మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి బాలుడు ఆత్మహత్య.

మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి బాలుడు ఆత్మహత్య

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

 

పని కోసం వెళితే… ప్రాణాన్ని సైతం వదులుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన జెల్ల రమేష్ -లక్ష్మి కుమారుడు వేసవికాలం సెలవులు ఉండడంతో తమకున్న నాలుగు మేకలు మేపేందుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఈ నేపథ్యంలో కోలా కొమరమ్మ అనే మహిళ ఒక మేకను కోయటానికి జెల్ల శ్రీకాంత్ (14) పత్రి అశోక్ లను పిలవగా మేకను కోసిన తర్వాత శ్రీకాంత్ అతని చేతులకు అంటిన రక్తాన్ని నీళ్ల తొట్టిలోని నీటితో శుభ్రపరుస్తుండగా తొట్టిలోని నీటితో చేతులను ఎందుకు కడుగుతున్నావని ఆగ్రహించిన కొమురమ్మ కులం పేరుతో దూషిస్తూ విచక్షణ రహితంగా కర్రతో కొట్టడంతో బాధ భరించలేక మనస్థాపం చెంది సమీపాన ఉన్న గుర్తుతెలియని క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో ఉండడంతో ఇది గమనించిన స్థానికులు నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు బాలుడు మృతి చెందడంతో గ్రామంలోని విషాద ఛాయల అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడి చిరుప్రాయంలోనే తండ్రి మృతి చెందాడు. మృతునికి తల్లి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మృతుడి తల్లి జెల్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు కోల కొమరమ్మపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై గోవర్ధన్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version