప్పుకుంటే సరిపోతుందా?
`తెలంగాణ వచ్చిన తర్వాతే మునుగోడు దాహార్తి తీరింది.
`ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందుతోంది.
`ఫ్లోరైడ్ బాధితుల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి.
`ఫ్లోరైడ్ ను మునుగోడు నుంచి తరిమిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కింది.
`మునుగోడులో గెలిచేది కారే…`ప్రజలంతా టిఆర్ఎస్ వెంటే…
`జనం నమ్మకమంతా కేసిఆర్ నాయకత్వం మీదే…
హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాకపోతే మునుగోడు లాంటి ప్రాంతాలుఎలా వుండేవో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. గత పాలకుల పాపానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఎంతో మంది అభాగ్యుగులు, ఫ్లోరైడ్ పీడితుల జీవితాలను చూస్తుంటే కళ్లలోనీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అసలు వాళ్లు కొన్ని దాశాబ్దాల కాలంగా పసి తనం నుంచి వయసు మళ్లే దాకా ఎలా బతికి బట్టకట్టారో అన్నది వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఎలా జీవించారో , ఎలా జీవితాలను నెట్టుకొచ్చారన్నది చూస్తుంటే గుండె చెరువౌతుంది. తినే తిండిలో ఫ్లోరైడే…తాగే నీటిలో ఫ్లోరైడే…శరీరమంతా ఫ్లోరైడ్నిండి, ఎండిన కర్రల్లా ఎముకలు ఎక్కడ విరిగిపోతాయో! అనుకుంటూ క్షణ క్షణం బతకడం అంటే ఎంత నరకమో!! వినడానికే గుండె ధైర్యం చాలడం లేదు. అలాంటి మునుగోడు వాసుల గోడు వింటూ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి కేసిఆర్ పుణ్యమా అని మిషన్ భగీరథ ద్వారా అందుతున్న మంచినీళ్లు వారి జీవితాలకు అమృతంలా మారి, ఆయు ప్రమాణాలు పెంచాయో వారి మాటల్లో వింటుంటే ఆనందమేస్తుంది. మిషన్ భగీరధ నీళ్లు వారి జీవిత కాలాన్ని పెంచాయని చెబుతుంటే అంతకన్నా సంబురం మరొకటి వుంటుందా? అని సంతోషం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్రెడ్డితో మునుగోడు నుంచి నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు…. మునుగోడులో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రజల మనోగతాన్ని వివరించారు.
ఆ విషయాలు ఆయన మాటల్లోనే… ప్రచారం కోసం మర్రిగూడ ప్రాంతంలో ప్రజలు చూసినప్పుడు గత పాలకులు చేసినపాపం ఏమిటో? వారికి వత్తాసు పలికిన నాయకులు, కనీసం తమ ప్రాంత ప్రజలకు మంచినీళ్లు ఇవ్వమని అడగలేని దద్దమ్మలాంటి నాయకులు ఇంకా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. సిగ్గూ శరం విడిచి, మానాభిమానుల వదిలేసి, ఇంకా ప్రజలకు తామే దిక్కని చెప్పుకుంటున్నారు. తెలంగాణ వచ్చేదాకా అక్కడి ప్రజలను పాలించిన నాయకులు ఎంత దుర్మార్గులో ప్రజలకు తెలుసు. అందుకే ఆ పార్టీల నాయకులంటే ప్రజలు అసహ్యించుంకుటున్నారు. అంతే కాదు బిజేపిపార్టీకి చెందిన నాయకులు సిగ్గు లేకుండా తాము ఫ్లోరైడ్ సమస్య తీర్చినట్లు చెప్పుకుంటున్నారు. ఓవైపు బాధితుడైన స్వామి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు,మంత్రి కేటిఆర్ తమకు ఎలాంటి సాయం చేశారన్నది చెబుతున్నాడు. తెలంగాణరాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ తమ మునుగోడుకు ఏం చేశారన్నది చెబుతున్నాడు. ప్లోరైడ్ను ఎలా పారద్రోలాడో స్వామి చెబుతున్నాడు. ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు మిషన్ భగీరధ ద్వారా ఎలా వస్తున్నాయో చెబుతున్నాడు. వాటిని చూసుకుంటూ, స్వామి లాంటి వారు చెప్పే మాటలు వింటూ కూడా ఇంకా బిజేపి నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఫ్లోరైడ్ బాధితుడైన స్వామికి సైతం కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇవ్వలేదు. అతని వృత్తి చేసుకునేందుకు అవసరమైన చేయూతనివ్వలేదు. ఫ్లోరైడ్సమస్య మునుగోడులో తీర్చలేదు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్ మునుగోడు గోడును ఏనాడో తీర్చారు. స్వామి లాంటి వారికి డబుల్ బెడ్ రూం ఇచ్చారు. ఆయన కాళ్ల మీద ఆయన నిలబడేందుకు అవసరమైన సెలూన్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందించారు. దివ్యాంగుల పెన్షన్ను కూడా అందిస్తున్నారు. ఇదీ మునుగోడు ప్రాంత ఫ్లోడైడ్ బాధితులైన దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత. నిస్సహాయులైన ఫ్లోరైడ్ బాధితులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో అన్నది ఫ్లోరైడ్ ఉద్యమంలో భాగస్వామైన స్వామి చెబుతున్నారు. ఇవి కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని బిజేపి, కాంగ్రెస్ పార్టీలకు రుచించడం లేదు. అసలు ఈ ప్రాంతంలో రాజకీయం చేయడానికి కూడా ఆ రెండు పార్టీలకు ఎలాంటి అర్హత లేదు. ఓటు అడిగే నైతిక హక్కు వారికి అసలే లేదు. ఏ ఒక్కనాడు ఫ్లోరైడ్ భాధితుల గోడు వినుకుండా దశాబ్ధాల పాటు మునుగోడులో రాజకీయం చేసినందుకు వాళ్లు సిగ్గుపడాలి. ఇప్పుడు మునుగోడు ప్రగతిని చూసి తల దించుకోవాలి.నిన్నటి తరం మునుగోడు బాధలుపట్టని పాలకుల నిర్ధయకు బలై, ఎంతనరకం అనుభవించారో కదిలిస్తే ఒక్కొ ఇంటిలో ఒక్కొ ధీనగాధ వినిపిస్తోంది.
