మాదిగ అమరవీరుల ప్రాణత్యాగం వృధా కానివ్వం-ఏకు శంకర్ మాదిగ

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని అమరధామంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోయ్యడ శ్రీనివాస్ పూలమాలలతో నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవ సమస్య అయినటువంటి ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన మాదిగ అమరవీరులకు ఘన నివాళులర్పించారు వారి యొక్క ఆకాంక్షలు వర్గీకరణ సాధించేంతవరకు మాదిగలు వర్గీకరణ పట్ల చిత్తశుద్ధితో మాదిగలంతా ఏకమై మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని బలపరుస్తూ వర్గీకరణ ఉద్యమంలో మన వంతు కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు బొచ్చు ప్రశాంత్ మాదిగ,పెయింటర్స్ అసోసియేషన్ పరకాల మండల అధ్యక్షులు గోపాల్ మాదిగ,బొచ్చు చంద్రశేఖర్ మాదిగ,మడికొండ నవీన్ మాదిగ,గోల్కొండ కృష్ణ మాదిగ, బొచ్చు సంపత్ మాదిగ,రాజేష్ కుమార్,జిల్లెల్ల ప్రవీణ్,రమేష్ ల్,రాజు,రాజ్ కుమార్,యాకయ్య,పవన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version