పది ఫలితాల్లో ప్రతిభ చూపిన ఉప్పల్ బాలుర పాఠశాల…..
నూటికి నూరు శాతం ఉత్తీర్ణత….
నేటిధాత్రి
కమలాపూర్ (హన్మకొండ) 2025-26
పదవ తరగతి పరీక్షల్లో మండలములోని ఉప్పల్ బాలుర పాఠశాల అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం నిర్మల తెలిపారు.బుధవారం విడుదలైన ఫలితాల్లో పాఠశాల విద్యార్థి అలుగు తేజ 545 మార్కులు సాధించి మండల పరిధిలోగల ప్రభుత్వ పాఠశాల ఫలితాల్లో ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు.పదవ పరీక్షల్లో 18 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా నూటికి నూరు శాతం 18 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వారిలో నలుగురూ విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు.మంచి నిక్షానితులైన ఉపాధ్యాయ బృందం విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలకు కారణమని కొనియాడారు