కళ్ల ముందే ఫ్లోరైడ్ శరీరంలో నిండిపోయి, తనువు చాలిస్తున్నవారిని చూస్తూ తమ జీవితానికి కూడా రోజులు లెక్కబెట్టుకున్న వారు, ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల ఫ్లోరైడ్ మహామ్మారి నుంచి తప్పించుకొని బతికి బట్టకట్టామని చెబుతున్నారు. కేసిఆర్ లాంటి పాలకులు వుంటే ప్రజలు ఏ సమస్య రాదని చెబుతున్నారు. అప్పటి రోజులకు ఇప్పటి రోజులు పూర్తి భిన్నం. ఉద్యమ నాయకుడైన కేసిఆర్ తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రమంతా తిరిగారు. అందులో భాగంగా ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లోనూ ఆయన పర్యటించారు. పరిస్దితి తెలుసుకున్నారు. ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశారు. అప్పటిపాలకులతో కొట్లాడాడు. కాని ఫలితం లేకపోయింది. ఆ పాలకులకు కనికరం లేకపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకు నాలుక లేకపోయింది. ఆ నాలుకలో నరం చచ్చుబడిపోయింది. కనీసం ఉద్యమ నాయకుడు కేసిఆర్తో కలిసి గళమెత్తే ధైర్యంలేకపోయింది. వారికి పదవులు కావాలి. కాంట్రాక్టులు కావాలి. ప్రజల గోడు విన్నది లేదు. మునుగోడు బాధ పట్టించుకున్నది లేదు. ఫ్లోరైడ్ మూలంగా ప్రజలు పిట్టాల్లా రాలిపోతున్నా, ఉమ్మడి పాలకులతో కొట్లాడాలన్న సోయి రాలేదు. ఉద్యమ కాలంలో మునుగోడు బాధలు చూసిన కేసిఆర్ తెలంగాణ రాగానే మిషన్ భగీరధ ఫలితాలు ముందు మునుగోడుకే అందించాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. కొన్ని విషయాలు వింటుంటే వారి జీవితానుభవాలు పగవారికి కూడా రాకూడదని అనిపిస్తుంది.
ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలంటే ఉద్యోగులు కూడా ముందుకు వచ్చేవారు కాదని తెలిసి ఆశ్చర్యపోయాను. మునుగోడులోని మర్రిగూడ మండలంలో పనిచేయాలంటే ఉద్యోగులు మరింత భయపడేవారట. వాళ్లు ఇక్కడి మంచినీళ్లు తాగలేక దాహం తీర్చుకునేందుకు యూరిన్ను పట్టుకొని, వడబోసి తాగేవారని తెలిసింది. అంత దుర్మార్గమైన పరిస్ధితులను ప్రజలు ఎలా ఎదుర్కొన్నారన్నది విని మనసు చలించిపోయింది. ఇలాంటి పరిస్ధితులు అనుభవించిన వారు చెబుతుంటే ముఖ్యమంత్రి కేసిఆర్ మిషన్ భగీరధ కార్యాక్రమం ఎందుకు ఎంచుకున్నారో అర్ధమౌతుంది. అలాంటి పరిస్ధితులు భవిష్యత్తులో ఏ ప్రాంతానికి రాకూడదన్న బృహత్ సంకల్పంతోనే మిషన్ భగీరధ పథకం తీసుకొచ్చారని ప్రతిపక్షాలకు ఇప్పటికైనా అర్ధం కావాలి. మిషన్ భగీరధ ఎంత విజయవంతమైన సంక్షేమ పథకమో అప్పుడర్ధమౌతుంది. మాట్లాడేవారు చాలా మాట్లాడతారు. ఒక్కసారి మునుగోడు ప్రజలు బాధలు చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మంచినీళ్ల విలువ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తెలియకున్నా, మునుగోడులో మంచినీళ్లే అమృతంతో సమానం. జీవితాలను నిలబెడుతోంది. అర్ధాంతర ఆయువులను అడ్డుకుంటోంది. గత చేదు జ్ఞాపకాలను చెరిపేస్తుంది. భవిష్యత్తును అందమైన లోకం చేస్తుంది. మునుగోడు ప్రజల జీవితాలను ఆనందమయం చేసింది నీళ్లే…ఆ నీళ్ల కోసమే దశాబ్దాలు వాళ్లు పోరాడిరది. మాకు ఏమీ ఇవ్వకున్నా ఫరావాలేదు. మంచినీళ్లివ్వండి మహాప్రభో అని డిల్లీదాకా వెళ్లే, ఉత్తచేతులు చూపించారు. మళ్లీ ఊసెత్తలేదు. నీళ్లకోసం నిధులు విడుదల చేస్తామని చెప్పి మాట మార్చారు. మర్చిపోయారు. ప్రజలు జీవితాలను ఆగం చేశరు. తెలంగాణ వస్తే గాని మునుగోడు లాంటి ప్రాంతాల బాధ తీరదని చెప్పారు. తెలంగాణ తెచ్చాక మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే కాదు, తినే తిండిలో, తాగే నీళ్లలో ఫ్లోరైడ్లేకుండా చేశారు…ఫ్లోరైడ్ ను పెంచి పోషించిన పాపాత్ములకు రాజకీయాల్లో స్ధానం లేకుండా చేశారు…అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్నే కొలుస్తున్నారు. టిఆర్ఎస్నే గెలిపిస్తామని చెబుతున్నారు.
పూటకోమాట…!
`మాయమాటలు…ఊసరవెల్లి రంగులు?
`రెండు రోజుల్లో మూడు మాటలు!
`కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీస్
`రాజకీయ దివాళా కోరుతనం అంటున్న జనం…
`ఇంత దగాకోరు మాటలు గతంలో ఎవరూ మాట్లాడలేదంటున్న కాంగ్రెస్ శ్రేణులు….
`నేనే పిసిసి అంటాడు….ఈసారికి తమ్ముడిని గెలిపించాలంటాడు…
`కాంగ్రెస్ గెలిచేది లేదంటున్నాడు!
`నన్ను నమ్మనప్పుడు పార్టీలో ఎందుకుంచుకుంటున్నారంటాడు…!
`రాజకీయాలనుండి తప్పుకుంటానంటాడు….
`నేనిక్కడే వున్నా నేనెక్కడికి పోలేదన్నాడు…
`రెండు రోజులకు ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం…
`ఇన్ని జిత్తుల మారి వేషాలా?
`ప్రజా ప్రతినిధిగా ఇన్ని అబద్దాల?
`ఎన్నికలలో గెలవడానికి నమ్మి నెత్తిన పెట్టుకున్న పార్టీకే వెన్నుపోటా!
`తమ్ముడు కాంట్రాక్టు కోసం…
`అన్న ,తమ్ముడి రాజకీయం కోసం…
`ఓట్లేసిన జనాన్ని వెర్రివెంగలప్పలను చేద్దాం!
`మంటెక్కి వున్న కాంగ్రెస్ నేతలు!
`గతంలో డిల్లీలో వుండి సోనియా గాంధీ చేసిన ధర్నాలో పాల్గొనలేదు..!
`రాహుల్ గాంధీ జోడో యాత్రకు డుమ్మా కొట్టాడు…!
`నమ్మి మునుగోడు చేతిలో పెడితే నిండా ముంచిన అన్నాదమ్ములు!
