13వ వార్డు అభ్యర్థి బొచ్చు మాధవి లత ప్రచారం
పరకాల,నేటిధాత్రి
మున్సిపాలిటీలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొచ్చు మాధవిలత విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వార్డు పరిధిలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను కలిసి ఆశీర్వాదం కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము ఎల్లప్పుడూ ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతామని తాగునీరు,డ్రైనేజీ,రోడ్లు,వీధి దీపాల సమస్యలు లేకుండా ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
