prabuthava patashallallone unnatha vidya, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య అందుతుందని తొగర్రాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతుల కుమారస్వామి అన్నారు. బుధవారం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల అధ్యాపక బందం గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధన వసతులు కల్పించామన్నారు. అలాగే డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతవిద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అభ్యసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో పాఠశాల నుండి అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బందంతోపాటు పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌ తుమ్మలపల్లి రామ్‌రాజ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

ci srilaxmi thirupia dalitha sangala mandipatu, సీఐ శ్రీలక్ష్మి తీరుపై దళితసంఘాల మండిపాటు…

సీఐ శ్రీలక్ష్మి తీరుపై దళితసంఘాల మండిపాటు…

ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మీ తీరుపై దళిత సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాతలకాలం నుండి దళితులు తమ భూమిని సాగు చేసుకుంటూంటే అన్ని హక్కుపత్రాలు కలిగి ఉన్నా కూడా సివిల్‌ వివాదంలో తలదూర్చి దళిత కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని వారు ఖండించారు. భూమి అసలు హక్కుదారులైనా దళితులను పోలీస్‌స్టేషన్‌లో అర్థరాత్రి వరకు నిర్భందించి భూకబ్జాదారులకు కొమ్ముకాస్తున్న సీఐని సస్పెండ్‌ చేయాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు. ఏ కారణం లేకుండా దళితులను తరుచుగా వేధిస్తున్న సీఐపై విచారణ జరిపి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. భూమి విషయంలో తలదూర్చవద్దని స్వయంగా పోలీస్‌ కమిషనరే చెప్పినా సీఐ శ్రీలక్ష్మి కమిషనర్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేయడంలో అంతర్యమేమిటని వారు ప్రశ్నించారు.

సీఐని సస్పెండ్‌ చేయాలి..

-ఆరూరి కుమార్‌, కులవివక్షత వ్యతిరేఖ పోరాట సమితి, జిల్లా కార్యదర్శి

దళితులను, భూ హక్కుదారులను అక్రమంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.పోలీస్‌శాఖ ఒక వైపు పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించాలని డిజిపి సైతం చెప్పుతున్నా వారి మాటలను పెడచెవిన పెట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఉన్నతాధికారుల ఆదేశాలను దిక్కరించడమే. సివిల్‌ తగాదాలో సీఐ తలదూర్చి కబ్జాదారులకు వంతపాడటాన్ని ఎవరు సహించరు.ఆడ,మగ తేడా లేకుండా పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించి, నానా బూతులు తిట్టినందుకు, వారిని కొట్టినందుకు సీఐ శ్రీలక్ష్మిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము. దళితులకు జరిగిన అన్యాయంపై ఏసిపి, డిసిపి, వరంగల్‌ పోలీస్‌కమీషనర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేసి వారికి అండగా నిలుస్తామన్నారు.

భూ బాదితులకు అండగా నిలుస్తాము

-గురుమిళ్ల రాజు, దళిత ప్రజాసంఘాల ఐక్య వేదిక,రాష్ట్ర కన్వీనర్‌

కాజీపేట మండలం రాంపూర్‌కు చెందిన సండ్ర మోజెస్‌ దళిత కుటుంబానికి అండగా ఉంటామని, వారికి చెందిన భూమిని కొందరు కభ్జారాయుళ్లు కబ్జా చేస్తే బాధితులకు అండగా వుండాల్సిన ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి కబ్జాదారుకు వత్తాసు పలకడమే కాకుండా భూ హక్కుదారులైన సండ్ర మోజెస్‌ కుటుంబాన్ని పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించడం ఇది ముమ్మాటికి చట్టాన్ని సీఐ తమ చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. సీఐ అత్యుత్సాహాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో దళితులకు, దళితుల భూములకు రక్షణ దొరకదేమోనన్న అనుమానం వస్తున్నది. పోలీస్‌ కమీషనర్‌ వెంటనే విచారణ చేపట్టి సీఐ శ్రీలక్ష్మిని సస్పెండ్‌ చేయాలి. భూ హక్కుదారుకు రక్షణ కల్పించాలి.

ఫ్రెండ్లీ పోలీస్‌కు అర్ధం లేకుండా చేస్తున్నారు

-దళిత యువజన సంఘం ఐక్యవేదిక

-కన్నం సునీల్‌, జిల్లా అధ్యక్షుడు

సివిల్‌ తగాదాలో తలదూర్చొద్దని పోలీస్‌ ఉన్నతాధికారులు చెప్పినా వినకుండా కొందరు సీఐలు భూతగాదాలలో తలదూర్చి కబ్జాదారుకు వంతపాడుతున్నారు. కబ్జాదారులకు సహకరించి భూబాధితులను వేదిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమీషనర్‌ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా వినకుండా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందే కబ్జాదారులకు సహరించిన విషయంలో కేయూ పోలీస్‌స్టేషన్‌ సీఐ రాఘవేందర్‌రావు,ఎస్సై విఠల్‌ను సస్పెండ్‌ చేసిన విషయం ప్రజలకు తెలుసునన్నారు. అలాంటి నర్ణయమే వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ తీసుకొని ఫ్రెండ్లీ పోలీస్‌ అన్న పదానికి అర్ధం లేకుండా చేసిన సీఐ శ్రీలక్ష్మిని వెంటనే సస్పెండ్‌ చేయాలి.

ఎంతటి వారినైనా వదిలిపెట్టద్దు

– అర్షం అశోక్‌, ఎంఆర్‌పిఎస్‌ టీఎస్‌ గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు

భూకబ్జాదారులతో అంటకాగుతూ దళితులను చిత్రహింసలకు గురి చేసిన ధర్మసాగర్‌ సీఐని వెంటనే విధుల్లోంచి తొలగించాలి. సివిల్‌ తగాదాను తన చేతిలోకి తీసుకొని దళితులను రాత్రి వరకు పోలీస్‌స్టేషన్‌లొ నిర్భందించినందుకు వెంటనే సస్పెండ్‌ చేయాలి.