హైదరాబాద్,నేటిధాత్రి:
నేను నిజాయితీ పరుడిని…నేను ప్రజల కోసం త్యాగం చేసే నాయకుడిని…ప్రజల ప్రతినిధిని…పేదోళ్లకు అండగా వుండే నాయకుణ్ణి…అని చెప్పుకునే గొప్పలన్నీ ఉత్తవే అని, నమ్మించి మోసం చేయడానికే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరూపించుకుంటున్నాడు. ఇంత కాలం ఆయన మాటలు నమ్మిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక నాయకుడు తన స్వార్ధం కోసం కూడా ఇంత కాలం నమ్మించగలడా? ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన కోసం పనిచేస్తూ, తన ఎదుగుదలకు పార్టీని వాడుకుంటూ, ఇంకా ఆ పార్టీలోనే వుంటూ, ఇంత కాలం పదవులు అనుభవిస్తూ, పార్టీకే గోతులు తవ్వుతూ తమ బ్రాండ్ అసలు నిజస్వరూపం ఇప్పుడు చూపిస్తున్నాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో వుండడం వెంకటరెడ్డికి కూడా ఇష్టం లేదు. కాకపోతే ఇప్పటికిప్పుడు తన పదవికి రాజీనామా చేసే ధైర్యం లేదు. తమ్ముడి కోసం త్యాగం చేయాలని వున్నా, అదును కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక వేళ రాజగోపాల్రెడ్డి మునుగోడులో గెలిస్తే, జంప్ అయ్యేందుకు సిద్దంగానే వున్నాడు..లేకుంటే కాంగ్రెస్లోనే కొనసాగాలన్న అంతర్మధనంలో వున్నాడు. తనంటత తాను వెళ్లిపోవాలని వున్నా, భవిష్యత్తులో ప్రజలు నమ్మరన్న భయం కూడా ఆయనను వెంటాడుతోంది. అందుకు పార్టీకి నష్టం చేకూర్చే మాటలు మాట్లాడుతూ, తనను బైటకు సాగనంపితే వెళ్ధామని చూస్తున్నాడు…స్వయంగా ఆయనే నన్ను భరించమని ఎవరంటున్నారు… నా ప్రవర్తన నచ్చపోతే పంపించండని పార్టీకి సవాలు విసిరే మాటలు కూడా మాట్లాడాడు. అంటే తనను కాంగ్రెస్ పార్టీ బైటకు పంపిస్తే దాన్ని కూడా సానుభూతికింద వినియోగించుకుందామని చూస్తున్నాడు. కాని ప్రజలు అంత అమాయకులా?
గతంలో ఎన్నడూ వెంకటరెడ్డి వంటి నాయకులను చూడలేదన్నది రాజకీయాలు తెలిసిన వారు అంటున్న మాట.
ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుబంధం వున్న పార్టీని ఇంత కాలం తన స్వలాభం కోసమే వెంకటరెడ్డి వినియోగించుకున్నాడన్నది నిజం. ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది. ఆయన నిజ స్వరూపం చూపించుకున్నాడు. అంతటి సీనియర్ నాయకుడు పూటకో మాట…గంటకో తిరకాసు రాజకీయం చేయడం అన్నది ఎక్కడా చూడలేదు… రెండు రోజుల్లో మూడు రకాలైన మాటలు మాట్లాడి, తనకు నాలుక మడతెట్టడం చాలా సులువు అని నిరూపించుకున్నాడు. జనం వెర్రి వెంగలప్పలని చెప్పకనే చెబుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి చూస్తుంటే కూడా వెంకటరెడ్డి మాట్లాడే మాటలు వెగటుపుట్టిస్తున్నాయి. చండూరు సభలో అద్దంకి దయాకర్ మాటలు తనను గాయపర్చాయని చెప్పి కొంత కాలం సాగదీశాడు…తాను ఎంతో మనస్తాపానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. తనకు క్షమాపణచెప్పాలన్నాడు. అద్దంకిని పార్టీనుంచి పంపించేయాలన్నాడు. తర్వాత ఏదో సందర్భంలో రేవంత్ రెడ్డి ఐపిఎస్, హోంగార్డుల మాటలు పట్టుకొని దాన్ని పెద్ద రాద్దాంతం చేశాడు…అలా కొంత కాలం గడిపాడు…ఆఖరుకు అద్దంకి దయాకర్తోపాటు, రేవంత్రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు…అబ్బే…నా మనసు కరగలేదన్నాడు. రేవంత్రెడ్డి క్షమాపణ చెబితే మునుగోడు ప్రచారం గురించి ఆలోచిస్తానన్నాడు. తీరా రేవంత్ క్షమాపణ చెప్పాక తూచ్ అన్నాడు. నాకు మనస్తాపం ఇంకా తగ్గలేదన్నాడు. సీనియర్లందరి చేత పట్టుబట్టించి పాల్వాయి స్రవంతికి టిక్కెట్టు వచ్చేలా రాజకీయం చేశాడు… రేవంత్ను అలా దెబ్బకొట్టాడు…గాంధీ భవన్లో పాల్వాయి స్రవంతిని దీవించి, మళ్లీ తూచ్ అన్నాడు…తమ్ముడి కోసం సెల్ఫోన్ ప్రచారం మొదలు పెట్టాడు…అదేంటని మీడియా ప్రశ్నిస్తే ఆ ఆడియా ఇప్పటిది కాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు… పార్టీ మీ మీద గుర్రుగా వుందని మీడియా ప్రశ్నిస్తే ఎందుకు ఎవరు భరించమంటున్నారంటూ పార్టీని ప్రశ్నించాడు…ఆఖరుకు ఆస్ట్రేలియా వెళ్లి, నాకు రాజకీయాలంటేనే ఇష్టం లేదన్నాడు. ఇంకా ఎంత కాలం రాజకీయాలు చేస్తానన్నాడు. మునుగోడు ఫలితం వచ్చే దాకా వెంకటరెడ్డి ఇండియాకు రాకపోవచ్చు…వచ్చి అప్పుడేం చెబుతాన్నది ఆసక్తి కరంగా మారింది.
గత మూడు నాలుగు నెలల కాలం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కమాట మీద నిలబడే నాయకుడు కాదని తనకు తానే నిరూపించుకుంటూ వస్తున్నాడు.
పదే పదే అబద్దాలు చెబుతూ వస్తున్నాడు. అందర్నీ నమ్మిస్తూనే , పార్టీని నిండా ముంచుతున్నాడు. పార్టీకి తీరని ద్రోహం చేస్తున్నాడు. తన తమ్ముడికోసం పార్టీని శ్రేణులను అమోయయానికి గురిచేస్తున్నాడు. పార్టీ శ్రేణులకు ఆశ చూపించి ఓట్లేయించుకునేందుకు విదేశాలనుంచి స్కెచ్ వేస్తున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న వెంకటరెడ్డి వ్యవహార శైలితో విసిగిపోయిన కాంగ్రెస్ ఫార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అందుకు పది రోజుల గడువు పెట్టింది. ఈ లోపు పుణ్య కాలం వెళ్లిపోతుంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కూడా తేలిపోతుంది. అప్పుడు మళ్లీ వెంకటరెడ్డి ఏ రాగం అందుకుంటాడో అని అంటున్నారు. ఇంత దగా కోరు మాటలు గతంలో ఏ నాయకుడు మాట్లాడలేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ మధ్య తనకు తెలసిన కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి, ఈ ఒక్కసారి రాజగోపాల్రెడ్డికి ఓటు వేయమని అడిగాడు. మంచికీ, చెడుకు పనికొచ్చేది మేమే అంటూ చెప్పాడు. అదేంటని మీడియా, పార్టీ ప్రశ్నిస్తే అది ఇప్పటిదికాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాని ఎవరూ నమ్మలేదు. అది ఈ మధ్య మాట్లాడిన మాటలే అని తేటతెల్లమయ్యాయి. అంతే కాదు ఫోన్లోనే తానే పిసిసి ప్రెసిడెంటునౌతానని చెప్పాడు. ఇలా రెండు నాలుకల మాటలు అనడం కన్నా, ఊసరవెళ్లి రంగులు అని చెప్పడం కరక్టుగా వుంటుందని రాజకీయ పార్టీలంటున్నాయి.
