చందాలు వేసుకొని రజితోత్సవ.!

వృద్ధులు లబ్ధిదారుల గుండెల్లో కేసీఆర్..

చందాలు వేసుకొని రజితోత్సవ సభకు సిద్ధమయ్యారు.

వృద్ధాప్య పెన్షన్ ను రజితోత్సవ సభకు విరాళమివ్వడం అభినందనీయం.

వితంతు వృద్ధురాలు నీలమ్మను అభినందించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది..

నర్సంపేట నేటిధాత్రి:

 

గత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి సీట్లు తక్కువ వచ్చి ప్రభుత్వాన్ని చేజార్చుకోవడం అటు ఇటు అయినప్పటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందించిన సంక్షేమ పథకాలతో వృద్ధులలో, ప్రజల గుండెల్లో నిలిచిపోయారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ నేత, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈనెల 27న కెసిఆర్ తలపెట్టిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున జరగనున్న నేపథ్యంలో అందుకు అయ్యే ఖర్చులకోసం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రూరల్ మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన బయ్య నీలమ్మ అనే వితంతు మహిళ తనకు నెలకు రూ.2 వేల చొప్పున కేసీఆర్ అందించిన పెన్షన్ ను తన కుమారుడు భయ్యా నవీన్ తో కలిసి నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేసింది.ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇకనుండి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తుడిచి పెట్టకపోతుందని మూర్ఖులకు నిరుపేద కుటుంబానికి చెందిన వితంతు మహిళా తన ఒక నెల పెన్షన్ ను విరాళంగా ఇవ్వడం,వృద్ధులు,ప్రజలు, పేదోళ్ల గుండెల్లో మాజీ సీఎం కేసీఆర్ పాతుకుపోయారని అందుకు ఈ సంఘటన ఉదాహరణ బయ్య నీలమ్మ అని ఎమ్మెల్యే పెద్ది వివరించారు.

BRS Silver Jubilee Celebration.

కెసిఆర్ అందించిన సంక్షేమ పథకాలు, పెన్షన్ దారులు, రోజువారి కూలీలు సైతం రోజువారి కూలీ డబ్బులు,చందాలను, కెసిఆర్ వల్ల పొందిన పెన్షన్లు ఇతర లబ్ధిలను పోగుచేసుకొని గ్రామ గ్రామాల నుండి రజితోత్సవ సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వితంతు వృద్ధ మహిళ బయ్య నీలమ్మ తను కెసిఆర్ వల్ల లబ్ధిపొందానని కృతజ్ఞతతో ఒక నెల పెన్షన్ 2000 రూపాయలను రజితోత్సవ సభ నిర్వహణ ఖర్చు కోసం విరాళంగా అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. విరాళం అందించిన నీలమ్మ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని బిఆర్ఎస్ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఒడిసి ఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్,మాజీ కౌన్సిలర్లు, నాగిశెట్టి పద్మ ప్రసాద్,దేవోజు తిరుమల సదానందం,పాషా, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు నాయకులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వితంతు మహిళా పెన్షన్ విరాళం.

BRS Silver Jubilee Celebration.

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన బయ్య నీలమ్మ అనే వితంతు మహిళా బిఆర్ఎస్ అధినేత,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన రూ. 2 016 పెన్షన్ ను అందుకు కృతజ్ఞతగా వరంగల్ జిల్లాలో తలబెట్టబోయే బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు విరాళంగా రూ.2 వేల16 ఒక నెల పెన్షన్ ను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సోమవారం నర్సంపేట పట్టణంలోని అందజేశారు.
ఈ సందర్భంగా వితంతు ఫెన్షన్ దారురాలు నీలమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలు నెలకు 200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని తెలిపారు.నేడు కేసీఆర్ ప్రభుత్వం నుండి 2 వేల రూపాయల పెన్షన్ తో నెల రోజుల పాటు గడిచే విధంగా అనుకూలంగా ఉందని అన్నారు.పెన్షన్ దారులకు ప్రతీ నెల క్రమం తప్పకుండా అందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఖర్చుల కోసం తన వంతుగా కృతజ్ఞతతో అందించినట్లు నీలమ్మ పేర్కొన్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నీలమ్మను  అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version