దళితులంటే చిన్న చూపెందుకు

-మంద నరేష్‌, అంబేద్కర్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌, వరంగల్‌జిల్లా అధ్యక్షుడు

తెలంగాణ రాష్ట్రంలో దళితులంటే ఇంకా చిన్నచూపు కొనసాగుతున్నదని, దళితుల భూమాలకు రక్షణ లేకుండా పోతున్నదని, రక్షించాల్సిన పోలీసులు కబ్జాదారులకు అండగా నిలుస్తుండటంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతున్నది. దళితులను చిత్ర హింసలకు గురిచేసి, నానా భూతులు తిట్టిన సీఐ శ్రీలక్ష్మిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. విచారణ చేపట్టి వెంటనే సస్పెండ్‌ చేయాలి.

bank kathala dwara vethanalu chellinchali, బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి

బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి

నర్సంపేట మున్సిపాలిటీలో నూతనంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలని టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు కోరారు. బుధవారం నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లుకు కార్మికుల వేతనాల కోసం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలో వేతనాలు వేస్తూ కార్మికులందరికీ ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. వారాంతపు సెలవు ఆదివారం రోజున పూర్తిగా సెలవు ఇవ్వాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్‌ కొద్దిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు మాదాసి నర్సింగరావు, కార్మికులు బొల్లెపెల్లి రాంబాబు, చింతనూరి శివకుమార్‌, గోనెల నరేందర్‌, పొనకంటి శ్రీకాంత్‌, దాసరి ప్రశాంత్‌, కొంపెల్లి సురేష్‌, జన్ను శోభన్‌, బొటికె మధు తదితరులు పాల్గొన్నారు.

pakalaku soukaryalu kalipinchali, పాఖలకు సౌకర్యాలు కల్పించాలి

పాఖలకు సౌకర్యాలు కల్పించాలి

పాఖల పర్యటక కేంద్రానికి అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించాలని లయన్స్‌క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ భరత్‌రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో పాఖలలో ర్యాలీని నిర్వహించగా లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ జిల్లా అటవీశాఖ అధికారి అక్బర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ భరత్‌రెడ్డి మాట్లాడుతూ పాఖల అభివృద్ధి కోసం, పాఖల సంపద, జీవవైవిధ్యం ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ పెట్టాలని, చెరువులోకి శిఖంలోకి పశువులు రాకుండా పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే చెరువు కట్టపై సీసీ రోడ్డు, పర్యాటకుల కోసం అడ్వంచర్‌, స్పోర్ట్స్‌, టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. తూము ప్రాంతంలో సందర్శన సమయంలో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రమాదం వాటిల్లకుండా పెన్సింగ్‌ను ఏర్పాటు చేసి చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన సందర్భంగా ప్రమాదచికిత్స కిట్లను ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ పురుషోత్తం, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

dieo karyalayamlo…dongalu….,డిఐఈవో కార్యాలయంలో…దొంగలు…?

డిఐఈవో కార్యాలయంలో…దొంగలు…?

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌జిల్లా కార్యాలయంలో క్యాంపు డబ్బులకు కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కన్నంవేసి మాయంచేసిన పరిస్థితి కార్యాలయంలో నెలకొన్నది. సుమారుగా 10లక్షలకు పైగా వీరంతా కలిసి మాయంచేసినట్లు సమాచారం. ‘నేటిధాత్రి’లో ”డిఐఈవో కార్యాలయంలో..అవినీతి లీలలు”, ”కాసులపై ప్రీతి…ఇదేం రీతి”, ”భుజాలు తడుముకుంటున్నారు”, ”ప్రైవేటు..రుబాబు”, ”అవినీతికి…సూత్రధారి..?”, ”కెమెరాలు బంద్‌..డిఐఈవో హస్తం ఉందా..?”, ”మాయమైన పైసలు..సాయిబాబా మహిమలు..”, ”అవినీతి లీలలపై ఉలుకులేదు..పలుకులేదు..” అనే శీర్షికలతో ప్రచురితమైన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన దొంగలు రిజిస్టర్లను, బిల్లులను, సంతకాలను మార్చే పనిలో ఉన్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

– ప్రైవేటు పైరవీదారుల చుట్టు ప్రదక్షణలు

మెక్కేసిన క్యాంపు డబ్బుల విషయంలో అవినీతికి పాల్పడిన కొంతమంది, ఒకవేళ విచారణ కమిటీని వేస్తే మేము ఖచ్చితంగా దొరికిపోతాము, మమ్ములను మీరే రక్షించాలంటూ ప్రైవేటు పైరవీదారుల చుట్టు తిరుగుతూ కాళ్లా..వేళ్లా పడుతు బ్రతిమలాడుకుంటున్నారని తెలుస్తోంది. ఏకంగా డిఐఈవోనే బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అందరం దొరికిపోతాము. కాబట్టి మీరే మమ్ములను రక్షించాలంటూ వేడుకుంటున్నారట. డిఐఈవో మాత్రం విచారణ కమిటి వేసేది లేదు..వారు వచ్చేది లేదు…మనం దొరికేది లేదు..మీరు ధైర్యంగా ఉండండి అన్ని నేను చూసుకుంటాను అన్న ధీమాతో డిఐఈవో ఉన్నట్లు కార్యాలయంలో కొందరు గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం.

(ఎంత నొక్కేశారు..ఎలా నొక్కేశారు…వివరాలు త్వరలో)

trslo intidonga, టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ

టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ

వరంగల్‌ టిఆర్‌ఎస్‌ అర్బన్‌లో ఇంటి దొంగల పోరు పార్టీకి ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే వీరిలో కొంతమంది బయటకు కనపడుతుంటే మరికొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పని కానిస్తున్నారు. పార్టీలో కొనసాగుతూనే ఇతర పార్టీలతో అంటకాగుతూ అంతర్గతంగా టిఆర్‌ఎస్‌ పార్టీపై చెప్పరాని విమర్శలు చేస్తున్నారు. వివిధ పార్టీలను వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన కొంతమంది నాయకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన రాజనాల శ్రీహరి పార్టీలో కొనసాగుతున్నా టిఆర్‌ఎస్‌ పార్టీపై తనకు ఎంత కోపం ఉందో నిరూపించుకున్నాడు. కాంగ్రెస్‌ వాసన పొగొట్టుకోలేక సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వ్యతిరేకంగా పోస్టింగులు చేస్తూ దొరికిపోయాడు. బుధవారం వరంగల్‌లోని ఓ గ్రూపులో దొర అంటేనే అహంకారం…ఫకర్‌ అంటూ ఉన్న ఓ వీడియోను పోస్టు చేసి తన ఇంటి దొంగ బుద్దిని బయటపెట్టుకున్నాడు. రాజనాల తీరుతో ఆశ్చర్యపోయిన గ్రూపులోని కొంతమంది వ్యక్తులు, జర్నలిస్టులు మీరు పార్టీ ఫిరాయించారా…అని ప్రశ్నిస్తే పొరపాటులో వీడియో సెండ్‌ అయిందని సమాధానమిచ్చాడు. ‘నేటిధాత్రి’ ప్రతినిధి ఫోన్‌ చేసి ఈ విషయమై ప్రశ్నిస్తే వేరే గ్రూపులో పోస్టు చేయబోయి ఆ గ్రూపులో పోస్టు చేశానని చెప్పాడు. రాజనాల సమాధానాన్ని బట్టి చూస్తే మీడియా ప్రతినిధులు ఉన్న గ్రూపుల్లో టిఆర్‌ఎస్‌ వ్యతిరేక వీడియోలు పోస్టు చేయకుండా ఇతర గ్రూపుల్లో వ్యతిరేకంగానే రాజనాల శ్రీహరి పోస్టింగులు చేస్తున్నాడని సమాధానాన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. కాంగ్రెస్‌ వాసన ఇంకా పోని రాజనాల టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాడని సోషల్‌ మీడియా గ్రూపుల్లోని సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

