తుమనపల్లి గామ అభివృద్ధికి మహర్దశ.
◆-: తుమనపల్లి గ్రామన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన
◆-: లక్ష్యమని సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ స్పష్టం చేశారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం,తుమనపల్లి గ్రామంలో, వార్డు సభ్యులతో మాట్లడుతూ, ఈ కొత్త సంవత్సరంలో వార్డు వార్డు తిరుగుతూ ఆయా వార్డుల పరిధిలో ఉన్న పలు కీలక సమస్య పనులకు గడప గడపకు తిరిగి, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పనులు పనులను పూర్తి చేస్తామని గ్రామంలో తను ఎన్నికల సమయంలో ప్రకటించిన ప్రత్యేక అభివృధి కార్యక్రమలు చేపట్టనున్నట్లు గ్రామ సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ పేర్కోన్నారు. అలాగే త్వరలో వచ్చే15వ ఆర్థిక సంఘం పంచాయతీ బడ్జెట్ నుండి ప్రత్యేక అభివృద్ధి పనులను గ్రామంలో ప్రారంభించ నున్నారు. గ్రామంలో పలు పనులను పరిశీలించి, నాణ్యతతో కూడిన పనులను చేయాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శి వేగంగా పూర్తి చేయాలని అధికారిని ఆదేశించనున్నారు. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంటి ఆధునిక వసతులు కల్పించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, ఉన్నత పాఠశాల, కొత్త భవనాలు, టాయిలెట్స్, క్రీడా ప్రాంగణాలు, అదనపు తరగతి గదులు మరియు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచిస్తున్నారు. గ్రామంలో ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గ్రామంలో వీధి దీపాలు వెలుగులోకి కోసం ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బందితో సేవలు అందించాలని చూస్తున్నారు. గ్రామంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. పంచాయితీ భవనానికి పేయింటింగ్, అలాగే కబరస్థాన్ మరియు హిందూ శ్మశాన వాటిక నిర్మాణాలకు పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా కట్టుబడి ఉన్నానని గ్రామ సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ స్పష్టం చేశారు.
