గంగ్వార్ గ్రామంలో నీటి కొరత..
జహీరాబాద్.నేటి ధాత్రి:
సంగారెడ్డి: న్యాల్కల్ మండలం గంగ్వార్ గ్రామంలోని 1వ వార్డ్ లో గత ఏడునెలల నుంచి నీటికొరత ఏర్పడుతుంది. బోరు చెడిపోయి ఏడునెలలు గడుస్తున్నా ఏఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోయారు. ఈ విషయంపై అధికారులకు చాలా సార్లు గ్రామస్థులు వినవించుకొన్న పటించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున నీటి సమస్యను తీర్చాలని మండల బీజేపీ అధ్యక్షులు మల్లేష్ డిమాండ్ చేశారు.