నిజానికి వెంకటరెడ్డి కాంగ్రెస్కు ఎప్పటినుంచో దూరంగా వుంటున్నాడు.
ఎందుకంటే పిపిసి అధ్యక్షుడిని నేనే అని కలలు గన్న వెంకటరెడ్డికి అధిష్టానం షాక్ ఇచ్చింది. రేవంత్ను పిసిసి చేసింది. దాంతో అప్పటినుంచి అక్కసు మొదలై, పార్టీకి దూరమయ్యేందుకే చూస్తున్నాడు. రేవంత్రెడ్డి రూ.50 కోట్లుపెట్టి పిసిపి కొనుక్కున్నాడని అన్నాడు. ఇక గాంధీభవన్ మెట్లు ఎక్కనన్నాడు. కాని ఏ మాట మీద ఆయన నిలబడలేదు. రేవంత్తో కలసి ముచ్చట్లు బాగానే వుంటాయి…తర్వాత పక్కకు జరగ్గానే విమర్శలు అంతే విధంగా వుంటాయి. ఆ మధ్య సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ విచారణ జరిగింది. ఆ సమయంలో సోనియాగాంధీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ర్యాలీ జరిపారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏక కాలంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు జరిగాయి. అదే సమయంలో వెంకటరెడ్డి పార్లమెంటులో వున్నాడు. తమ్ముడు రాజగోపాల్రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్షాతో మంతనాలు జరిపారు. ఇక తాజాగా రాష్ట్రంలో రాహుల్గాంధీ జోడో యాత్ర జరుగుతోంది. కాని వెంకటరెడ్డి ఆస్ట్రేలియాలో వున్నాడు. ఇంతకన్నా నయ వంచన ఏదైనా వుంటుందా? పార్టీ ఎంపిగా వుంటూ, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా, కోవర్టు రాజకీయాలు చేయడాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. పార్టీ నమ్మి మునుగోడు చేతిలో పెడితే తమ్ముడు నిండా ముంచి పోయాడు…నల్లగొండ రాజకీయాలు అన్న వెంకటరెడ్డి చేతిలో పెడితే పార్టీనే నామరూపాలు లేకుండా చేస్తున్నాడు…! నైతికతకు అర్ధాలు మార్చుతున్నాడు…నమ్మక ద్రోహానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాడని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
కేసిఆర్తో గోక్కుంటే అట్లుంటది మరి!
`ఆరు నెలల ముందే చెప్పిన నేటిధాత్రి…
`ఉద్యమ కారులంతా మళ్ళీ త్వరలోనే సొంత గూటికి…
` కేసిఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేతలకు ఒక్క పిలుపు చాలు…
`కేసిఆర్ చిరునవ్వు వాళ్లకు కొండంత అండదండలు.
`మళ్ళీ త్వరలోనే ఉద్యమకారులతో కారు కళకళ…ప్రతి పక్షాలు విలవిల.
` ఒక్క అడుగు దిగితే తెలంగాణ మొత్తం ఏకమైతది…
` ఉద్యమకాలం మళ్ళీ కళ్లముందు కనిపిస్తది…
` ఉద్యమకారుల అడ్డా మళ్ళీ ఉరకలెత్తుతది…
`ఉద్యమ కాలంలోనే రాజకీయం రుచిచూపించారు…
` ఉద్యమాన్ని, రాజకీయంతో రంగరించారు.
` తెలంగాణ ఆకాంక్షల వేధిక టిఆర్ఎస్సే…
`తెలంగాణ అభివృద్ధి ప్రధాత కేసిఆరే…
`ప్రగతిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తోంది కారే…
`చేతికి బలం లేదు?కమలానికి తావులేదు?గులాబీకి ఎదురులేదు?
`తెలంగాణ వాదుల మదిలో మాట, ఉద్యమ కారుల నోటి మాట.
` తెలిసో తెలియకో ప్రతి పక్షాల మాయలో పడిన వాళ్లు మళ్ళీ సొంత గూటికే…
`ఆత్మాభిమానం నూటికి నూరుపాళ్లు టిఆర్ఎస్ తోటే…
` నెగ్గడం తెలిసిన కేసిఆర్ కు తగ్గడం కూడా తెలుసు…
`తెలంగాణ సాధనలో గొంగళి పురుగునైనా ముద్దాడానన్న గొప్ప సాధకుడు.
`తెలంగాణ భవితవ్యానికి దిశానిర్దేశకుడు…
`అలిగిన తమ్ముళ్లను అక్కున చేర్చుకునే అన్న అతడు…
`పెద్ద తరానికి పెద్ద కొడుకు…
` మొత్తంగా తెలంగాణ కు రక్షకుడు…
హైదరాబాద్,నేటిధాత్రి:
ముందే ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో సున్నితంగా చెప్పాడు. ఒక దశలో హెచ్చరించి మరీ చెప్పాడు. అయినా బిజేపి వినలేదు. పదే పదే నన్ను గోకాలని చూస్తున్నారు. నా ఓపికను పరీక్షిస్తున్నారు. మరి నేనే గోకడం మొదలు పెడితే, ఇక ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడిదాక గోకుతానో తెలియదు అని సిఎం అన్నాడు. అంతే కాదు. ఒక్కసారి నన్ను గోకి మీరు వదిలేసినా, ఇక నేను వదలేయను. ఏం రాజకీయం నడపాలో అది నడుపుతానన్నాడు. అన్నట్లునే బిజేపిని మునుగోడు ఉప ఎన్నికల వేల కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నలుగురు పార్టీలో చేరారో లేదో..ఇక అంతా అయిపోయినట్లే…ఇక పార్టీ అధికారంలోకి వచ్చే…అన్నంత కలలు గన్న బిజేపికి ఒక్కసారిగా దిమ్మతిరిగి బొమ్మ కనిపించే సన్నివేశం రాష్ట్ర రాజకీయాల్లో కనిపించింది. గతంలో టిఆర్ఎస్లో కీలక భూమిక పోషించిన ఇద్దరు నేతలు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద పరిణామం…గతంలో టిఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వలేదని దాసోజు శ్రవణ్ కాంగ్రెస్లో చేరాడు. తర్వాత ఈ మధ్య కాలంలోనే బిజేపిలో చేరాడు. కాంగ్రెస్లో రేవంత్రెడ్డి పొమ్మన లేకపొగబేట్టే రాజకీయాలను సహించలేని దాసోజ బిజేపిలో చేరాడు. కాని ఆయన మనస్తత్వానికి సరిపోని బిజేపిని వదిలి మళ్లీ టిఆర్ఎస్లో చేరాడు. ఇక మరో నేత, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఆ మధ్య బిజేపిలో చేరాడు. కాని తన స్వభావానికి, బిజేపికి ఎక్కడా సొసగలేదు. దాంతో తిరిగి మళ్లీ ఆయన టిఆర్ఎస్లో చేరాడు. ఉద్యోగ సంఘ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ కారుడిగా, టిఆర్ఎస్ ఎమ్మెల్సీగా పార్టీలో ఆయనకు ఎనలేని గౌరవం వుండేది. బిజేపిలో చేరిన నాడు తప్ప, మళ్లీ ఆయన గురించి అడిగిన వారు లేరు. పిలిచిన వారు లేరు. పేరుకే తప్ప బిసిలకు బిజేపిలో ప్రాధాన్యత లేదన్నది గుర్తించి, మాతృ సంస్ధ టిఆర్ఎస్కి చేరుకున్నాడు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్ బిజేపికి రిటన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవల మునుగోడు నామినేషన్ రోజు కూడా టిఆర్ఎస్తో వున్న మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాత్రికి రాత్రి పార్టీ కండువా మార్చుకున్నాడు. డిల్లీలో మూడు రోజులు మకాం వేసి, బిజేపిలో చేరాడు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పాయింటు మెంటు ఇవ్వడం లేదన్న బూర నర్సయ్య గౌడ్ మూడు రోజుల పాటు బిజేపి పెద్దల ఆశీస్సుల కోసం ఎదరుచూసినప్పుడు ఆత్మగౌరవం ఎటు పోయిందని టిఆర్ఎస్ కూడా ప్రశ్నించింది.
