స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…
21 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ చైర్ పర్సన్ జంగం కళ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
స్థానిక 21వ వార్డ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని 21 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ చైర్ పర్సన్ జంగం కళ స్పష్టం చేశారు.21 వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలో లో సింగరేణి ఖాళీ స్థలాల్లో పట్టాలు ,76 జీవో ద్వారా ఇళ్లపట్టాలు రానివారికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అన్ని వీధుల్లో రోడ్లు, డ్రైన్లు, సరైన మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