manchineru raka pattana prajala ibbandulu, మంచినీరు రాక పట్టణ ప్రజల ఇబ్బందులు

మంచినీరు రాక పట్టణ ప్రజల ఇబ్బందులు

గత కొన్నిరోజులుగా నర్సంపేట పట్టణ ప్రజలకు మంచినీరు రాక అనేక ఇబ్బందులకు గురైతుండగా నర్సంపేట మునిసిపాలిటీ పాలకవర్గం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆ క్యాంపులలో జల్సాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌, ఖానాపురం ఎంపీపీ తక్కళ్ళపెల్లి రవీందర్‌రావు ఆరోపించారు. గత కొన్నిరోజులుగా నర్సంపేట పట్టణ ప్రజలకు మంచినీరు రాకపోవడంతో అందుకు సంబంధించిన మంచినీటి నల్లాల బావితోపాటు వాటర్‌ ఫిల్టర్‌ బెడ్‌లను నర్సంపేట పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, ఎఐసిసి మెంబర్‌ దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రవిందర్‌రావు మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో ప్రస్తుతం ఉన్న 3వాటర్‌ ట్యాంక్‌ల ద్వారా మిషన్‌ భగీరథ నీటి ద్వారా, అలాగే అశోక్‌నగర్‌ దగ్గర ఉన్న రిజర్వాయర్‌ ద్వారా ఫిల్టర్‌ చేసిన మంచినీటిని ప్రజలకు అందించి దాహార్తిని తీర్చాలని తెలిపారు. పాకాలవాగు వద్ద ఉన్న మంచినీటి నల్లాల బావి కూరుకుపోయిందని, గుర్రపుడెక్కతో నిండిపోయి నీరు పూర్తిస్థాయిలో కలుషితమైపోయిందని, ప్రజలు రోగాల భారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీరు రాక ప్రజలు అల్లాడిపోతున్నారని మున్సిపాలిటీ పాలకవర్గ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. వేసవికాలంలో మంచినీరు రాక ప్రజలు అవస్థలకు గురైతుంటే పాలకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మంచినీటి సమస్యను పరిష్కారం చేసి పట్టణ ప్రజలకు అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణ ప్రజలపక్షాన నిలబడి భారీఎత్తున కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట అర్బన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పాలాయి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ మెర్గు వరలక్ష్మి సాంబయ్య, మాజీ వార్డు మెంబర్‌, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేముల సాంబయ్య, నర్సంపేట మండల కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమణారెడ్డి, నర్సంపేట యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోల చరణ్‌రాజు, నర్సంపేట యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్‌, కాంగ్రెస్‌ నాయకులు దండెం రతన్‌కుమార్‌, గురిజాల కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బండారి మంజుల, పొన్నం నర్సింహారెడ్డి, నర్సంపేట ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు ములుకల మనీష్‌ తదితరులు పాల్గొన్నారు.

computer vyavasthanu praveshapettina mahaniyudu rajivgandhi, కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజీవ్‌గాంధీ

కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజీవ్‌గాంధీ

భారతదేశంలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత దేశప్రధాని రాజీవ్‌గాంధీ అని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌, ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు అన్నారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నర్సంపేట అర్బన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్‌ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులుగా పాల్గొన్న నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌, ఎంపీపీ తక్కళ్లపెల్లి రవిందర్‌రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓటుహక్కును వినియోగించుకోవడానికి 21సంవత్సరముల నుండి 18 సంవత్సరాల వయస్సు కు తగ్గించి అందరికీ ఓటుహక్కు కల్పించే విధంగా కషి చేశారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌ పాలనలోనే పేద ప్రజలకు మేలు జరిగిందని, నిరుపేదలను గుర్తించి అన్నివిధాలుగా ఆదుకున్నారని ఆయన గుర్తుకు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ మార్కెట్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పాలాయి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ మెర్గు వరలక్ష్మి సాంబయ్య, మాజీ వార్డు మెంబర్‌ దేవోజు సదానందం, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేముల సాంబయ్య, నాగేల్లి సారంగం, నర్సంపేట మండల కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమణారెడ్డి, నర్సంపేట యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోల చరణ్‌రాజ్‌, నర్సంపేట యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్‌, కాంగ్రెస్‌ నాయకులు దండెం రతన్‌కుమార్‌, గురిజాల కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బండారి మంజుల, బీరం భాస్కర్‌రెడ్డి, పొన్నం నర్సింహారెడ్డి, నర్సంపేట ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు ములుకల మనీష్‌, గొర్రె నవీన్‌, కమలాపురం కష్ణలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

avinithipia lelalapia uluku ledu…paluku ledu, అవినీతి లీలలపై ఉలుకు లేదు…పలుకు లేదు

అవినీతి లీలలపై ఉలుకు లేదు…పలుకు లేదు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందంటూ గత వారంరోజులుగా ‘నేటిధాత్రి’లో వరుస కథనాలు వస్తున్నా ఇంటర్మీడియట్‌ బోర్డు ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లైన అనిపించడం లేదా…అవినీతి లీలలపై నేటి వరకు విచారణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పేపర్‌ వాల్యూవేషన్‌ క్యాంప్‌లో బాయ్స్‌ పేరిట, పేపర్‌ వాల్యూవేషన్‌ సబ్జెక్టులవారీగా ఏర్పాటు చేసిన బోర్డులలో లెక్కకు మించి లెక్చరర్లు పనిచేసినట్లు తప్పుడు పేర్లను రాసి చెక్కుల ద్వారా కార్యాలయ ఉద్యోగ సిబ్బందికి చెందిన సన్నిహితుల అకౌంట్లలో జమ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా నేపథ్యంలో ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు తప్పుబడుతున్నారు.

విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి

‘నేటిధాత్రి’లో వచ్చిన వరుస కథనాల ఆధారంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జరిగిన అవినీతి బాగోతంపై ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులతో తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. పేపర్‌ వాల్యూవేషన్‌ ప్రారంభమైన నాటి నుంచి బిల్లుల చెల్లింపులు జరిగిన రోజు వరకు ప్రభుత్వం పేపర్‌ వాల్యూవేషన్‌ కోసం ఎంత బడ్జెట్‌ను కేటాయించింది…ఎంత మందికి చెల్లించారు…ఎవరెవరికీ ఎంతెంత చెల్లించారు…క్యాంపులో పనిచేసిన వారెంతమంది…క్యాంపు కార్యాలయంలో పనిచేసినట్లుగా రిజిస్టర్లలో నమోదైన పేర్లు, వారి సంతకాలు…సబ్జెక్టులవారీగా పేపర్‌ వాల్యూవేషన్‌ చేయడానికి మొత్తం ఎన్ని బోర్డులను ఏర్పాటు చేశారు. ఒక్కో బోర్డులో ఎంతమంది లెక్చరర్లు పనిచేశారు. వీరికి ఎంతెంత చెల్లించారు. పలు విషయాలపై ప్రత్యేక కమిటీని వేసి విచారణ చేపడితే దొంగలు దొరుకుతారని విద్యార్థి, ప్రజాసంఘాలు తెలుపుతున్నాయి.

బాధ్యులను సస్పెండ్‌ చేయాలి

క్యాంపు కార్యాలయంలో పనిచేయకున్నా పనిచేసినట్లుగా లెక్కకు మించి పేర్లు రాసి చెక్కుల ద్వారా చిక్కుల లెక్కలతో చెల్లింపులు చేసినా కార్యాలయ అవినీతి ఉద్యోగ సిబ్బందిని వెంటనే గుర్తించి సస్పెండ్‌ చేయాలని విద్యార్థి, ప్రజాసంఘాలు ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో 23మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఒకవైపు రాష్ట్ర ప్రజలను విషాదం వెంటాడుతున్నా తమకేమి పట్టనట్లుగా అక్రమంగా సంపాదనే ధ్యేయంగా అవినీతికి పాల్పడుతున్నా ప్రతి ఒక్కరిని ఉపేక్షించకుండా సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

dalithulapia mahila ci srilaxmi dashtikam, దళితులపై మహిళా సీఐ శ్రీలక్ష్మి దాష్టీకం

దళితులపై మహిళా సీఐ శ్రీలక్ష్మి దాష్టీకం

అరేయ్‌, ఏయ్‌ ముండల్లారా…ఆ భూమి వదులుకోండి…లేదంటే గు…..బొక్క సాపు చేస్తా. ఎన్ని హక్కు పత్రాలున్న చెల్లవు. కోర్టు ఆర్డర్‌లు నా దగ్గర చెల్లవు. నేను చెప్పిందే చేయాలి. భూమి మీదైన అక్కడికి వెళ్లకూడదు. ఎంతో కొంత తీసుకుని పక్కకు తప్పుకోవాలి. కబ్జా చేసిన వారిదే భూమి నేను చెబుతున్న ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి. పోలీసుశాఖలో ఏ ఉన్నత అధికారి కూడా నన్ను ఎం చేయలేడు. నేను చెప్పిందే న్యాయం…వింటే వినండి…లేదంటే మీ ఇష్టం భూమి మాత్రం మీకు దక్కదు. కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, అర్దర్లు ఎన్ని ఉన్నా భూమిలోకి మిమ్మల్ని పోనివ్వను. ఇది నిత్య వివాదాల మహిళ సీఐ ధర్మసాగర్‌ సర్కిల్‌ పరిధిలో తనదైన శైలిలో నడిపిస్తున్న పోలీస్‌ రాజ్యం. కోర్టులంటే గౌరవం ఉండదు. పేదలన్నా, దళితులన్నా అసలే గిట్టదు. మనీ పవర్‌ ఉన్న వాళ్లు ఉంటే సరి చట్టాలు, న్యాయాలను తుంగలో తొక్కుతోంది. తన శాయశక్తులా అన్యాయానికే వత్తాసు పలుకుతుంది. తన పరిధిలోకి రాకున్నా, అది సివిల్‌ మ్యాటర్‌ అయిన తలదూర్చుతుంది. అందినకాడికి దండుకుని పేదలను బెదిరింపులకు గురిచేస్తుంది. అసలు హక్కుదారులపై కబ్జాదారులు దాడులకు పాల్పడినా, మారణాయుధాలతో ఇంట్లో దూరి బెదిరింపులకు గురిచేసిన ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు. ఫిర్యాదు చేసిన బాధితులనే అర్థరాత్రి వరకు స్టేషన్‌లో నిర్భంధించి బూతులు తిడుతూ వేధింపులకు గురిచేస్తుంది. తమ భూమి విషయంలో సీఐ వేధింపులు భరించలేక బాధితులు ‘నేటిధాత్రి’ని ఆశ్రయించారు. తమ సొంత భూమిపై తమకు అన్ని హక్కులు ఉండి ఏం లేని వారిగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు నిబంధనల ప్రకారం భూమి మీద హక్కు ఉండడానికి భూమి తమ సొంతమే అని చెప్పడానికి కావాల్సిన అన్ని పత్రాలు ఉన్నా సీఐ తమను మానసిక వేధింపులకు గురిచేస్తోందని తమ సొంత భూమి తమకు కాకుండా చేయడానికి కబ్జాదారులకు పూర్తిగా సహకరిస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు చెప్పిన వ్యక్తి వివరాల ప్రకారం కాజీపేట మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన ఉప్పలమ్మ, ఎలిషా దంపతులకు ఇదే గ్రామశివారులో గుడిగుంట చెరువు ప్రాంతంలో 657 సర్వే నెంబర్‌లో 2ఎకరాల 38గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని తన కొడుకు సండ్ర ఎలిషాకు వీరి నుంచి సంక్రమించింది. 1950 సంవత్సరం నుంచి ఈ భూమి వారసత్వంగా వీరి కుటుంబానికే ఉంది. దశాబ్ధాలుగా ఈ భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబ జీవనం కొనసాగిస్తుంది. ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌ పుస్తకం, పహానీలు, 1బి లాంటి అన్ని హక్కు పత్రాలను తెలంగాణ సర్కార్‌ నుండి వీరు అందుకున్నారు. రెవెన్యూశాఖ ఈ భూమి వీరిదేనని ధృవీకరించి అన్ని భూమిహక్కు పత్రాలను అందజేసింది.

