యోగా డే.. త‌ర‌లివ‌చ్చిన సినీతార‌లు.

యోగా డే.. త‌ర‌లివ‌చ్చిన సినీతార‌లు

 

 

 

హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన యోగా డే కౌంట్‌డౌన్ శుక్ర‌వారం క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది.

జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన యోగా డే (Yoga Day) కౌంట్‌డౌన్ శుక్ర‌వారం క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుడేవ్ వర్మ (Telangana Governor Jishnu Dev Varma), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu)ల‌తో పాటు ప‌లువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు,పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు యోగాసనాలు వేశారు.

ఆపై సినీ తార‌లు తేజ స‌జ్జా (Teja Sajja), సాయుధ‌ర‌మ్ తేజ్ (Sai Dharam Tej), మీనాక్షి చౌద‌రి (Meenakshi Chaudhary), ఖుష్బూ (Kushboo) వంటి తార‌లు సైతం త‌ర‌లివ‌చ్చి ప్రొగ్రాంకు కొత్త క‌ళ తీసుకు వ‌చ్చారు. త‌మ ప్ర‌సంగంతో అక్క‌డికి చ్చిన వారిలో ఉత్తేజం నింపారు. అంద‌రితో పాటుగా యోగా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అని అన్నారు. ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారని.. మోదీ నాయత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్న 2 వందల దేశాల నాయకులు, ప్రజలు యోగాను ఆచరిస్తున్నారంటే.. ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయమని కిషన్ రెడ్డి అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version