ఆదివాసీ యువకుడి పై దాడి.!

ఆదివాసీ యువకుడి పై దాడి చేసిన గిరిజనేతరుడి పైన ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ డిమాండ్..

.. ఆదివాసీ నవనిర్మాణ సేన, తుడుందెబ్బ సంఘాలు…

వలస గిరిజనేతరుల నుండీ ఆదివాసీలకు రక్షణ కల్పించాలి..

ఆదివాసీల పైన అగ్రవర్ణాల ఆగడాలను అరికట్టాలి.

ఎస్సై రాజ్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చిన ఆదివాసీ నాయకులు..

నూగూర్ వెంకటాపురం

 ములుగు జిల్లా వెంకటాపురం నేటి ధాత్రి:

ఏజెన్సీ ఏరియాలో ఆదివాసీలకు కనీస రక్షణ కరువైందని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. మండపాక గ్రామానికి చెందిన తోలేం సర్వేశ్వర్ రావు అనే ఆదివాసీ పైన విచక్షణ రహితంగా దాడి చేసిన నాగేంద్ర బాబు రాజు పైన ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి, తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాయం జానకి రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాయకులు నర్సింహా మూర్తి, పాయం జానకిరావు వాజేడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై రాజ్ కుమార్ ని కలిసి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఫిర్యాదు చేసినారు. తోలేం సర్వేశ్వర్ రావు అనే ఆదివాసీ యువకుడిని వాజేడు గ్రామానికి చెందిన కృష్ణబాబు రాజు తన ఇంటి ఆవరణలో ఉన్న మట్టి దిబ్బలు చదును చేయమని ట్రాక్టర్ డ్రైవర్ తోలేం సర్వేశ్వరరావు ని తీసుకెళ్ళినరాని అన్నారు. పని చేస్తున్న డ్రైవర్ ని నాగేంద్ర బాబు రాజు అకారణంగా కొడుతూ,కులం పేరుతో దుర్భాషలు ఆడినట్టు ఫిర్యాదు లో పేర్కొన్నట్టు తెలిపారు. అనంతరం ఆదివాసీ నాయకులు కొర్స నర్సింహా మూర్తి, పాయం జానకి రావు మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో వలస గిరిజనేతరుల వల్ల ఆదివాసీలకు రక్షణ కరువైందని ఆరోపించారు. పని చేస్తున్న యువకుడి పైన రాత్రి ఏడున్నర గంటల సమయం లో దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. యువకుడి పై దాడి చేయడం తో పాటు ట్రాక్టర్ పైన కూడా రాళ్లతో దాడి చేసినారని అన్నారు.యువకుడి తండ్రి ముందు కూడా కొడుతూ హైదరాబాద్ బాద్ నుండి రౌడీలను తెప్పిస్తా ట్రాక్టర్ ని పెట్రోలు పోసి కాల్చేస్తా అని బెదిరించినట్టు నాయకులు మీడియా కు తెలిపారు. అగ్రవర్ణాలకు ఆదివాసీల పైన అంత అక్కస్సు ఎందుకని అన్నారు. వలస వచ్చి వాజేడు మండలం లో ఉన్న సారవంత మైన వేల ఎకరాల భూములను కబ్జా చేసినట్లు తెలిపారు. ఇక్కడున్న స్థానిక గిరిజన గిరిజనేతరుల పైన పెత్తనం చెలయిస్తూ ఉన్నారని అన్నారు. పూర్వం వాజేడు మండలం లోని ఆదివాసీల పైన అరాచకాలు, హత్యలు, హత్యా చారాలు చేసినారని అన్నారు.రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని నేటికీ వాజేడు మండలం లో వలస గిరిజనేతరుల అరాచకాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ఇక్కడున్న ఎల్ టి ఆర్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ప్రభుత్వ భూములకు పట్టాలు చేపించు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వాదులకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధన్యత ఇస్తూ ఉండడం కారణంగానే ఆదివాసీల పైన దుర్మార్గాలకు తెగపడుతున్నారని అన్నారు. వలస గిరిజనేతరుల స్వాధీనం లో ఉన్న గిరిజనుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. తోలేం సర్వేశ్వర్ రావు పైన జరిగిన దాడి యావత్తు ఆదివాసీ సమాజం పైన జరిగిన దాడి గా నాయకులు పేర్కొన్నారు. అగ్రవర్ణాలు అహంకారం తో ఆదివాసీల పైన, దళితుల పైన దాడులు చేస్తున్నారని అన్నారు. తోలేం సర్వేశ్వర్రావు పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే వాజేడు లో భారీ ర్యాలీ చేస్తామని నాయకులు ప్రకటించారు. నాయకులు మోడెం నాగరాజు, నల్లేబోయిన సర్వేష్, కుంజ మహేష్, యుగంధర్,చాప కిరణ్, మండపాక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version