కబ్జా కథ ఇలా మొదలు

గత కొద్ది సంవత్సరాలుగా రాంపూర్‌ ప్రాంతంలో భూముల ధరలు పెరిగిపోయాయి. నివాస ప్రాంతాల కోసం పలు కంపెనీలు రియలెస్టేట్‌ వెంచర్‌లు నిర్వహిస్తున్నాయి. దీంతో ఎలిషా భూమికి సైతం డిమాండ్‌ పెరిగింది. పేద దళిత ఎలిషా కుటుంబం భూమిని అమ్ముకుందామనుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన తక్కెళ్లపల్లి ప్రదీప్‌రావు, మునిగాల ప్రభాకర్‌, ఆరెపల్లి కట్టయ్యలు భూమి మాదంటూ కబ్జా తతంగం మొదలుపెట్టారు. సండ్ర మోజేష్‌ తండ్రి కీ.శే.ఎలిషా భూమిని అమ్మాడంటూ ఓ నకిలీ పత్రం ఆర్‌ఓఆర్‌ అంటూ మరో నకిలీ పత్రాన్ని సృష్టించి కేవలం రెండంటే రెండు పత్రాలతో ఈ భూమిపై సర్వ హక్కులు తమవేనని మోజేష్‌ కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడం మొదలెట్టారు. వారి భూమి చుట్టూ వారు పెన్సింగ్‌ చేసుకున్న తొలగించి వేశారు. ఈ తగాదా చిలికి, చిలికి గాలివానలా మారి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. ఇంకేముంది కబ్జాదారులు పోలీసులను ప్రసన్నం చేసుకున్నారు. తనకు సంబంధం లేకున్నా సివిల్‌ కేసే అయినా, అన్ని హక్కుపత్రాలు బాధితులకే ఉన్నా ధర్మసాగర్‌ సీఐ మాత్రం కబ్జాదారులకు వత్తాసు పలకడం మొదలెట్టింది. మోజేష్‌కు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించిన సీఐ శ్రీలక్ష్మీ పత్రాలన్నీ సరిగ్గా ఉన్నా తన దగ్గర పనిచేయవని బెదిరింపులకు గురిచేసింది. కబ్జాదారులు భూమి దగ్గర నానా హంగామా సృష్టించినా, పెన్సింగ్‌ తొలగించి వేసినా భూకబ్జాదారులకు సీఐ వత్తాసు పలుకుతోంది. కబ్జాదారులు బాధితుల ఇంట్లో చొరబడి గొడ్డళ్లతో భీభత్సం సృష్టించి బెదిరింపులకు గురిచేసినా, ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా సీఐ శ్రీలక్ష్మి కబ్జాదారులకే అనుకూలంగా వ్యవహారించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌లో తమను నిర్భంధించి ఇష్టారీతిన తిడుతూ, తమను కొట్టిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

న్యాయం చేయండి

అన్ని హక్కుపత్రాలు కలిగి ఉండి తమ సొంతభూమిలోనే తాము పరాయి వారిగా మారామని మోజేష్‌ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులకు సీఐ శ్రీలక్ష్మి తన శాయశక్తులా సహకరిస్తూ తమను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

శ్రీలక్ష్మి లీలలు

– రేపటి సంచికలో…

kabzadarulaku o mahila ci vathasu, కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు

కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు

1953 నుండి దశాబ్దాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ దళితులు జీవనం కొనసాగిస్తున్నారు. తాత ముత్తాతల నుండి వారసత్వంగా ఆ భూమి వారికి లభించింది. నగరశివారులో ఉన్న ఆ భూమి ధరకు రెక్కలొచ్చాయి. వ్యవసాయ భూములన్ని రియలెస్టేట్‌ వెంచర్‌లుగా రూపాంతరం చెంది, నివాస ప్రాంతాలుగా మారుతుండటంతో దళితులు సైతం తమకు చెందిన భూమి రెండు ఎకరాల 38గుంటలు అమ్మి జీవనోపాధి వెతుక్కుందామనుకున్నారు. కొనుగోలుదారులు ముందుకొచ్చారు. భూమి కొనడానికి సిద్ధమయ్యారు. అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 1బి దళితులకు ఉన్నా, వీరే సర్వహక్కులు కలిగి ఉన్నా, కేవలం ఓ బయానపత్రం, ఆర్‌ఓఆర్‌లను దస్తావేజులుగా చూపుతూ కొంతమంది కబ్జాదారులు బయలుదేరారు. భూమిని కబ్జా చేశారు. దళితులు లబోదిబోమన్నారు. భూకబ్జాదారుతోపాటు ఓ మహిళ సీఐ వేధింపులు భూయజమానులైన దళితులకు రోజురోజుకు పెరిగిపోయాయి. అన్ని హక్కులు, కావల్సిన దస్తావేజులు, కోర్టు ఆర్డర్లు ఉన్నా కబ్జాదారులకే ఆ మహిళా సీఐ వంత పాడుతోంది. కబ్జాదారులు అక్రమంగా భూమిలోకి ప్రవేశిస్తే సీఐ దగ్గరుండి రక్షణ కలిపిస్తోంది. దళితులను రాత్రి వరకు ఆడ, మగా తేడా లేకుండా స్టేషన్‌లో నిర్బందించి బూతులు తిడుతూ నానాహంగామా సృష్టించిందట. కోర్టు ఆర్డర్లు, భూమి దస్తావేజులతో తనకు పని లేదు. తాను చెప్పిందే వేదం. తాను చెప్పిందే తీర్పు. తానే కోర్టు అన్నట్లుగా భూమి వదిలివెళ్లండని దళితులకు ఆ మహిళా సీఐ హుకుం జారీ చేస్తోందట.

పూర్తి వివరాలు రేపటి సంచికలో…

vallyball kit panpini, వాలీబాల్‌ కిట్‌ పంపిణీ

వాలీబాల్‌ కిట్‌ పంపిణీ

వాజేడు గ్రామ యూత్‌కు వాలీబాల్‌ కిట్‌ను ఆ గ్రామ ఆదివాసీ ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఉపాధ్యాయులు పీర్ల కృష్ణబాబు, బోదెబోయిన పరమేశ్వరరావు మాట్లాడుతూ వాలీబాల్‌ క్రీడలో రాణించి వాజేడు గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా క్రీడల్లో పడి చదువును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు గ్రామ యూత్‌ సభ్యులు ఆలం శివ, బంధం రాంబాబు, బొడ్డు కృష్ణ, తోలెం దినేష్‌, జాక ప్రవీణ్‌, చిడెం రవికుమార్‌, చిడెం నాగేంద్ర, ఆలం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

vidyarthiki sanmanam, విద్యార్థికి సన్మానం

విద్యార్థికి సన్మానం

పదవతరగతి పరీక్షల్లో 10/10 జిపిఎ సాధించిన విద్యార్థి బానోతు రవీంద్రను నర్సంపేట లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ వైద్యుడు భరత్‌రెడ్డి శాలువాతో సన్మానించి 5వేల పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్యుడు భరత్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మండలంలోని పర్శనాయక్‌ తండా గ్రామానికి చెందిన బానోతు ప్రేమ్‌సింగ్‌-అమతల కుమారుడు రవీంద్ర అనే విద్యార్థికి పండ్ల సమస్యతో చికిత్స అందిస్తున్న సందర్భంగా పదవ తరగతిలో 10/10 జిపిఎ సాధిస్తే సన్మానిస్తానని తెలపగా, అదే పట్టుదలతో ఉత్తీర్ణత సాధించినట్లు తెలపడంతో ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపారు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విద్యార్థికి నగదుతోపాటు శాలువాతో ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తండాల నుండి ఉత్తీర్ణత సాధిస్తే సన్మానించనున్నట్లు వైద్యుడు భరత్‌రెడ్డి తెలిపారు.

chairmenga mahilaku avakasham kalipinchali, చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి..

చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి..

వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పద్మావతికి అవకాశం కల్పించాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ ఏర్పాటు నుండి ఎప్పుడూ కూడా మహిళలకు అవకాశం కల్పించలేదని, ఈసారి 100శాతం దివ్యాంగురాలైన పొట్టబత్తిని పద్మావతికి అవకాశం కల్పించాలని తెలిపారు. రెండుసార్లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అదేవిధంగా దేశవిదేశాల్లో 500పైగా వికలాంగ రంగస్థల ప్రదర్శనలు, 200పైగా కచేరీలు చేశారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో వికలాంగులను సంఘటితం చేసిన ఘనత, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుని, రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న దివ్యాంగురాలు పద్మావతికే ఈసారి వికలాంగుల కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రిని, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ని, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్‌ని కలిసి అన్ని సంఘాల నాయకులు కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పినింటి రవీందర్‌రావు, రావుల వెంకట్‌, మదర్‌పాషా, ఆలీ, మంజురి ఇలాహి, రాజయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

saibaba mahimalu…mayamaina piasalu, ‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు

‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు
వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఆడిందే ఆటగా..పాడిందే పాటగా కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో కలిసి ఓ ప్రభుత్వ ఉద్యోగి పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు సమాచారం. క్యాంపులో పనిచేయని వారికి సైతం దొంగ పేర్లతో చెక్కుల ద్వారా చెల్లించినట్లు తెలుస్తున్నది. బాయ్స్‌ పేరిట వీరంతా కలిసి కొంతమంది దొంగ పేర్లు రాసి వారి అకౌంట్లను సేకరించి అందులో డబ్బులు జమ చేశారు. ఇలా జమచేసిన డబ్బులను మళ్లీ తిరిగి వారి వద్ద నుండి కలెక్ట్‌ చేసుకున్నారని చెబుతున్నారు.
– బాయ్స్‌ పేరిట దొంగపేర్లకు డబ్బులు జమ
పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌లో పనిచేయని వారికి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఏమున్నదన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే దొడ్డిదారిన ప్రభుత్వ సొమ్మును కాజేయాలన్న ఉద్దేశ్యమేనని అర్థమౌతున్నది. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందే ఈ దొంగ పేర్లను సేకరించారు. వారికి తెలిసిన సన్నిహితులతోపాటు బంధువుల పేర్లతో దొంగలెక్కలు రాసి చెక్కుల ద్వారా వారివారి అకౌంట్లలో వేశారు. కార్యాలయ సిబ్బందినే ఈ దొంగ పేర్లను బిల్లులు తయారుచేసే ఉద్యోగికి అందించారని పక్కా సమాచారం.
– కళ్లు మూసుకుని డిఐఈవో సంతకాలు..
కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, అకౌంటెంట్‌తో చేతులు కలిపి ఈ అవినీతికి పాల్పడ్డారని, వీరు చేసిన నిర్వాకం చూస్తే అర్ధమౌతున్నది. ఇలా దొంగదారిలో తయారుచేసిన బిల్లులపై కార్యాలయ డిఐఈవో కనీసం వాటిని పరిశీలించకుండానే కళ్లు మూసుకుని సంతకాలు చేయడంతో డిఐఈవో పాత్ర కూడా ఉందన్న అనుమానం రేకెత్తుతున్నది. ఇవే కాకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ విషయంలో కూడా ఇంటర్‌బోర్డ్‌కు పంపిన ప్రపోజల్‌ అమౌంట్‌ వేరు, వచ్చిన మొత్తం డబ్బులు వేరు, స్క్వాడ్స్‌కు చెల్లించింది మాత్రం అంతంత మాత్రమే. ఇక మిగిలిన డబ్బును వీరు నొక్కేశారని కొంతమంది సీనియర్‌ ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.
                                                                                    (అధికారి లీలలు….అవినీతి జాడలు త్వరలో…)

tera venuka suthradarulevaru…,తెర వెనుక సూత్రధారులెవరు…?

తెర వెనుక సూత్రధారులెవరు…?

– ఐనవోలు వెంచర్‌ వెనుక అదృశ్యశక్తులెవరు

– ఎవరి అండతో రియల్టర్లు, ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు

– అనుమతులు లేవంటున్న ‘కుడా’ చైర్మన్‌

– స్మశానంలో రియలెస్టేట్‌ ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు

– ‘స్మశానంలో రియలెస్టేట్‌’ విషయంలో ఆరా తీస్తున్న ఇంటలీజెన్స్‌

నేటిధాత్రి బ్యూరో : ఐనవోలు మండలకేంద్రంలో స్మశానంలో వెంచర్‌ నిర్వహిస్తూ, కుడా అనుమతులు ఉన్నామంటూ ప్లాట్లు అమ్మకం పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. అధికారులు, కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు రియలెస్టేట్‌ వ్యాపారానికి తెరతీశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్మశానంలో వెంచర్‌ నిర్వహించడానికి ఓ కార్పొరేటర్‌ భర్త, అధికార పార్టీ ప్రజాప్రతినిధి హస్తం ఉందని వెనకల ఉండి వీరే ఆ తతంగం అంతా నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరు మాత్రం తమకేం సంబంధం లేదని అంటున్నారు.

‘నేటిధాత్రి’కి బెదిరింపులు

ఐనవోలు మండలకేంద్రంలో ‘స్మశానంలో రియలెస్టేట్‌’ పేరుతో కథనం వెలువడగానే అందులో ఎవరి పేర్లు లేకున్నా 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ బానోతు కల్పన భర్త సింగ్‌లాల్‌ ‘నేటిధాత్రి’కి ఫోన్‌ చేసి భూకబ్జాల విషయం ప్రభుత్వం చూసుకోవాలని ఉపదేశమిచ్చారు. తన పేరుపై గజం భూమి లేదంటూనే వార్త రాసే ముందు తన వివరణ ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. సంబంధం లేని అట్రాసిటి కేసు విషయం తీసుకువచ్చి కులం కార్డు వాడుతూ మీపై అట్రాసిటీ కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. తమ పేరు రాయనపుడు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నిస్తే తన పరువు పోయిందంటూ బాధపడిపోయారు. ఐనవోలు వెంచర్‌తో సంబంధం లేనపుడు ఎందుకు పరువుపోయిందని బాధపడాలో అర్థం కాని విషయం.

ఎవరి బలం చూసుకుని…

వర్థన్నపేట ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ ఎవరిని లెక్క చేయని తనంతోనే బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే అండ చూసుకుని ఏం చేసిన చెల్లుతుందనే ధీమాతో ప్రవర్తిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రియలెస్టేట్‌ వ్యాపారాన్ని వృత్తిగా చేసుకుని ముందుకు వెళుతున్న సింగ్‌లాల్‌ ఎమ్మెల్యే పేరుతో అధికార పార్టీలోని కొందరిని సైతం లెక్క చేయకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. ఇదంతా కేవలం ఎమ్మెల్యే అండతోనేనని పలువురు ఆరోపిస్తున్నారు.

అనుమతులు ఇవ్వలేదు…తప్పుడు ప్రకటనలు నమ్మెద్దూ

కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి

ఐనవోలు మండలకేంద్రంలో నిర్వహిస్తున్న లేఅవుట్‌కు సంబంధించి కుడా నుండి ఎలాంటి అధికారిక అనుమతి లభించలేదని కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి తెలిపారు. నిర్వాహాకులు ఇస్తున్న ప్రకటనలు తప్పుగా మేము ధ్రువీకరిస్తున్నామని చెప్పారు.

లేఅవుట్‌ నిర్వహించడానికి ప్రజలు వ్యతిరేకం

కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు వడిచర్ల శ్రీనివాస్‌

మండలంలో నిర్వహిస్తున్న లేఅవుట్‌ నిర్వహణ కొరకు స్థానిక స్మశాన వాటికలు తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో వ్యతిరేకమైనప్పటికీ సంబంధిత అధికారులు చేస్తున్న ప్రయత్నాలు రియలేస్టేట్‌ దారులకు లాభదాయకంగా ఉండడం భాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వడిచర్ల శ్రీనివాస్‌ అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రియాల్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

cameralu bandh…dieo hastham unda…,కెమెరాలు బంద్‌..డిఐఈవో హస్తం ఉందా….?

కెమెరాలు బంద్‌..డిఐఈవో హస్తం ఉందా….?

– సీసీ కెమెరాలను నిలిపివేసిందెవరు..!

– కెమెరాల బంద్‌తో పలు అనుమానాలకు తెర

– డిఐఈవో ఏం చేస్తున్నట్టు

– ప్రశ్నిస్తున్న విద్యార్థి, ప్రజాసంఘాలు

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ కార్యాలయంలో సీసీ కెమెరాలను నిలిపివేశారని ‘నేటిధాత్రి’లో వెలువడిన కథనాన్ని చదివిన ప్రజలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలంతా వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. అవినీతి లీలలు అలుముకున్నాయని గత ఐదు రోజులుగా వరుసగా ‘నేటిధాత్రి’లో కథనాలు వస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపధ్యంలో సీసీ కెమెరాలను నిలిపివేసి ఈ తతంగమంతా చేసివుంటారన్న అనుమానం ఇప్పుడు జిల్లాలో దుమారం రేపుతున్నది.

-డిఐఈవో ఏం చేస్తున్నట్టు

కార్యాలయంలో సీసీ కెమెరాలు గత ఏప్రిల్‌ నెల నుండి నిలిపివేసిన విషయం డిఐఈవోకు తెలియకుండా వుంటుందా? కెమెరాలు పని చేస్తున్నాయా లేదా అని ఒక్కసారి కూడా కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు..తన చాంబర్‌లో టీవి మానిటర్‌ను నెలలో ఒక్కసారి కూడా ఎందుకు ఓపెన్‌ చేయలేదు..కావాలనే డిఐఈవో నిలిపివేశాడా..కార్యాలయంలోని ఉద్యోగులు నిలిపివేశారా? అన్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తిస్తున్నది. ఇంత జరుగుతున్నా డిఐఈవో అటు వైపు దృష్టి సారించకపోడంలో ఆంతర్యం ఏమిటని పలు విద్యార్థి, ప్రజాసంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

-కెమెరాల బంద్‌తో పలు అనుమానాలకు తెర

కార్యాలయంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల పేపర్‌ వాల్యుయేషన్‌ అనంతరం లెక్కకు మించి బిల్లులు పెట్టి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేశారని ‘నేటిధాత్రి’లో వెలువడిన కథనాలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. బిల్లులు తయారుచేసే సమయంలో తమ అవినీతి ఎవరికి చిక్కకుండా దొరకకుండా కెమెరాలను నిలిపివేసి వుంటారని ప్రజలు భావిస్తున్నారు. ప్రతి కాలేజీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఉపన్యాసాలిచ్చే డిఐఈవో తన కార్యాలయంలో మాత్రం సీసీ కెమెరాలను ఎందుకు నిలిపివేశారో..ఎవరు నిలిపివేశారో సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

