ప్రభుత్వ పథకాలు పేదలకు అందిస్తాం.

ప్రభుత్వ పథకాలు పేదలకు అందిస్తాం.

ఆమనగల్ నేటిధాత్రి :

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలోని బోడ నరేష్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఆవాసం కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లతోపాటు ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ.. అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ.. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగేలా చూడటం తన ప్రాధాన్య లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో.. మెకానిక్ బాబా, ఎమ్మెల్యే సహోదరులు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీమండలఅధ్యక్షులు జగన్, ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కేశవులు, శివలింగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్, కృష్ణా నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అప్పం శ్రీను, ఎంగలి ప్రసాద్, ఖాదర్, మాజీ వార్డు సభ్యులు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version