జాబ్ కార్డ్ ఉన్న కూలీలందరికి పని కలిపించాలి

ఎంపీడీఓ సరోజ

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి : మండలంలోని కూలీలందరికి ఉపాధిహామీ లో పని కలిపించాలని ఎంపీడీఓ సరోజ అన్నారు.శుక్రవారం మండలం లోని రంగపెట్, హనుమంతుపల్లి, చందారం గ్రామపంచాయతీలలో ఆమె సుడిగాలి పర్యటన గావించారు.గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో పని కలిపించి రోజు కు రూ.272 సగటు వేతనం అందించాలని సూచించారు. ఉపాధిహామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశాన్ని,నర్సరీ లను, అంగన్వాడీ సెంటర్స్, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఎంపీడీఓ వెంట ఏపిఓ వెంకటరమణ, టెక్నీకల్ అసిస్టెంట్ బూసిరాజు రాజన్న, ఆయా గ్రామాల సెక్రెటరీస్ ప్రదీప్, మౌనిక, శ్రీలత లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *