— టీ యు డబుల్యూజే ఐజేయు సభ్యత్వ నమోదు
నిజాంపేట, నేటి ధాత్రి
మండల కేంద్రంలో సోమవారం టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, డీజీ శర్మ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జర్నలిస్టులో ఇండ్ల స్థలాల సమస్యలను త్వరలోనే పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు డీకే శర్మ, అజ్గర్, బాలరాజ్, శ్రీకాంత్, చంద్రకాంత్, సిద్దారములు, నవీన్ రెడ్డీ, భైరవరెడ్డి తదితరులు ఉన్నారు.
