-కాంగ్రెస్ లో కుంపట్లకు కొదువలేదు?
-వున్న వారంతా ముఖ్యమంత్రులే?
-రేవంత్ ను అసలు కాంగ్రెస్ లీడర్లే నమ్మడం లేదు?
-గతంలో రేవంత్ చేసిన ఉద్యమం లేదు?
-పార్టీలో పది మంది లీడర్లు సక్కగ లేరు?
-పార్టీని గెలిపించే నాయకుడే కరువయ్యాడు?
-రాని ప్రభుత్వంలో నేనే సిఎం అని చెప్పుకునే వారే?
-జనం నమ్ముతారని అనుకోవడం లేదు?
-పరిపాలనా దక్షతలో అనుభవం లేదు?
-ఎక్కడ చేరినా ఆ పార్టీలు బతికి బట్టకట్టింది లేదు?
-ఒక్కొక్కరినీ నిచ్చెన మీద నుంచి లాగడానికి వాళ్లే చాలు?
-పాత వారికి ప్రాధాన్యత లేదు?
-కొత్త వారికి ప్రజల్లో వున్న గుర్తింపు లేదు?
-ఏ ఒక్కరికీ ప్రభుత్వం మీద పోరాటం చేసిన చరిత్ర లేదు?
-రోడ్ల మీదకొచ్చి కొట్లాడిరదెన్నడూ లేదు?
-ఈ ఐదేళ్లలో పోరాటం చేసి జైలుకెళ్లొచ్చిన నాయకుడే లేదు?
-కాలు కదపకుండా, కడుపు సల్లగా వున్న వాళ్లే?
-వీళ్లను చూసి ప్రజలు ఓట్లేస్తారా?
-కాంగ్రెస్ కు పట్టం కడతారా?
-కర్ణాటక లో గెలిస్తే తప్ప సోయి రాలేదు?
-నిద్రలో నుంచి లేచినా పగటి కలలే కంటున్నారు?
హైదరబాద్,నేటిధాత్రి:
రాజకీయ పార్టీలకు ఆశలుండాలి. అంతకు మించి పోరాటం కూడా వుండాలి. అంతే కాని గాలి వాటం గెలుపుకోసం ఎదురుచూస్తే విజయాలు రావు. నిన్నటి దాకా వచ్చేది మేమే…పాలించేది మేమే అంటూ బిజేపి తెగ ఆశలకు పోయింది. కర్నాటక ఫతితాలతో పార్టీకి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు ఆ ఆశల పల్లకిలో కాంగ్రెస్ ఊరేగుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పట్టుమని పది సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్ధితి లేదు. కరంటు విషయంలో ప్రజలు కాంగ్రెస్ను ఎలా తిట్టిపోశారో అందరూ చూశారు. అయినా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో కొట్లాడేంతస్ధాయిగాని, రాజకీయాలంటే పోరాటాలన్నది తెలిసిన వాళ్లు లేరు. ఎంత సేపు ప్రచార యావ తప్ప, పార్టీ మీద మమకారం, గెలుద్దామన్న లక్ష్యం ఎవరకీ లేదు. నేను తప్ప, మరొకరు వుండొద్దు. నాకుంటే ముందుకు ఎవరూ ముందుకు పోవద్దు. అనే మనస్తత్వాలతో కాంగ్రెస్ పార్టీ నిండిపోయింది. అందుకే ఆ పార్టీ ఆశల మీదే బతుకుతోంది. ఆశయాలను ఎప్పుడో మర్చిపోయింది. కర్నాటక ఊపును చూసి, తమకు బలమొచ్చిందని కలలు గనే పార్టీ ప్రపంచంలో కాంగ్రెస్ తప్ప మరొకటి వుండకపోవచ్చనే చెప్పాలి. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పారీక్టి కర్నాకట కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏమిటి? అక్కడ బిజేపి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు మార్పు కోరుకున్నారు. అంతే కాని కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో గెలిపించలేదు. ఇక తెలంగాణలో అటు వంటి పరిస్దితి లేదు. ప్రపంచంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పధకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. అలాంటి బిఆర్ఎస్ను ఓడిరచాలంటే ప్రజలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే తెలంగాణలో గోసను చూసి, వాళ్లెవరు కాంగ్రెస్ ఓటు వేసే పరిస్ధితి వుండకపోవచ్చు. ఆనాడు కరంటు లేదు. నీళ్లు లేవు. పంటలులేవు. ప్రజల బతుకు అన్నమో రామచాంద్రా! అన్నట్లు వుండేది. కాని తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర్ర పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ దేశంలోని అనేక రాష్ట్రాలకన్నా, ఎన్నొ రెట్లు ముందుంది.
ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో తెలంగాణ సంపూర్ణ వికాసం పొందింది.
ఇదీ అసలు తెలంగాణ ఆర్ధిక ముఖచిత్రం. దాన్ని గురించి కాంగ్రెస్కు అవసరం లేదు. అయినా పార్టీ పరిస్ధితి ఏమిటి? వాస్తవ పరిస్దితులు ఎలా వున్నాయి? ప్రజలు పార్టీకి అనుకూలంగా వున్నారా? ప్రజలకు పార్టీ ఎంతచేరువైంది. ప్రజల్లో పార్టీపట్ల కనీసం సానుభూతి వుందా? అన్నది కూడ తెలుసుకునే స్ధితి పార్టీలో ఎవరికీ లేదు? ఎవరూ పట్టించుకున్నది లేదు. కాని నేనే సిఎం. అని చెప్పుకోమంటే మాత్రం అందరూ ముందుటారు. నేనే సిఎం అవుతా అని చెప్పమంటే అందరూ చెప్పేస్తారు.ఇదీ ఆ పార్టీ పరిస్దితి. కాంగ్రెస్ పార్టీలో తాజా రాజకీయ పరిస్దితులు ఓసారి బాగా నిశితంగా పరిశీలిస్తే మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్ ప్రచార కమిటీ చైర్మన్గా ఏఐసిసి. నియమించింది. అసలు ఈ పదవికి ఎవరిని నియమించాలి. పార్టీలో అందరికీ తెలిసిన నాయకుడి, లేక ప్రజల్లో బాగా గుర్తింపు వున్న నాయకుడిని నియమించాలి. మరి మధుయాష్కీ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కరుడు గట్టిన కాంగ్రెస్ వాది ఇంతవరకు ఓకే. రెండుసార్లు ఎంపి. కాని రెండు సార్లు ఓడిపోయాడు. గత ఎన్నికల్లో దిక్కు లేక మళ్లీ నిజామాబాద్ వెళ్లిపోయాడు. అసలు ఆయన భవనగిరి నుంచి పోటీ చేయాలని అనుకున్నాడు. కాని పార్టీ ఆయనకు భువనగిరి ఇవ్వలేదు. బెట్టు చేస్తే నిజామాబాద్ కూడా ఇచ్చే పరిస్థితి లేని స్దితి దాకా వెళ్లింది. ఏమైంది? రెండోసారి కూడా ఓడిపోయాడు. గత మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచార కార్యదర్శి బాద్యతలు అప్పగిస్తే ఏం చేశాడు? అలిగి ఇంట్లో కూర్చున్నాడు. ఇదీ ఆయన చరిత్ర. అలాంటిది సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార కమిటీ బాద్యతలు అప్పగిస్తే ఆయన వల్ల సమన్వయం సాధ్యమా? ఆయనను పార్టీ ప్రెసిడెంటు పట్టించుకునే అవకాశం వుందా? ఇదిలా వుంటే ప్రచార కమిటీ బాద్యతలు నిర్వర్తించే నాయకుడికి అనర్గళమైన వాక్చాతుర్యం వుండాలి. మరి అది మధుయాష్కీకి వుందా? కొన్ని రోజుల పాటు, గంటల పాటు నిర్విరామంగా సభలు నిర్వహించాల్సిన అవసరం వుంటుంది. అలసిపోవడం, చెప్పిందేచెప్పడం వంటివి కాకుండా, ప్రజలను ఉత్సాహపర్చే, ఆలోచింపజేసేలా ప్రసంగాలు సాగాలి. అవి ముధుయాష్కీ వల్ల సాధ్యమా? ఇది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ముందున్న ప్రశ్న.
ఇక సాక్ష్యాత్తు పిసిసి. అధ్యక్షుడైన రేవంత్రెడ్డి తెలుగుదేశం పార్టీలో వున్నంత కాలం కాంగ్రెస్ను చెడుగుడు ఆడుకునేవారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. తూర్పారపట్టేవారు. మరి అలాంటి రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణశాఖకు అధ్యక్షుడు. ఇక త్వరలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న వైఎస్. షర్మిల తాను పాదయాత్ర చేసిన సందర్భంలో రేవంత్ చేసిన యాత్రపై విసిరిన వ్యంగ్యాస్త్రాలు తెలియందికాదు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అంటూ, రేవంత్రెడ్డికి పాదయాత్రను ఎగతాళి చేసింది. పార్టీ కోసంపాదయాత్రనే సరిగ్గా నిర్వహించని నాయకుడు పార్టీకోసం అహర్నిషలు కష్టపడతాడంటే అతిశయోక్తి కాదా? ఇక సీనియర్ల సంగతి తెలింది కాదు. రాజుగారి కథలో ఏడో చేప ఎప్పటికీ ఎండదు. కాంగ్రెస్పార్టీలో సీనియర్లలో సమన్వయం ఎప్పుడూ సాధ్యం కాదు. దీనికి తోడు కోవర్టు రాజకీయాలు తెలియంది కాదు. ఇలాంటి పార్టీ అధ్యక్షుడు, కొత్తగాచేరే నాయకులు, సీనియర్లను చూసి ప్రజలు ఓట్లేస్తారని భ్రమ పడడం ఊహలకు అంతు లేకపోవడం కాకపోతే మరేమిటని కార్యకర్తలే అనుకుంటున్నారు. అసలు ఊహించడానికి కూడా హాస్వాస్పదంగా వుంది.
తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది. ఇంత వరకు బాగానే వుంది.
కాని ఆ పార్టీని 2014లో ప్రజలు ఆదరించలేదు. కారణం పదేళ్లుగా తెలంగాణ ఇస్తామని సాగదీసి, తీసి ఆఖరుకు తప్పని పరిస్దితుల్లో మాత్రమే ఇచ్చారు. 2004 ఎన్నికల్లో అప్పటి టిఆర్ఎస్, ఇప్పటి బిఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టి, కామన్మినిమమ్ ప్రోగ్రామ్లో తెలంగాణ ఏర్పాటును చర్చించి, అవసరమైతే రెండో ఎస్సార్సీ వేసైనా సరే అంటూ సన్నాయి నొక్కులు నొక్కి, ఆఖరుక పదేళ్లకు తెలంగాణ ఇచ్చారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో ఒక రకమైన హేయ్య భావం ఏర్పడిపోయింది. వందల మంది యువకులు బలిదానాలకు కాంగ్రెస్ కారమైందన్న ఆరోపణలు ఎదుర్కొన్నది. అయినా సరే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు వున్నా, ప్రజలకు చేరువలో వున్న నాయకులు కాంగ్రెస్లో ఎవరున్నారు? తెలంగాణ ఉద్యమ కాలంలో బిఆర్ఎస్ నేతలు నిత్యం ప్రజల్లో వున్నారు. పోరాటాలు చేశారు. పోలీసు దెబ్బలు తిన్నారు. కాళ్లు చేతులు విరగ్గొట్టుకున్నారు. జైలు జీవితం అనుభవించారు. ఒక్కొక్క నాయకుడి మీద పదులు సంఖ్యలో కేసులు ఇంకా వున్నాయి. మరి ఏ ఒక్క కాంగ్రెస్ నేత మీద తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో చేసిన ప్రజా ఉద్యమాలెన్ని? ప్రజల కోసం కొట్లాడి జైలుకు వెళ్లిన నేతలెంత మంది? కాళ్లు కదలకుండా,కడుపు చల్లగా ఇంట్లో కూర్చొని మీడియా సెటైట్లు వేసిన వాళ్లే గాని, ప్రజల్లో ప్రజలకు మద్దతుగా నిలిచిన నాయకుడు ఒక్కరైనా? వున్నారా? ఇదీ ప్రజలకు ముందు చెప్పాల్సిన సమాధానం…