దంచి కొడుతున్న ఎండలు

నిప్పుల కుంపటిలా మారుతున్న వాతావరణం

ఈ రోగులకి పొంచి ఉన్న ప్రమాదం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం కేంద్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి శుక్రవారం శనివారం ఈ రెండు రోజుల్లో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి ఎండ తీవ్రత పెరగడంతో రహదారులు, పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు జనసంచారం లేక బోసిపోయింది. తీవ్రమైన వేడి గాలులు పెరిగిన ఉష్ణోగ్రతలు ఎక్కువగా మానవ శరీరానికి హాని చేస్తుంది. బిపి మధుమేహం శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి వేడిని తట్టుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జ్వరం వైరల్ జ్వరం దగ్గు జలుబు శ్వాసకోస వ్యాధులు బిపి వంటి సమస్యలు తలెత్తుతాయి పిల్లల్లో రోగ నిరోధక తగ్గుతుంది. యువతీ యువకులు ఎండ తీవ్రతకు తట్టుకునేలా తలకు టోపీలను ధరించాలి. వేడి గాలులకు నోరు ముక్కు కు అడ్డుగా దస్తిని కట్టుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *