errajanda perutho buvyaparam, ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం

ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం

వారికి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధం లేకున్నా కమ్యూనిస్టులమని చెప్పుకుంటారు. ఎర్రజెండా పేరుతో గుడిసెలు వేస్తారు. ఖరీదైన స్థలాలను గుర్తించి అమ్మేసుకుంటారు. అధికారుల సాయం తీసుకోవడానికి వారికి స్థలం ఆశ చెపుతారు. ఖరీదైన ప్రభుత్వ స్థలంలోనే అధికారులకు ప్రహరీ గోడ కట్టి, బోర్‌ వేసి స్థలాన్ని ఆక్రమించి అప్పగిస్తారు. అధికారుల స్థలాన్ని కంటికి రెప్పలా కాపాడుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే స్థలం ఆ అధికారిది కాదు మాదే అని దబాయిస్తారు. ఎం చూస్తారో చేసుకొండని బెదిరిస్తారు. విలేకరులు వివరణ అడిగిన అలాగే అంటారు. అసలు మీకేం సంబంధం మేము ఇలాగే కబ్జా చేస్తాం అంటూ అవగాహన లేకుండా మాట్లాడుతారు. స్థానిక పోలీసు అధికారికి సైతం ఇందులో వాటా ఉందంటారు. ప్రభుత్వ భూములు యథేచ్చగా కబ్జా అవుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లే వ్యవహరిస్తారు. హన్మకొండలో జరుగుతున్న ఈ యధేచ్చ కబ్జాపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కథనం సోమవారం సంచికలో…

collector sir…mudokannu teravali, కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి…

కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి…

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ జిల్లా డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతికి పాల్పడిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ చేస్తూ, డిఐఈవో, సూపరింటెండెంట్‌ను విధుల్లో నుండి తొలగించాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సమితి(ఎవిపిఎస్‌), అంబేద్కర్‌ విద్యార్థి సమాఖ్య(ఎబిఎస్‌ఎఫ్‌), డెమోక్రాటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌(డివైఎఫ్‌), భారతీయ విద్యార్థి మోర్చా(బివిఎమ్‌), బహుజన దళిత్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌(బిడిఎస్‌ఎఫ్‌) సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత పదిరోజులుగా డిఐఈవో కార్యాలయంలో క్యాంపు పేరిట వచ్చిన డబ్బులను కార్యాలయంలోని కొందరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోపాటు డిఐఈవో, సూపరింటెండెంట్‌లు అవినీతికి పాల్పడ్డారని ‘నేటిధాత్రి’ దినపత్రికలో వస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సంబంధిత జిల్లా యంత్రాంగం అధికారుల తీరును విమర్శిస్తున్నారు.

అవినీతి ఉద్యోగులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

డిఐఈవో కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీని నియమించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను గుర్తించి వెంటనే సస్పెండ్‌ చేయాలి. స్టేషనరీ పేరుతో ముక్కున వేలేసుకునే విధంగా లెక్కలు రాశారని, క్యాంపులో పనిచేయని వారి పేర్లను రాసి దొంగపేర్లతో, దొంగల అకౌంట్లలో డబ్బులు వేసుకుని అందినకాడికి దండుకున్నారని, కొన్ని బిల్లులపైన తీసుకున్న వారి సంతకాలు లేకున్నా వారికి చెల్లించినట్టుగా బిల్లులు తయారుచేసి అసలు పనిచేసిన వారికి తెలియకుండా ఎక్కువ మొత్తంలో నొక్కేశారు. పేపర్‌ వాల్యుయేషన్‌ చేసే లెక్చరర్‌ల విషయంలో కూడా ఒక్కో టేబులో ఉన్న వారికంటే ఎక్కువ మంది ఉన్నట్టు బిల్లులు డ్రా చేశారు. వీటిని కమిటీ చేత విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.

డిఐఈవో, సూపరింటెండెంట్‌లను ఉద్యోగాల నుండి తొలగించాలి

క్యాంపునకు చెందిన డబ్బులను డ్రా చేయడంలో వీరిద్దరి పాత్ర కీలకమైనదని, వీరు సంతకాలు చేస్తేనే బిల్లులు డ్రా చేసే అవకాశం వుంటుంది. ఫిఫ్టీ-ఫిఫ్టీ దండుకునేందుకు పన్నిన ప్రణాళికలో భాగమే ఈ అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. క్యాంపు రిజిష్టర్‌లలో సంతకాలు లేని వారికి బిల్లులు, డబ్బులు డ్రా ఎలా చేస్తారని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ అవినీతి భాగోతానికి సూత్రధారి డిఐఈవో, పాత్రధారి సూపరింటెండెంట్‌లేనని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, ఇంటర్మీడియట్‌ ఆర్జేడీ వెంటనే స్పందించి విచారణ చేయించి బాధ్యులను ఉద్యోగాల నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ఇంటర్‌ బోర్డు కమీషనర్‌, హైదరాబాద్‌, తెలంగాణ విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రాలు ఇస్తామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

harithahaaraniki mokkalu siddam cheyali, హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి

హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి

హరితహారం కార్యక్రమ సమయానికి మొక్కలను అందించేందుకు సిద్ధంగా ఉంచాలని రాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి సూచించారు. శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాయినగర్‌లో నిర్వహిస్తున్న నర్సరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహార కార్యక్రమానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. అదేవిధంగా సాయినగర్‌లోని వాటర్‌ట్యాంకులను సందర్శించి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, ప్రజలకు స్వచ్చమైన నీటిని అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సినారె ఆధునాతన గ్రంథాలయ పనులను పర్యవేక్షించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీలకు సూచిస్తూ నాణ్యతాయుతంగా పనులు కొనసాగేలా చూసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

 

summer season, badibatapia avagahana, సమ్మర్‌ సీజన్‌, బడిబాటపై అవగాహన

సమ్మర్‌ సీజన్‌, బడిబాటపై అవగాహన

సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌లో సమ్మర్‌ సీజన్‌, బడిబాటలపై తెలంగాణ సాంస్క తిక సారధి, టీమ్‌లీడర్‌ గడ్డం శ్రీనివాస్‌ అవగాహన కల్పించారు. శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌ గ్రామాలు పెద్దూర్‌, జగ్గారావుపల్లి, సర్దాపూర్‌ గ్రామాల్లో జిల్లా సమాచారశాఖ ఆదేశాలతో గడ్డం శ్రీనివాస్‌ బందంచే సమ్మర్‌ సీజన్‌, టిబి వ్యాధి, బడిబాటలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లితండ్రులు కషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏవిధమైన ఫీజులు లేకుండా నాణ్యమైన విద్య, మంచి సంస్క తి, ఆరోగ్యమైన వాతావరణం ఉంటుందని వివరించారు. కూలి పనులు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు, మండుటెండలకు అందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం, సాయంత్రం పనులు చేసుకోవాలని అన్నారు. ఎండలోకి వెళ్లే ముందు తలపాగా, టోపి ధరిస్తూ, గొడుగు, మంచినీరు వెంట ఉంచుకోవాలని చెప్పారు. పిల్లలు, వద్దులు, గర్భిణులు, బీపీ, షుగర్‌, గుండె జబ్బులు ఉన్నవారు, ధీర్ఘ వ్యాధిగ్రస్తులపై వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కనుక ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, తెల్లని, వదులైన కాటన్‌ దుస్తులు ధరించడం మంచిదని సూచించారు. మజ్జిగ, నిమ్మ, కొబ్బరినీళ్లు తాగడం, అధికంగా ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిదని, ఎండలో ఎలాంటి రక్షణ లేకుండా తిరగడం, నీళ్లు తక్కువగా, మత్తు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా వడదెబ్బ తగులుతుందని తెలిపారు. తల తిరగడం, తీవ్ర తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం, బాగా జ్వరం రావడం అనిపిస్తే సత్వర చికిత్స అందజేయాలని, లేకుంటే ప్రమాదకరం, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని వాతావరణం, నీడలో కాసేపు సేదతీర్చి మంచినీరు తాగించి, తడిగుడ్డతో తుడిచి, చల్లని నీటిస్నానం చేయించి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వివరించారు. అదేవిధంగా టీబీ వ్యాధి గాలి ద్వారా మైక్రో బ్యాక్టీరియా, ఒకరినుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అని, టిబి2 వరకు పైగా జ్వరం, తేమడతో కూడిన దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి, నీరసం, తిమ్మిర్లు, రాత్రిపూట చెమటలు, ఈ లక్షణాలు కనిపిస్తే సమీప ఏరియా ఆస్పత్రులలో పరీక్షలు చేయించాలని సూచించారు. టిబి అని నిర్దారణకు వస్తే భయపడే అవసరం లేదని, తగు జాగ్రత్తలతో డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ, వ్యాధికి తగు మందుల కోర్సును వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణకోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఎడ్మల శ్రీధర్‌రెడ్డి, ఆకునూరి దేవయ్య, గడ్డం దేవయ్య, కాయితోజు ప్రవీణ్‌, పొత్తురి రాజు, కొడుమోజు లక్ష్మినారాయణ, ఆయా గ్రామల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

 

మడిపల్లిలో మహాయజ్ఞం

మడిపల్లిలో మహాయజ్ఞం

మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం బొడ్రాయి ఉత్సవాల చివరిరోజు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు బొడ్రాయి వద్ద పూజలు చేసి మహాయజ్ఞం చేశారు. గ్రామస్తులంతా కలసివచ్చి గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రతిష్టించిన అమ్మవార్లకు కొత్తబట్టలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తమతమ మొక్కులు తీర్చుకున్నారు. వేదపండితులతో ప్రతిఒక్కరు అమ్మవార్ల దీవెనెలు తీసుకున్నారు. గ్రామంలోని వారందరు చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గల గ్రామాల ప్రజలు కూడా మడిపల్లి గ్రామంలోని బొడ్రాయి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ బొడ్రాయి మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఆనందోత్సాహాలతో సాగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ చిర్ర సుమలత విజయ్‌, ఎంపిటిసి ఆకుల ఇంద్రయ్య, రైతు సమన్వయ అధ్యక్షుడు అంచూరి విజయ్‌కుమార్‌, వెలుదండి శ్రీరాములు, రమేష్‌, మాజీ ఎంపిటిసి రాజ్‌కుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

aa ci anthe…maradata…,ఆ సీఐ అంతే…మారదట…!

ఆ సీఐ అంతే…మారదట…!

ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి పేరు చెపితేనే సర్కిల్‌ పరిధిలోని ప్రజలు అమ్మో…అంటున్నారు. సమస్య ఏదైనా ఉంటే పరిష్కారానికి వెళితే చేయి తడపందే పని పూర్తికాదని, అడిగింది సమర్పించుకుంటే మనవైపు ఎంత న్యాయం ఉన్నా కేసు రివర్స్‌ అయిపోతుందని అంటున్నారు. ధర్మసాగర్‌లో సీఐగా వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతిపనికి రేటు కట్టి దండుకోవడం తప్ప బాధితులకు న్యాయం చేసిన పాపానపోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌ గడప తొక్కితే చాలు ఖర్చు కావాల్సిందేనని పైసలు ముట్టజెప్పనిదే ఏ పనికాదంటున్నారు. ధర్మసాగర్‌, రాంపూర్‌ తదితర ప్రాంతాలలో భూముల ధరలు అధికంగా ఉండడం, భూతగాదాలు, భూకబ్జాలు సైతం అదే స్థాయిలో ఉండడంతో తనకు అవసరం లేకున్నా సీఐ శ్రీలక్ష్మి సివిల్‌ మ్యాటర్‌ అని తెలసి కూడా కలుగజేసుకుంటుందని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల వద్ద గొడవలతో స్టేషన్‌కు వెళితే ఇదే అదనుగా భావించి ఎవరు అసలు హక్కుదారులో, ఎవరు కబ్జాకోరల్లో గుర్తించకుండా డబ్బులు ఎవరు ఎక్కువగా ఇస్తే వారివైపే సీఐ మొగ్గుచూపుతుందని, దీంతో ధర్మసాగర్‌ సర్కిల్‌ పరిధిలో అమాయకులు అనేకమంది చుక్కలు చూస్తున్నారని వారు అంటున్నారు.

పోలీసు ఉన్నతాధికారులకు పట్టదా…?

ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి ఇంతా చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు మాత్రం తమకేం తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. రాంపూర్‌ భూవివాదం విషయంలో బాధితులు 2018 సంవత్సరంలో పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు హక్కుదారులం మేమేనని మొరపెట్టుకున్నారు. అయిన ఎవరు స్పందించలేదు. సమస్య పరిష్కారం చేసేందుకు చొరవ చూపలేదని తెలిసింది. సీఐ శ్రీలక్ష్మి విషయంలో సైతం కమిషనర్‌కు ఫిర్యాదులు బాగానే వెళ్లాయట. కానీ సీఐపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ధర్మసాగర్‌ సర్కిల్‌ పరిధిలో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం రాజకీయ ఒత్తిళ్లు అనే అనుమానం సైతం కలుగుతుంది.

సీఐకి బదిలీ ఉండదా…?

ధర్మసాగర్‌లో సీఐ శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు అవుతున్నా ఉన్నతాధికారులు బదిలీ చేయడానికి సాహసం చేయడం లేదని తెలిసింది. రెండు సంవత్సరాలకే లాంగ్‌ స్టాండింగ్‌ పేరుతో బదిలీ చేయడం, పోస్టింగ్‌ లేకుంటే అటాచ్‌లో ఉంచడం కమిషనరేట్‌ పరిధిలో జరుగుతుంది. కానీ అందుకు విరుద్ధంగా సీఐ శ్రీలక్ష్మిని 3సంవత్సరాలు గడిచినా అధికారులు బదిలీ చేయడం లేదు. అయితే భూవివాదాలు, ఇతర గొడవల్లో చేతివాటం ప్రదర్శించి బాధితులను ముప్పుతిప్పలు పెట్టే సీఐ శ్రీలక్ష్మి తనకు బదిలీ అయితే తిరిగి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉండాలని అనుకుంటుందట. నిజానికి ఒక నియోజకవర్గంలోని స్టేషన్‌లో విధులు నిర్వర్తించాక అదే నియోజకవర్గంలోని వేరే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ ఉండదని అంటున్నారు. సీఐ శ్రీలక్ష్మి మాత్రం తాను స్టేషన్‌ ఘన్‌పూర్‌ పట్టణ సీఐగా వెళ్తానంటూ ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక ఎమ్మెల్యే అండతో రెండునెలల క్రితమే ఎమ్మెల్యే విల్లింగ్‌ లెటర్‌ సంపాదించినట్లు తెలిసింది. నిజానికి శ్రీలక్ష్మి ఉన్నతాధికారులను సైతం పట్టించుకోకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి స్థానిక ఎమ్మెల్యే కారణమని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

కమిషనర్‌ సాబ్‌ జర దేఖో

భూముల విషయంలో అతిగా వ్యవహరిస్తూ సివిల్‌ మ్యాటర్‌లో వేలు పెడుతున్న ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి వ్యవహారాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించాలని రాంపూర్‌ భూబాధితులు కోరుతున్నారు. గతంలోనే తాము కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తుచేస్తున్నారు. అసలు హక్కుదారులైన తమను మానసిక వేధింపులకు గురిచేస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని, తమ సమస్య పరిష్కారం చేయాలని వేడుకుంటున్నారు. కబ్జాదారుల ఆట కట్టించి తమను ఆదుకోవాలంటున్నారు.

kabza kathalu endukosam…, ‘కబ్జా’ కథలు ఎందుకోసం…?

‘కబ్జా’ కథలు ఎందుకోసం…?

భూమితో మనిషిది విడదీయరాని సంబంధం. భూమి లేనిది మనిషి జీవించడం అసంభవం. నాలుగుముద్దలు నోట్లోకి వెళ్లాలన్న నాలుగు పైసలు సంపాదించాలన్న భూమి అనేది ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ ప్రపంచానంతటిని తిండిగింజలు అందిస్తూ పోషిస్తున్నది భూమి. భూమి, భుక్తి, విముక్తి అంటూ, దున్నేవాడిదే భూమి అంటూ అనేక ఉద్యమాలు సైతం కొనసాగాయి. ఈ ఉద్యమాలకు భూమే ప్రధాన భూమికగా మారింది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాంటి భూమి ఈ రోజుల్లో వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం కొంతమంది కబ్జాదారులు అమాయకులు, బలహీనుల భూములను బలవంతంగా అక్రమిస్తున్నారు. జీవనాధారం అనుకున్న భూమి నిలువ నీడ కోసం ఇంత గూడు వేసుకోవడానికి ఉపయోగపడే భూమి కొంతమంది బలవంతుల కబంధహస్తలలో చిక్కుకొనడంలో ‘ఏ ఆసరా లేని అమాయకులు భూముల అసలు హక్కుదారులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సహయం చేసి వారు ఎదుర్కొంటున్న కష్టాలను, కబ్జారూపంలో వారికి జరుగుతున్న అన్యాయాన్ని అధికారులకు, సర్కార్‌ దృష్టికి తేవడానికి ‘నేటిధాత్రి’ దినపత్రిక ‘కబ్జా’కథలు శీర్షికను కొనసాగిస్తుంది. కబ్జా అయిన భూముల వివరాలు, కబ్జారాయుళ్ల ఆగడాలతో నిత్యం వేధింపులకు గురిఅవుతున్నావారి వేదనను బహిర్గతం చేసేందుకు మేము సర్వదా సిద్ధంగా ఉన్నాం. దేశంలోని భూసమస్యలు పరిష్కారం అయితే మెజార్టీశాతం ప్రజలు హాయిగా జీవిస్తారనే సత్యాన్ని ‘నేటిధాత్రి’ బలంగా విశ్వసిస్తుంది. అందుకు కొంతమంది బలవంతులు మా ప్రయత్నాన్ని ఆపడానికి బెదిరింపులకు దిగినా, బాధితులపక్షాన వకాల్తా పుచ్చుకుంటే లేనిపోని ఆరోపణలు చేసిన ఏ మాత్రం ఖాతరు చేయకుండా పేదప్రజలపక్షాన ముందుకు వెళుతూ నిఖార్సయిన వార్తలు అందించేందుకే నిత్యం కృషి చేస్తుంది. భూఅక్రమాలు, భూకబ్జాలను వెలికితీసి బాధితులపక్షాన తన గొంతును ‘నేటిధాత్రి’ వినిపించబోతుంది. మీ సమస్యలు ఏం ఉన్నా మాకు తెలియచేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాటి పరిష్కారానికి ‘నేటిధాత్రి’ దినపత్రిక వేదికగా మేము మావంతు కృషి చేస్తామని చెపుతున్నాం. ‘కబ్జా’ కథలు శీర్షికన కబ్జాకోరుల ఆగడాలను ఇక ఆటకట్టిస్తాం.

lingambaba…iduguru dongalu, ‘లింగంబాబా’…ఐదుగురు దొంగలు

‘లింగంబాబా’…ఐదుగురు దొంగలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా డిఐఈఓ కార్యాలయంలో క్యాంపు పేరిట భారీ మొత్తంలో అవినీతి జరిగిందన్నా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అవినీతి బాగోతాన్ని ‘నేటిధాత్రి’ కథనాల ద్వారా పాఠకులకు అందించిన అవినీతి డిఐఈఓ కార్యాలయంలో ఉద్యోగులు అవినీతి పాల్పడ్డారన్న కథనాల ఆధారంగా విద్యార్థి, ప్రజాసంఘాలు కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమవుతున్నట్లు విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు తెలిపారు.

తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న దొంగలు

క్యాంపు పేరిట అక్రమంగా నొక్కేసి అవినీతికి పాల్పడిన ‘ఐదుగురు దొంగలు’ తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. క్యాంపు బాయ్స్‌ పేరిట 90మందికిపైగా పనిచేయకున్నా పనిచేసినట్లుగా పేర్లను సృష్టించి వారి అకౌంట్లలో దొడ్డిదారిన ప్రభుత్వ సొమ్మును వారి ఖాతాలో జమచేశారు. ఇవేకాకుండా స్టేషనరీ, ట్రావెల్స్‌, ఫ్లైయింగ్‌ స్వ్కాడ్స్‌, సిట్టింగ్‌ స్వ్కాడ్స్‌, పేపర్‌ వాల్యూవేషన్‌ చేసిన లెక్చరర్ల విషయంలో కూడా లెక్కకు మించి ఎక్కువ బిల్లులు పెట్టి అక్రమంగా నొక్కేశారు. ఈ విధంగా అవినీతికి పాల్పడిన ఆ ‘ఐదుగురు దొంగలు’ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కమిటీ వేస్తే దొరకడం ఖాయమంటున్న కొందరు

క్యాంపులో జరిగిన అవినీతి లీలలపై వస్తున్న ఆరోపణలపై ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ ఒకవేళ విచారణ కమిటీని నియమిస్తే అందరం దొరికిపోవడం ఖాయమని అవినీతికి పాల్పడిన ఉద్యోగులు ఒకరితో ఒకరు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

(అలీబాబా…’అస్త్రం’ త్వరలో)

kulo thagunitiki katakata, కేయూలో తాగునీటికి కటకట

కేయూలో తాగునీటికి కటకట

కాకతీయ యూనివర్సిటీలో తాగునీటి కటకట ఏర్పడింది. అసలే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయ్‌…చల్లటి నీటితో దాహం తీర్చుకుందాం అనుకున్న విద్యార్థులకు, ఉద్యోగులకు నీళ్లులేక…పనిచేయక అలంకార ప్రాయంగా మిగిలిన ప్రిడ్జ్‌లు దర్శనం ఇస్తున్నాయి. అన్ని డిపార్టుమెంట్లలో తాగునీటికి అధికారులు ప్రిడ్జ్‌లు ఏర్పాటు చేసిన ఇవి పనిచేయక పాడైపోయి వెక్కిరిస్తున్నాయి. అధికారులు మాత్రం ఇదేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో గుక్కెడు నీటికోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

sena layout kabzalu chudatharama…,సేనా లేఅవుట్‌ కబ్జాలు చూడతరమా…

సేనా లేఅవుట్‌ కబ్జాలు చూడతరమా…

లేఅవుట్‌ నిర్వాహకుల కబ్జాలు నానాటికి స్థానిక ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మండలంలో లే అవుట్‌ కొరకు కొనుగోలు చేసిన భూముల్లో, పక్కన ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని దర్జాగా ప్లాట్లను అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ భూములను కొనుగలు చేసి కోట్లు గడించాలన్న వారి ఆలోచన వారి వ్యాపారవ్యవహారాలకు సంబంధించినదైతే అట్టి భూములను ఆనుకుని ఉన్న భూములనే నమ్ముకుని బతుకుతున్న రైతుల జీవితాల్లో చీకట్లు మిగిల్చే పరిస్థితులకు దారి తీస్తున్నాయి. బీద ప్రజలకు సంబంధించి భూముల్లో చిన్న చిన్న తప్పిదాలు ఉంటేనే అమ్మో ఎంత పెద్ద తప్పిదమో అని భూతద్దంలో చూసి పట్టాలు చేయకుండా పక్కనబెట్టే రెవెన్యూ అధికారులు రెవెన్యూ కార్యాలయం పక్కనే నిర్వహిస్తున్న లేవుట్‌లో తప్పిదాల మీద తప్పిదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు అర్జీలు పెట్టుకున్నప్పటికి అధికారులు మాత్రం నిర్వాహకులకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. దీంతో రెచ్చిపోయిన సేన లేఅవుట్‌ నిర్వాహకులు భూములను కబ్జా చేసుకుంటూనే పోతున్నారు.

మిట్టకాలువ మాయం.!

సేన లేఅవుట్‌ కొరకు కొనుగోలు చేసిన భూములలో ఉన్న మిట్టకాలువను లేఅవుట్‌ నిర్వాహకులు అక్రమంగా కబ్జాచేసి కాలువను మాయం చేశారు. దీంతో మిట్టకాలువ పరిధిలో ఉన్న వ్యవసాయ భూములకు చెందిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కబ్జా చేసి మూసివేసిన మిట్టకాలువ కింద సుమారు 60మంది రైతులకుపైగా వ్యవసాయ భూములు కలిగి ఉన్నారు. కాలువను మూసిన విషయమై నిర్వాహకులను స్థానిక రైతులు ఇదేంటని ప్రశ్నించినప్పటికీ మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకొండని చెప్పినట్లు సమాచారం.

పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా..?

లేఅవుట్‌ నిర్వహిస్తున్న స్థలాన్ని ఆనుకుని 29 సర్వే నంబర్‌ ఉంది. ఈ సర్వే నంబర్‌లో మొత్తం 16ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉన్నది. కొనుగోలు చేసిన భూమి పక్కన ప్రభుత్వభూమిని కబ్జా చేసినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 516, 517, 305లను అనుకున్న ప్రభుత్వభూమిలో సుమారు 12 నుండి 15గుంటల భుమిని కబ్జాచేసి లేఅవుట్‌లో కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

బ్లూప్రింట్‌లో కొంత లేఅవుట్‌ చేస్తున్నది మరింత….

కుడాకు, గ్రామపంచాయితికి సమర్పించిన కొనుగోలు భూమికి సంబంధించి బ్లూప్రింట్‌లో చూపిన భూమి విస్త్తీర్ణానికి ప్రస్తుతం నిర్వాహకులు చేస్తున్న విస్తీర్ణానికి మధ్య చాలా తేడాలు ఉన్నట్లు స్పష్టంగా తెలియవస్తుంది. బ్లూప్రింట్‌ ప్రకారం 13ఎకరాల భూమిని చూపినప్పటికీ కాలువ, ప్రభుత్వ భూములు కలుపుకుని మొత్తం 16ఎకరాల విస్తీర్ణం వరకు లేఅవుట్‌ కొరకు అభివృద్ధి చేస్తున్నారు.

అధికారిక నిర్వాహకులు వేరు…పెత్తనం చేసే నిర్వహకులు వేరు..?

అసలే లేఅవుట్‌ వ్యాపారం కోట్ల రూపాయల పెట్టుబడులు, రాబడుల వ్యవహారం. దీంతో నిర్వాహకులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్‌ నిర్వహణకు సంబంధించి రాజకీయ ప్రముఖుల అండదండలు ఉన్న వ్యక్తులే ఇందులో భాగస్వాములుగా ఉండడం అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అందరికి తెలిసిన విషయమే. సరిగ్గా మండలకేంద్రంలో నిర్వహిస్తున్న లేఅవుట్‌ విషయంలో కూడా ఇదే జరుగుతన్నదని ప్రచారం జరుగుతుంది. సేనా లేఅవుట్‌కు సంబంధించి గ్రామపంచాయితికి సమర్పించిన భూముల కొనుగొళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో గంజి నవీన్‌, ఆమంచ మహేశ్వర్‌లు కొనుగోలుదారులుగా ఉన్నారు. కాని లేఅవుట్‌ నిర్వహణ తదితర వ్యవహారాలు మాత్రం స్థానిక నేతలకు దగ్గరి పరిచయస్తులు, రాజకీయ మిత్రులే చూస్తున్నారని స్థానిక ప్రజలు పలు సంధర్భాల్లో అధికారులకు సమర్పించిన దరఖాస్తులలో తెలియజేశారు. ఏదిఏమైనా వ్యాపారవ్యహరాలను అడ్డుపెట్టుకుని ప్రజలకు అన్యాయం చేసే విధంగా ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను మింగెయాలని చూసే వారి ప్రయత్నాలు మానుకోవాలని పలు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు.

కబ్జాలపై కుడా అధికారుల ద్వందవైఖరి..

మండలకేంద్రంలో సేన లేఅవుట్‌లో జరుగుతున్న కబ్జాలను గురించి కుడా అధికారులు నిర్వాహకులకు అండగా ఉండే విధంగా వ్యహరించడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాసంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఅవుట్‌లో ప్రభుత్వ భూముల కబ్జాల గురించి కుడా అధికారులు స్పందించకుండా నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరించడం అధికారుల నిర్లక్ష్యవైఖరిని ప్రతిబింబించడంతోపాటు వారు నిర్వాహకులకు కొమ్ముకాస్తున్నారని ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నారు. కుడా అనుమతి కొరకు సంబంధిత సేన లేఅవుట్‌ ఫైల్‌ టెక్నికల్‌ విభాగంలో ఉన్నట్లు సమాచారం.

లేఅవుట్‌ కబ్జాలపై రెవెన్యూ, కుడా అధికారుల పాత్రే కీలకం..

లేఅవుట్ల నిర్వహణలో భూములకు సంబంధించి క్లియరెన్స్‌ ఇచ్చేది. రెవెన్యూ శాఖ అధికారులు వారి నుండి ఫైల్‌ ముందుకు వెళ్ళిన తర్వాత కబ్జాలకు పాల్పడినట్లైతే స్థానిక రెవెన్యూ అధికారులు, కుడా అధికారులకు విషయం దృష్టికి వస్తే తగు విచారణ చేసి చర్యలు తీసుకోవడం, అనుమతుల రద్దులకు సంబంధించి రెవెన్యూ, కుడా అధికారుల పాత్రలే కీలకంగా ఉంటాయి. మరీ మండలకేంద్రం లే అవుట్‌ జరుగుతున్న కబ్జా అంశాలపై ఇదివరకే సమాచారం తెలిసినప్పటికి అధికారులు వాయిదాలను ఎంచుకుని కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయాలపై స్పందించి నిర్వాహకుల ఆగడాలకు చెక్‌ పెట్టనట్లతే సమాజంలో విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదంతోపాటు ఉన్నతాధికారుల నుండి అధికారిక చర్యలకు బాధ్యులవుతారనే విషయాన్ని గుర్తెరిగితే మంచిదని అంటున్నారు పిర్యాదిదారులు.

