18వ రోజు రిలే నిరాహార దీక్ష
మంచిర్యాల నేటి దాత్రి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి 26 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ యాజమాన్యం చెల్లించకపోవడంతో కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికులు రిలే నిరాహార దీక్షకు పోనుకోవడం జరిగింది. అందులో భాగంగానే పవర్ ప్లాంట్ గేట్ ముందు ఈరోజు 18వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతాఉంది. ఇప్పటికైనా కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లిస్తానని ఒప్పుకొని యాజమాన్యం ముందుకు రాని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియూత నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా కంపెనీకి సంబంధించిన భూములలో గుడిసెలు వేసుకోనైన కార్మిక హక్కులను సాధించుకోవడానికి
సిద్ధంగా ఉన్నామని శాలివాహన పవర్ ప్లాంట్ యాజమాని ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా బిజెపి పార్టీ నుండి పోటీ చేయుచున్న మల్కా కొమురయ్య కి తెలియజేస్తున్నాం, అదేవిధంగా కొంతమంది,బి.ఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు యాజమాన్యానికి తొత్తులుగా మారి, కార్మికులకు సెటిల్మెంట్ కాకుండా చాలా రోజులుగా వివిధ రకాలుగా అడ్డుపడడం జరుగుతుంది, కంపెనీ భూములలో గుడిసెలు వేస్తామంటే అడ్డుపడ్డారు, కంపెనీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తే అడ్డుపడ్డారు, ప్రస్తుతం కంపెనీ అమ్ముతున్న భూములలో మరియు కార్మికులకు రావాల్సిన బెనిఫిట్ లలో పర్సంటేజ్ లకు ఆశపడి కార్మికులను ఆర్థికంగా మోసం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు త్వరలో తగిన గుణపాఠం చెప్పడానికి కార్మిక సంఘం నాయకులం సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్, ప్రధాన కార్యదర్శి నిమరాజుల సత్యం, ఉపాధ్యక్షులు కాయితి శ్రీనివాస్, కోశాధికారి పెంట సత్యం,ఆసరి రాజయ్య, సిరిపురం తిరుపతి, కాయితి బుచ్చయ్య, ఈసారపు శంకర్, సిహెచ్ చందు, ఆసరి పోశం, మరియు కార్మికులు పాల్గొన్నారు..