తిరుపతిలో అత్తలూరి ఆర్యవైశ్య సత్రంలో లాకర్ కు 400 ?
ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఏపీ అధికారులు
వనపర్తి నేటిధాత్రి:
తిరుపతి లో రైల్వే స్టేషన్ ఎదురుగా అత్తలూరి ఆర్యవైశ్య సత్రం లాకర్ ఇవ్వడానికి అత్తలూరు 400 రూపాయలు చెల్లిస్తేనే లాకర్ ఇస్తామని పీడిస్తున్నారు . ఈ మేరకు భక్తులు కొందరు సోమవారం రాత్రి లాకర్ ఇవ్వాలని సత్రం దగ్గరికి వెళ్లి నిర్వాహకులను అడిగారు సత్రం నిర్వాహకులు ఒక లాకర్ ఇవ్వడానికి 400 రూపాయలు చెల్లిస్తేనే లాకర్ ఇస్తామని ఆగ్రహంగా ఆవేశంగా ప్రవర్తించారని భక్తులు తెలిపారు . ఈ మేరకు భక్తులు నేటి దాత్రి దినపత్రిక విలేకరులతో ఆవేదన వ్యక్తం చేస్తూ భక్తులను పీడించి వసూలు చేస్తున్న లాకర్లు రూముల కేటాయింపు ప్రభుత్వ నియమ నిబంధనలు జీఎస్టీ చెల్లించ కుండ రూల్స్ ను ఉల్లంఘించి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ భక్తులను పీడిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి లో అధికారులు ప్రేక్షక పాత్ర వహించిదముపై ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ తిరుపతి కలెక్టర్ తిరుపతి ఎంపీ ఎమ్మెల్యేకు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు సత్రం వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొన్నారు