ఒక్కసారి కేసిఆర్ మెట్టు దిగితే ఎలా వుంటుందన్నదానిపై నేటిధాత్రి ఆరు నెలల క్రితమే చెప్పింది.
కేసిఆర్ మదిలో వున్న ఆలోచనలు అక్షర బద్దం చేసింది. త్వరలో మళ్లీ ఉద్యమ కారులను తిరిగి సొంత గూటికి తెప్పించేందుకు కేసిఆర్ ఆలోచిస్తున్నాడని కూడా చెప్పడం జరిగింది. అదును కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ చూస్తున్నాడు. నిజానికి ఏ ఉద్యమ కారుడిని కేసిఆర్ వదులుకోలేదు. వదిలేయలేదు. కావాలనే వాళ్లకు వాళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేసుకుంటూ వెళ్లారే…గాని కేసిఆర్ ఎవరినీ వదిలుకోవాలని అనుకోలేదు. వారికి వాళ్లు, ఎవరో చెప్పిన మాటలు విని భ్రమపడి ఇప్పుడు కేసిఆర్పక్కన లేకుండా ఇతర పార్టీలలో వున్నారు. ఇప్పటికే వాళ్లు ముఖ్యమంత్రి కేసిఆర్ నుంచి ఒక్క పిలిస్తే చాలు అనుకుంటూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కేసిఆర్తో కలిసి నడిచారు. వాళ్లను కూడా కేసిఆర్ ఎంతో గౌరవించారు. అందరినీ అక్కున చేర్చుకున్నాడు. వారి వారి స్ధాయిని బట్టి పదవులు కూడా ఇచ్చాడు. ఒక దశలో 2004లో మంత్రి పదవులు కూడా అవకాశం కల్పించి, వారి నాయకత్వాలకు భరోసా కల్పించాడు. అయినా వారిలో పదవుల ఆశతోనో, లేక ఎవరో చెప్పిన మాటల వల్లనో కాని వారు టిఆర్ఎస్కు దూరమయ్యారు. కేసిఆర్ నాయకత్వం నుంచి దూరంగా జరిగారు. దూరమైన తర్వాత గాని వారికి తత్వంబోధ పడలేదు. ఇప్పటికీ వారిని కదిలిస్తే ఆ జ్ఞాపకాలే చెబుతుంటారు. అవి తప్ప చెప్పుకోవడానికి వారికి ప్రత్యేకంగా ఎలాంటి జ్ఞాపకాలు లేవు. అంతగా వారి జీవితాలను కేసిఆర్ ప్రభావితం చేశారు. అయినా వారు కేసిఆర్ను వదిలి వెళ్లిపోయారు. కాని ఇప్పటికీ వాళ్లు ఎందుకు కేసిఆర్ను వదిలి వెళ్లిపోయామన్న అన్న ఆలోచనల్లోనే వున్నారు. కేసిఆర్ నుంచి పిలుపొస్తుందేమో అన్న ఆశతో కూడా ఇంకా వున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజున మళ్లీ గులాబీ గూటికి చేరాలన్న ఆలోచనలతో , కేసిఆర్ కళ్లలో పడాలన్న తపనతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, ఆయనకు దగ్గరవ్వాలని చూశారు. కాని మళ్లీ ఆ ప్రయత్నం వాళ్లు చేయలేదు. కేసిఆర్ కూడా వారి గురించి పట్టించుకోలేదు. కాకపోతే మళ్లీ వారంతట వాళ్లు వస్తామంటే వద్దంటామా? అన్న ఆలోచనలోనే కేసిఆర్ వున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత కేసిఆర్. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఆయన కోపం కూడా అంతే..ఒక్కసారి వద్దనుకున్నాక ఆయన మళ్లీ ముఖం చూసే పరిస్దితి వుండదు. కాని ఆయన ఎవరినీ వద్దనుకోలేదు. వాళ్లే వెళ్లిపోయిన సందర్భాలు. అందుకే ఎవరైతే మళ్లీ సొంత గూటికి రావాలని చూస్తున్నారో! వాళ్లు వస్తే ఆదరించేందుకు సైతం కేసిఆర్ సిద్దంగా వున్నాడు. వారికి తగిన ప్రాదాన్యత కల్పిస్తాడనడంలో సందేహం లేదు.
నిజం చెప్పాలంటే ఒక రకంగా కేసిఆర్ అదృష్ట జాతకుడు.
ఆయన ప్రతి అడుగు ఒక సంచలనమే…ప్రతి మాట ఒక వినూత్నమే…ఆయన ప్రతి నిర్ణయం కొత్తదనమే…ప్రతి ఆచరణ ఆదర్శమే…అందుకే ఆయన రాజకీయాల్లో చేరిన నుంచి వేసిన ప్రతి అడుగు ఒక చారిత్రక సత్యమే కాదు. అవసరంగా కూడా మారింది. కాంగ్రెస్నుంచి టిడిపిలో చేరి, ఆయన గురువు మీదనే గెలిచి శభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో తనదైన పాత్రతో ప్రత్యేకతను చాటుకున్నాడు. ఏ చంద్రబాబు అయితే నమ్మించి మోసం చేశాడో..కేసిఆర్ సేవలు తీసుకొని వదిలేశాడో…ఆయనను గద్దెదించిన నాయకుడైన చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత చంద్రబాబును తెలంగాణ రాజకీయాలకు పూర్తిగా దూరం చేశాడు. ఇదీ కేసిఆర్ చాణక్యం. చంద్రబాబు లాంటి నాయకుడినే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి, తెలుగుదేశం పార్టీనే తెలంగాణలో లేకుండా చేసిన నాయకుడు కేసిఆర్. అసలు ఏ తరం ఆలోచించలేదు. ఉద్యమ తరం కూడా తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్దితి వస్తుందని ఊహించలేదు. ఎవరూ ఊహించని వాటిని నిజం చేయడమే కేసిఆర్ రాజకీయం.
తనకు ఎదరు లేని, తిరుగులేని నాయకత్వాన్ని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్కు వ్యతిరేకంగా రాజకీయం చేయడం అంటే అందుకు ఎంతో సాహసం కావాలి.
