జమ్మికుంట పట్టణంలో కార్మిక సంఘాల నిరసన ర్యాలీ

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) కార్మిక సంఘాల తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధరల గ్యారంటీ చేసే చట్టం చేయాలన్నారు. పేద, మధ్యతరగతి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు. 60 ఏండ్లు పైబడిన అందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలన్నారు. నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లు 2022ను ఉపసహరించాలని అన్నారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. పెన్షన్ 10 వేల రూపాయలు అందరికీ చెల్లించాలన్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పనా, ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించి పని రోజులను 200 రోజులు చేసి రోజుకు 800 రూపాయల కనీస వేతనం ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న అన్ని వేతనాలు చెల్లించాలన్నారు. జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేయాలన్నారు. రైల్వే రక్షణ విద్యుత్తు సహా ప్రభుత్వ రంగ సంస్థలను పబ్లిక్ సర్వీస్ లను ప్రైవేటీకరణ చేయరాదన్నారు. ధరల పెరుగుదలను అరికట్టాలి. ఆహారవస్తులు నిత్యవసర వస్తువులపై జిఎస్టిని ఉపసంహరించాలన్నార. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ లపై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను (పిడిఎస్) విస్తరించి.. 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలన్నారు. ఆహార భద్రత చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేసి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఖాళీలన్నీ భర్తీ చేయాలన్నారు. ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిని ఆపాలి, ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై దాడులను అరికట్టాలన్నారు. సామాజిక న్యాయం అమలు చేయాలి. అందరికీ నాణ్యమైన ఆరోగ్యం, విద్యను అందించాలన్నారు. జాతీయ విద్యా విధానం ఎన్ఇపి 2022ను రద్దు చేయాలన్నారు. అందరికీ గృహ వాసంతి కల్పించాలన్నారు. ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, దండిగారి సతీష్, రాజకుమారి, ముద్దమల్ల కుమార్, రావుల ఓదెలు, వడ్లూరి కిషోర్, సురేష్, శంకర్, కుమార్, రాజు, శ్రీనివాస్, ఉపేందర్, క్రాంతి, కుమార్, బాలకృష్ణ, ప్రశాంత్, సంపత్, రాజేందర్, బండి రవి, ఉపేందర్, సిఐటియు, రైతు సంఘం, హమాలి సంఘం. వ్యవసాయ కార్మిక, భవన నిర్మాణ కార్మిక సంఘాలు, నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version