online ganjaye muta gutturattu, ఆన్‌లైన్‌ గంజాయి ముఠా గుట్టురట్టు

ఆన్‌లైన్‌ గంజాయి ముఠా గుట్టురట్టు

– 30లక్షల విలువ చేసే 150కిలోల గంజాయి స్వాధీనం

– రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు కూడా…

– వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌

ఆన్‌లైన్‌ ద్వారా గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ముఠాను శనివారం ఎల్కతుర్తి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముఠాసభ్యుల నుండి సుమారు 30లక్షల విలువగల 150కిలోల శుద్దిచేసిన గంజాయితోపాటు రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. శనివారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూర్‌ మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన బోనగాని భిక్షపతి, వరంగల్‌ ఆర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌ గ్రామానికి చెందిన తీగల రాజు ఆలియాస్‌ చిన్నరాజు, హన్మకోండ వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన జెల్లి యాకయ్య, జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన మాసారపు భూపతిరావు ఉన్నారు. అదేవిధంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కోమటిపల్లి విష్ణుపురి కాలనీలో నివాసం ఉంటున్న బానోత్‌ వీరన్న ఆలియాస్‌ వినోద్‌, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖ పట్టణానికి చెందిన నాయుడు, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కోత్తవాడకు చెందిన దేశిని రమేష్‌, జయశంకర్‌ భూపాల్‌ పల్లి జిల్లా గోరుకోత్తపల్లి గ్రామానికి చెందిన శంకర్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల్లో ఒకడైన బోనగాని భిక్షపతి, పరారీలో ఉన్న వినోద్‌, నాయుడు ముగ్గురు మిత్రులని పేర్కొన్నారు. గతంలో వీరు చోరీలు పాల్పడడంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. ఈ ముగ్గురు నిందితులు దొంగతనాలకు స్వస్తి పలికి సులువుగా డబ్బు సంపాదించాలనే అలోచనతో ఆన్‌లైన్‌లో గంజాయి వ్యాపారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించుకున్నారని చెప్పారు. నిందితులు మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, అంద్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో గంజాయిని సెల్‌ఫోన్‌లో ఆర్డర్లు తీసుకోనేవారని, ఆర్డర్లు స్వీకరించిన నిందితులు మరో ఆరుగురు నిందితులను తమ ముఠాలో నియమించుకుని వారి ద్వారా నాయుడుకు తెలిసిన వ్యక్తుల ద్వారా విశాఖపట్టణం జిల్లా నుండి గంజాయిని బోలేరో వాహనాల్లో తాత్కాలిక రహాస్య ప్రదేశంలో పెట్టి వరంగల్‌ నగరానికి చేరవేసేవారన్నారు. అనంతరం ప్రధాన నిందితులు వినోద్‌, నాయుడు ఆర్డర్లు ఇచ్చిన వ్యక్తులకు గంజాయి సిద్దంగా వుందని, తమ బ్యాంక్‌ ఖాతాకు డబ్బు జమ చేయాలని సెల్‌ఫోన్‌లో సమాచారం ఇచ్చేవారన్నారని తెలిపారు. ఆర్డర్‌ చేసిన వ్యక్తుల నుండి ఖాతాలో డబ్బు జమ కాగానే నిందితులు గంజాయిని కార్లలో మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, అంద్రప్రదేశ్‌లకు ముఠాసభ్యులతో తరలించేవారని చెప్పారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన బానోత్‌ వీరన్నపై గతంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని జఫర్‌గడ్‌, పాలకుర్తి పోలీస్‌స్టేషన్ల పరిదిలోó బందిపోటు దొంగతనాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని అన్నారు. మధ్యప్రదేశ్‌, మహరాష్ట్ర రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా సంబంధించి పలు కేసులు నమోదు కాగా, బోనగాని బిక్షపతిపై ఇంతజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగతనంతోపాటు అంధ్రప్రదేశ్‌లో గంజాయి కేసులు నమోదయ్యాయని తెలిపారు. మరో నిందితుడు నాయుడుపై అంధ్రప్రదేశ్‌లో గంజాయి రవాణాకు సంబంధించి పలు కేసులు ఉన్నాయని వివరించారు. పెద్ద మొత్తంలో గంజాయి వ్యాపారాన్ని గుర్తించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఎ.సి.పి చక్రవర్తి, ఎల్కతుర్తి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నందిరాంనాయక్‌, ఎల్కతుర్తి సబ్‌-ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌, సూరి, ఉపేందర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లయ్య, కానిస్టేబుళ్లు రాజు, కిరణ్‌లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అభినందించారు.

autonu deekottina tractor, ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్‌

ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్‌

– నలుగురికి తీవ్రగాయాలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద కూలీలతో వరంగల్‌కు వెళుతున్న ఆటోను ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలకు గాయాలు కాగా నలుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కూలీలు వర్ధన్నపేట మండలకేంద్రానికి చెందినవారు.

nidithudipia pd act, నిందితుడిపై పీడీ యాక్ట్‌

నిందితుడిపై పీడీ యాక్ట్‌

– వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెళ్లికి నిరాకరించినందుకు విద్యార్థినిని హతమార్చిన నిందితుడిపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేశారు. హన్మకొండ పరిధిలోని కిషన్‌పుర ప్రాంతంలో సంగెం మండలం రాంచంద్రపురం గ్రామానికి చెందిన భాధితురాలు తోపుచర్ల రవళి అనే విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన నిందితుడు వర్థన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన పెండ్యాల సాయి అన్వేష్‌పై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శనివారం పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సంపత్‌రావు కేంద్రకారాగారంలో నిందితుడికి జైలర్‌ సమక్షంలో పీ.డీ యాక్ట్‌ నిర్బంధ ఉత్తర్వులను అందజేశారు. నిందితుడు పెండ్యాల సాయి అన్వేష్‌ హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివాహనికి అంగకరించలేదని సంగెం మండలం రాంచంద్రపురం గ్రామానికి చెందిన తోపుచర్ల రవళిని ఈ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదిన విధ్యార్థిని తోపుచర్ల రవళిపై పెట్రోల్‌పోసి నిప్పంటించడంతో బాధితురాలు రవళి మార్చి 4వ తేదిన హైదరాబాద్‌ హస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించిన సంఘటనపై నిందితుడిపై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీ చేశామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఇకపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ఇలాంటి నిందితులు పాల్పడిన నేరాలను కోర్టులో నిరూపించి శిక్షపడే విధంగా తగు చర్యలు తీసుకుంటామని, వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి చేసుకుంటానే సాకుతో వేధింపులకు గురవుతున్న విధ్యార్థినులు మౌనంగా ఉండకుండా తమ సమస్యను పోలీస్‌ అధికారులు, తమ తల్లిదండ్రుల దష్టికి తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారిపై చట్టపరిధిలో కఠినచర్యలు తీసుకుంటామని పోలీస్‌ కమిషనర్‌ పేర్కోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version