ఎంతో నేర్పు కావాలి. రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్నవారై వుండాలి. అంతే కాని ఎప్పుడొచ్చాం కాదని సినిమా డైలాగు ప్రతిపక్షాలు చెబితే చాలదు. కేసిఆర్ను ఎదుర్కొనే శక్తి సమీప కాలంలో ఎవరికీ లేదు. ఏపార్టీకి ఆ అవకాశం రాదు. ఎందుకంటే రాజకీయ చాణక్యమే కాదు, అభినవ అభిమన్యుడు కూడ ఆయనే… పద్మవ్యూహంలాంటి రాజకీయాలను చేధించి, శాసించగలిగే నాయకుడు కేసిఆర్. వ్యూహాలు సృష్టించడం తెలుసు. పద్మవ్యూహాలు చేదించడం తెలుసు. ఆ పద్మవ్యూహంలో ప్రతిపక్షాలను చిక్కించి ఉక్కిరిబిక్కిరి చేయడం కూడా కేసిఆర్కే తెలుసు. మునుగోడు ఉప ఎన్నిక అనగానే చంకలు గుద్దుకున్న బిజేపి ఆశలు ఆవిరైపోతున్నాయి. అందుకే జాతీయరాజకీయాలను కూడా తన కనుసైగలతో శాసించగలిగే స్ధాయిలో వున్నాడు. దేశ రాజకీయాలను ఏలేందుకు అన్ని అర్హతలున్న ఏకైక నాయకుడు. అందుకే ఆయనంటేనే ఉద్యమకారులకు ఒక నమ్మకం. తెలంగాణ నేతలకు ఒక వరం. తెలంగాణ రాజకీయాలే కాదు, ప్రగతి కూడా కేసిఆర్తోనే సాధ్యం. ఎందుకంటే జాతీయ స్దాయిలో పాలన సాగిస్తున్న బిజేపి ఏ ఒక్క ప్రాజెక్టు తెలంగాణకు ఇచ్చింది లేదు. తెలంగాణ అభివృద్ధి కాంక్షించింది లేదు. నలుగురు ఎంపిలున్నా ఇచ్చిన నిధులు లేవు. వారు చేసిన అభివృద్ధి లేదు. అలాంటిది రాష్ట్రంలో వారు బలం పెరిగితే తెలంగాణకు వచ్చేది లేదు…మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లినట్లే…అందుకే ఆ పరిస్దితి కేసిఆర్ ఎప్పుడూ రానివ్వడు. తెలంగాణలో మరే పార్టీకి చోటు లేదు. రాష్ట్రం సాధించుకున్న టిఆర్ఎస్దే ఎప్పటికీ అధికారం…! కేసిఆర్దే నాయకత్వం. అదే జనం మాట…ప్రజల నోట…!
కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు
కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు.
అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలు 14 రకాల ఐటమ్స్ తో వడ్డించారు. సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ
*** టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి చీఫ్ గెస్ట్ గా పాల్గొని హాజరైన మెంబెర్స్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇండియా కెనడా బంధం మరింత ముడి వేయించుకోవాలని ఆకాంక్షించారు.
*** ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించిన బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులు జగపతి రాయల,సూర్య కొండేటి, ప్రతాప్ బొల్లవరం, విష్ణు వంగల, రమేష్ తుంపర, శ్రీకాంత్
*** ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ కెనడా చరిత్రలో ఇది అతిపెద్ద దీపావళి ఈవెంట్ ,ఇలాంటి మరిన్ని మనదైన పండుగలను జరుపుతూ కెనడాలోని తెలుగువారికి
*** అలాగే ఇంకో ఆర్గనైజర్ సూర్య కొండేటి మాట్లాడుతూ 120 మంది వాలంటీర్లు రాత్రి ప్రగలు శ్రమించి దీపావళి ఈవెంట్ ఇంత గొప్ప సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
విస్తృత పోడు భూముల సర్వే
–పోడు భూముల సందర్శన
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపురం మండలంలోని రెవెన్యూ గ్రామం ఖానాపురం-2 పరిధిలోని మనుబోతుల గడ్డ,బండమీదిమామిడి తండా గ్రామపంచాయతీల పరిధిలోని పోడు వ్యవసాయ భూముల సర్వేను ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ప్రారంభించారు.ఎంపీపీతో కలిసి బండమీదిమామిడి తండా సర్పంచ్ బోడ లక్ష్మీ-బాలరాజు, ఎంపీటీసీ సభ్యులు బోడ భారతి-పూలునాయక్,స్థానిక రైతులతో కలిసి సర్వే అధికారులతో వాగులు,వంకలు దాటుతూ సర్వేను ఎంపీపీ ప్రకాష్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పోడు రైతులకు శాశ్వత పరిష్కారం కోసం ల్యాటు ట్యూడ్ ద్వారా సమగ్రమైన సమాచారాన్ని రైతుల ముందుకు తీసుకవచ్చి ఎఫ్ఆర్సి పట్టాలు(హక్కు పత్రాలు) ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదగా అందిస్తామని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
చతిస్గడ్, యూపీ వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన
వరంగల్ జిల్లా, నేటిధాత్రి : ఎనుమాముల మార్కెట్ లో శనివారం రోజున బీహార్ ,చతిస్గడ్, యూపీ వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేస్తున్న ఇండియన్ డిసైపోల్ మిషన్ ఆధ్వర్యంలో. గత.నెల రోజుల నుండి. పాఠశాల నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లిన. వరంగల్ జిల్లా ఎస్సీ/ ఎస్టీ. అట్రాసిటీ. విజిలెన్స్. అండ్. మంటరింగ్ కమిటీ మెంబర్.
మరియు. వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు దళిత రత్న,నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ అక్కడి వాతావరణం పిల్లల పరిస్థితి చూసి బాధ చెందడంజరిగింది. పిల్లలకు సరిగా బట్టలు లేకపోవడం అనారోగ్యంతో ఉండడం. శుభ్రత లేకపోవడం చూశాను చదువు ఏమాత్రం లేకపోవడం చూసి. బాధపడ్డాను. వీరికి తక్షణమే .స్కూలుకు అవసరమైన గది సౌకర్యం కావాలివీడి పరిస్థితిని చూసి. బాధపడి నేను జిల్లా కలెక్టర్ గోపికి ఈ విషయం తెలపరుస్తానని శుభ్రత కోసం శనివారం రోజున సబ్బులను ఇచ్చినాను ఇట్టి పాఠశాలను నిర్వహిస్తున్న. కలకోట్ల,స్వామి దాస్ ,ఝాన్సీ దంపతులు,పోలేపాక సుమన్ పుష్ప. దంపతుల ,సేవలు మరువలేనివి.
ఈ పాఠశాలలో,సుమారు 65 మంది ,పిల్లలకు ,విద్యాబోధనలు. అందిస్తున్నారు.
సెలవు రోజుల్లో కాంటాలు
కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి:
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు సెలవు ప్రకటించగా శనివారం ట్రేడర్లు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల తూకాలు చేసి లావాదేవీలను జరపడం శోచనీయం.మార్కెట్ పని దినాలలో కాకుండా మార్కెట్ సెలవు దినాల్లో లావాదేవులు జరపడంతో మార్కెట్కు రావలసిన ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.అలాగే మార్కెట్ నియమాలకు విరుద్ధంగా ట్రేడర్లు వ్యవసాయ ఉత్పత్తులను ఖరీదు చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.మార్కెట్ పాలకమండలి ఎన్ని నియమ నిబంధనలు పెట్టిన కూడా ట్రేడర్లు నడుచుకోకవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇటీవల సేమ్ డే సేమ్ చెక్ సమస్య మరిచిపోక ముందే ఇలాంటి ఘటనలు జరగడం మార్కెట్ పేరు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశాలు ఉంటుందని పలువురు బహిరంగనే విమర్శిస్తున్నారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు : కలెక్టర్ కె.శశాంక
మహబూబాబాద్,నేటిధాత్రి:రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ,దిగుబడి అంచనాల మేరకు కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.జిల్లాలో వానాకాలం-2022 -23 సీజన్ లో 91,385 ఎకరాల్లో పత్తి పంట వేసినట్లు, ఇందులో 7లక్షల 31 వేల 080 క్వింటాళ్ల పంట ఉత్పత్తి అంచనా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.8శాతం తేమ కలిగిన రకానికి క్వింటాలుకు 6380/- రూపాయలు కనీస మద్దత్తు ధర లభించనుందని, రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే విధంగా చూడాలని,అవసరమైన తేమ శాతం నిర్ధారణ,తూకం యంత్రాలు సిద్ధంగా ఉంచాలన్నారు.ప్రతి కేంద్రం వద్ద రవాణాకు వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు.నాణ్యత ప్రమాణాలను,తేమశాతాన్ని పాటించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.తూనికలు, కొలతలు శాఖ ద్వారా జిన్నింగ్ మిల్లుల తూకపు మిషన్లను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు.
పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో 5 జిన్నింగ్ మిల్లులు, రోజుకు 1250 బేళ్ళ సామర్థ్యం కలవి ఉన్నాయనీ,కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా పత్తికి కనీస మద్దతు ధర, వానాకాలం 2022-23 నాణ్యత ప్రమాణాలపై రూపొందించిన
పోస్టర్ ను జిల్లాకలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్,
జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకట్ రెడ్డి,సి.సి. ఐ. అధికారి
ఎం.ఉమామహేశ్వర
రావు,ఇంఛార్జి జిల్లా వ్యవసాయ అధికారి ఎం. లక్ష్మినారాయణ,ఆర్.టి.ఓ. రమేష్ రాథోడ్,అగ్నిమాపక శాఖ అధికారి డి.నాగేశ్వరరావు, లీగల్ మెట్రోలజీ అధికారి ఎస్.విజయ్ కుమార్, డి.ఎస్.పి. డి.రమణ , తొర్రూరు, మహబూబాబాద్ ఎ.ఎం.సి.చైర్మన్లు పి.శాంత, బి.ఉమ ,కార్యదర్శులు ఎన్.రాజ,
జి.రాజేందర్,జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఎ.వేణుగోపాల్ రెడ్డి, ఎస్.జనార్ధన్,రవికిరణ్,
తదితరులు పాల్గొన్నారు.
పోలీసు స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్
చెన్నారావుపేట ఎస్ ఐ తోట మహేందర్
చెన్నారావుపేట-నేటిధాత్రి:పోలీసు అమరవీరుల వారోత్స వాలను పురస్కరించు కుని చెన్నారావుపేట మండల కేంద్రంలోని కస్తూరిభా బాలికల పాఠశాల,జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థులకు ఎస్ ఐ తోట మహేందర్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల కు పోలీసు స్టేషన్ లో ఉన్నటు వంటి వివిధ రకాల టెక్నాలజీ ల గురించి వివరించారు సమాజంలో జరుగుతున్న విషయాలు పోలీసుల పాత్ర అనే అంశాలను ఆయుధాలు పట్ల ఎస్ ఐ విద్యార్థులకు వివరించారు ఈ27 వరకు పోలీసు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతాయి అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించాలి
జేరిపోతుల జనార్దన్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,తెలంగాణ
సిద్దిపేట జిల్లా: నేటి ధాత్రి
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఇతర వృతివిద్యా కోర్సుల ఫీజులను వెంటనే తగ్గించాలని, ఫీజులు పెంచుతున్నట్టు ఇచ్చిన జీవోను వెనక్కు తీసుకోవాలని అదే విధంగా ఈ మధ్య జరిగిన గ్రూప్-1 పరీక్షలలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్దన్ అన్నారు.. శుక్రవారం నాడు సిద్దిపేట లోని స్థానిక ఎడ్ల గురువారెడ్డి భవన్ లో ఆయన మాట్లాడారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఫీజులను గత ఫీజుల కంటే భారీగా పెంచి విద్యార్థులపై మోయలేని భారం మోపిందని విమర్శించారు.. కరోనా తరువాత ఇప్పుడు ఫీజులు పెంచడంతో తమ పిల్లలను ఉన్నత విద్యను అందించలేమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు..ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెంచిన ఫీజుల జీవోలను వెనక్కి తీసుకోవాలన్నారు..ఫీజుల పెంపు ప్రయివేటు కాలేజీలకు కొమ్ముకాసే విధంగా ఉందని మండి పడ్డారు.. రాష్ట్రంలోని 159 ఇంజనీరింగ్ కాలేజీల్లో టిఏఎఫ్ఆర్ సి సిఫారసులతో ప్రభుత్వం ఫీజులు పెంచడం సరికాదన్నారు.. కనీస ఫీజులను సైతం 35 వేల నుండి 45 వేల రూపాయలకు పెంచారని,పెంచిన ఫీజులతో రాష్ట్రంలోని 40 కాలేజీల్లో లక్ష దాటిందని ఆందోళన వ్యక్తం చేశారు.. ఫీజులను పెంచడం ఠీ పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవుతారని, వెంటనే జీవోలను వెనక్కు తీసుకోవాలన్నారు..
అదే విధంగా ఈ నెల 16 వ తేదీన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని, రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనల ప్రకారం ఉదయం10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించగా హైదరాబాద్ లలాపేట్ శాంతినగర్ లోని సెయింట్ ప్రాన్సిస్ డి సెల్ఫ్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో మాత్రం మధ్యాహ్నం1 గంట నుంచి 3.30 నిర్వహించారని,ఉదయం నిర్వహించాల్సిన పరీక్ష మధ్యాహ్నం నిర్వహించడం ఏంటని వారు ప్రశ్నించారు.. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించిన ఆయా సెంటర్ లపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు..టిఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు.. వేలాదిమంది అభ్యర్థుల భవిష్యత్తు పై ఆధారపడిన గ్రూప్-1 పరీక్ష నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఉన్నతస్థాయి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు సంగెం మధు,జిల్లా అధ్యక్షులు చిట్యాల శేఖర్ లు ఉన్నారు..
