డబుల్ బెడ్ రూములు కేటాయించే.!

డబుల్ బెడ్ రూములు కేటాయించే వరకు పోరాడుతాం…

“వరంగల్ తూర్పు జర్నలిస్టుల” రిలే నిరహార దీక్షలు – “5వ రోజు”

“ఓ జర్నలిస్ట్ యూనియన్” నాయకుల కుట్రలు? దీక్షలకు వెళ్లకుండా వారి సభ్యులకు హుకుం జారీ?

మేలుకోండి తూర్పు జర్నలిస్టు మిత్రులారా, కుట్రపూరిత మాటలను నమ్మి మోసపోకండి

డబుల్ బెడ్రూమ్స్ సాధనే మా లక్ష్యం, కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా ఈ ఉద్యమం ఆగదు

“ఐదవ రోజు” రిలే నిరహార దీక్షలు. వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల మద్దతు.

జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ లు కేటాయించండి మంత్రి కొండా సురేఖకు, “తూర్పు జర్నలిస్టుల” విజ్ఞప్తి.

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

 

వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను త్వరగా కేటాయించాలని వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ఐదవ రోజు జర్నలిస్టుల రిలే నిరహార దీక్షలకు సంఘీభావం తెలిపిన తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షుడు ఆకారపు మోహన్, వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు భరత్, నవ తెలంగాణ వికలాంగుల సంఘం అధ్యక్షుడు మహమ్మద్ అజీమ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యారా ప్రశాంత్, ప్రజానాట్యమండలి వరంగల్ జిల్లా కార్యదర్శి వలదాసు దుర్గయ్య, తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. అంబేద్కర్ జయంతి 14 ఏప్రియల్ సోమవారం రోజున మొదలైన నిరహార దీక్షలు, ఐదవ రోజుకి చేరుకున్నాయి.

double bedrooms

పాలకులు, అధికారులు స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని దీక్షలో పాల్గొన్న జర్నలిస్టులు తెలిపారు.

కొన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు, తమ సభ్యులను నిరహారదీక్షల వద్దకు వెళ్లకుండా, అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే కొందరు సభ్యులు యూనియన్లకు అతీతంగా వచ్చి, నిరహార దీక్షలో పాల్గొన్నారు. జర్నలిస్టులకు న్యాయబద్ధంగా రావాల్సిన డబల్ బెడ్ రూమ్ ల కొరకు, నిరాహార దీక్షలు చేపట్టిన తోటి జర్నలిస్టు మిత్రులతో కలిసి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఇది మింగుడు పడని ఓ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కొందరు కుట్రలకు తెరలేపారని సమాచారం.

double bedrooms

 

“ఓ జర్నలిస్ట్ యూనియన్” నాయకుల కుట్రలు?

వరంగల్ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం తమకోసం నిర్మించిన ఇళ్లను అప్పగించాలనే డిమాండ్ తో జర్నలిస్ట్ లు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదు రోజులకు చేరిన, అధికారుల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ఎలాంటి చలనంలేదు. దీనంతటికి కారణం జర్నలిస్ట్ యూనియన్ ల నాయకుల కుట్రలే కారణమంటూ దీక్షలో పాల్గొన్న జర్నలిస్ట్ లు మండిపడుతున్నారు. ఓవైపు వరంగల్ తూర్పులొ జర్నలిస్ట్ లు దీక్షలు కొనసాగుతుంటే, వారికి మద్దతు ఇవ్వాల్సిన జర్నలిస్ట్ నాయకులు కొందరు, ఓ మాజీ ఎమ్మెల్సీతో కొంత మంది సమావేశం కావటం తీవ్ర దుమారమే లేపింది. నిజానికి అక్కడ సమావేశంలో పాల్గొన్న జర్నలిస్ట్ లంతా ముందుగా దీక్షా శిబిరాని సందర్శించి సంఘీభావం తెలిపి, వాస్తవ పరిస్థితులపై చర్చించాల్సి వుండే, అదికూడా సదరు నాయకుడు చర్చలకు ఆహ్వానం పంపితేనే. కాని ఎలాంటి పిలుపు రాకపోయినా మనవాళ్ళు కొంత మంది జర్నలిస్ట్ లతో వెళ్లి, అయనతొ సమావేశం కావటం ఓరకంగా తొందరపడ్డట్టు అయింది. మరోరకంగా మనకు మనం విలువలను దిగజార్చుకున్నంత పనైందన్న చర్చ జరుగుతుంది.

double bedrooms

అంతే కాదు అక్కడ పాల్గొన్న చోట మోట నాయకులు కనీసం దీక్ష శిబిరం వైపు కూడ చూడకపోవటం అనేక అనుమానాలకు తావిచ్చినట్టు అయింది. ఇంతకీ మాజీ ఎమ్మెల్సీతొ సమావేశం అయినా జర్నలిస్ట్ లు రాజకీయ నాయకుల పక్షమా? లేక జర్నలిస్ట్ ల పక్షమో కూడ తెలియని అయోమయంలొ స్థితిలొ జర్నలిస్ట్ లు కొట్టు మిట్టడుతున్నారు. దీక్ష శిబిరం వద్దకు రాకుండ ఎమ్మెల్యే భర్తతొ సమావేశం అయి ఏంసాధించారో కూడ కనీసం తెలుపలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి నేతలు ఉండబట్టే జర్నలిస్ట్ లపై పరోక్షంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

 

రాజకీయ నాయకులు సైతం, జర్నలిస్టులను విభజించి పాలించే చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వున్నాయి. వరంగల్ జిల్లాలొ వరంగల్ తూర్పు జర్నలిస్ట్ లు ఇళ్ళ కోసం చేపట్టిన దీక్షలకు పొరుగు జిల్లా (కరీంనగర్) నుండి అక్కడి నాయకులు విచ్చేసి, దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారని, మరి మన జిల్లా నాయకులు మాత్రం, మనకు మద్దతు తెలుపడానికి కూడా రాలేదని, రాజకీయ నాయకుల చుట్టు తిరుగటం కోసం కాళ్ళు స్పందించాయని అన్నారు. ఇంత దౌర్బాగ్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు దీక్షలో పాల్గొన్న జర్నలిస్టులు. స్వంత ప్రయోజనాల కోసం యూనియన్ ల పేరు చెప్పుకుని రాజకీయ నాయకుల నుండి, పరోక్షంగా లబ్ది పొందెందుకే ఈ ఎత్తుగడలా కనిపిస్తున్నది తప్ప, జర్నలిస్ట్ ల గూడు కోసం కాదన్నది స్పష్టమౌతున్నదని తూర్పు జర్నలిస్ట్ లు కొందరు మండిపడుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version