గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం కలిగేనా!
ఏండ్లు గడుస్తున్న భవన నిర్మాణం కలగానే మిగిలి పోతుందా!
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి మోక్షం ఎప్పుడు అనేది మండల ప్రజలు ఆలో చనలో పడ్డారు. గత ప్రభుత్వం నూతన భవనానికి శంకుస్థాప నలు చేసి పనులు మొదలు పెట్టకపోవడం వల్ల ప్రజాప్రతిని ధులు అధికారుల మీద ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తు న్నారు.మెరుగైన పాలనఅందిం చేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలను నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి భవనాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందిం చాలి.గత ప్రభుత్వం పంచా యితీ కార్యాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృ ద్ధి ద్యేయం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నూతన భవన నిర్మాణానికి అవకాశం కల్పించి, త్వరగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ప్రజలు కోరుతు న్నారు.గత ప్రభుత్వం అభి వృద్ధి చేయని ఘనత. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే ఉన్నట్టు అనిపించింది. దీంతో గ్రామపం చాయతీ నూతన భవనానికి మోక్షం కలుగుతుందా!