28వ వార్డులో .రోడ్డు కోసం త్రవ్వారు. రోడ్డు వేయకుండా వదిలిపెట్టారు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి లో
ఆరు నెలల క్రితం రోడ్డు మంజూరు అయిందని చెప్పి 28వ శ్రీవాణి కాలేజీ వెనకాల చాణిక్య స్కూల్ వైపు, యాదవ సంఘం భవనం పక్కన రోడ్డు కోసం మట్టిని త్రవ్వారు . దానిపై అక్కడక్కడ డస్ట్ వేశారు ప్రజల ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాధుడు లేడు ఆరు నెలలుగా ఎం ఈ దగ్గరికి వెళ్లినా వారు సమయానికి ఆఫీస్ లో ఉండరని ఫోన్ చేస్తే ఎత్తరు, కాంట్రాక్టర్ ఎవరో తెలియదు,డీ ఈ ని అడుగుతే నాకు తెలియదు నా వర్క్ కాదు అంటూ తప్పించుకున్నారని పబ్లిక్ హెల్త్ డి. ఈ కిందికి వస్తుంది మున్సిపాలిటీ ఏ ఈ ప్రశాంత్ కు సంబంధం అని తెలిపాడు. పబ్లిక్ హెల్త్ డీఈకి ఫోన్ చేసి వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనివల్ల ఆరు నెలలుగా 28 వ వార్డు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ద్విచక్ర వాహనాలు కిందపడి కాలు విరగొట్టుకున్నారని జిల్లా అఖిలపక్షఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు. వెంటనే ఆ పనులు చేపట్టకుంటే వెంగళరావు కాలనీ మాజీ కౌన్సిలర్ గా ప్రజల తరఫున స్థానిక ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డి జిల్లా కలెక్టర్కు అధికారులకు ఫిర్యాదు చేస్తామని సతీష్ యాదవ్ తెలిపారు.