baryanu nariki champina bartha, భార్యను నరికి చంపిన భర్త

భార్యను నరికి చంపిన భర్త

కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అతి కిరాతరంగా నరికి చంపిన ఘటన మండలంలోని కట్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…కట్రియాల గ్రామానికి చెందిన చెవ్వల్ల యాదగిరికి గత 24 సంవత్సరాల క్రితం రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మల్లికాంబతో వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితంలో ఇరువురు కుమారులు జన్మించారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరికి తరచూ కలహాలు రావడంతో మల్లికాంబ తన స్వగ్రామమైన కొత్తూరుకు వెళ్లిపోయి అక్కడే జీవనం సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో యాదగిరి మల్లికాంబలకు కలిగిన ఇరువురు కుమారులు పెరిగి పెద్దవారు కావడంతో తల్లిదండ్రులు వివాదాలు పక్కనపెట్టి కలిసి ఉండాలని ఇరు గ్రామాలకు చెందిన పెద్దమనుషులు పంచాయితిలో నిర్ణయించారు. వీరి నిర్ణయం మేరకు గత 8సంవత్సరాలుగా తల్లిగారి ఇంటి వద్దే ఉన్న మల్లికాంబ తిరిగి అత్తగారి గ్రామమైన కట్రియాలకు ఈనెల 16న వచ్చి తన కుటుంబంతో కలిసి ఉంటుంది. అయితే వచ్చిన తర్వాత ఇద్దరు బాగానే ఉన్నప్పటికీ శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో భర్త యాదగిరి మల్లికాంబ నిద్రిస్తున్న సమయంలో పదునైన ఆయుధంతో ఆమెపై విచక్షణారహితంగా నరకడంతో ఆమే నిద్రిస్తున్న మంచంపైనే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి ప్రవీన్‌, ప్రశాంత్‌ కుమారులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు స్థానిక ఎసిపి మధుసూధన్‌, సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సంపత్‌లు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.

dongalu…dongalu…vullu panchukunnattlu, దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు

దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు

– ఉద్యోగుల అకౌంట్లలో దొంగ సొమ్ము జమ

– సూపరింటెండెంట్‌ పనేనని అనుమానం

– డిఐఈవోకు తెలిసే జరిగింది…?

– వాటాల పంపకంలో మనస్పర్థలు..

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన అవినీతిలో కొందరి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మధ్య పంపకాల విషయంలో తలెత్తిన వివాదంతో డిఐఈవో కార్యాలయంలో జరిగిన అవినీతి విషయం బయటికొచ్చినట్టు తెలుస్తున్నది. కార్యాలయంలోని సూపరింటెండెంట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సహాయంతో క్యాంపునకు సంబంధంలేని వ్యక్తుల అకౌంట్లను సేకరించి తప్పుడు పేర్లను సృష్టించి దొంగ లెక్కలురాసి వారి అకౌంట్లలో జమచేశారని సమాచారం. ఇలా కలెక్ట్‌చేసిన అకౌంట్లలో డబ్డులు వేసి స్వయంగా సూపరింటెండెంట్‌ మళ్లి తిరిగి ఇవ్వాలని అడగటంతో అసలు కథ ఇక్కడ అడ్డం తిరిగింది. అకౌంట్లలో పడిన డబ్బులకు పర్సంటేజి ఇస్తానని తీసుకొని వారికి కమీషన్‌ ఇవ్వకపోవడంతో కొందరు గొడవ చేయడంతో ఈ కథ బయటికొచ్చింది. ఓ ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి క్యాంపు ఆఫీస్‌లో పనిచేయని కొంతమందితోపాటు వారి బంధువుల అకౌంట్లను సేకరించి సూపరింటెండెంట్‌కు ఇచ్చాడు. ఇలా ఇచ్చిన అకౌంట్లలో ఆయన డబ్బులు చెక్కుల ద్వారా జమ చేయడం జరిగింది. తిరిగి ఇచ్చే క్రమంలో ఈ విషయంలో కొంతమందికి గొడవ జరగటంతో అసలు విషయం బయటికొచ్చింది.

(ఎవరా…సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగి….వివరాలు త్వరలో)

dongalu…dongalu…vullupanchukunntulu, దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు

దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు

– ఉద్యోగుల అకౌంట్లలో దొంగ సొమ్ము జమ

– సూపరింటెండెంట్‌ పనేనని అనుమానం

– డిఐఈవోకు తెలిసే జరిగింది…?

– వాటాల పంపకంలో మనస్పర్ధాలు..

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన అవినీతిలో కొందరి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మధ్య పంపకాల విషయంలో తలెత్తిన వివాదంతో డిఐఈవో కార్యాలయంలో జరిగిన అవినీతి విషయం బయటికొచ్చినట్టు తెలుస్తున్నది. కార్యాలయంలోని సూపరింటెండెంట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సహాయంతో క్యాంపునకు సంబంధంలేని వ్యక్తుల అకౌంట్లను సేకరించి తప్పుడు పేర్లను సృష్టించి దొంగ లెక్కలురాసి వారి అకౌంట్లలో జమచేశారని సమాచారం. ఇలా కలెక్ట్‌చేసిన అకౌంట్లలో డబ్డులు వేసి స్వయంగా సూపరింటెండెంట్‌ మళ్లి తిరిగి ఇవ్వాలని అడగటంతో అసలు కథ ఇక్కడ అడ్డం తిరిగింది. అకౌంట్లలో పడిన డబ్బులకు పర్సంటేజి ఇస్తానని తీసుకొని వారికి కమీషన్‌ ఇవ్వకపోవడంతో కొందరు గొడవ చేయడంతో ఈ కథ బయటికొచ్చింది. ఓ ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి క్యాంపు ఆఫీస్‌లో పనిచేయని కొంతమందితోపాటు వారి బంధువుల అకౌంట్లను సేకరించి సూపరింటెండెంట్‌కు ఇచ్చాడు. ఇలా ఇచ్చిన అకౌంట్లలో ఆయన డబ్బులు చెక్కుల ద్వారా జమ చేయడం జరిగింది. తిరిగి ఇచ్చే క్రమంలో ఈ విషయంలో కొంతమందికి గొడవ జరగటంతో అసలు విషయం బయటికొచ్చింది.

