బడం పేట నూతన సర్పంచ్కు ఘన సన్మానం
జహీరాబాద్ నేతి ధాత్రి:
శుక్రవారం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలం బడం పేట నూతన సర్పంచ్ దయానంద్ పాటిల్ను పలువురు ప్రముఖ నాయకులు ఘనంగా శాలువా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఆయన విజయవంతంగా కృషి చేయాలని నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
