ప్రజలకు మూడు నెలల రేషన్ కోటా అందుబాటులోకి.

ప్రజలకు మూడు నెలల రేషన్ కోటా అందుబాటులోకి.
ప్రారంభించిన 29 వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్.
శ్రీరాంపూర్: నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ సంగ మల్లయ్య పల్లె షాప్ నెంబర్-2లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రేషన్ బియ్యం మూడు నెలల కోటాను కార్పొరేటర్ బండారి సుధాకర్ గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‌ పేద ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని అర్హత కలిగిన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రేషన్ బియ్యం సరఫరా ద్వారా ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు మహిళా సోదరీమణులు, కార్యకర్తలు, రిటైర్డ్ కార్మికులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version