(ఎవరా…సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగి….వివరాలు త్వరలో)

తెలంగాణలో మిశ్రమ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ 4స్థానాలను కైవసం చేసుకోగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలను చేజిక్కించుకోగా, 16కు 16 గెలుస్తామనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 9స్థానాల వద్దే ఆగిపోయింది. ఇక ఎంఐఎం పార్టీ ఒకస్థానంతో సరిపెట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసిఆర్‌ 16కు 16 గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడంతో టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఖంగుతిన్న పరిస్థితి నెలకొంది. ప్రజలు ఊహించని విధంగా తెలంగాణలో బిజెపి కరీంనగర్‌లో బండి సంజీవ్‌, సికింద్రాబాద్‌ కిషన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ సోయం బాబురావులు గెలుపొందారు.

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలలో బిజెపి 4స్థానాలను గెలవడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసిఆర్‌ మొదటి నుండి ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఎలాగైనా కేంద్రంలో అధికారం చేపట్టి ప్రధాని కావాలనుకున్నారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా రావడంతో ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేకుండాపోయింది. కేసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జాతీయస్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కల కలగానే మిగిలిపోయింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు వెలువడిన ఫలితాలలో నల్గొండ నియోజకవర్గం నుండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), భువనగిరి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్‌), మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌), నిజామాబాద్‌ ధర్మపురి అరవింద్‌ (బిజెపి), కరీంనగర్‌ బండి సంజీవ్‌ (బిజెపి), ఆదిలాబాద్‌ సోయం బాబురావు (బిజెపి), సికింద్రాబాద్‌లో జి.కిషన్‌రెడ్డి (బిజెపి), పెద్దపల్లిలో నేతకాని వెంకటేశ్వర్లు (టిఆర్‌ఎస్‌), నాగర్‌కర్నూల్‌లో రాములు (టిఆర్‌ఎస్‌), వరంగల్‌లో పసునూరి దయాకర్‌ (టిఆర్‌ఎస్‌), మహబూబాబాద్‌లో మాలోతు కవిత (టిఆర్‌ఎస్‌), ఖమ్మంలో నామా నాగేశ్వర్‌రావు (టిఆర్‌ఎస్‌), మెదక్‌ కొత్త ప్రభాకర్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), మహబూబ్‌నగర్‌లో యన్నం శ్రీనివాస్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), జహీరాబాద్‌లో బివి పాటిల్‌ (టిఆర్‌ఎస్‌), చేవేళ్లలో రంజిత్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఓవైసి (ఎంఐఎం) కైవసం చేసుకున్నారు.

దేశంలో రెండోసారి మోడీ హవా : కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు

దేశవ్యాప్తంగా మరోసారి భారతీయ జనతా పార్టీ సునామీ కొనసాగింది. 45రోజుల ఉత్కంఠ అనంతరం కొనసాగిన ఎన్నికల లెక్కింపులో దేశవ్యాప్తంగా మొదటి నుంచి బిజెపి తన సత్తా చాటింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరిచిన బిజెపి ఎవరి మద్దతు లేకుండానే అధికారపీఠం ఎక్కడానికి మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకుంది. మిత్రపక్షాల సహకారం లేకుండానే 299 స్థానాలను సాధించుకుంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 348 స్థానాలతో బిజెపి బలమైన శక్తిగా అవతరించింది. యుపిఎ తన మిత్రపక్షాలతో కలిసి 90స్థానాలను సాధించగా కేవలం 50 స్థానాలను సొంతంగా సాధించగలిగింది.

రెండోసారి మోడీ హవా

దేశంలో రెండోసారి మోడీ హవా కొనసాగింది. నోట్ల రద్దు, జిఎస్టీ తదితర అంశాలు మోడీకి ఎన్నికల్లో ప్రతికూలంగా మారి ఘోరపరాజయాన్ని పొందుతాడని ప్రతిపక్షాలు కలలు కంటే వాటినన్నింటిని కల్లలుగా మార్చి, దేశప్రజలు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం దగ్గర నుండి బిజెపి తన ప్రభావాన్ని చూడగలిగింది. దీంతో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కనున్నారు. బిజెపి విజయంతో పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది.

కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు

ఈ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి ప్రధాని పీఠం ఎక్కవచ్చనే రాహుల్‌గాంధీ ఆశలపై బిజెపి నీళ్లు చల్లింది. ఘనవిజయంతో రాహుల్‌ ఆశలు అడియాశలయ్యాయి. ఎంపీగా కేరళ వయనాడ్‌లో, యుపి అమేథీలో పోటీ చేసిన రాహుల్‌ కేవలం కేరళ వయనాడ్‌లో మాత్రమే తన ప్రభావాన్ని చూడగలిగాడు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతిఇరానీతో తలపడిన రాహుల్‌ విజయం కోసం తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.

పశ్చిమబెంగాల్‌లోను బిజెపి హవా

పశ్చిమ బెంగాల్‌లో మొదటి నుండి దీదీ వర్సెస్‌ మోడీగా కొనసాగింది. అయితే ఇక్కడ బిజెపి అంతగా ప్రభావం చూపదని అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి 15స్థానాల్లో తన సత్తాను చాటుకుంది. తృణమూల్‌ 25స్థానాలతో సరిపెట్టుకుంది.

‘ఫ్యాన్‌’ గాలికి ‘సైకిల్‌’ కుదేలు – ఖాతా తెరవని జనసేన

‘ఫ్యాన్‌’ గాలికి ‘సైకిల్‌’ కుదేలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ కుదేలయిపోయింది. రెండోసారి తప్పక అధికారంలోకి వస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్న చంద్రబాబు అంచనాలను వైఎస్సార్‌సీపీ పటాపంచలు చేసింది. అత్యధిక స్థానాలలో మెజార్టీని కనబరుస్తూ అధికారం దిశగా కదిలింది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి వైఎస్సార్‌సీపీ తన అధిక్యాన్ని ప్రదర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ 152 స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఖాతా తెరవని జనసేన

ఆంధ్ర ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన పార్టీని ఆంధ్రప్రజలు ఎంతమాత్రం ఆదరించలేదు. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు నియోజకవర్గాల్లో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. గాజువాకలో మొదట్లో పవన్‌ లీడ్‌లో ఉన్నా విజయం దక్కలేదు. మరోవైపు భీమవరంలో పవన్‌ మూడోస్థానంలో నిలవాల్సి వచ్చింది.

వెనుకంజలో మంత్రులు, మంత్రుల కుమారులు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. వైఎస్సార్‌సీపీ సునామీలో ఓటమి బాట పట్టారు. వీరితోపాటు కొంతమంది మంత్రుల కుమారులు సైతం ఓటమి పాలయ్యారు.

పార్లమెంట్‌ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ హవా

ఆంధ్రప్రదేశ్‌లోని పార్లమెంట్‌ స్థానాల్లో సైతం వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఫ్యాన్‌ మెరుపు వేగంతో దూసుకుపోయింది. టిడిపి, జనసేన పార్టీలు పార్లమెంట్‌ ఖాతా కూడా తెరవలేకపోయాయి. 25స్థానాల్లో వైఎస్సార్‌సీపీ లీడ్‌ ఇలాగే కొనసాగితే దేశంలో అతిపెద్ద మూడోపార్టీగా వైఎస్సార్‌సీపీ అంతరించి రికార్డు సృష్టించబోతుంది.

bodrai prthishatapana mahostvam, బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం

బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం

హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ భూదేవి, శ్రీదేవి అమ్మవార్లు గ్రామంలోని ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తారని, అమ్మవార్ల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మడిపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు పాడిపంటలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్రతిష్టాపనలో గ్రామ సర్పంచ్‌ చిర్ర సుమలత విజయ్‌, ఎంపిటిసి ఆకుల ఇంద్రయ్య, అంచూరి విజయ్‌కుమార్‌, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పసుపు అంచనాలు పటాపంచాలు

పసుపు అంచనాలు పటాపంచాలు

కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ చంద్రబాబు గెలుస్తాడని తమ అంచనాలు ప్రకటించగా నిన్న మొన్నటి వరకు పసుపు శిబిరంలో కొంత ఉత్సాహం నెలకొంది. ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి తన పార్టీ గెలుపుపై కాసింత అనుమానంతో ఉన్న చంద్రబాబుకు ఎగ్జిట్‌ పోల్స్‌ కొంత ఊరటనివ్వగా, బాబు గెలుస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు. ఆంధ్ర ప్రజలు మాత్రం అందుకు వ్యతిరేకంగా తీర్పునిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ 130 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుండగా టిడిపి కేవలం 29స్థానాల్లో తన అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కొంత మైర అయినా ప్రభావం చూపుతున్న జన సేన ఒకే ఒక స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం ఆంధ్రలో వైఎస్సార్‌సీపీ తన హావాను కొనసాగిస్తోంది. 13స్థానాల్లో అధిక్యాన్ని కనబరుచుతుండగా టిడిపి ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తానికి వైఎస్సార్‌సీపీ ఆంధ్రలో గెలుపు సునామీని సృష్టించబోతుందని స్పష్టమవుతోంది.

anada balikaku andaga ktr, అనాథ బాలికకు అండగా కెటిఆర్‌

అనాథ బాలికకు అండగా కెటిఆర్‌

తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అండగా నిలిచారు. ఆ బాలికకు 50వేల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే…ముస్తాబాద్‌ గ్రామంలోని మద్దికుంట రజిత తల్లి మద్దికుంట కమలమ్మ, తండ్రి మద్దికుంట రాములు. రజిత తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ముస్తాబాద్‌ మండలకేంద్రంలోని గుడిసెలో నివసిస్తున్నది. రజిత దీనస్థితిని ట్విట్టర్‌ ద్వారా స్థానిక శాసనసభ్యుడు, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ తెలుసుకున్నారు. కేటిఆర్‌ వెంటనే స్పందించి రూ.50వేల ఆర్ధిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రామరెడ్డిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో బుధవారం ఉదయం డిఆర్వో ఖిమ్యానయక్‌ స్వయంగా ముస్తాబాద్‌ వెళ్లి రూ.50వేల రూపాయల చెక్కును మద్దికుంట రజితకి అందించారు. అలాగే మద్దికుంట రజితను తంగళ్ళపల్లి గ్రామంలోని కెజిబివిలో ఎంపిహెచ్‌డబ్ల్యు కోర్సులో చేర్పించారు. అదేవిధంగా రజితకు డబల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. తన దీన పరిస్థితిపై సత్వరమే స్పందించిన కేటిఆర్‌కు మద్దికుంట రజిత, ప్రజలు కతజ్ఞతలు తెలిపింది. ట్విట్టర్‌ విజ్ఞప్తికి కెటిఆర్‌ స్పందించినందుకు ముస్తాబాద్‌ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. వీరి వెంట డిఇఓ రాధకిషన్‌, ఎంఇఓ రాజయ్య, డిప్యూటీ తహసీల్దార్‌ బి.గోపాల్‌లు ఉన్నారు.

panullo nanyatha pramanalu patinchali, పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలి

పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలి

సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి తెలిపారు. బుధవారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినారె ఆధునాతన గ్రంథాలయం, జెపి నగర్‌ పార్కు, వెంకంపేటలోని మహిళా కమ్యూనిటీ హాలు, రజక కమ్యూనిటీ భవనం, తారకరామానగర్‌, కొత్త చెరువు బండ్‌, పార్కులను అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పనులను వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని ఆయా ఏజెన్సీ, ఇంజనీర్లను ఆదేశించారు. అదేవిధంగా రగుడులో నిర్మిస్తున్న మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ (ఎఫ్‌ఎస్‌టిపి), డిఆర్‌సి షెడ్‌లను, కొత్త చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న మురికి నీటిశుద్ది ప్లాంట్‌లను త్వరితంగా వాడుకలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది, సుందరీకరణ పనుల్లో ఎలాంటి అలసత్వం, నాణ్యతా లోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, లేని యెడల శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ పర్యవేక్షణలో కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version