పాఠశాలను సందర్శించిన డీఈవో
మహబూబాబాద్,నేటిధాత్రి:
మహబూబాబాద్ మండలం లో ఎంపీపీ ఎస్ నందమూరి నగర్ ఉర్దూ మీడియం పాఠశాల ను ఆకస్మికంగా జిల్లా విద్యాధికా అరేయ్ డాక్టర్ అబ్దుల్ హై సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యలు పరిశీలన చేశారు.మూడవ వ తరగతి విద్యార్థిని ఎండి.ముష్క్కాన్ ను ఉర్దూ మరియు ఇంగ్లీష్ పై పలు ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టం జరిగింది.హెచ్ ఎం ను పాఠశాలలో విద్యా అభివృద్ధి తగిన సలహాలు సూచనలు చెయ్యటం జరిగింది.అలాగే ప్రతి పాఠశాల లో ఎఫ్ ఎల్ ఎన్ (ఫాండేషన్ లిటెర్రస్సి న్యూమరాస్ ప్రోగ్రాం) సమర్థవంతగా నిర్వవించవలెనని,దీనికి సంబందించిన లెషన్ ప్లాన్ ప్రకారం టిఎల్ ఎం తయారు చేసి మైక్రో లెవెల్ బోధన గావించాలని ప్రతి ఉపాధ్యాయులు తెలంగాణ స్టూడెంట్ ట్రాకర్ ఆప్ డౌన్ లోడ్ చేసుకొని ప్రతినెలా ప్రగతి నమోదు చెయ్యాలన్నారు.ఎట్టి పరిస్థితి లో నిర్లక్ష్యం చేయకూడదని చేసిన వారిపై రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.డీఈవో వెంట ఎ సిజిఈ మందుల శ్రీరాములు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం
ములుగు జిల్లా,నేటిధాత్రి:ములుగు జిల్లా కేంద్రంలోని రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు యొక్క ప్రాధాన్యత వివరించారు జిల్లా ఉద్యాన అధికారి బీ వి రమణ ఈ సంవత్సరం ములుగు జిల్లాలోని 1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్యాన మరియు వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కృషి చేద్దామని ఉద్యాన మరియు వ్యవసాయ అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ పథకం నందు మొక్కలకు 90% రాయితీ పోను రైతు వాటాగా 20 రూపాయలు ఒక్క మొక్క కు చెల్లించవలెను అదేవిధంగా డ్రిప్ కొరకు ఎస్సీ ఎస్టీ రైతులకు 100% మరియు మిగతా రైతులకు 90 శాతం రాయితీ ఇవ్వబడును మొక్కల నిర్వహణ కొరకు సంవత్సరానికి హెక్టార్కు 5వేల రూపాయల చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతర పంటల సాగు కొరకు హెక్టార్కు 5వేల రూపాయలు చొప్పున మొదటి మూడు సంవత్సరాలు ఇవ్వబడును అని తెలియజేశారు వ్యవసాయ నివిస్తరణ అధికారులను తమ క్లస్టర్ నందు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సాహనిచ్చగలరని సూచించారు ఈ సమావేశం కు జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా ఉద్యాన అధికారి ములుగు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మండల వ్యవసాయ అధికారులు ఉద్యాన అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు ఆల్ఫామ్ కంపెనీ ప్రతినిధులు మరియు డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు
ప్రభుత్వస్కూల్లో ముందస్తు దీపావళి సంబురాలు
భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా,నేటిధాత్రి:భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ ఇందిరా నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాధమిక పాఠ శాల లో శనివారం ముందస్తు దీపావళి సంబురాలు నిర్వ హించారు. దీపావళి పండుగ ప్రాధాన్యత గురించి విద్యార్థులకు హెచ్ఎం ఎం. జ్యోతి రాణి వివరించారు.బాణాసంచా కాల్చే సమయంలో, దీపాలు వెలిగించే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు తెలియజేప్పారు.పటాకులు కాలుస్తూ విద్యార్థులు ఎంజాయ్ చేశారు. స్కూల్ హె చ్ఎం జ్యోతి రాణి ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో టీచర్స్ ఇన్నయ్య, సరస్వతి, సుజాత,విద్యార్థుల తల్లి దండ్రులు కళ్యాణి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
కొమరం భీమ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన టిపిసిసి సభ్యులు వగ్గెల పూజ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నేటిధాత్రి: అశ్వరావుపేట .జల్ జంగిల్ జమీన్ అని నినాదించి ఆదివాసుల హక్కుల అలుపెరగని పోరాటం చేసిన స్వయంపాలన అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించిన అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకురాలు టి పి సి సి సభ్యులు వగ్గెల పూజ .
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
తంగళ్ళపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు నక్క రవి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులైన నాంపెల్లి కవిత బాలరాజు 29000, అస్మ బేగం ఫజల్ 18500, బండి దేవదాస్ రామయ్య 18000, జే మల్లేశం నారాయణ 20000, పెద్ది దేవేంద్ర ఎల్లయ్య 7000, వి శైలజ తండ్రి తిరుపతి 20000, చెక్కులను సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్నలింగం, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, తెరాస నాయకుడు బుస్సలింగం, గుర్రం కిషన్ గౌడ్, తంగళ్లపల్లి శ్రీనివాస్, అమరగొండ ప్రశాంత్, చేతుల మీదిగా అందజేయడం జరిగింది.
డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు
రామారెడ్డి,నేటిధాత్రి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్. ఉప్పల్ వాయి. గిద్ద గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం కామారెడ్డి కళాశాల లకు సమయనుకూలంగా ఉదయం 2 ట్రిప్పులు సాయంత్రం 2ట్రిప్పులు ఆర్టీసీ బస్ వేసినందుకు డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు మరియు మా సమస్య ను అధికారులకు వివరించి బస్ ఎపించినందులకు ఎమ్మెల్యే సురేందర్ కి. ఎంపీపీ దశరథ రెడ్డి కి మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు కి ఉప్పల్ వాయి ఎంపీటీసీ ఉమాదేవి దత్తాద్రి కి ఇరు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గురుమూర్తి.లచ్చిరెడ్డి. జరా. గంగయ్య.భూంపల్లి దత్తాద్రి. రామగౌడ్.రంజిత్ గౌడ్.దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా, నేటిధాత్రి: కోర్ట్ ప్రాంగణంలో జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ సిరిసిల్ల N. ప్రేమలత మరియు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మరియు పోలీస్ అధికారులతో 12-11-2022 రోజున జరుగు జాతీయ లోక్ అదాలత్ పైన సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ..12-11-2022 రోజున జరుగబోయే జాతీయ లోక్ అదాలత్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించి,పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి కృషి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు..
ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జిలు శ్రీమతి శ్రీలేఖ, సట్టు రవీందర్, జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య,ప్రతీక్ సిన్హా, ఏపీపీ లు సతీష్ కుమార్,విక్రాంత్, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, డిఎస్పీ లు ,విశ్వప్రసాద్ నాగేంద్రచారి, సి.ఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, వెంకటేష్,బన్సీలాల్, శ్రీలత,నవీన్ కుమార్, ఎస్.ఐ లు కోర్ట్ కానిస్టేబుల్ పాల్గొన్నారు..
పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన ఊకంటి గోపాలరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:
కొత్తగూడెంలోని జడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఈనెల 28న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినము సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏడవ జూనియర్ వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన షిప్ టోర్నమెంట్స్ కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్నట్లు విలేకరుల సమావేశంలో జిల్లా వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి తూము చౌదరి, నాగేందర్ త్రివేణి, సోమిరెడ్డి, రజాక్, పోసాని వీరభద్రం, వడ్డం సతీష్, మైనార్టీ నాయకులు గౌస్, దేవరగట్ల ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు