డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణ శివారు హోతి(కె)లో కేటాయించిన ఇళ్లను అప్పగించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో గృహ సముదాయాల వద్ద శనివారం బైఠాయించారు. ఇవాళ ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా తాళాల అప్పగింత ఉంటుందని ప్రకటించి మళ్లీ వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. వారం రోజుల్లో ఇళ్లు అప్పగించకపోతే తాళాలు పగలగొట్టి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.