జహీరాబాద్ 14వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ ఘన విజయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే ఎంఐఎం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మొహమ్మద్ రఫీ తెలిపారు. ఈ ఎన్నికలు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగాయి.
